Leader For Seva

Leader For Seva సేవ పరమో ధర్మ:

  నిత్య జనగణమన కార్యక్రమం వార్షికోత్సవ సంబరాలు చేసుకుంటూ మున్ముందుకు సాగుతోంది. నేటి కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా ...
19/05/2023



నిత్య జనగణమన కార్యక్రమం వార్షికోత్సవ సంబరాలు చేసుకుంటూ మున్ముందుకు సాగుతోంది. నేటి కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటు నల్లకుంట కార్పొరేటర్ వై అమృత, బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రావు, నిజామాబాద్ బీజేపీ పార్లమెంటరీ ప్రబారి వెంకటరమణి, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆనంద్ గౌడ్, బీజేపీ అంబర్పేట్ నియోజకవర్గ కన్వీనర్ శ్యామ్ రాజ్, సీనియర్ నాయకులు మర్రి మురళి, సురేష్ యాదవ్, మహేందర్, నల్లకుంట బీజేపీ అధ్యక్షుడు రమణ నాయుడు, నల్లకుంట ఓబీసీ మోర్చా సెక్రటరీ రాఘవేందర్ గౌడ్, నాయకులు ఎంబీ కిషోర్, సంధ్యారాణి, బాబు, మహేందర్, ధర్మేంద్ర, యాదగిరి, వీరయ్య గౌడ్, సురేష్ యాదవ్ తదితరులు కూడా వచ్చారు.
ముందుగా భారతమాత ఫోటోకు వందనం చేసిన లక్ష్మణ్ గారు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అందరూ కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ సంవత్సరం పాటు నిత్యం జాతీయ జెండాను ఎగురవేయడం అభినందనీయం అని అన్నారు. జాతీయ జెండా నీడన మనందరం సుఖశాంతులతో జీవిస్తున్నామని చెప్పారు. ఈ పతాక స్ఫూర్తితోనే భారత్ విశ్వ గురువుగా వెలుగొందుతుంది అని పేర్కొన్నారు. అంతటి విశిష్టత కలిగి ఉన్న మన జెండాను ఇక్కడ ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఆవిష్కరిస్తుండడం శ్లాఘనీయమన్నారు. జాతీయ జెండా స్ఫూర్తిని, సేవా భావాన్ని వ్యాపింప చేయడానికి కృషి చేస్తున్న వందే ప్రజ, లీడర్స్ ఫర్ సేవ సంస్థలను, ఆ సంస్థల సభ్యులకు ఈ సందర్భంగా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. వందే ప్రజా శ్రీనివాస్ వందన సమర్పణ చేశారు. లీడర్స్ ఫర్ సేవ ఆర్గనైజెషన్ సభ్యులు నేలంటి మధు, మల్లాడి క్రాంతి, జూకంటి ప్రశాంత్, సర్వు అశోక్, ప్రసాద్ దూబే, వందే ప్రజ ప్రెసిడెంట్ ఏం కే శ్రీనివాస్, అడ్వకేట్ అరవింద్ రాజ్ నవీన్, విజయేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

   నిత్య జనగణమన వార్షికోత్సవ కార్యక్రమాలు ఉత్సహంగా సాగుతున్నాయి. నేడు వందే ప్రజ ప్రెసిడెంట్ ఏం కే శ్రీనివాస్ జాతీయ జెండా...
12/05/2023




నిత్య జనగణమన వార్షికోత్సవ కార్యక్రమాలు ఉత్సహంగా సాగుతున్నాయి. నేడు వందే ప్రజ ప్రెసిడెంట్ ఏం కే శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురవేసి, అందరితో కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో నేలంటి మధు, మల్లాడి క్రాంతి, జూకంటి ప్రశాంత్, ప్రసాద్ దూభే, విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

             నిత్యజనగణమన కార్యక్రమం జాతీయతాభావం పెంపొందిస్తూ ముందుకు సాగుతోంది. 365 రోజులు పూర్తి చేసుకుని ఉత్సహంగా ముంద...
11/05/2023


నిత్యజనగణమన కార్యక్రమం జాతీయతాభావం పెంపొందిస్తూ ముందుకు సాగుతోంది. 365 రోజులు పూర్తి చేసుకుని ఉత్సహంగా ముందుకు సాగుతూ వారోత్సవాలు జరుపుకుంటోంది. వారోత్సవాల్లో భాగంగా నేడు నల్లకుంట కార్పొరేటర్ వై.అమృత అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగురవేసి అందరితో కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో నేలంటి మధు, మల్లాడి క్రాంతి, జూకంటి ప్రశాంత్, సర్వు అశోక్, వందేప్రజ శ్రీనివాస్, విజయేందర్ రెడ్డి, ప్రసాద్ దూబె, తదితరులు పాల్గొన్నారు.

09/05/2023




నిత్య జనగణమన కార్యక్రమం ప్రారంభమై 365 రోజులు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ప్రారంభ సూచికగా BJP సీనియర్ నాయకులు రాము యాదవ్ యాజమాన్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు అతిథులుగా విచ్చేశారు. నల్లకుంటలోని ఇన్స్టిట్యూట్ నుంచి ప్రొఫెసర్లు స్నేహ జాదవ్, భవానిల ఆధ్వర్యంలో 40 మందికి పైగా విద్యార్థులు జెండా కేంద్రం దాకా ర్యాలీగా తరలివచ్చారు. త్రివర్ణ పతాకాలు పట్టుకుని నినాదాలు చేస్తూ యువతులందరూ క్రమశిక్షణగా ముందుకు సాగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫీవర్ హాస్పిటల్ మెయిన్ రోడ్డు, తిలక్ నగర్ రోడ్డు వీరి రాకతో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. వీరి నినాదాలతో కొందరు స్థానికులు కూడా గొంతు కలపడం విశేషం. ర్యాలీకి తోడుగా నిత్య జనగణమన స్థాపకు సభ్యులు వందే ప్రజ శ్రీనివాస్, జూకంటి ప్రశాంత్ ముందుకు సాగారు. నిత్య జనగణమన కేంద్రం వద్ద ఈ ప్రదర్శనకు నిర్వాహకులు ఎన్. మధు, మల్లాడి క్రాంతి, నల్లవెల్లి విజయేందర్ రెడ్డి, ఉపేంద్ర ప్రసాద్ దుబే, తదితరులు స్వాగతం పలికారు. విద్యార్థులు జెండా కేంద్రం వద్ద త్రివర్ణ పతాక వేదిక చుట్టూ వలయంగా నిలబడి పతాక ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ విద్యార్థినుల బృందానికి సారథ్యం వహించిన ప్రొఫెసర్లు స్నేహ జాదవ్, భవానిలు సంయుక్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అందరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం వారు కార్యక్రమం గురించి మాట్లాడారు. నేటితో నిత్య జనగణమన కార్యక్రమం వార్షికోత్సవాలు ప్రారంభమైనట్టు నిర్వాహకులు ప్రకటించారు. విద్యార్థులు, నిర్వాహకులు, స్థానికులు కలిసి ఈ సందర్భంగా నినాదాలు చేయడం పలువురుని ఆకట్టుకుంది. ప్రదర్శన, కార్యక్రమం ఆద్యంతం వినూత్నంగా ఆసక్తిగా కొనసాగింది.



   నిత్య జనగణమన కార్యక్రమం ప్రారంభమై 365 రోజులు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ప్రారంభ సూ...
09/05/2023




నిత్య జనగణమన కార్యక్రమం ప్రారంభమై 365 రోజులు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ప్రారంభ సూచికగా BJP సీనియర్ నాయకులు రాము యాదవ్ యాజమాన్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు అతిథులుగా విచ్చేశారు. నల్లకుంటలోని ఇన్స్టిట్యూట్ నుంచి ప్రొఫెసర్లు స్నేహ జాదవ్, భవానిల ఆధ్వర్యంలో 40 మందికి పైగా విద్యార్థులు జెండా కేంద్రం దాకా ర్యాలీగా తరలివచ్చారు. త్రివర్ణ పతాకాలు పట్టుకుని నినాదాలు చేస్తూ యువతులందరూ క్రమశిక్షణగా ముందుకు సాగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫీవర్ హాస్పిటల్ మెయిన్ రోడ్డు, తిలక్ నగర్ రోడ్డు వీరి రాకతో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. వీరి నినాదాలతో కొందరు స్థానికులు కూడా గొంతు కలపడం విశేషం. ర్యాలీకి తోడుగా నిత్య జనగణమన స్థాపకు సభ్యులు వందే ప్రజ శ్రీనివాస్, జూకంటి ప్రశాంత్ ముందుకు సాగారు. నిత్య జనగణమన కేంద్రం వద్ద ఈ ప్రదర్శనకు నిర్వాహకులు ఎన్. మధు, మల్లాడి క్రాంతి, నల్లవెల్లి విజయేందర్ రెడ్డి, ఉపేంద్ర ప్రసాద్ దుబే, తదితరులు స్వాగతం పలికారు. విద్యార్థులు జెండా కేంద్రం వద్ద త్రివర్ణ పతాక వేదిక చుట్టూ వలయంగా నిలబడి పతాక ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ విద్యార్థినుల బృందానికి సారథ్యం వహించిన ప్రొఫెసర్లు స్నేహ జాదవ్, భవానిలు సంయుక్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అందరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం వారు కార్యక్రమం గురించి మాట్లాడారు. నేటితో నిత్య జనగణమన కార్యక్రమం వార్షికోత్సవాలు ప్రారంభమైనట్టు నిర్వాహకులు ప్రకటించారు. విద్యార్థులు, నిర్వాహకులు, స్థానికులు కలిసి ఈ సందర్భంగా నినాదాలు చేయడం పలువురుని ఆకట్టుకుంది. ప్రదర్శన, కార్యక్రమం ఆద్యంతం వినూత్నంగా ఆసక్తిగా కొనసాగింది.



22/04/2023

నిత్య జనగణమన కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతున్నది.
నేడు రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, బిజెపి నాయకుడు, న్యాయవాది ఎస్ వీపీ యాదవ్ నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన సహచరులు బి. శివ నేత, ఎస్. రవి శంకర్, జస్వంత్ కౌర్, రింకు కూడా వచ్చారు.
అతిథి హోదాలో యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించి,
అందరితో కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కార్యక్రమాన్ని ప్రశంసించారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో Nelanti Madhu, Malladi Kranthi, Jukanti Prashanth, Vande Praja Srinivas, Upendra Prasad Dube, Nallavelli Vijayender Reddy, తదితరులు పాల్గొన్నారు.

Address

Telangana
Hyderabad
500004

Telephone

+919866652040

Website

Alerts

Be the first to know and let us send you an email when Leader For Seva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Leader For Seva:

Share