09/10/2025
కాలనాగుకు పర్యాయపదం పాకిస్థాన్ . అదును దొరికితే భారత్ మీద కాట్లు వేయడానికి సిద్ధంగా ఉంటుంది ఆ ధూర్త దేశం. అలాంటి కాలనాగును ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్రేష్ఠమైన పాలు పెంచి పోషిస్తుండగా.....ఆ రెండు దేశాల స్నేహం మరింత బలపడేలా పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా అత్యాధునిక ఏ.ఐ.ఎం-120క్షిపణులను పాకిస్థాన్ కు అందించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సమాచారం. అటు ఇరాన్ లో భారత్ అభివృద్ధి భాగస్వామిగా ఉన్న చాబహార్ పోర్టుకు సమీపాన.... ఓడరేవు నిర్మాణంపై పాక్ అధికారులు అమెరికాతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. మరి ఈ పరిణామాలు దేనికి సంకేతం. దీని వల్ల భారత్ పై పడే ప్రభావం ఎంత. మనం ఎంతమేర అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.