అప్డేట్ న్యూస్

అప్డేట్ న్యూస్ The channel was set up for the sake of Telugu people.. JUBILEE HILSS POST OFFICE ROAD NO.10. FIRS

15/09/2025

అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా ధీరజ్ కునుబిలి బాధ్యతలు

అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా ధీరజ్ కునుబిలి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఆయనను జిల్లా పోలీస్ అధికారులు ఘనంగా స్వాగతించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించమని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు సత్వర న్యాయం అందేలా పనిచేస్తామని, ఫ్రెండ్లీ పోలీసీలింగ్ అమలు చేస్తామని తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదాలను తగ్గించి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడతామని వెల్లడించారు.

తేదీ: 15.09.2025*అన్నమయ్య జిల్లా* *అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ గారు..*ర...
15/09/2025

తేదీ: 15.09.2025

*అన్నమయ్య జిల్లా*

*అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ గారు..*

రాష్ట్ర ప్రభుత్వ సాధారణ బదిలీలలో భాగంగా, ఇంతకు ముందు అన్నమయ్య జిల్లా ఎస్పీగా ఉన్న శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారు కృష్ణా జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు.

ఆయన స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహించిన శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ గారు అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా నేడు బాధ్యతలు స్వీకరించారు..

👉బాధ్యతలు స్వీకరించే సందర్భంగా..

ఏఆర్ సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు.

🎙 మీడియా సమావేశంలో ఎస్పీ గారు మాట్లాడుతూ..
"అన్నమయ్య జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను" అన్నారు.

ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారు, డిజిపి గారు, కర్నూల్ రేంజ్ డీఐజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రధాన ప్రాధాన్యతలు:

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు. మహిళలు, పిల్లలపై నేరాల నివారణకు ప్రత్యేక దృష్టి. మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి.
జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా పై ప్రత్యేక దృష్టి సారిస్తాం..
చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై గట్టి నిఘా ఏర్పాటు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను చట్టపరంగా వేగంగా పరిష్కరిస్తాం. పెరుగుతున్న సైబర్ నేరాల నివారణకు గట్టి చర్యలు & ప్రజలకు అవగాహన కార్యక్రమాలు.
మాదకద్రవ్యాల నివారణ విషయంలో రాజీ లేని పోరాటం చేస్తాం. డిజిటల్ అరెస్టులు, ఆధార్, క్రెడిట్ కార్డ్ మోసాలపై పెద్ద ఎత్తున ప్రచారం.
కళాశాలలు, పాఠశాలల్లో శక్తి టీమ్స్, మహిళా పోలీసులు, మీడియా సహకారంతో సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై అవగాహన.
ప్రజలు & మీడియా సహకారంతోనే నేరాల నివారణ సాధ్యం.

👮‍♂️ పోలీసు అధికారులకు సూచనలు..
జిల్లా పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం.

నేర నియంత్రణలో గట్టి చర్యలు తీసుకోవాలని దిశానిర్ధేశం. ప్రజల నమ్మకం పొందేలా ప్రజా-పోలీసు స్నేహ సంబంధాలు పెంపు.

📌 ఎస్పీ గారి ప్రత్యేక సందేశం..
ప్రజలందరూ భయరహితంగా జీవించేలా చూడటం పోలీసు శాఖ ధ్యేయం.
సైబర్ నేరాలను అరికట్టేందుకు ఆధునిక సాంకేతికత వినియోగం.

మహిళా భద్రతకు ప్రాధాన్యత – ‘శక్తి టీమ్స్’ బలోపేతం.
పోలీసు సిబ్బంది సంక్షేమం, శిక్షణ, వృత్తి అభివృద్ధికి కృషి.
“ప్రజల భాగస్వామ్యంతోనే నేర రహిత సమాజం సాధ్యం” అని ఎస్పీ గారు స్పష్టం.

👉ఎస్పీ గారి నేపథ్యం ఇలా ఉంది..

2020 బ్యాచ్ లో ఐపీఎస్ కు ఎంపికయ్యారు. 2021లో ఐఏఎస్ కు ఎంపికయ్యారు. వీరి తల్లి పార్వతి (గృహిణి) తండ్రి కె. వెంకటరమణ గారు అడిషనల్ ఎస్పీ గా శ్రీకాకుళం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఐఏఎస్ గా ఎంపికైనప్పటికీ తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని ఐపీఎస్ గా కొనసాగుతున్నారు. నేడు అన్నమయ్య జిల్లా ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించారు.

🌸స్వాగతం - సుస్వాగతం🌸

జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ యం. వెంకటాద్రి గారు, రాజంపేట ఏఎస్పీ శ్రీ. మనోజ్ రామనాథ్ హెగ్డే ఐపీఎస్ గారు, మదనపల్లి డిఎస్పీ ఎస్.మహేంద్ర గారు, రాయచోటి డిఎస్పీ యం.ఆర్. కృష్ణమోహన్ గారు, ఏఆర్ డిఎస్పీ యం. శ్రీనివాసులు గారు, సిఐలు, ఆర్‌ఐలు, ఎస్ఐ లు, ఆర్‌ఎస్ఐలు, డిపిఓ సిబ్బంది కొత్త ఎస్పీ గారిని కలసి మొక్కలు, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
👇
అన్నమయ్య పోలీస్

*నా బిడ్డను కాపాడండి సీఎం సారూ...*  *అరుదైన వ్యాధితో బాధపడుతున్న నాగచైతన్య*  *చికిత్సకు ప్రభుత్వం సహకరించాలంటూ తల్లి సుమ...
14/09/2025

*నా బిడ్డను కాపాడండి సీఎం సారూ...*

*అరుదైన వ్యాధితో బాధపడుతున్న నాగచైతన్య*

*చికిత్సకు ప్రభుత్వం సహకరించాలంటూ తల్లి సుమలత వేడుకోలు*

టి సుండుపల్లె సెప్టెంబర్ 14
సీమ వార్త
అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడు నాగచైతన్య(15సం)కి మెరుగైన వైద్యం అందించి కాపాడాలని తల్లి బోనంశెట్టి సుమలత కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. వివరాల్లోకి వెళ్తే.. సుండుపల్లె మండల పరిధిలోని దిన్నెమీద బలిజపల్లి గ్రామానికి చెందిన బోనం శెట్టి నాగచైతన్య ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పది రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో రాయచోటిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చూపించారు. జ్వరం తగ్గకుండా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు వేలూరు సి ఎం సి కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి ఇతనికి బోన్ బ్లడ్ క్యాన్సర్ వ్యాధిగా నిర్ధారించారు. చికిత్స కోసం దాదాపు 60 లక్షల వరకు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పడంతో ఆ నిరుపేద కుటుంబ సభ్యులు ఎటు తోచని దీనస్థితితో కుప్పకూలిపోయారు. తన భర్త జీవనోపాధి కోసం కువైట్ దేశంలో పని చేసుకుంటూ జీవనాన్ని నెట్టుకొస్తున్నాడని, తమ బిడ్డకు ఈ వింత వ్యాధి రావడంతో ఏం చేయాలో తమకు దిక్కుతోచలేదని ఆమె తమ బాధలను చెప్పుకుంటూ కుమిలిపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు తమ బిడ్డకు ప్రాణ బిక్ష పెట్టాలని ఆమె ప్రాధేయపడ్డారు. దాతలు కూడా ముందుకు వచ్చి తమ బిడ్డ వైద్యానికి సహాయం చేయాలని ఆమె వేడుకుంటున్నారు.

ఏపీలో కొత్త జిల్లాలు.. స‌రికొత్త సంగ‌తులు..!ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న 26 జిల్లాల‌ను మార్పు చేసే దిశ‌గా స‌ర్కారు అడుగులు వేస్...
14/09/2025

ఏపీలో కొత్త జిల్లాలు.. స‌రికొత్త సంగ‌తులు..!

ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న 26 జిల్లాల‌ను మార్పు చేసే దిశ‌గా స‌ర్కారు అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ నేతృత్వంలో స‌ర్కారు క‌మిటీని ఫామ్ చేసింది. ఈ క‌మిటీ కార్య‌క్ర‌మాలు కొంత మేర‌కు నెమ్మ‌దిగా సాగుతున్నాయి. అయితే.. వ‌చ్చే డిసెంబ‌రు 31 నాటికి పూర్తి చేయాల‌న్న డెడ్‌లైన్ ఉండ‌డంతో తాజాగా దీనిపై మ‌రోసారి దృష్టి పెట్టారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు, సూప‌ర్ సిక్స్‌-సూప‌ర్ హిట్ స‌భ వంటివి కొన‌సాగాయి. దీంతో మంత్రుల‌కు జిల్లాల‌పై దృష్టి పెట్టే అవ‌కాశం లేకుండా పోయింది.

ఇక, ఇప్పుడు వ‌చ్చే వారం రోజుల పాటు మంత్రులు జిల్లాల ఏర్పాటు, మార్పు, కూర్పుల‌పై దృష్టి పెట్టాల‌ని.. సీఎం చంద్ర‌బాబు నుంచి ఆదేశాలు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. దీంతో మంత్రులు మ‌ళ్లీ.. ప‌ని ప్రారంభించారు. ఈ క్ర‌మంలో తాజాగా చింతూరు జిల్లాను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌తిపాదిస్తున్న‌ట్టు తెలిసింది. అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలోని రంపచోడవరం నుంచి జిల్లా కేంద్రమైన పాడేరు సుదీర్ఘ దూరంలో ఉంది. సుమారు మూడు గంట‌ల పాటు ప్ర‌యాణిస్తే త‌ప్ప‌.. వెళ్లే ప‌రిస్థితి లేదు. ఈ విష‌యాన్ని అక్క‌డి ప్ర‌జాప్ర‌తినిధులు చెప్ప‌డంతో ప్ర‌త్యేకంగా జిల్లా ఏర్పాటుకు రంగం రెడీ అవుతోంది.

దీని ప్ర‌కారం.. రంపచోడవరం డివిజన్‌తో పాటు చింతూరు డివిజన్‌లోని 4 విలీన మండలాలు కలిపి.. చింతూరు లేదా.. రంప‌చోడ‌వ‌రం పేరుతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అదేవిధంగా ఐదు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లిపి.. ‘మార్కాపురం’ జిల్లా ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ జిల్లాలో గిద్దలూ రు, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలు ఉండ‌నున్నాయి. వాస్త‌వానికి గ‌తంలోనే మార్కాపురం ప్ర‌త్యేక జిల్లా ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్ ఉన్నా.. వైసీపీ స‌ర్కారు ప‌ట్టించుకోలేద‌న్న విష‌యం తెలిసిందే.

ఇక‌, అద్దంకి, కందుకూరు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప్ర‌కాశం జిల్లాలో విలీనం చేయ‌నున్నారు. త‌ద్వారా.. ఒంగోలు, కొండపి, సంతనూతలపాడుతో కలిపి మొత్తం ఐదు నియోజకవర్గాలతో ప్ర‌కాశం జిల్లా ఏర్ప‌డుతుంది. ఇదిలావుంటే.. రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌త్యేక జిల్లాగా మార్చాల‌ని నిర్ణ‌యించారు. అమరావతి కేంద్రంగా కొత్తగా అర్బన్‌ జిల్లా ఏర్పాటు చేస్తారు. దీనిలో రాజధాని పరిధిలోని 29 గ్రామాలు, మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలు వస్తాయి. అదేవిధంగా పెదకూరపాడు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలు కూడా ఈ ‘అమ‌రావ‌తి జిల్లా’లో క‌ల‌ప‌నున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి ఓ ప‌ది రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంద‌ని అధికారులు చెబుతున్నారు

హోంమంత్రి ప్రెస్‌మీట్ పవర్ – నోటికి పని చెప్పిన రోజా !మెడికల్ కాలేజీల విషయంలో హోంమంత్రి అనిత శుక్రవారం ప్రెస్‌మీట్ పెట్ట...
14/09/2025

హోంమంత్రి ప్రెస్‌మీట్ పవర్ – నోటికి పని చెప్పిన రోజా !

మెడికల్ కాలేజీల విషయంలో హోంమంత్రి అనిత శుక్రవారం ప్రెస్‌మీట్ పెట్టారు. కాలేజీల దుస్థితిని.. వీడియోల సాక్ష్యంగా బయట పెట్టారు. జగన్ రెడ్డికి చాలెంజ్ చేశారు దమ్ముంటే.. మెడికల్ కాలేజీలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు తీసుకెళ్తాం రావాలని సవాల్ చేశారు. అనిత ప్రెస్మీట్ వైరల్ అయింది. తాము పదిహేడు కాలేజీలు కట్టామని.. అటు నుంచి వెళ్తున్న వారు ఆగి..చూసి.. ఆహా అంటారని జగన్ ప్రెస్‌మీట్‌లో చేసి చూపించి స్కిట్ ను గుర్తు చేస్తూ.. కాలేజీలు చూసేందుకు జగన్ వెళ్లాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

అనిత ప్రెస్ మీట్ సెగ వైసీపీకి బాగా తగిలింది. వెంటనే రోజాను రంగలోకి దింపారు. ఆమె .. విస్తరాకుల కట్ట భాషతో తన టాలెంట్ చూపించారు. అనితకు అబద్దాలు చెప్పడంతో ట్రైనింగ్ ఇస్తున్నారని.. అనిత చూపించిన వీడియోలన్నీ ఫేక్ అని చెప్పుకొచ్చారు. మరి నిజం ఏమిటో వైసీపీ నేతలు వీడియోల రూపంలో బయట పెట్టవచ్చు. పునాదులు వేసి వదిలేసి.. కేంద్రం ఇచ్చిన నిధుల్ని మళ్లించేసిన దౌర్భాగ్యపు పని చేయడమే కాకుండా ఇప్పుడు.. తాము కట్టేశామని నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పేసుకుంటున్నారు.

రోజా ప్రెస్ మీట్‌లో నాలుగు మెడికల్ కాలేజీల పేర్లు చెప్పి వాటిని చూసేందుకు రావాలని సవాల్ చేశారు. అవన్నీ.. గతంలోనే మంజూరు అయి నిర్మాణాలు జరిగినవి.. జగన్ రెడ్డి తాను శంకుస్థాపన చేసిన వాటిలో ఒక్క పులివెందుల తప్ప.. ఒక్క మెడికల్ కాలేజీని కూడా నిర్మించలేదు. పులివెందులలోనూ భవనాలు తప్ప మౌలిక సదుపాయాలు కల్పించలేదు. అయినా.. నిజాలు చెబితే మాత్రం.. రోజా లాంటి వాళ్లు.. బూతులతో విరుచుకుపడేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు.

అమరావతి ఏపీ రాజధాని – చర్చే అనవసరం!మళ్లీ జగన్ రెడ్డి సీఎం అయితే అమరావతి నుంచి పరిపాలిస్తారు అని సజ్జల రామకృష్ణారెడ్డి ఓ ...
14/09/2025

అమరావతి ఏపీ రాజధాని – చర్చే అనవసరం!

మళ్లీ జగన్ రెడ్డి సీఎం అయితే అమరావతి నుంచి పరిపాలిస్తారు అని సజ్జల రామకృష్ణారెడ్డి ఓ మీడియా కాంక్లేవ్‌లో చెప్పుకొచ్చారు. మూడు రాజధానులు అని చెప్పలేదన్నారు. ఆయన చెప్పిన మాటల్ని విన్న వారికి పాపం వైసీపీ అనిపిస్తుంది. ఆ పార్టీ క్యాడర్ సంగతి చెప్పాల్సిన పని లేదు. లీడర్ల గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇదే మాట జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి.. అమరావతిపై తన విధానాన్ని చెప్పి ఉంటే బాగుండేది. కానీ సజ్జలతో చెప్పించారు. దానికి ఎంత విలువ ఉందన్నది పక్కన పెడితే.. అసలు అమరావతి రాజధాని అన్న అంశంపై చర్చ ఎప్పుడో ముగిసిపోయింది.

రాజధాని చర్చే అసంబద్దం

అమరావతి ఏపీ రాజధాని అనేది ఎప్పుడో జరిగిపోయిన నిర్ణయం. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన నిర్ణయం. అందులో జగన్ రెడ్డికూడా ఉన్నారు. ఆమోదిస్తున్నా అన్నారు. 30వేల ఎకరాల్లో కట్టాలి అన్నారు. ఆయన మాటల ప్రకారమే…అమరావతిలో రాజధాని నిర్ణయం అయింది. పునాదులు పడిన తర్వాత వచ్చిన ఆయనే.. దాన్ని చంపేసే ప్రయత్నం చేశాడు. కానీ విజయవంతం కాలేదు. అక్కడే రాజధాని పునాదుల్లో ఎంత బలం ఉందో తేలిపోయింది. ప్రజలు జగన్ రెడ్డికి భయంకర శిక్ష వేశారు. ఇక అమరావతిపై చర్చే అసంబద్ధం.

అమరావతిని మార్చడం ఇక ఎవరి తరం కాదు !

అమరావతిలో కట్టకూడదు.. విజయవాడ, గుంటూరు మధ్య కట్టాలి అని కొత్తగా ఏదో చెబుతున్నారు వైసీపీ నేతలు. అసలు అమరావతి అంటే ఏంటో తెలిస్తే ఇలా మాట్లాడరు. కానీ ప్రజల్ని మభ్యపెట్టి.. ఏదో తప్పుడు ప్రచారం చేసి.. తమదైన కుళ్లు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడతారు. వాళ్లకు తెలిసినా తెలియనట్లుగా ఉండే విషయం ఏమిటంటే.. అసలు రాజధానిగా అమరావతిని మార్చడం ఎవరి తరం కాదు. వారు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా అదే నిజం. కానీ తాము వస్తే.. అదే కొనసాగిస్తామని చెప్పడం.. కేవలం అమరాతిపై చర్చను కొనసాగించడానికే.

వైసీపీ, సజ్జల అమరావతిపై కుట్రలు ఆపరు !

సజ్జల అలా చెప్పాడని.. అమరావతిపై చర్చ పెట్టడం కూడా పొరపాటే అవుతుంది. అమరావతిలో ఇప్పుడు యాభై వేల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. ప్రైవేటు పెట్టుబడులు కూడా కలిస్తే.. వచ్చే రెండేళ్లలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులతో నిర్మాణం జరుగుతుంది. అమరావతి పునాదులు ఎంతో బలంగా ఉన్నాయి కాబట్టే.. రాక్షస మూకలు దాడి చేసినా చెక్కు చెదరలేదు. కాలకేయులంతా కలసి వచ్చినా.. అమరావతిని ఒక్క ఇంచ్ కూడా కదిలించలేరు. ఇది ప్రజాశాసనం కాబట్టి.. చర్చ కూడా అనవసరం.

అది చిన్న విష‌యం కాదు.. ఆ నిర్ణయంతో భారత్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయి: ట్రంప్భారత్‌పై 50 శాతం సుంకం.. సంబంధాలు దెబ్బతిన్నా...
14/09/2025

అది చిన్న విష‌యం కాదు.. ఆ నిర్ణయంతో భారత్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయి: ట్రంప్

భారత్‌పై 50 శాతం సుంకం.. సంబంధాలు దెబ్బతిన్నాయన్న ట్రంప్

రష్యా నుంచి ఆయిల్ కొనడమే టారిఫ్‌లకు కారణమని వెల్లడి

ఇది అంత తేలికైన నిర్ణయం కాదని వ్యాఖ్య‌

ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య విభేదాలు సృష్టించిందని అంగీకారం

త్వరలోనే ప్రధాని మోదీతో మాట్లాడతానన్న అమెరికా అధ్యక్షుడు

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు తాము విధించిన 50 శాతం దిగుమతి సుంకం (టారిఫ్), ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఇది ఇరు దేశాల మధ్య విభేదాలకు కారణమైందని ఆయన తొలిసారి బహిరంగంగా వ్యాఖ్యానించారు. శుక్రవారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

"రష్యాకు భారత్ అతిపెద్ద వినియోగదారు. వారు రష్యా నుంచి చమురు కొంటున్నందుకే నేను 50 శాతం టారిఫ్ విధించాను. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు. ఈ నిర్ణయం చాలా పెద్దది. ఇది భారత్‌తో విభేదాలకు దారితీసింది" అని 'ఫాక్స్ & ఫ్రెండ్స్' కార్యక్రమంలో ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించగా, వాటిని పక్కనపెట్టి భారత్ చమురు కొనుగోళ్లను కొనసాగించడంతో అమెరికా ఈ కఠిన చర్యలు తీసుకుంది.

వాస్తవానికి, వాషింగ్టన్ మొదట భారత దిగుమతులపై 25 శాతం అదనపు సుంకాలు విధించింది. ఆ తర్వాత, ఢిల్లీ తన కొనుగోళ్లను మరింత పెంచడంతో ఆగస్టు 27 నుంచి ఆ సుంకాలను 50 శాతానికి రెట్టింపు చేసింది. ఈ చర్యతో భారత్‌లో అమెరికా వ్యతిరేక సెంటిమెంట్ పెరిగింది. వ్యవసాయ, డెయిరీ రంగాల్లో తమ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు భారత్ నిరాకరించడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు ఇప్పటికే స్తంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఏటా 190 బిలియన్ డాలర్లకు పైగా ఉంది.

అయితే, కొన్ని వారాల దౌత్యపరమైన ఉద్రిక్తతల తర్వాత పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ట్రంప్ మాటల ద్వారా తెలుస్తోంది. భారత్‌తో వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు చర్చలు కొనసాగిస్తున్నామని, త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీతో తాను మాట్లాడతానని ట్రంప్ ఇటీవల వెల్లడించారు.

ఇదే విషయంపై, భారత్‌కు అమెరికా రాయబారిగా నామినేట్ అయిన సెర్గియో గోర్ కూడా స్పందించారు. ఈ టారిఫ్‌ల వివాదాన్ని "ఒక చిన్న అవాంతరం"గా ఆయన అభివర్ణించారు. "మేము మా మిత్రులను భిన్నమైన ప్రమాణాలతో చూస్తాము. భారత్‌ను మా నుంచి దూరం కాకుండా, మా వైపునకు ఆకర్షించేందుకు నేను అత్యంత ప్రాధాన్యత ఇస్తాను" అని ఆయన అన్నారు. ఇతర దేశాధినేతలపై తరచూ విమర్శలు చేసే ట్రంప్, ప్రధాని మోదీని వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శించలేదని కూడా గోర్ గుర్తుచేశారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సీఎం మాస్టర్ ప్లాన్!జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో నవీన్ కుమార్ యాదవ్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ...
14/09/2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సీఎం మాస్టర్ ప్లాన్!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో నవీన్ కుమార్ యాదవ్ను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముస్లిం మైనార్టీ తర్వాత యాదవ ఓటర్లు ఎక్కువగా ఉండటం బీసీ నినాదం కలిసి వస్తుందని పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అసదుద్దీన్, మజ్లిస్ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.

ప్రాణాల కంటే డబ్బులే ముఖ్యమా?భారత్-పాక్ మ్యాచ్పై అసదుద్దీన్ ఒవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రత్యర్థి దేశంతో క్రికెట్ ఆ...
14/09/2025

ప్రాణాల కంటే డబ్బులే ముఖ్యమా?

భారత్-పాక్ మ్యాచ్పై అసదుద్దీన్ ఒవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రత్యర్థి దేశంతో క్రికెట్ ఆడటాన్ని వ్యతిరేకించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పౌరుల ప్రాణాలు పోయాయి. ఆ ప్రాణాల కంటే ఒక మ్యాచ్ ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయలు ముఖ్యమా? అని ప్రశ్నించారు. మతం అడిగి చంపిన దేశంతో క్రికెట్ ఆడకూడదన్నారు.

సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దు!ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పర్యటన రద...
14/09/2025

సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దు!

ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పర్యటన రద్దయినట్లు అధికారులు తెలిపారు. తిరుపతిలో మహిళా సాధికారత సదస్సులో సీఎం పాల్గొనాల్సి ఉంది. అయితే అమరావతి-తిరుపతి మధ్య దట్టమైన మేఘాలు అలముకొని ఉండటంతో ఏవియేషన్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో పర్యటన రద్దయింది.

ఎయిర్పోర్టులో తప్పిన ప్రమాదంలక్నో ఎయిర్పోర్టులో పెను ప్రమాదం తప్పింది. లక్నో నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానంలో సాంక...
14/09/2025

ఎయిర్పోర్టులో తప్పిన ప్రమాదం

లక్నో ఎయిర్పోర్టులో పెను ప్రమాదం తప్పింది. లక్నో నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ సమయంలోనే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ కాలేదు. వెంటనే అలరెన అలర్టైన పైలెట్.. విమానాన్ని టేకాఫ్ చెయ్యకుండా ఆపేశారు. విమానంలో ఎంపీ డింపుల్ యాదవ్తో పాటు 151 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సంఘటన కారణంగా విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు.

అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్ గా నిశాంత్ కుమార్ బాధ్యతలు స్వీకరణఅన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్‌గా నిశాంత్ కుమార్ శుభారంభం...
14/09/2025

అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్ గా నిశాంత్ కుమార్ బాధ్యతలు స్వీకరణ

అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్‌గా నిశాంత్ కుమార్ శుభారంభం చేశారు. ఆయనను పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతించారు. వీరభద్ర స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు కలెక్టర్‌కు శ్రద్ధతో స్వాగతం పలికారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, ఇతర జిల్లా స్థాయి అధికారులు పుష్పగుచ్చాలతో కలెక్టర్‌కు హృదయపూర్వకంగా స్వాగతం అందించారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం, జిల్లా అభివృద్ధిపై సమగ్రంగా చర్చించేందుకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా పురోగతి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల సమస్యల పరిష్కారం పై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.

Address

JUBILEE HILLS PISTA OFFCE . Road 10 . HYDERABAD TELANGANA . 500033
Hyderabad
HYDERABAD.TELANGANA.TSINDAIA.PINCODE500033

Website

Alerts

Be the first to know and let us send you an email when అప్డేట్ న్యూస్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to అప్డేట్ న్యూస్:

Share