Idi Sangathi - ఇదీ సంగతి

Idi Sangathi - ఇదీ సంగతి Hi Everyone!

08/06/2025

ఇటీవలే జపాన్‌ను వెనక్కి నెట్టి నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది భారత్‌. అదే సమయంలో వరుసగా మూడో సారి వడ్డీ రేట్లలో కోత విధించింది ఆర్బీఐ. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతను చాటిచెప్పే సానుకూల పరిణామాలు ఇవి. అయితే ఈ పురోగతి ఇక్కడితోనే అయిపోలేదని....ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరింత ఆశాజనక స్థితి కనిపిస్తోందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఆర్బీఐ వరుసగా మూడోసారి వడ్డీ రేట్లలో కోతను విధించడం, రుతుపవనాల సానుకూలత సహా వివిధ అంశాల కలయికతో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని అంచనా వేశారు. ఆహార ధరలు తగ్గుముఖం పడుతూ ఉండడంతో ద్రవ్యోల్బణం కూడా తగ్గుతుందని తెలిపారు. మరి భారత ఆర్థిక వ్యవస్థ ఇంత సానుకూలంగా ఉండడానికి దారి తీసిన ఇతర కారణాలు ఏమిటి. ఇక ముందుకు కూడా ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉందా.

08/06/2025

వాకీటాకీ.! ఇదొక కమ్యూనికేషన్‌ పరికరం. దూర ప్రాంతాల్లోని వారికి సమాచారం చేరవేయాలన్నా..అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలన్నా..వాగ్వాదాలను నిలువరించాలన్నా... వాకీటాకీలు ఎంతగానో తోడ్పడతాయి. ఒకప్పుడు యుద్ధాల్లో సమాచార పంపిణీకి దోహదపడిన వాకీటాకీలు.. నేడు పోలీసుల చేతుల్లోనూ కనిపి‌స్తాయి. అలాంటి వాకీటాకీల వల్ల ప్రతికూల పరిణామాలూ చోటు చేసుకుంటున్నాయి. విధ్వంసానికి కారణం అవుతున్నాయి. ఇజ్రాయిల్-హమాస్‌ యుద్ధంలో వాకీ టాకీలే అపార నష్టానికి కారణం అయ్యాయి. ఒక్క తూటా కూడా లేకుండా పేలిన వాకీటాకీలు.. అప్పట్లో ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేశాయి. ఐతే వాకీటాకీల వల్ల జరిగే ప్రమాదాలను గుర్తించిన కేంద్రం ముందస్తు చర్యలుగా వాటిపై ఆంక్షలు విధించింది. నిబంధనలకు విరుద్ధంగా తయారైన 16, 970 వాకీటాకీలను అమ్మకూడదని ఈ-కామర్స్‌ సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. మరి ఈ నిర్ణయానికి కారణాలేంటి.? కేంద్రం ఆదేశాలపై ఈ-కామర్స్‌ సంస్థలు ఎలా స్పందించాయి?

06/06/2025

భారత్ ఇటీవలే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి నాలుగో స్థానంలోకి చేరుకుంది. తదుపరి లక్ష్యం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం. అయితే, మనం బాగుండాలంటే పొరుగు దేశాలు మనతో సఖ్యతగా ఉండటం చాలా ముఖ్యం. లేదంటే ఎప్పుడో ఒకసారి వారి నుంచి ముప్పు ఎదురవ్వొచ్చు. ప్రస్తుతం భారత్ అలాంటి స్థితిలోనే ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో చుట్టూ ఉన్న శత్రుదేశాలన్నీ ఏకం అవుతుండటం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే భారత్ ను అస్థిరపర్చేందుకు పాక్ కుటిల ప్రయత్నాలు చేస్తోంది. చైనా సైతం చాపకింద నీరులా తన పని తాను చేసుకుపోతోంది. ఇటీవల బంగ్లాదేశ్ కూడా వీటికి తోడైంది. మహమ్మద్ యూనస్ తరచూ భారత్ పై వ్యతిరేక స్వరాలు వినిపిస్తూనే ఉన్నారు. అంతేకాదు, భారత వ్యతిరేక ఉగ్రవాదులకు సహికరిస్తున్నట్లు సమాచారం. ఈ తరుణంలో భవిష్యత్తులో భారత్ కి బంగ్లాదేశ్ ముప్పుగా మారనుందా?... భారత శత్రుదేశాలన్నీ ఏకమవ్వడం దేనికి సంకేతం?

06/06/2025

భారత్‌ ఇటీవలే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి నాలుగో స్థానంలోకి చేరుకుంది. తదుపరి లక్ష్యం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం. అయితే, మనం బాగుండాలంటే పొరుగు దేశాలు మనతో సఖ్యతగా ఉండటం చాలా ముఖ్యం. లేదంటే ఎప్పుడో ఒకసారి వారి నుంచి ముప్పు ఎదురవ్వొచ్చు. ప్రస్తుతం భారత్ అలాంటి స్థితిలోనే ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో చుట్టూ ఉన్న శత్రుదేశాలన్నీ ఏకం అవుతుండటం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. భారత్‌ను అస్థిరపర్చేందుకు పాక్‌ కుటిల ప్రయత్నాలు చేస్తోంది. చైనా సైతం చాపకింద నీరులా తన పని తాను చేసుకుపోతోంది. ఇటీవల బంగ్లాదేశ్‌ కూడా వీటికి తోడైంది. మహమ్మద్ యూనస్‌ తరచూ భారత్‌పై వ్యతిరేక స్వరాలు వినిపిస్తూనే ఉన్నారు. అంతేకాదు, భారత వ్యతిరేక ఉగ్రవాదులకు సహికరిస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో భారత్‌కి బంగ్లాదేశ్‌ ముప్పుగా మారనుందా ? భారత శత్రుదేశాలన్నీ ఏకమవ్వడం దేనికి సంకేతం?

05/06/2025

స్టేడియం సామర్థ్యం 35వేలు. వచ్చింది 3లక్షల మంది. ఫలితం తొక్కిసలాట...11 మంది మృతి. ఇదీ రాయల్ ఛాలెంజ ్ బెంగళూరు విజయోత్సవాల సందర్భంగా జరిగిన విషాదం. అంత భారీ సంఖ్యలో అభిమానుల రాకతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అయితే తొక్కిసలాట ఘటనలు దేశంలో తరచూ విషాదాన్ని నింపుతూనే ఉన్నాయి. ఎంతటి పటిష్ఠ ఏర్పాట్లు చేసినా ఏదో ఒక రూపంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. మరి ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి. గత సంఘటనల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదా. అసలు తొక్కిసలాట సంఘటనలు జరగకుండా ఏం చేయాలి. జరిగినపుడు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

05/06/2025

అయ్యయ్యో రక్తం బాగా పోతుందే!... ప్రమాదం ఎలా జరిగింది? తప్పు ఎవరిది? ఎవరైనా అంబులెన్స్ కి కాల్ చేశారా? అనే మాటలు రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రదేశంలో తరచుగా వినబడు తాయి. కానీ, క్షతగాత్రులను ఆసుపత్రి తీసుకెళ్లడానికి అనేక మంది సంకోచిస్తారు. పైగా అయ్యో పాపం అని కాసింత జాలి చూపించి చేతులు దులిపేసుకుంటారు. సాయం చేయాలని కొందరికి ఉన్నా.. తాము ఎక్కడ ఇరుక్కుపోతామో, పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందేమో అని భయపడి వెనకడుగు వేస్తారు. ఒకవేళ ఎవరో ఒకరు మంచి మనసులో ఆసుపత్రికి తీసుకెళ్లినా ...కుటుంబ సభ్యులు వచ్చే వరకు డాక్టర్లు వైద్యం ప్రారంభించని పరిస్థితి. బాధిత కుటుంబాల దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో అన్న సందేహం వైద్యుల్లో ఉంటుంది. దీంతో చాలా మంది వైద్యం ఆలస్యమై... క్షతగాత్రులు మరణించిన ఘటనలు కూడా అనేకం. ఐతే ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్రం ఓ ముందడుగేసింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం-2025 పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి ఆ పథకం రూపకల్పన ఎలా జరిగింది.? దీని ద్వారా క్షతగాత్రులకు కలిగే మేలేంటి.?...లాంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం...

04/06/2025

గుట్టలుగా పేరుకుపోయిన భూ సమస్యలతో రెవెన్యూ అధికారులు సతమతం అవుతున్న పరిస్థితి. వీటికి తోడు రోజుకో రకమైన కొత్త సమస్య వారి దృష్టికి వస్తోంది. ఈ క్రమంలో రెవెన్యూ సదస్సుల్లో వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు భూ భారతికి ఎంత సమయం పట్టనుంది? ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులను అప్పగించే అధికారులపై ఎలాంటి చర్యలు ఉండనున్నా యి? సర్వే రికార్డుల్లో నంబర్లు, వాటిలోని లోపాలు, భూధార్ కార్డు, నంబరు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం.

04/06/2025

బస్సుల్లో ప్రయాణించే వారికి R.T.C శుభవార్త చెప్పింది. బస్సుల్లో పగిలిన కిటికీలు, చిరిగిన సీట్లు, విరిగిన హ్యాండిళ్లు త్వరలో కనిపించవు. చూడగానే వామ్మో అనిపించే డొక్కు బస్సులు... కొద్ది నెలల్లోనే కనుమరుగు కానున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులు కొని రోడ్డెక్కిస్తోంది R.T.C. బాడీలు దెబ్బతిని డొక్కుగా కనిపించే పాత బస్సులనూ కొత్తగా తీర్చి దిద్దుతోంది. ఇంజిన్ బాగుండి, బాడీ దెబ్బతిన్న బస్సులను సొంత వర్క్ షాపులకు తరలించి కొత్త వాటిలా ఆధునీకరిస్తోంది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పాత బస్సుల స్థానంలో మాడిఫైడ్ బస్సులను ప్రవేశపెడుతోంది. పెద్ద మిషనరీ, అధునాతన సదుపాయాలు లేకున్నా...అతి తక్కువ ఖర్చుతో అధునాతన హంగులతో ఆకట్టుకునే బస్సులను తయారు చేస్తున్నారు R.T.C సిబ్బంది. అంతేనా, ఆర్టీసీ వర్క్ షాపులనే బస్ బాడీ యూనిట్లుగా మార్చేసి పాత బస్సులకు కొత్త రూపం ఇస్తున్నారు..

04/06/2025

భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. ప్రజల వద్దకే రెవెన్యూ అధికారులను పంపిస్తూ... భూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామం నుంచి దాదాపు 200 లెక్కన దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరి, భూ భారతి తో సమస్యల్లో ఉన్న భూములన్నింటికీ పరిష్కారం లభించనుందా? ఇందుకోసం ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులు ఏంటి?... అసైన్డ్ భూములు, పట్టదారు పుస్తకాలు వంటి సమస్యలు తీరనున్నాయా? తదితర అంశాలను... భూభారతి చట్టం రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన.... భూమి సునీల్ మాటల్లో విందాం...

04/06/2025

పర్యావరణం! ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైంది. మనిషి మనుగడను చిన్నాభిన్నం చేస్తుంది కూడా. అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, వడగాల్పులు సహా ప్రకృతి విపత్తులుతో పాటు మరెన్నో వాతావరణ సమస్యలకు పర్యావరణమే కారణం. మరి అలాంటి పర్యావరణం పరిరక్షణకు మొక్కల పెంపకమే పరిష్కారం. అందుకే అదే కార్యక్రమానికి మరోసారి భారీగా తలపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 5 నుంచి ఆగస్టు చివరి వరకు వనమహోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు. కోటి మొక్కల పెంపకమే లక్ష్యంగా ఈ కా ర్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసింది సర్కారు. అటవీ ప్రాంతాలు సహా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఖాళీ ప్రదేశాలతో పాటు రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటనున్నారు. పచ్చదనం పెంపు సహా పౌరులకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

03/06/2025

ఈ ఏడాది వానాకాలం ముందే వచ్చేసింది. రెండు నెలల పాటు దంచి కొట్టిన ఎర్రటి ఎండల నుంచి ఊరట కల్పిస్తూ ఆహ్లాదాన్ని మోసుకొచ్చింది వానాకాలం. అయితే దేశమంతా ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉండగా ఒక్క ఈశాన్య భారతంలో మాత్రం ఒకింత విషాదాన్ని మోసుకొచ్చాయి వానలు. నైరుతి రుతుపవనాలు వస్తూ...వస్తూనే ఈశాన్యంలో కుండపోత వానలను కురిపిస్తున్నాయి. వరదల ధాటికి 36 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది ఇళ్లు కూలిపోయాయి. అయిదున్నర లక్షల మందిపై వరదల ప్రభావం పడింది. వరదల పరిస్థితిపై స్వయంగా ఆరాతీసిన ప్రధాని నరేంద్ర మోదీ ఆదుకుంటామని ఈశాన్య రాష్ట్రాలకు భరోసా ఇచ్చారు. మరి అక్కడ ఎందుకీ ఆకస్మిక వరదలు. ఈ ప్రాంతం కోలుకునేది ఎప్పుడు. ఈ విపత్తు నుంచి రానున్న వానాకాలంలో దేశంలోని ఇతర ప్రాంతాలు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి.

03/06/2025

యావత్ ప్రపంచంలో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న పేరు కృత్రిమ మేధ. ఇందు గలదు అందు లేదని సందేహము వలదు..ఎందెందు వెతికినా అందందే గలదు..అన్నట్లు ఇది అన్నింటా విస్తరిస్తోంది. విప్లవాత్మక మార్పులకూ కారణం అవుతోంది. కానీ, మంచిలోనూ చెడు ఉన్నట్లు..A.I కూడా పలు ముప్పులు మోసుకొస్తోంది. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవడానికి కారణం అవుతోంది. 2022 నుంచి టెక్ ఉద్యోగాలకు ముప్పుగా మారిన A.I 2025లో ఇప్పటివరకు దాదాపు 60వేల మందిని ఇళ్లకు పంపించేసింది. ఉద్యోగాలను సృష్టిస్తుందనుకున్న..ఏఐ..వాటి కోతకు కారణం కావడం..ఆందోళనలు రేకెత్తిస్తుంది. బడాబడా కంపెనీలు సైతం వేల సంఖ్యల్లో ఉద్యోగులను తొలగిస్తుండటంతో భవిష్యత్ పరిస్థితులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. మరెందుకిలా.? ఉద్యోగాలు తొలగింపునకు A.I ఎలా కారణం అవుతుంది.? ఉద్యోగులను తొలగిస్తున్న టెక్ కంపెనీలు ఎలాంటి కారణాలు చెబుతున్నాయి.? ఆ వివరాలు ఈ కథనంలో.

Address

Hyderabad

Telephone

+918415246555

Alerts

Be the first to know and let us send you an email when Idi Sangathi - ఇదీ సంగతి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Idi Sangathi - ఇదీ సంగతి:

Share