Idi Sangathi - ఇదీ సంగతి

Idi Sangathi - ఇదీ సంగతి Hi Everyone!

05/11/2025

మచిలీపట్నం ప్రజల చిరకాల వాంఛ బందరు పోర్టు. మొదటిసారి శంకుస్థాపన చేసి దాదాపు 15 ఏళ్లు గడిచింది. ఒకటి కాదు రెండు కాదు ముచ్చటగా 3 సార్లు శంకుస్థాపన జరిగినా పోర్టు నిర్మాణంలో ఏ మాత్రం కదలిక లేదు. ప్రభుత్వాలు మారుతుండడంతో ముందుకూ వెనక్కీ అన్నట్లైంది ఈ ఓడరేవు నిర్మాణ పరిస్థితి. నిర్దేశిత సమయానికి ఓడరేవు అందుబాటులోకి వచ్చి ఉంటే.. స్థానిక ప్రజలకు మాత్రమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధికీ చేదోడుగా ఉండేది. ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొంటూ.. ఏళ్లుగా ముందుకు కదలని సమస్యకు కూటమి ప్రభుత్వ చొరవతో తెరపడనుంది. పోర్టు నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కదిలింది. మరి సకాలంలో ఓడరేవును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది. పోర్టు అందుబాటులోకి వస్తే కల్గే లాభాలేంటి.

05/11/2025

రైతులు వ్యవసాయం చేసేందుకు అనాదిగా వాగులు, వంకలే ప్రధానమైన నీటి వనరులు. కాలక్రమంలో సాగునీటి ప్రాజెక్టులు వచ్చి చేరినా... వ్యవసాయానికి అవసరమైన నీటిని అందించటంలో వాగులది కీలకపాత్ర. వాగులు బాగుంటే నీటి వనరులు సమృద్ధిగా లభించి రైతులు సంతోషంగా ఉంటారు. కానీ ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని నల్లమడ వాగు విషయంలో రైతులది భిన్నమైన పరిస్థితి. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి నల్లమడ వాగు పొంగి.. పొలాలను ముంచెత్తుతోంది. ఇది రైతుల పాలిట దు:ఖదాయినిగా మారింది. వాగు కట్టలను బలోపేతం చేయాలని రైతులు దశాబ్దాలుగా ఆందోళన చేస్తున్నారు. ఇటీవల మొంథా తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు సైతం వాగు ఉప్పొంగి వేలాది ఎకరాల్ని నీటముంచింది. దీర్ఘకాలిక సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వాగు విస్తరణకు, అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో
రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

05/11/2025

పత్తి ప్రతి ఏడాది రైతులకు కన్నీరే మిగులుస్తోంది. సాగుదారులకు తిప్పలు పెరుగుతున్నాయి తప్ప.. తగ్గిన దాఖలాలే లేవు. ఓ సారి ప్రకృతి పగబడితే..ఇంకోసారి ధరల దగా..మరోసారి మార్కెట్ యార్డులు, CCI కేంద్రాల్లో కొనుగోళ్ల కొర్రీలు ..ఇలా అనేక కారణాలతో పత్తి పండించిన రైతులకు నష్టాలు, కష్టాలు. ఈసారి పరిస్థితి మరింత దయనీయం. పంట పండించడానికి అనేక కష్టాలకోర్చిన రైతులు...దాన్ని అమ్మడానికీ మరింత ఆగచాట్లు పడాల్సి వస్తోంది. ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు...అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. మరి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొనుగోళ్లు ఎలా ఉన్నాయి.? అమ్మకానికి రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లేంటి.? ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం

05/11/2025

తెలంగాణలో వరి తర్వాత అత్యధికంగా పండించేది... పత్తి. ఆ పంటను నమ్ముకుని వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. మనందరం ఒంటిపై రంగురంగులు, రకరకాలు దుస్తులు ధరిస్తున్నామంటే అది పత్తి రైతుల శ్రమే. మరి అలాంటి పత్తిని పండించే రైతులు మాత్రం ఎప్పటిక ప్పుడు ఓడిపోతునే ఉన్నారు. సకాలంలోనే పంట వేయడం, వేసిన వాటిని కాపాడుకోవడం, కాపాడుకున్న వాటిని మార్కెట్ కు తెచ్చి అమ్ముకోవడం, అమ్ముకున్న పంటకు సరైన ధర దక్కిం చు కోవడం.. ఇలా ప్రతి అడుగులో ఓటములే వెక్కిరిస్తున్నాయి. వారి బతుకుల్ని భారంగా మార్చుతున్నాయి. ఈ ఏడాది కూడా అందుకు భిన్నమైన పరిస్థితులు ఏమీ లేవు రాష్ట్రంలో. ఒక రకంగా చెప్పాలంటే గతానికి మించిన సమస్యలు, సవాళ్లు, కష్టాలు, కన్నీళ్ల మధ్య దిక్కుతోచని స్థితి. అదే ప్రకృతి ప్రకోపం. అదే తేమశాతం నిబంధనలు. అవే సీసీఐ కొర్రీలు, అవే దళారీల మోసా లు. తెలంగాణ పత్తి రైతన్నకు ఇంకెంతకాలం... ఈ దైన్యం?

04/11/2025

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్ నెట్ లేనిదే గడవని పరిస్థితి. తక్కువ సమయంలోనే అంతర్జాలం అందరికీ చేరువైంది. ఐతే, సరైన రీతిలో ఉపయోగించుకుంటే ఎన్నో ఉపయోగాలు... అంతకుమించిన ప్రయోజనాలు. అభివృద్ధిలోనూ ఇంటర్ నెట్ పాత్ర ఎంతో ముఖ్యమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాలాన్ని రాష్ట్ర ప్రజలందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఇంటింటికీ ఇంటర్ నెట్ కనెక్షన్ అందించడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించింది. టీ ఫైబర్ ద్వారా ఇప్పటికే ప్రతి గ్రామానికి కేబుల్ వ్యవస్థను సిద్ధం చేసింది. మరి, ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది. ఎప్పటిలోగా ప్రతి ఇంటికి ఇంటర్ నెట్ కనెక్షన్ రానుంది అనే విషయాలు...టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్ ని అడిగి తెలుసుకుందాం.

04/11/2025

విపత్తులు సంభవించడానికి సమయం, సందర్భం అంటూ ఉండదు. అటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బాధితులను బయటపడేసేందుకు అన్ని రకాల అధికారులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి. అందులో భాగంగానే అగ్నిమాపక శాఖ ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేస్తోంది. 15మంది సిబ్బందికి అధునాతన పద్ధతుల్లో స్విమ్మింగ్ శిక్షణ ఇస్తోంది. 21రోజులపాటు కృష్ణానదిలో సుమారు 40అడుగుల లోతు వరకు వెళ్లి బాధితులను సంరక్షించేందుకు స్కూబా డైవింగ్ లోనూ ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. మరి, ఈ బృందం ఏ విధంగా తర్ఫీదు పొందింది. బాధితులను రక్షించే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

04/11/2025

మంగళగిరి అంటే గుర్తొచ్చేది చేనేత. ఐతే ఇక్కడ చేనేత వస్త్రాలతో పాటు బంగారు ఆభరణాల తయారీ కూడా ఊపందుకుంటోంది ఇప్పుడు. స్వర్ణకారులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా గోల్ట్ క్లస్టర్ ప్రారంభించడానికి ప్రభుత్వం కార్యాచరణ చేప ట్టింది. అందులో భాగంగానే తాత్కాలికంగా 10కోట్ల రూపాయలతో ఓ భవనంలో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేసింది. అక్కడ అధునాతన యంత్రాల వినియోగంపై స్వర్ణకారులకు శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టారు. శాశ్వతంగా గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు కోసం భూ సమీకరణ చేయాలని నిర్ణయించారు. దీని కోసం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి స్వర్ణాభరణాల తయారీ కేంద్రంగా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలు...భవిష్యత్ కార్యాచరణ...తదితర అంశాలపై ఇదీసంగతి కథనం.

03/11/2025

ఓ వైపు ఏళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ , ఇజ్రాయెల్ -హమాస్ యుద్ధాలతో ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్తతలు వీడనే లేదు. ఈ మధ్యలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఏడాది కాలంగా తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచంలో మరింత అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు అదే ట్రంప్ మరో బాంబు పేల్చారు. పాకిస్థాన్, చైనా సహా ప్రపంచంలోని పలు దేశాలు అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తున్నాయని సంచలన ప్రకటన చేశారు. అందువల్ల తాము కూడా ఆ పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రకటన ద్వారా ఒక రకంగా అణ్వస్త్ర ఉద్రిక్తతలకు తెర తీశారు ట్రంప్ . మరొకరకంగా శత్రుదేశం పాకిస్థాన్ తో భారత్ కు పొంచి ఉన్న సవాళ్లను చెప్పకనే చెప్పారు. మరి ఆయన ప్రకటనతో ప్రపంచంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. మనకు పొరుగున ఉన్న పాకిస్థాన్ , చైనా పేర్లు ప్రస్తావించి ట్రంప్ ఏం సంకేతాలు ఇచ్చారు.

03/11/2025

చేవెళ్ల బస్సు ప్రమాదం....దేశవ్యాప్తంగా సంచలనం.! ప్రయాణికుల... ప్రాణాలు హరించిన ప్రమాదం.. బాధిత కుటుంబాలకు తీరని విషాదం! అయితే చేవెళ్ల రహదారిపై ప్రమాదాలు కొత్తేమీ కాదు. హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు వెళ్లే ఆ మార్గం ఎల్లప్పుడూ రక్తమోడుతూనే ఉంటుంది. 2 రోజుల క్రితమే ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. సరిగ్గా 11నెలల క్రితం కూరగాయల వ్యాపారులపైకి ..లారీ దూసుకెళ్లగా నాటి ఘటనలో 4గురు మృతి చెందారు. ఇలా 2018నుంచి 2020 వరకు మూడేళ్లలో 184మంది మృతి చెందారు. మరి... ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా..ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదా? ప్రమాదాల తగ్గింపునకు ప్రణాళికలు రచించడం లేదా?..అంటే తీసుకున్నాయి. కానీ, అవేవీ ప్రమాదాలను అరికట్టలేకపోతున్నాయి. ప్రాణాలు కాపాడలేకపోతున్నాయి. అసలు వందలాది ప్రాణాల్ని హరిస్తోన్న రహదారి విస్తరణను ప్రభుత్వాలు ఎందుకు జాప్యం చేస్తున్నాయి.? ఎదురైన సవాళ్లేంటి.? స్థానికుల డిమాండ్లు ఎలా ఉన్నాయి.?..

02/11/2025

ఉద్యోగ భవిష్య నిధి ..! అదేనండి E.P.F. దేశంలో వేతన జీవుల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమైన సామాజిక భద్రతా పథకం ఇది. దీన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఉద్యోగి పనిచేసినన్ని రోజులు యాజమాన్యంతో పాటు అతడి జీతంలో నుంచి కొంత మొత్తం ఈ సంస్థకు జమ అవుతుంది. అందులో ఎక్కువ భాగం భవిష్య నిధికి, మిగతా భాగం పింఛను నిధికి వెళ్తుంది. పదవీ విరమణ పొందిన తర్వాత సదరు చందాదారు నిబంధనల ప్రకారం నగదు ఉపసంహణ చేసుకోవచ్చు. అవసరాలను బట్టి మధ్యలోనూ E.P.F.O నుంచి నగదును తీసుకోవచ్చు. ఈ మేరకు కేంద్రీయ ధర్మకర్తల మండలి కొత్తగా పలు నిర్ణయాలను తీసుకుంది. మరి, ఉద్యోగుల జీతంతో పాటు ఎంప్లాయర్‌ సంస్థ నుంచి ఎంత మొత్తం భవిష్య నిధికి వెళ్తుంది? ఏ సమయంలో చందాదారులు ఎక్కువ మొత్తంలో విత్‌డ్రా చేసుకోవచ్చు? అందుకున్న నిబంధనలు ఏంటి? అనే విషయాలు విశ్రాంత రీజినల్‌ పీఎఫ్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ని అడిగి తెలుసుకుందాం

31/10/2025

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాదు, కాలకుండా చేతిని జాగ్రత్తగా ఉంచడమే తెలివి. మొంథా తుపాను ఈసారి ఆంధ్రప్రదేశ్ తీరానికి ప్రమాదం మోసుకొస్తోందని వాతావరణ శాఖ హెచ్చరించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆ మాటను అక్షరాలా ఆచరణలో పెట్టినట్లు పని చేసింది. ఎక్కడా ప్రాణ నష్టం జరగకూడదు అనే ఏకైక లక్ష్యంతో పెను విపత్తును దీటుగా ఎదుర్కొంది. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఉన్న అనుభవన్నంతా ఉపయోగించి పని చేశారు. సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆధునిక సాంకేతికతతో మొంథా తుపానును ఎదుర్కొని రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. ఇది ఎలాంటి సత్ఫలితాలు ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం.

31/10/2025

సాధారణంగా వంట నూనెను ఆహారం వండేందుకు ఉపయోగిస్తాం. కొందరు ఒకసారి వాడిన వంట నూనెను పదేపదే వాడుతుంటారు. రంగు మారినా అదే ఆయిల్ ను వినియోగిస్తుండడం తరచూ సామాజిక మాధ్యమాల్లో చూస్తుంటాం. హోటళ్లు, వీధి వ్యాపారులు ఒకసారి వాడిన ఆయిల్ ను తిరిగి వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు, గుండె జబ్బులతో పాటు క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల బారినపడే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ఒక సారి వాడిన వంటనూనెను ఏం చేయలేమా. అది ఎందుకూ పనికిరాదా అని సందేహాలుండొచ్చు. ఈ నేపథ్యంలో ఒకసారి ఉపయోగించిన వంట నూనెతో బయో డీజిల్ తయారు చేయవచ్చు అని అంటున్నారు నిపుణులు. రాబోయే రోజుల్లో యూజ్ చేసిన ఆయిల్ తో జెట్ విమానాలకు కావాల్సిన ఇంధన వనరుని సృష్టించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ అంశాలకు సంబంధించి స్కై గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ M.D.... J.V.V సత్యనారాయణతో ముఖాముఖి.

Address

Hyderabad

Telephone

+918415246555

Alerts

Be the first to know and let us send you an email when Idi Sangathi - ఇదీ సంగతి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Idi Sangathi - ఇదీ సంగతి:

Share