08/06/2025
ఇటీవలే జపాన్ను వెనక్కి నెట్టి నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది భారత్. అదే సమయంలో వరుసగా మూడో సారి వడ్డీ రేట్లలో కోత విధించింది ఆర్బీఐ. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతను చాటిచెప్పే సానుకూల పరిణామాలు ఇవి. అయితే ఈ పురోగతి ఇక్కడితోనే అయిపోలేదని....ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరింత ఆశాజనక స్థితి కనిపిస్తోందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఆర్బీఐ వరుసగా మూడోసారి వడ్డీ రేట్లలో కోతను విధించడం, రుతుపవనాల సానుకూలత సహా వివిధ అంశాల కలయికతో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని అంచనా వేశారు. ఆహార ధరలు తగ్గుముఖం పడుతూ ఉండడంతో ద్రవ్యోల్బణం కూడా తగ్గుతుందని తెలిపారు. మరి భారత ఆర్థిక వ్యవస్థ ఇంత సానుకూలంగా ఉండడానికి దారి తీసిన ఇతర కారణాలు ఏమిటి. ఇక ముందుకు కూడా ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉందా.