05/11/2025
మచిలీపట్నం ప్రజల చిరకాల వాంఛ బందరు పోర్టు. మొదటిసారి శంకుస్థాపన చేసి దాదాపు 15 ఏళ్లు గడిచింది. ఒకటి కాదు రెండు కాదు ముచ్చటగా 3 సార్లు శంకుస్థాపన జరిగినా పోర్టు నిర్మాణంలో ఏ మాత్రం కదలిక లేదు. ప్రభుత్వాలు మారుతుండడంతో ముందుకూ వెనక్కీ అన్నట్లైంది ఈ ఓడరేవు నిర్మాణ పరిస్థితి. నిర్దేశిత సమయానికి ఓడరేవు అందుబాటులోకి వచ్చి ఉంటే.. స్థానిక ప్రజలకు మాత్రమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధికీ చేదోడుగా ఉండేది. ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొంటూ.. ఏళ్లుగా ముందుకు కదలని సమస్యకు కూటమి ప్రభుత్వ చొరవతో తెరపడనుంది. పోర్టు నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కదిలింది. మరి సకాలంలో ఓడరేవును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది. పోర్టు అందుబాటులోకి వస్తే కల్గే లాభాలేంటి.