AP Focus Media

AP Focus Media #1 Telugu News Website for Telugu People.

17/07/2025

గురజాల నియోజక వర్గ విజన్ యాక్షన్ ప్లాన్ అమలులో భాగంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతుల కోసం కిసాన్ మేళా నిర్వహించాలన్న ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ, ఆచార్య నాగార్జున వ్యవసాయ విద్యాలయాల నేతృత్వంలో నడికుడి ఏఎంసీలో కిసాన్ మేళా నిర్వహించారు.

వ్య‌వ‌సాయరంగంలో వినియోగించే ఆధునిక ప‌రిక‌రాల‌తో పాటు ఆధునాత‌న డ్రోన్లు, సాగు యంత్రాలు, ప‌నిముట్ల‌ను మంత్రి ప‌రిశీలించారు. వాటి ప‌నితీరును అధికారులు మంత్రికి వివ‌రించారు.

సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో ఎక్కడ రైతులకు కష్టం వచ్చినా ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొస్తోందన్నారు. నల్లబర్లీ ధరలు పతనమై పంట అమ్ముకోలేని స్థితిలో ఉన్న రైతుల కోసం నిబంధనలు సవరించదంతో పాటూ రూ.270 కోట్లు వెచ్చించి జిల్లాలో పొగాకు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. చిత్తూరులో కేజీకి రూ.4 అదనంగా చెల్లించి మామిడి కొనుగోలు చేశామన్నారు.

ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 12 రకాల శాఖలను ఆహ్వానించి రైతుల కోసం ఎన్నడూ లేని విధంగా గురజాల నియోజక వర్గంలో భారీ స్థాయిలో కిసాన్ మేళా నిర్వహించడం జరిగిందన్నారు. రైతులు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుని, ఉత్పత్తి పెంచి, అధిక రాబడులు పొందాలన్నారు.

జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు మాట్లాడుతూ..పత్తి, మిర్చి వంటి సంప్రదాయ పంటల నుంచి రైతులు ప్రత్యామ్నాయ పంటలపవైపు మళ్లాలన్నారు. నూతన సాంకేతికత గురించి అవగాహన పెంచుకుని లాభసాటి వ్యవసాయం చేయాలన్నారు.

ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ..భూమ్మీద వ్యవసాయం చేస్తున్న మాకు కొత్తగా తెలుసుకోవాల్సింది ఏముంది అనే ఆలోచన నుంచి రైతులు బయటికి రావాలన్నారు. ఉత్పత్తి పెంచి, రాబడి పెంచే మార్గాలను రైతులకు తెలియజేయడం కోసం కిసాన్ మేళా నిర్వహించడం జరిగిందన్నారు.

టీటీడీ పాలకవర్గం సభ్యులు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. వ్యవసాయ పద్ధతుల్లో వస్తున్న మార్పులను రైతులు అవలంబించాలన్నారు.

కార్య‌క్ర‌మంలో గుర‌జాల ఎమ్మెల్యే యర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు, క‌లెక్ట‌ర్ అరుణ్ కుమార్, అధికారులు, స్థానిక కూట‌మి నేత‌లు పాల్గొన్నారు.

25/10/2024

పల్నాడు జిల్లా..

సత్తెనపల్లిలో వృద్ధ దంపతులపై దాడి కేసులో 24 గంటల లోపే నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు...

బంగారం, నగదు కోసమే దాడి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడి...

సత్తి గవన్ కుమార్ రెడ్డి,మర్రి అమ్మయ్య అనే
ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు...

మరొకరి నిందితుడి కోసం గాలింపు చర్యలు...

నిందితులు రాజమండ్రి సత్తెనపల్లి, వాసులుగా గుర్తించిన పోలీసులు...

నిందితుల వద్ద నుంచి బైక్ ,కారం ప్యాకిట్స్ స్వాధీనం..

కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు.

*వినుకొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన* రూ.20.15 కోట్ల వ్యయంతో పియంజిఎస్ వై పథకం కింద.. వినుకొండ మండలం గోకన...
24/10/2024

*వినుకొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన*

రూ.20.15 కోట్ల వ్యయంతో పియంజిఎస్ వై పథకం కింద.. వినుకొండ మండలం గోకనకొండ-నూజండ్ల మండలం పువ్వాడ మధ్య గుండ్లకమ్మ నదిపై హైలెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపనలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అత్యంత త్వరలోనే ఈ రోడ్డు నిర్మాణం చేయించి ప్రజలకు అందిస్తాం. ఈ వంతెన నిర్మాణంతో నూజండ్ల, వినుకొండతో పాటు బాపట్ల జిల్లాకు, గుంటూరుకు సులువుగా రాకపోకలు సాగించేందుకు అవకాశం కలుగుతుంది.
అనంతరం పువ్వాడలోని, ఎస్సి కాలనీలో జలజీవన్ కింద కుళాయి ఏర్పాటు పథకాన్ని ప్రారంభించడం జరిగింది.

అనంతరం నూజెండ్ల మండలం, ములకలూరు గ్రామంలో రూ. 10లక్షలతో నిర్మించే సీసీ రోడ్లు డ్రైన్స్ కు శంకుస్థాపన చేయడం జరిగింది.

ఈ కార్యక్రమాలలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ , టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు , వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు , మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున్ , జనసేన శ్రీనివాస్ , కూటమి నాయకులు పాల్గొన్నారు.

24/10/2024

బ్రేకింగ్

గుంటూరు జిల్లా తుళ్లూరు

మాజీ వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఆక్రమణలు తొలగిస్తున్న సీఆర్డిఏ అధికారులు

ఉద్ధండరాయునిపాలెం సీడ్ యాక్సెస్ వెంబడి సుమారు రెండు ఎకరాలు ఆక్రమించిన నందిగం సురేష్

ఆక్రమణలో విజిటర్స్ ఆఫీస్ నిర్మించిన నందిగం సురేష్

సీర్డియే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యం. విశ్వర నాయుడు ఆధ్వర్యంలో ఆక్రమణలు తొలగింపు

నేను సిద్ధం...మరి మీరు..! ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్ర ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగానికి నేను సిద్ధం.. మరి మీ...
24/10/2024

నేను సిద్ధం...మరి మీరు..!

ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్ర ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగానికి నేను సిద్ధం.. మరి మీరు సిద్ధమా..?

పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేయించుకుని ఓటు వినియోగించుకోవడం సామాజిక బాధ్యత అని మరువద్దు.

ఓటర్ నమోదుకు సమయం ఉంది కదా అని అశ్రద్ధ చేయొద్దు.

ఈరోజే ఫారం 18 పూర్తి చేసి ఓటరుగా నమోదవ్వండి.

నేను పట్టభద్ర ఓటరుగా నమోదుకు ఫామ్- 18 సమర్పించాను.

సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని పట్టబద్రులందరూ ఓటర్లుగా నమోదు చేయించుకుని చైతన్యం చాటుదాం.
మీ
కన్నా లక్ష్మీనారాయణ.

01/01/2024

సత్తెనపల్లి పట్టణంలోని శ్రీవిద్య హాస్పటల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించిన హాస్పిటల్ యాజమాన్యం..

ఈ మెగా మెడికల్ క్యాంపులో ఆర్థోపెడిక్ విభాగానికి సంబంధించి.. ఎముకలు, కీళ్లు, మెడ వెన్నుముక సమస్యలు, నరముల సమస్య, కీళ్లవాతం, విరిగిన ఎముకలు, స్పోర్ట్స్ ఇంజురీస్, జనరల్ మెడిసిన్ కు సంబంధించి.. బిపి, షుగర్,థైరాయిడ్, నెమ్ము ఉబ్బసం, ఆయాసం, విష జ్వరాలు,గ్యాస్,లివర్ వ్యాధులు, గుండె దడ,కాళ్ళ వాపులు, చర్మ వ్యాధులు మొదలగు సమస్యలకు ఈ మెడికల్ క్యాంపులో రక్త పరీక్షలు,ఎక్సరేలు, ఎముకల సాంద్రత( అరుగుదల) పరీక్షలు మొదలగు పరీక్షలు చేసి ఆయా వ్యాధులకు సంబంధించి ఉచితంగా మందులు ఇచ్చారు. ఈ మెడికల్ క్యాంపు నందు శ్రీవిద్య హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్స్ డాక్టర్" కాట్రాజు చిరంజీవి..M. S.ORTHO (RANGARAYA MEDICAL COLLEGE)CPCR (REHMATALOGY),FLJR ఎముకలు, కీళ్లు, వెన్నుపూస నరముల వైద్య నిపుణులు,డాక్టర్" తడవర్తి నాగ శ్రీవిద్య..DNB FAMILY MEDICINE (FELLO IN Diyabetology), క్రిటికల్ కేర్, షుగరు,బిపి,థైరాయిడ్, మరియు జనరల్ వైద్యునిపుణులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్" కాట్రాజు చిరంజీవి మాట్లాడుతూ..

సత్తనపల్లి,పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సత్తనపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదురు శ్రీవిద్య హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ విభాగాలకు సంబంధించి,అవగాహన కొరకు ఈరోజు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో సుమారు 500 మంది సత్తెనపల్లి,పెదకూరపాడు, ఫిరంగిపురం మండలాలకు చెందిన ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, వారికి మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే మా లక్ష్యం. 24 గంటలు హాస్పిటల్లో అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించబడునన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్" శ్రీవిద్య మాట్లాడుతూ..

బీపీ,షుగర్, థైరాయిడ్, క్రిటికల్ కేర్ కేసులు అన్నివేళలా చూడబడునని, ఈరోజు ఈ క్యాంపు నిర్వహించడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగిందన్నారు. 24 గంటలు ఆసుపత్రిలో అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.

15/12/2023

పల్నాడు.. సత్తెనపల్లి

ఎన్నో సంవత్సరాలుగా అంగన్వాడి వర్కర్స్ గా ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నాము..

అంగన్వాడికి సంబంధించిన సేవలను ప్రతి రోజు A to Z 24/7 సేవలను ఎంతో నిబద్ధతతో, నిజాయితీగా పనిచేస్తున్నాం..

ఒక పండుగ లేదు, ఒక పబ్బం లేదు నిత్యం అంగన్వాడి స్కూలే ధ్యాసగా ఎంతో కష్టపడుతూ.. పనిచేస్తున్నాం..

అనారోగ్యం బారిన పడితే వేలకు వేలు ఖర్చు అవుతుంది.

పిల్లలు చదువులకు, కుటుంబ పోషణ నిమిత్తం అధిక మొత్తంలో ఖర్చు అవుతుంది.

ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతూ.. ఎన్నో ఇబ్బందులను అధిగమిస్తూ.. ఇట్టి చాకిరి చేస్తూ కుటుంబాన్ని కూడా వదిలి సేవ చేస్తున్నాం..

బానిసలుగా చూస్తున్నారు తప్ప మమ్ములను గుర్తించడం లేదు ప్రభుత్వాలు..

అంగన్వాడి స్కూల్లో ఇద్దరు చేసే పనిని 9 మంది చేత అంగన్వాడి పనులను చేయించడానికి సిద్ధపడ్డ ప్రభుత్వం మాకు కనీస వేతనాలు, సౌకర్యాలు కల్పించడానికి ఎందుకు వెనకాడుతున్నారు..

అంగన్వాడి స్కూల్లో ఇద్దరు చేసే పనిని 9 మంది సచివాలయ సిబ్బంది చేత చేయించడం ద్వారా మా చాకిరిని ప్రభుత్వం గుర్తించడం అభినందనీయం..

మమ్ములను గుర్తించాలని, మా హక్కుల కోసం మేము ఇక్కడ పోరాటం చేస్తుంటే ప్రభుత్వం సచివాలయ సిబ్బంది చేత బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలను తాళాలను పగలకొట్టి మరి దౌర్జన్య పద్ధతిలో ప్రవర్తించడం చాలా బాధాకరం..

అంగన్వాడికి సంబంధించిన యాప్స్, ఇంకా రెండు యాప్స్ మొత్తం మూడు యాప్స్ కు సంబంధించిన ఆన్లైన్ వర్క్ నుచేయాలి..

ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు చేసిన తప్పును భూతద్దంలో చూయించి (మీడియాలో),మేము చేసే వెట్టి చాకిరిని మాత్రం చూపించరు..

తెలంగాణలో రేవంత్ రెడ్డి మేము గెలిచిన తర్వాత 18,000 ఇస్తామన్నారు, మీరు కనీసం 19000 అయినా ఇచ్చుంటే బాగుండేదని, 26వేలు ఇవ్వలేమని మాకు చెప్పవచ్చు కదా..

గత ప్రభుత్వంలో 10,500 ఇస్తే ఇప్పుడున్న ప్రభుత్వం మొక్కుబడిగా వెయ్యి రూపాయలు పెంచి చేతులు దులుపుకుంది..

ఈ రాష్ట్రంలో అనేక మందిని అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ.. వారికి జీతభత్యాలు పెంచుతూ.. మమ్ములను మాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ అంగన్వాడి కార్యకర్తలు డిమాండ్ చేశారు.

02/12/2023

సత్తనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ మండలం తొండపి గ్రామంలో జరిగిన బోరుపోతు వారి పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న సత్తనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ బొర్రా వెంకట అప్పారావు గారు మరియు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ గారు పాల్గొనడం జరిగింది

30/11/2023

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో "డాక్టర్స్" ఆధ్వర్యంలో ర్యాలీ..

27/11/2023

కార్తీక సోమవారం.. అమరావతి శైవక్షేత్రాలలో భక్తుల కోలాహలం..

Address

Guntur

Alerts

Be the first to know and let us send you an email when AP Focus Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to AP Focus Media:

Share