Gunturmedia

Gunturmedia ప్రత్యేకహోదా ఆంద్రుల హక్కు

05/01/2026

ఏపీలో పట్టపగలు పోలీసుల ముందే కిడ్నాప్

ఎంపీపీ ఎన్నికల్లో పోలీసుల ముందే వైసీపీ అభ్యర్థులను కిడ్నాప్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్తత

ఓటు హక్కు వినియోగానికి వస్తున్న వైసీపీ ఎంపీటీసీలను పోలీసుల ముందే కిడ్నాప్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులు

ఐదుగురు వైసీపీ ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న కారు అడ్డగింత

వైసీపీ మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు గాయాలు

మల్లికార్జున్ అనే వైసీపీ ఎంపీటీసీ కిడ్నాప్

మరో వైసీపీ ఎంపీటీసీ మోహన్ రెడ్డిని నిర్బంధించిన పోలీసులు

ఎన్నిక జరిగే ఎంపీడీవో కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల జులుం
Nara Chandrababu Naidu Nara Lokesh Anitha Vangalapudi YSRCP SPSR Nellore District

అశోకుడు చెట్లు నాటేన్ లోకేష్ చెట్లు కొట్టేన్
12/10/2025

అశోకుడు చెట్లు నాటేన్ లోకేష్ చెట్లు కొట్టేన్

పేద ప్రజల కొండంత దైర్యం ఆరోగ్య శ్రీ అటువంటి పథకాన్ని నిర్వీర్యం చేయడం అంటే వాళ్ళ సంస్కృతి సంస్కారం ఇదే కాబోలు
11/10/2025

పేద ప్రజల కొండంత దైర్యం ఆరోగ్య శ్రీ
అటువంటి పథకాన్ని నిర్వీర్యం చేయడం అంటే
వాళ్ళ సంస్కృతి సంస్కారం ఇదే కాబోలు

**సై సైరా చిన్నపరెడ్డి- నీపేరే బంగారుకడ్డీ@ నరసరావుపేట** ఆగష్టు 14.బ్రిటిష్ పాలకుల గుండెల్లో సింహస్వప్నంగా మారిన సైరా చి...
14/08/2025

**సై సైరా చిన్నపరెడ్డి- నీపేరే బంగారుకడ్డీ@ నరసరావుపేట**

ఆగష్టు 14.
బ్రిటిష్ పాలకుల గుండెల్లో సింహస్వప్నంగా మారిన
సైరా చిన్నపరెడ్డి ఉరితీయబడిన రోజు... ఆసంఘటనల సమాహారం.,,,,,,

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం భరతగడ్డపై దురహంకారంతో చెలరేగుతున్న రోజులు....
భారతమాత కన్నీటి బొట్లు మాతృనేలను చిత్తడి చేస్తున్న దయనీయమైన రోజులు ...
ఈ సమయంలో -
దాస్య శృంఖలాల విముక్తి కోసం....
స్వేచ్ఛావాయువుల సంచారం కోసం....
కుదేలవుతున్న జాతి చైతన్యం కోసం...
ప్రాణాలకు తెగించి.. సమరోత్సాహంతో ముందుకు నడిచాడు ఒక యువకుడు.. !
వందేమాతరం అంటూ ఎందరో యువతీ యువకులను ముందుకు నడిపించి....పల్లె పల్లెని తట్టిలేపి.... గుండె గుండెలో ఫిరంగులు మోగించి.... ఆత్మస్థయిర్యమే ఆయుధంగా పిడికిలెత్తి నినదించిన ఆ యువకుడు సై సైరా చిన్నపరెడ్డి !

ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లా నర్సరావుపేట తాలూకాలోని రెడ్డిపాలెం. అక్కడికి సమీపంలోని కోటప్పకొండ ప్రముఖ శివక్షేత్రం. మహాశివరాత్రికి జరిగే తిరునాళ్లకు భక్తులు పోటెత్తి వస్తారు.ప్రభల ఉత్సవం కన్నుల పండుగలా సాగుతుంది.

రెడ్డిపాలెం కి చెందిన గాదెలింగమ్మ, సుబ్బారెడ్డి దంపతులకు ఉన్న నలుగురి కుమారుల్లో నాలుగోవాడు గాదె చిన్నపరెడ్డి. చిన్నపరెడ్డి తన గ్రామంలో ప్రభ కట్టి తన పందెపు ఎడ్లను కట్టుకుని కోటప్పకొండకు
ఉత్సాహంగా అనుచరులతో కలసి బయలు దేరారు.

చిన్నపరెడ్డి స్వతహాగా స్వేచ్చా ప్రవృత్తి, స్వాతంత్ర కాంక్ష కలవాడు అవ్వడంతో బ్రిటీష్ ప్రభుత్వ శాసనాలను లెక్కచెయకుండా ఎప్పటికప్పుడు దిక్కార స్వరం వినిపిస్తు ఉండేవాడు. చిన్నపరెడ్డి ధైర్యశాలి. ఆజానుబాహుడు. చిన్నతనం నుంచే గుర్రపుస్వారీ నేర్చుకున్నాడు. 1907లో మద్రాసు సంతకు వెళ్లినప్పుడు అక్కడ జరిగిన సభలో బాలగంగాధర తిలక్ రగిల్చిన దేశభక్తి ప్రభావం చిన్నపరెడ్డి పై పడింది. దాంతో తిరిగి గ్రామానికి వచ్చినప్పుడు స్వరాజ్యం కావాల్సిందే అంటూ గ్రామంలో ప్రజల్ని కూడగట్టాడు. బ్రిటిష్ పాలకులు విధించిన వివిధ రకాల పన్నులకు వ్యతిరేకంగా ప్రజల్ని సంఘటితం చేసి పోరాడాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా చిన్నపరెడ్డి ప్రదర్శించిన ధైర్యసాహసాల్ని ప్రజలు కథలు కథలుగా పాటల రూపంలో నేటికీ పాడుకుంటూనే ఉన్నారు.

ఫిబ్రవరి 18, 1909, శివరాత్రిపర్వదినం. జిల్లాలో నర్సరావుపేటకు సమీపంలో ఉన్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కోటప్పకొండలో ఉత్సవం జరుగుతోంది. అంబరాన్ని చుంబించినట్టు ఉండే ప్రభలు, అలంకరించిన ఎద్దులు ఈ ఉత్సవం ప్రత్యేకత. ఆ రోజు జరిగే సంత కూడా అప్పటికే జాతీయ స్థాయిలో పేరెన్నికగన్నది.

చిన్నపరెడ్డి కూడా స్వగ్రామం నుంచి అరవై అడుగుల ఎత్తు ప్రభ కట్టుకుని, ఎడ్లతో తిరనాళ్లకు వెళ్లాడు. కోటప్పకొండ చేరుకోనేసరికి తిరునాళ్ళు మంచి కోలాహళంగా ఉంది. అక్కడ అశేష జనవాహిణి సంబరాలను వీక్షించడానికై వచ్చియున్నారు.ఆ సంరంభంలో ఆయన ఎద్దులు అదుపు తప్పాయి. చిన్న తొక్కిసలాట జరిగింది.చిన్నప్పరెడ్డి ఎద్దులు బెదిరిపోయి అడ్డదిడ్డంగా కంగారుగా పరుగిడ సాగాయి. చిన్నపరెడ్డి బృందం వాటిని నిలువరించడానికై విశ్వప్రయత్నం చేసారు కానీ అవి వశంకావడంలేదు.

ఇంతలో అక్కడ కాపలా ఉన్న బ్రిటీషు పోలీసులు ఆ ఎడ్లను నిలిపివేయమని లేకుంటే ఎడ్లను కాల్చి చంపుతాం అని చిన్నపరెడ్డి ని బెదిరించారు. దాంతో చిన్నపరెడ్డి ఉగ్రుడై పోలీసులకు ఎదురుతిరిగాడు . చేతనైతే ముందు నన్ను చంపు ఆ తరువాత నా ఎడ్లను చంపమని పోలీస్ తుపాకులకు రొమ్ము చూపాడు.
ఆనాటి డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆరణి సుబ్బారావు పోలీసులుకు ఆజ్ఞ ఇచ్చి చిన్నపరెడ్డి ఎద్దులని కాల్చి చంపమన్నాడు. దాంతో పోలీసులు నిర్ధాక్షయంగా చిన్నపరెడ్డి ఎద్దులని కాల్చి చంపేసారు

ఈ ఘటనతో కోపోదృక్తుడైన చిన్నపరెడ్డి తన వెంట ఉన్న ప్రజలతో కలిసి అక్కడే పోలీసులపై తిరగబడ్డాడు . వందేమాతరం - మనదే రాజ్యం అంటూ పోలీసులపై ఇనుపకడ్డీలతో దాడి చేసి
ఒకహెడ్ కానిస్టేబుల్ను, కొందరు కానిస్టేబుల్ను మంటల్లో వేసి కాల్చి చంపారు . తక్కిన పోలీసు వారిని , మెజిస్ట్రేట్ ను, బ్రిటీష్ అధికారుల్ని అక్కడినుండి తరిమి కొట్టారు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న పోలీసులు చిన్నపరెడ్డిని అరెస్టు చేశారు. అక్కడే తాత్కాలికంగా తాటాకులతో నిర్మించిన పోలీసు స్టేషన్‌లో బంధించారు. చిన్నపరెడ్డిని విడుదల చేయాలని కోరుతూ ప్రజలు ఆందోళనకు దిగారు. వారి నోటి నుంచి వినిపించిన నినాదం - వందేమాతరం. పోలీసులు మళ్లీ కాల్పులు జరిపితే ఇద్దరు యువకులు మరణించారు. కోపోద్రిక్తులైన ప్రజలు తాటాకుల పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. చిన్నపరెడ్డితో పాటు మరో వందమందిపై కూడా కేసులు నమోదైనాయి.

విచారణ ఒక ప్రహసనంగా మారిపోయింది. ఈ కేసులో గుంటూరు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఐషర్ కార్షన్ 21 మందికి ఉరిశిక్ష, 24 మందికి కఠిన శిక్షలు విధించాడు. అయితే ఈ తీర్పు ఇచ్చిన తరువాత అతడు పదవికి రాజీనామా చేశాడు.

ఈ తీర్పును చిన్నపరెడ్డి మద్రాసు హైకోర్టులో సవాలు చేశాడు. కావాలంటే తనను శిక్షించి, మిగిలిన వారిని వదిలివేయమని ఆయన కోరాడు. ఆగస్టు 13, 1910న న్యాయమూర్తి మన్రో తీర్పు వెలువరించాడు. చిన్నపరెడ్డికి మరణశిక్ష, 21 మందికి ద్వీపాంతర శిక్ష పడింది. ఆ వెంటనే శిక్షను అమలు చేశారు.
చిన్నపరెడ్డిని బ్రిటీష్ ప్రభుత్వం రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఆగష్టు 14న ఉరితీసి చంపారు.

దేశ విముక్తి కోసం చిన్నపరెడ్డి చిరునవ్వుతో ఉరితాళ్లని ముద్దాడాడు. చిన్నపరెడ్డి ఉరితో జిల్లా ప్రజలు బెదరలేదు.
సైరా చిన్నపరెడ్డి
సై సైరా చిన్నపరెడ్డి
నీ పేరే బంగారుకడ్డీ
పుట్టింది రెడ్డిపాలెములో
పెరిగింది చేబ్రోలున రెడ్డీ....
""సైరా ""

చిన్నపరెడ్డి మాటలాకు
చుట్టూనొక పన్నెండామడ
నిప్పులేక మండిస్తివి రెడ్డీ
చుట్టును యొక్క నాలుగామడ
బందిపోటు కొట్టిస్తివి రెడ్డీ..... ""సైరా ""

చిలుకలా తలగుడ్డ చుట్టి
గోరంచు పంచెను గట్టి
ఏడాది ఒక్క దినంబు
కోటప్పకొండ వెళ్ళడానికి
బండిని ప్రభనుగా తయారుజేసే
ఏభై ముళ్ళా ప్రభను గట్టే
నాలుగు గాండ్ల ఎద్దులు గట్టే... ""సైరా ""

అంటూ....మరణం తర్వాత కూడా జనాలు చిన్నపరెడ్డిని మరిచిపోలేదు. పాటలుగా పాడుకుంటూ చిన్నపరెడ్డి తమ మధ్యనే జీవిస్తున్నట్టుగా పాటల్లో వెదుక్కోవడం మొదలెట్టారు.
చిన్నపరెడ్డి వీరత్వపు కథలను బుడిగజంగాలు, గుర్రాలు ఆడించేవాళ్ళు , తదితర జానపదులు తమ పాటల్లో నేటికిని స్మరించుకోవడం గుంటూరు పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. కోలాటాల పాటల్లో, వరి నార్లల్లో, వినిపించే చిన్నపరెడ్డి పాటలు రాగయుక్తమైనవి.
అని ఆయన త్యాగాన్నీ, దేశభక్తిని ప్రజలు గానం చేశారు.

వందేమాతరం ఊపిరిగా ఉరికొయ్యని దిక్కరించిన చిన్నపరెడ్డి వంటి దేశభక్తులు నడియాడిన స్థలాలను, వారు జీవించిన ఇళ్లను చారిత్రక స్మృతి కేంద్రాలుగా తీర్చిదిద్ది భావితరాలకు స్ఫూర్తినిచ్చేందుకు అందించాలి. వారి చరిత్రను పాఠ్యపుస్తకాలలో పొందుపరచాలి.

చిన్నపరెడ్డి ఉరితీత ఘటనతో నాటి ఆంధ్రుల్లో స్వాభిమానంతో పాటు దేశ భక్తి, స్వాతంత్ర కాంక్ష మరింత పెరిగి ,నాటి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడేలా చేశాయి .

వంద సంవత్సరాలు వెనక్కివెళితే వీరుల త్యాగాల జాడలు కనపడ తాయి. వారు కన్న కలలూ, నిర్మించాలనుకున్న స్వేచ్ఛాభారతం కోసం ప్రదర్శించిన పట్టుదల మన ముందున్నాయి. బ్రిటిష్ పాలకుల గుండెల్లో సింహస్వప్నంగా మారిన చిన్నపరెడ్డి లాంటి దేశభక్తుల పోరాట చరిత్రను నేటి తరాలకు అందించాల్సిన కర్తవ్యం మనపై ఉంది.

11/08/2025

పులివెందుల జడ్పీటీసీ గెలుపు కోసం ఇంటింటికి నోట్ల కట్టలు చీర పంపిణి చేసింది ఎవరు?

09/08/2025

ఆంధ్రప్రదేశ్ లో ఏ ముఖ్యమంత్రి హయాంలో రైతులకు మేలు జరిగింది?
అలాంటి మంచిమనసున్న నాయకుడు ఎవరు?

అప్పటి ఎన్నికల కమిషనర్ ముకేశ్ కుమార్ మీనా ఈవిఎం వివి ప్యాడ్స్ డేటా మొత్తం కాల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు దానికి గిఫ్ట...
14/07/2025

అప్పటి ఎన్నికల కమిషనర్ ముకేశ్ కుమార్ మీనా
ఈవిఎం వివి ప్యాడ్స్ డేటా మొత్తం కాల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు దానికి గిఫ్ట్ ఈ పోస్టింగ్ As of July 14, 2025, Mukesh Kumar Meena (IAS: AP:1998) is currently posted as the Principal Secretary to the Government in the Revenue (Excise) Department. He also holds the full additional charge as the Principal Secretary to the Government for the Industries and Commerce (Mines) Department. This posting was ordered with immediate effect on July 12, 2024, relieving Dr. N. Yuvaraj, IAS (2005), from the additional charge of the Industries and Commerce (Mines) Department.
అని ప్రజలు అనుకుంటున్నారు

03/07/2025

మధ్యాంద్రప్రదేశ్

అప్పట్లో జగన్ ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసుకున్నారని గగ్గోలు పెట్టిన ప్రజాస్వామ్య వాదులు ఒకసారి ఇప్పుడు బాబుగారు స...
03/07/2025

అప్పట్లో జగన్ ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసుకున్నారని గగ్గోలు పెట్టిన ప్రజాస్వామ్య వాదులు ఒకసారి ఇప్పుడు బాబుగారు స్టిక్కర్లు అదే "ఇది మంచి ప్రభుత్వం" అని ఇంటింటికి అతికించిన స్టిక్కర్ల కోసం చేసిన ఖర్చు 5,67,00,000/- అక్షరాల ఐదు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు......🫢

1993 మార్చి 7 రాత్రి హైదరాబాదు నుండి చిలకలూరిపేటకు బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన సూపర్ డీలక...
27/06/2025

1993 మార్చి 7 రాత్రి హైదరాబాదు నుండి చిలకలూరిపేటకు బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన సూపర్ డీలక్స్ బస్సు మార్చి 8 తెల్లవారు ఝామున నర్సరావుపేటలో ఆగి, 4:10 కి తిరిగి బయలుదేరింది. పట్టణం లోని రైల్వే క్రాసింగు వద్ద సాతులూరి చలపతిరావు, గెంటెల విజయవర్ధనరావు అనే ఇద్దరు వ్యక్తులు బస్సెక్కి చిలకలూరిపేటకు టిక్కెట్టు తీసుకున్నారు. కొంతదూరం ప్రయాణించాక వారిద్దరూ బస్సులో పెట్రోలు విరజిమ్మారు. అది గమనించి బస్సు డ్రైవరు లైట్లు వేసి, బస్సును ఆపాడు. వారిద్దరూ కిందికి దిగిపోతూ ఆగిప్పుల్ల వెలిగించి బస్సుకు నిప్పు పెట్టారు. బస్సులో ప్రయాణిస్తున్న మొత్తం 32 మందిలో 23 మంది సజీవదహనమై పోయారు. మిగిలినవారు తప్పించుకోగలిగారు. తప్పించుకున్నవారిలో ఇద్దరిని దుండగులు వెంటాడి, వారివద్ద నున్న డబ్బును దోచుకున్నారు.

గుంటూరు సెషన్సు కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. రెండేళ్ళ విచారణ తరువాత, 1995 సెప్టెంబరు 7 న నిందితులిద్దరికీ కోర్టు ఉరిశిక్ష విధించింది. [3] దోషులు హైకోర్టుకు అప్పీలు చెయ్యగా అది కింది కోర్టు విధించిన శిక్షను ధ్రువీకరించింది. దోషులు తిరిగి సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకోగా, 1997 ఆగస్టు 28 న అక్కడ కూడా శిక్షను ధ్రువీకరించారు. తమకు క్షమాభిక్ష ప్రసాదించమంటూ దోషులు రాష్ట్రపతికి విన్నవించుకోగా, అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ దాన్ని తిరస్కరించాడు. 1998 మార్చి 29 న దోషులకు ఉరి వేసేందుకు సన్నద్ధమయ్యారు.

అయితే ఒక్క రోజు ముందు, మార్చి 28 న, రచయిత్రి మహాశ్వేతాదేవి, రాష్ట్రపతి నుండి జ్ఞానపీఠ పురస్కారం అందుకునే సందర్భంలో, దోషుల తరపున మరొక క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతికి సమర్పించింది. ఆ వెంటనే, క్షమాభిక్ష అభ్యర్థన రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉన్నందున, దానిపై నిర్ణయం వెలువడే వరకు ఉరితీతను ఆపాలని సుప్రీం కోర్టులో ఒక కేసు వేసారు. సుప్రీం కోర్టు వెంటనే దాన్ని విచారించి, ఉరిని ఆపాలని తీర్పునిచ్చింది. [2]

ఆ రాత్రే ఈ తీర్పును జైలు అధికారులకు పంపగా, మరుసటిరోజు తెల్లవారుఝామున అమలు చెయ్యాల్సిన ఉరిని ఆపారు. ఆ తరువాత వచ్చిన రాష్ట్రపతి, కె.ఆర్. నారాయణన్ ఆ క్షమాభిక్ష అభ్యర్థనపై స్పందించి, దోషులిద్దరికీ క్షమాభిక్ష ప్రసాదించాడు. దానితో ఉరిశిక్షను యావజ్జీవ జైలుశిక్షగా మార్చారు.
సేకరణ : ఆన్లైన్ ప్లాట్ ఫామ్

Address

Guntur

Website

Alerts

Be the first to know and let us send you an email when Gunturmedia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share