అప్డేట్ న్యూస్

అప్డేట్ న్యూస్ The channel was set up for the sake of Telugu people.. JUBILEE HILSS POST OFFICE ROAD NO.10. FIRS

*అన్నమయ్య జిల్లా  రాజంపేట ఏ.ఎస్.పి గా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ కుమార్ హెగ్డే  గారిని  మర్యాదగాపూర్వకంగా కలిసి శాలువాతో...
23/01/2025

*అన్నమయ్య జిల్లా రాజంపేట ఏ.ఎస్.పి గా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ కుమార్ హెగ్డే గారిని మర్యాదగాపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన 1 టివి అన్నమయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్ షేక్.యూసుఫ్ రాజంపేట రిపోర్టర్ సురేష్.లు*

Follow this link to join my WhatsApp group:
22/01/2025

Follow this link to join my WhatsApp group:

WhatsApp Group Invite

22/01/2025

అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ గ్రౌండ్ కరువు అయినా నేపథ్యంలో బహుద నది లో ఆటల పోటీలు

*కరవైన మైదానం.. ఎర్రటి ఎండలో బహుదా నదిలో విద్యార్థులకు ఆటల పోటీలు*విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరం. ఆటలతో మానసికో...
22/01/2025

*కరవైన మైదానం.. ఎర్రటి ఎండలో బహుదా నదిలో విద్యార్థులకు ఆటల పోటీలు*

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరం. ఆటలతో మానసికోల్లాసంతో పాటూ దేహదారుఢ్యం పెరుగుతుంది. కానీ కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో తగిన క్రీడా వసతులు లేక విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు

అన్నమయ్య జిల్లా సుండుపల్లికి చెందిన లిటిల్ ఫ్లవర్ స్కూల్ కు పాఠశాల క్రీడా మైదానం లేకపోవడంతో విద్యార్థులను ఆటల పోటీలను నిర్వహిస్తున్నారు. ఎర్రటి ఎండలో పోటీలు నిర్వహిస్తూ విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పాఠశాలలో విద్యార్థులను అడ్మిషన్ చేసుకునేటప్పుడు మాకు అన్ని వసతులు ఉన్నాయి అని కల్లబొల్లి మాటలు చెప్పి తల్లిదండ్రులను మాయ చేసి అడ్మిషన్లు చేసుకుని తమ పబ్బం గడుపుకుంటారని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాలలో మైదాన వసతి లేకపోవడంతో విద్యార్థులు తరగతి గదులకు, బహుదా నదికి పరిమితం కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రైవేటు పాఠశాలలలో తగినన్ని వసతులు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని మండల విద్యాధికారులు తనిఖీలు చేసి నిర్ధారించి వారికి అనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే వీరు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని స్థానికుల ఆరోపణ. దీనిపై మండల విద్యాధికారులతోపాటు, జిల్లా విద్యాధికారి కూడా పాఠశాలను తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

👉సుండుపల్లి మండలంలో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్...!!!..?👉 గంజాయి మత్తులోన లేద మద్యం మత్తులోన హై స్కూల్ విద్యార్థిని పై  ...
22/01/2025

👉సుండుపల్లి మండలంలో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్...!!!..?

👉 గంజాయి మత్తులోన లేద మద్యం మత్తులోన హై స్కూల్ విద్యార్థిని పై దురుస్తూ ప్రవర్తనలు...?

👉తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఫలితం లేదంటున్న తల్లిదండ్రులు

👉పిల్లోళ్లకు పాఠశాలలకు పంపాలంటేనే భయంగా ఉంది అంటున్న తల్లిదండ్రులు

👉ఇదేం పట్టినట్టు వ్యవహరిస్తున్న అధికారులు

👉ఆకతాయిల నుంచి విద్యార్థినీ లకు రక్షణ కల్పించాలని తల్లిదండ్రుల డిమాండ్.

అన్నమయ్య జిల్లా, టి.సుండుపల్లె మండలం లోని పదవ తరగతి, ఇంటర్ చదువుతున్న విద్యార్థినీ లకు ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం లో కొంతమంది యువత ఆకతాయిలు గా చలామణి అవుతూ సుండుపల్లె లోని మహిళా విదార్థినీల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని, అలా ప్రవర్తిస్తున్న వారి పైన పోలీస్ వ్యవస్థ కఠినంగా వ్యవహరించాలి మంగళవారం సాయంత్రం సుండుపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదివే విద్యార్థినీలు పాఠశాల విడిచి పెట్టిన తరువాత ప్రాథమికోన్నత పాఠశాల గ్రౌండ్ లో నుంచి ఇంటికి పోతున్న సమయంలో అక్కడ సుండుపల్లె లో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న ఒక అధికారి కుమారుడు అదే ప్రాథమికోన్నత పాఠశాల గ్రౌండ్ లో ఉండి, ఇంటికి వెళుతున్న కొంత మంది మహిళా విద్యార్థినీ ల పట్ల నోటికి వచ్చినట్లు, చెప్పుకోలేని విధంగా, పరుష పదజాలంతో దూషించి, మీ కథ చూస్తానని హెచ్చరించాడని వినికిడి, ఇలా విద్యార్థినీ ల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తూ, విద్యార్థులను భయ భ్రాంతులకు గురిచేస్తున్న ఆకతాయిల నుంచి మహిళా విద్యార్థినీ లకు రక్షణ కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

21/01/2025

*అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి మండలం MPP అవినీతి తిమింగలం*

"MPP రాజమ్మ అవినీతి చేసి ప్రజా ధనం దుర్వినియోగం చేసిన విషయాలు స్పష్టంగా అధికార నివేదికల ద్వారా వెలుగులోకి వచ్చాయి. మండల పరిషత్ నిధుల నుంచి దాదాపు రూ. 2 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడ్డారని నిర్థారణ అయ్యింది. ఇది మాత్రమే కాకుండా, సీసీ రోడ్ల కోసం సమర్పించిన వుకాయిదాలలో లోటుపాట్లను వెనకటి ప్రకటనలు ఎత్తిచూపాయి.*

*ఈ పరిస్థితుల మధ్య, ఆమె చట్ట బద్ధంగా ఆడిట్లకు సమాధానాలు చెప్పకుండా పార్టీ మారడం తన అక్రమాలకు రక్షణగా టీడీపీ పార్టీని అడ్డుపెట్టుకోవడం తప్ప వేరొక ఉద్దేశం లేదని ప్రజల మధ్య అనుమానాలు రేకెత్తించింది. పార్టీకి చేరినప్పటి నుండి నిజమైన నాయకత్వం ప్రదర్శించకపోవడం మాత్రమే కాకుండా, ప్రజల నమ్మకానికి భంగం కలిగింది.*

*ఇలాంటి అవినీతి పుట్టలను పార్టీలో కొనసాగించడం పార్టీ ఆశయాలకు వ్యతిరేకం. అవినీతి వ్యక్తులను మద్దతు ఇస్తూ, వారిని రక్షించేవారికి ఎలాంటి మన్నన కూడా ఉండకూడదు. అసలు తక్షణం చట్ట ప్రకారం చర్యలు తీసుకోని పక్షంలో, ఇది పార్టీ క్రమశిక్షణను తప్పనిసరిగా చెదరగొడుతుంది.*

*మండల ప్రజలు, కార్యకర్తలు, అందరూ ఇప్పుడు ఎంతో సహనం కోల్పోయి, MPP రాజమ్మ గారిపై వెంటనే పార్టీ చర్య తీసుకుని, ఆమెను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివిధ అభ్యంతరాలను స్పష్టం చేయడం టీడీపీ నిజాయితీని చాటిచెప్పే కార్యకర్తల విజయంగా గుర్తించాలి.*

*జిల్లా మరియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రాజు గమరియు శ్రీ పల్లా శ్రీనివాసులు ప్రజా నమ్మకం కోసం తక్షణమే చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఈ విషయాన్ని బహిర్గతం చేసిన ప్రతి కార్యకర్తకు ప్రజల, పార్టీ వారసత్వానికి మనం అండగా నిలవాలి.*

21/01/2025

అన్నమయ్య జిల్లా టీ. సుండుపల్లి మండలంలో దేవుడు మాన్యం దళితుల మాన్యని సైతం వదలని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు..

21/01/2025
*1 టివి న్యూస్ ఛానల్ (శాటిలైట్) ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలు*మహిళలలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలుగులోకి తెచ్చేందుకు, వారి...
21/01/2025

*1 టివి న్యూస్ ఛానల్ (శాటిలైట్) ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలు*

మహిళలలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలుగులోకి తెచ్చేందుకు, వారిని ప్రోత్సహించేందుకు 1 టివి న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ఈనెల 25న రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆటల పోటీలు ప్రారంభం కానున్నాయి. చిన్ననాటి సాంప్రదాయ ఆటలైన లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్ మొదలుగా ఆటల పోటీలు నిర్వహించబడును. పోటీలో గెలుపొందిన మహిళలకు మా 1టివి న్యూస్ ఛానల్ తరపున ఆకర్షణీయమైన బహుమతులు కలవు.
*అర్హులు:* 18 ఏళ్ల వయసు నుంచి 50 ఏళ్లలోపు మహిళలు
కావున మహిళామణులు ఈ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని మనవి. రాజంపేట మునిసిపాలిటి పరిధిలో గల మహిళల ఆరోగ్య మరియు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి మరియు వారిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మహిళామణులారా! మీ ప్రతిభను చాటేందుకు ఇదే సరైన అవకాశం త్వరపడండి.
*వేదిక:* ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం రాజంపేట.
*1 టీవి న్యూస్ చానల్ నిర్వహిస్తున్న ఆటల పోటీలలో పాల్గొనదలచిన మహిళలు క్రింది నెంబర్లకు కింది నెంబర్లను సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవలయును :*
1) D.సురేష్ 1టీవి రిపోర్టర్ రాజంపేట
ఫోన్ నెం. 7893406698,7989752224
2) షేక్ యూసుఫ్ ఫోన్ నెం. 8142675370

*అన్నమయ్య జిల్లా రాయచోటి టిడిపి యువ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు గారి జన్మదిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య ...
18/01/2025

*అన్నమయ్య జిల్లా రాయచోటి టిడిపి యువ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు గారి జన్మదిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్ షేక్ యూసుఫ్. పాల రెడ్డయ్యా లు*

*కడప జిల్లా: చాపాడు ఎస్సై చిన్న పెద్దయ్య ఓవరాక్షన్...!*వార్త కవరేజ్ కి వెళ్ళిన మీడియా ప్రతినిధి పై బూతులు తిడుతూ రెచ్చిప...
16/01/2025

*కడప జిల్లా: చాపాడు ఎస్సై చిన్న పెద్దయ్య ఓవరాక్షన్...!*

వార్త కవరేజ్ కి వెళ్ళిన మీడియా ప్రతినిధి పై బూతులు తిడుతూ రెచ్చిపోయిన ఎస్సై చిన్న పెద్దయ్య.

అంతటితో మీడియా ప్రతినిధిని మొబైల్ ఫోన్ లాక్కొని లాఠీ తో చితకబాదిన ఎస్సై చిన్న పెద్దయ్య.

ఎస్సై చిన్న పెద్దయ్య దాడిలో గాయపడ్డ ప్రొద్దుటూరు మీడియా ప్రతినిధికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు.

గతంలో పెనగలూరు ఎస్సైగా పనిచేస్తున్న చిన్న పెద్దయ్య ఓ ప్రేమ జంట తల్లిదండ్రులను విచక్షణ రహితంగా కొట్టడంతో 10tv మీడియాకు ఫిర్యాదు చేసిన బాధితులు.

ఎస్సై చిన్న పెద్దయ్య పై అప్పట్లో నేనేరా పోలీస్ అంటూ 10tv ప్రత్యేక కథనం.

10tv కథనానికి స్పందించిన జిల్లా ఎస్పీ ఎస్సై చిన్న పెద్దాయన వెంటనే విఆర్ కు పంపుతూ ఉత్తర్వులు.

ఎక్కడ పనిచేసిన వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఎస్సై చిన్న పెద్దయ్య.

ఎస్సై చిన్న పెద్దయ్య ను సస్పెండ్ చేయాలంటూ మీడియా ప్రతినిధుల డిమాండ్.

16/01/2025

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ

చల్లోపల్లి క్వారీ గుంతలో యువకుడు గల్లంతు

గుర్రంకొండ కు స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వచ్చిన యువకుడు.

సంక్రాంతి పండుగకు అతని సొంత ఊరుకు వచ్చిన వెంకటరత్నం

పక్కనున్న క్వారీ గుంతలో ఈత ఆడదామని వెళ్లిన యువకులు .

చొక్కానోళ్లపల్లి కి చెందిన సూరి కొడుకు బి .వెంకటరత్నం (24) స్నేహితులు కలిసి గుర్రంకొండ మండలానికి చల్లపల్లి వద్ద ఉన్న దద్దలవారిపల్లికు క్రికెట్ ఆడేందుకు వెళ్లారు.

వెంకటరత్నం 25వ తేదీ US కి వెళ్లే అతడు అంతలోనే ఈతకెళ్లి గల్లంతయ్యాడు.

పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు

వెంకటరత్నం కనపడకపోవడంతో లోపల బండల్లో చిక్కుకుపోయాడని రెస్క్యూ టీం ను పిలిపించి వెతుకుతున్నారు.

15/01/2025

అన్నమయ్య జిల్లా. టి. సుండుపల్లి

సుండుపల్లి మండల కేంద్రం చెన్నంశెట్టిగారిపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా కనుమ వేడుకలు.

ఎల్లమ్మ తల్లి కి ప్రత్యేక పూజలు నిర్వహించి చాందిని బండి ఆర్కెస్ట్రా తో ప్రారంభించి

కాటరామరాజుకు ప్రత్యేక పూజలు నిర్వహించి చిట్లకుప్ప వద్దకు చేరుకోన్న గ్రామస్తులు.

పశువులను సర్వసుందరంగా అలంకరించి చిట్లకుప్ప చుట్టూ ప్రదక్షిణలు చేసిన రైతులు.

కులమతాలకు అతీతంగా తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు.

*అన్నమయ్య జిల్లా:-**శిబ్యాల న్యూస్:-**ఆటో,ద్విచక్ర వాహనం ఢీ - వ్యక్తి మృతి* సుండుపల్లి - రాయచోటి మార్గమధ్యంలో గల శిబ్యాల...
15/01/2025

*అన్నమయ్య జిల్లా:-*

*శిబ్యాల న్యూస్:-*

*ఆటో,ద్విచక్ర వాహనం ఢీ - వ్యక్తి మృతి*

సుండుపల్లి - రాయచోటి మార్గమధ్యంలో గల శిబ్యాల వద్ద ఆటో మరియు ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న సాదిక్ ( 25 సం ) అనే యువకుడు మృతి చెందారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సిఐ విశ్వనాథరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది...

Address

JUBILEE HILLS PISTA OFFCE . Road 10 . HYDERABAD TELANGANA . 500033
Hyderabad
HYDERABAD.TELANGANA.TSINDAIA.PINCODE500033

Website

Alerts

Be the first to know and let us send you an email when అప్డేట్ న్యూస్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to అప్డేట్ న్యూస్:

Videos

Share