01/07/2025
తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన చెరువుగట్టు దేవాలయాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం ఓ ప్రణాళిక పద్ధతిలో ప్రజల వారీగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర దేవాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య అన్నారు ఈరోజు నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిలతో కలిసి జిల్లా సాయి అధికారులు దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ దేవాలయానికి ఆదాయం బాగుందని అదేవిధంగా భక్తుల సంఖ్య కూడా అధికంగా ఉందని ఇంకా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు చాలా ఉన్నాయని ఆమె అన్నారు గుట్టమీదికి మరో రోడ్డు మార్గాన్ని వేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అదేవిధంగా వీలుగా కావలసిన వసతులపై సమీక్ష చేస్తున్నమన్నారు భక్తులకు కావలసిన వస్తువులను మరింత పెంచి ఈ దేవాలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆధునికరిస్తామని ఆమె తెలిపారు ఈ దేవాలయం సంబంధించిన కొంత భూమి అన్యాక్రాంతం అయినట్టుగా తమకు తెలిసిందని దాన్ని కూడా జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి తిరిగి దేవాలయానికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.