Bharat Public News

Bharat Public News Bharat Public News

09/11/2024

పబ్లిక్ కోర్ట్ న్యూస్ : నిజామాబాద్

ఏసీబీకి చిక్కిన వర్ని ఎస్సై కృష్ణకుమార్

నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్ఐ కృష్ణకుమార్ శుక్రవారం ఓ బాధితుడి వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా చిక్కారు.ఏసీబీ డీఎస్పీ శేకర్ గౌడ్ తన సిబ్బందితో కలిసి రైడ్ చేసి బాధితుడి వద్ద ఎస్ఐ లంచం తీసుకుంటుండగా..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఈ ఘటన జిల్లాలో,ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది. వర్ని మండలం కోటయ్య క్యాంపుకు చెందిన నాగరాజు అనే రైతుకు ఐదు రోజుల క్రితం ఓ వ్యక్తితో వర్ని మండల కేంద్రంలో గొడవ జరిగింది. ఈ గొడవ కాస్త పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.

దీంతో ఈ కేసులో ఎస్ఐ కృష్ణకుమార్ నాగరాజుపై కేసు నమోదు చేశారు. నాగరాజుకు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్ ఐ కృష్ణకుమార్ నాగరాజు నుంచి రూ.50 వేలు ఇవ్వాలని నాగరాజును డిమాండ్ చేశారు. చిన్నపాటి గొడవకు ఇంత పెద్ద మొత్తంలో తాను ఇచ్చుకోలేనని ఎస్ఐతో లంచం డబ్బుల కోసం బేరమాడారు.

చివరికి రూ.20 వేలకు ఎస్ఐ కృష్ణకుమార్ కు బాధితుడు నాగరాజుకు మధ్య పరస్పర ఒప్పందం కుదిరింది.

ఎస్ఐ తనను లంచం డబ్బుల కోసం వేధించిన తీరుకు నాగరాజుకు చిర్రెత్తి ఎలాగైనా ఎస్ఐ ఏసీబీ అధికారులకు నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్ఐ కృష్ణకుమార్ శుక్రవారం ఓ బాధితుడి వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా చిక్కారుపట్టివ్వాలని పథకం వేశాడు.

ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి వారితో కలిసి పథక రచన చేశారు.

తమ ప్లాన్ లో భాగంగా బాధితుడు నాగరాజు శుక్రవారం ఎస్ఐ కృష్ణకుమార్ కు రూ.20 వేలు లంచం డబ్బులు ఇచ్చాడు.

వెంటనే ఏసీబీ డీఎస్పీ శేకర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి బాధితుడి నుంచి లంచం డబ్బలు తీసుకుంటుండగా..

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఏసీబీ రైడ్స్ తర్వాత వరుసగా జిల్లాలో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. టీజీఎన్ పీడీసీఎల్ లో పనిచేసే ఉద్యోగి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. నందిపేట్ మండలంలో ఓ గ్రామకార్యదర్శి ఏసీబీ కి పట్టుబడ్డాడు.

నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలోని బాలికల హాస్టల్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

తాజాగా పోలీస్ శాఖలో వణుకు పుట్టించేలా ఎస్ఐ ని పట్టుకున్నారు.

ఏసీబీ దాడులతో జిల్లాలో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఏసీబీ పంజా ఎప్పుడు ఎవరి పైన పడుతుందోనని భయపడుతున్నారు.

08/11/2024

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్. ఎస్. ఎస్ ) - ప్రార్థన యొక్క భావం తెలుగులో 🚩

కొందరికి ఈ RSS గురించి కనీస పరిజ్ఞానం, అవగాహన లేకపోయినా నిష్కారణంగా ద్వేషం పెంచుకుంటున్నారు అలాంటి వారి కోసమే👇

నమస్తే సదా వత్సలే
మాతృభూమే

త్వయా హిన్దుభూమే సుఖం వర్ధితోహమ్

మహామఙ్గలే పుణ్యభూమే త్వదర్థే

పతత్వేష కాయో నమస్తే నమస్తే

ప్రభో శక్తిమన్‌ హిన్దురాష్ట్రాఙ్గభూతా

ఇమే సాదరం త్వాం నమామో వయమ్

త్వదీయాయ కార్యాయ బధ్దా కటీయం

శుభామాశిషం దేహి తత్పూర్తయే

అజయ్యాం చ విశ్వస్య దేహీశ శక్తిం

సుశీలం జగద్యేన నమ్రం భవేత్

శ్రుతం చైవ యత్కణ్టకాకీర్ణ మార్గం

స్వయం స్వీకృతం నః సుగం కారయేత్

సముత్కర్షనిఃశ్రేయస్యైకముగ్రం

పరం సాధనం నామ వీరవ్రతమ్

తదన్తః స్ఫురత్వక్షయా ధ్యేయనిష్ఠా

హృదన్తః ప్రజాగర్తు తీవ్రానిశమ్‌

విజేత్రీ చ నః సంహతా కార్యశక్తిర్

విధాయాస్య ధర్మస్య సంరక్షణమ్‌

పరం వైభవం నేతుమేతత్‌ స్వరాష్ట్రం

సమర్థా భవత్వాశిశా తే భృశమ్

భారత మాతా కీ జయ

తెలుగు లో ప్రార్ధన యొక్క అర్ధం

వాత్సల్య పూర్ణా ! ఓ మాతృ భూమీ !
నేను నీకు ఎల్లప్పుడూ నమస్కరింతును

ఓ హిందూ భూమీ ,
నీ వల్లనే నేను సుఖముగా వర్ధిల్లినాను

మహా మంగళమయీ ! ఓ పుణ్య భూమీ !!

నీ కార్య సాధనకై నా శరీరము సమర్పింపబడు గాక !
నీకివే అనేక నమస్కారములు

సర్వశక్తిమయుడైనా ! ఓ పరమేశ్వరా !
హిందూ రాష్ట్రమునకు అవయవ స్వరూపులయిన

మేము నీకు సాదరముగ నమస్కరించుచున్నాము

నీ కార్యము కొరకే కటి బద్ధులమైయున్నాము

దానిని నెరవేర్చుటకై మాకు శుభాశీస్సుల నిమ్ము

విశ్వము గెలవలేని శక్తిని ,
ప్రపంచము మోకరిల్లునట్టి సౌశీల్యమును

మేము బుద్ధి పూర్వకముగా స్వీకరించిన
మా కణట్కాకీర్ణ మార్గమును సుగమము
చేయునట్టి జ్ఞానమును ప్రసాదింపుము

అభ్యుదయ సహిత నిశ్రేయమును పొందుటకై
ఒకే ఒక ఉత్తమము
తీక్షణమునైన సాధనము వీర వ్రతము

అది మా అంతః కరణముల యందు స్ఫురించుగాక !
అక్షయము, తీవ్రమునైన ధ్యేయ నిష్ఠ
మా హృదయములలో ఎల్లప్పుడూ జాగృతమై యుండుగాక !

విజయాశీలియైన మా సంఘటిత కార్యశక్తి మా ధర్మమును సంరక్షించి

మా ఈ దేశమును పరమ వైభవ స్థితికి చేర్చుటలో
నీ ఆశీస్సులచే మిక్కిలి సమర్థమగు గాక !

భారత్ మాత కీ జై 🚩🕉🇮🇳

08/11/2024

LIVE : ప్రతి శుక్రవారం కనకధారా స్తోత్రం తెలుగులో తప్పుల్లేకుండా నేర్చుకోండి ||

జై శ్రీ రామ్ 🚩 జై భారత్ 🇮🇳తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణనపై ప్రజా ప్రతినిధులు,  కుల సంఘాల మ...
05/11/2024

జై శ్రీ రామ్ 🚩 జై భారత్ 🇮🇳

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణనపై ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల మేధావులతో నిర్వహిస్తున్న సదస్సుకు విచ్చేస్తున్న ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక స్వాగతం.. సుస్వాగతం.

మీ,
నంగి దేవేందర్ రెడ్డి
ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ ఎన్ఆర్ఐ అఫైర్స్
టీపీసీసీ ఎన్అర్ఐ సెల్.



జై శ్రీ రామ్ 🚩 జై భారత్ 🇮🇳అందరూ ఆహ్వానితులే ! తేదీ: 04 నవంబర్ 2024 సాయంత్రం 6:00 గంటలకు గోవర్ధనపూజ & అన్నకూట్ సుందరకాండ ...
03/11/2024

జై శ్రీ రామ్ 🚩 జై భారత్ 🇮🇳

అందరూ ఆహ్వానితులే !

తేదీ: 04 నవంబర్ 2024 సాయంత్రం 6:00 గంటలకు
గోవర్ధనపూజ & అన్నకూట్ సుందరకాండ పారాయణం వంటి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగును, కుటుంబం మరియు బంధుమిత్రులతో కలిసి అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణుని ఆశీస్సులు మరియు మహా ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము.

శ్రీ రామచంద్రజీ మఠం, సంఘం లంగర్ హౌజ్ భాగ్యనగర్

మీ సేవలో
శ్రీశ్రీ మహంత్ రాహుల్ దాస్ మహారాజ్
సంగం పీఠాధిపతి.


వివిధ శాఖల ఆధ్వర్యంలోని హాస్టళ్లు, గురుకులాలు, ఇతర విద్యా సంస్థల్లోని విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతి నెలా చెల్లించే డ...
01/11/2024

వివిధ శాఖల ఆధ్వర్యంలోని హాస్టళ్లు, గురుకులాలు, ఇతర విద్యా సంస్థల్లోని విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతి నెలా చెల్లించే డైట్ మరియు కాస్మోటిస్ చార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రజా ప్రభుత్వం.

డైట్ చార్జీలు: Girls and Boys
3 నుంచి 7వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు రూ.950 నుంచి రూ.1330కు పెంపు

8 నుంచి 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు రూ.1100 నుంచి రూ.1540కు పెంపు

ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యార్థినీ విద్యార్థులకు రూ.1500 నుంచి రూ. 2100కు పెంపు

కాస్మొటిక్ చార్జీలు:
Girls
3 నుంచి 7వ తరగతి విద్యార్థినులకు రూ.55 నుంచి రూ.175కు పెంపు.

8 నుంచి 10వ తరగతి విద్యార్థినులకు రూ.75 నుంచి రూ.275కు పెంపు.
-------
Boys
3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు రూ.62 నుంచి 150కు పెంపు

8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.62 నుంచి రూ.200కు పెంపు.

30/10/2024

పబ్లిక్ కోర్ట్ న్యూస్ : అమరావతి,

టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు..

24 మంది సభ్యులో టీటీడీ బోర్డును ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడిని నియమించింది. ఈ మేరకు బుధవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలిలో మొత్తం 24 మంది సభ్యులు ఉండగా.. వీరిలో తెలంగాణ నుంచి ఐదుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్కరు చొప్పున అవకాశం కల్పించారు. ఈసారి టీటీడీ పాలకమండలిలో సగం మంది పొరుగు రాష్ట్రాల వారికి అవకాశం కల్పించడం విశేషం. కాగా, 24 మంది సభ్యులను ప్రకటించిన ఆంధ్రప్రభుత్వం.. మరొక సభ్యుడిని నియమించాల్సి ఉంది. బీజేపీ నుంచి మరో పేరు ప్రతిపాదన వచ్చిన వెంటనే ఆ సభ్యుడిని కూడా నియమించనున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు వీరే..

సాంబశివరావు (జాస్తి శివ)

శ్రీసదాశివరావు నన్నపనేని

ఎం.ఎస్‌ రాజు (మడకశిర ఎమ్మెల్యే)

జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)

ప్రశాంతిరెడ్డి (కొవ్వూరు ఎమ్మెల్యే)

పనబాక లక్ష్మి (మాజీ కేంద్ర మంత్రి)

మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌

జంగా కృష్ణమూర్తి

బురగపు ఆనందసాయి

సుచిత్ర ఎల్లా

నరేశ్‌కుమార్‌

డా.అదిత్‌ దేశాయ్‌

శ్రీసౌరబ్‌ హెచ్‌ బోరా

కృష్ణమూర్తి

కోటేశ్వరరావు

దర్శన్‌. ఆర్‌.ఎన్‌

జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌

శాంతారామ్‌

పి.రామ్మూర్తి

జానకీ దేవి తమ్మిశెట్టి

బూంగునూరు మహేందర్‌ రెడ్డి

అనుగోలు రంగశ్రీ

ప్రభుత్వానికి ధన్యవాదాలు..

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా తమను నియమించడంపై పలువురు సభ్యులు స్పందించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ కొత్త సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమిచండం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. వెంకటేశ్వర స్వామి సేవలో తరించడానికి దొరికిన గొప్ప అవకాశం ఇది అని పేర్కొన్నారు. బోర్డు సభ్యుడిగా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు జ్యోతుల నెహ్రు. టీటీడీ బోర్డు ద్వారా వెంకన్న భక్తులకు మరింత ఉన్నత సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు. ప్రతి భక్తుడికి వెంకన్న సులభ దర్శనం జరిగేలాగా బోర్డు ద్వారా చర్యలు చేపడతామన్నారు.

Address

Hyderabad

Telephone

+918143588886

Website

Alerts

Be the first to know and let us send you an email when Bharat Public News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share