06/04/2025
డాక్టర్ మణి భూషణ్ దర్శకత్వం లో " నమో... వాసవి...! "
విశాఖపట్నం నగరానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న, ప్రముఖ వెబ్ ఛానల్ టీవీ టూరిజం వారి నిర్మాణం లో, ప్రముఖ దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత, రచయత డాక్టర్ మణి భూషణ్ స్వీయ దర్శకత్వం లో, పార్వతీపురం మన్యం జిల్లా మెయిన్ రాడ్ లో వెలసిన , ప్రపంచ ప్రఖ్యాతి పొందిన శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పుణ్య దేవాలయం యొక్క ఆలయ విశేషాలతో కూడిన షార్ట్ ఫిలిం " నమో... వాసవి...! "- అమ్మ దయ ఉంటె అన్ని వున్నట్టే , షూటింగ్ పూర్తి చేసుకుంది .
ఈ సందర్బంగా డాక్టర్ మణి భూషణ్ మాట్లాడుతూ ఈ దేవాలయం యొక్క చరిత్ర తోపాటు అనుబంధ ఆలయాల సౌందర్యం , విశేష పూజలు , దసరా మరియు శ్రావణమాసం లో జరిగే ప్రత్యేక ఉత్సవాలు , ప్రతి రోజు జరిగే నిత్య అన్నదాన కార్యక్రమం , పేదవాళ్ల వివాహాలకు ఏర్పాటుచేసిన కల్యాణ మండపం , ప్రతి రోజు మహిళా భక్తులచేత జరిగే లలిత పారాయణం , ఈ ఆలయానికి ఎంతో చరిత్ర కలిగి, కళింగ వైశ్య కుటుంబాల వారు, ఎంతో భక్తి శ్రద్దలతో అమ్మవారి సేవలు చేసుకుంటూ అందరి ఆదరాభిమానాలు పొందుతున్నారు , అంతే కాకా ఉత్తరాంధ్ర ఇలవేల్పు గా ప్రసిద్ధి పొంది , పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా లోని వివిధ ప్రదేశాలనుండి , భారతదేశం నలుమూలల , విదేశీ భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూవుంటారు, అలంటి కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత , వారి అస్సిసులతో ఈ షార్ట్ ఫిలిం షూటింగ్ అంగరంగ వైభవంగా పూర్తి అయిందని , ఈ సందర్బంగా కళింగ వైశ్య సంఘం సభ్యులు, ఆలయ కమిటీ సంక గౌరీ శంకర్ , బరాటం వెంకటరమణ , గోపి, ఆలయ ప్రధాన అర్చకులు మురపాక రామకృష్ణ శర్మ , భక్తులు ఎంతో సహాయ సహకారాలు అందించారని వారికీ కృతజ్ఞతలు తెలిపారు , త్వరలో ఈ ప్రేత్యేక టెంపుల్ టూరిజం షార్ట్ ఫిలిం " నమో... వాసవి...! "- అమ్మ దయ ఉంటె అన్ని వున్నట్టే, టీవీ టూరిజం వెబ్ ఛానల్ ద్వారా విడుదలై ప్రపంచ పర్యాటకులకు అందుబాటులో ఉంటుందని , పార్వతిపురం వచ్చే భక్తులు తప్పకుండ అమ్మవారిని దర్శించి కృపకు పాత్రులు కాగలరని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సీఈఓ సీత రామ స్వామి, ఎడిటర్ నీరజ భూషణ్ , హీరో మరియు నిర్మాత ఆదిత్య భూషణ్ , పార్వతీపురం టీవీ టూరిజం ఇంచార్జి వారణాసి తదితరులు పాల్గొన్నారు.