Sardak One

Sardak One this about news and analysis

09/06/2026

యూపీలోని కాన్పూర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక అత్త తన అల్లుడితో కలిసి ఇంటి నుంతి పారిపోయి, ఇద్దరూ కోర్టులో వివాహం చేసుకున్నారు. వారిద్దరి మధ్య చాలా కాలంగా ప్రేమ సంబంధం ఉందని ప్రచారం జరుగుతోంది. పెళ్లి తర్వాత, వారిద్దరూ దండలు మార్చుకుంటున్న వీడియో కూడా వైరల్ అయింది.

యూపీలో కొద్ది రోజుల క్రితం అలీగఢ్‌లో రాహుల్ తన పెళ్లికి కొద్ది రోజుల ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు! పెళ్లి తర్వాత అత్త స...
09/06/2026

యూపీలో కొద్ది రోజుల క్రితం అలీగఢ్‌లో రాహుల్ తన పెళ్లికి కొద్ది రోజుల ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు! పెళ్లి తర్వాత అత్త సప్నా దేవి అలియాస్ సరిత దేవిపై మనసు పారేసుకున్నాడు రాహుల్. అత్త కూడా అల్లుడి ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి పారిపోయారు. ఈ జంట ఇంట్లో నుంచి లక్ష రూపాయల నగదు, నగలను కూడా తీసుకువెళ్లారు. ఇద్దరూ కోర్టులో వివాహం చేసుకున్నారు. వారిద్దరి మధ్య చాలా కాలంగా ప్రేమ సంబంధం ఉందని ప్రచారం జరుగుతోంది. పెళ్లి తర్వాత, వారిద్దరూ దండలు మార్చుకుంటున్న వీడియో కూడా వైరల్ అయింది.

24/05/2026

ఖమ్మం బల్లేపల్లిలోని లవకుశ లాడ్జిలో వేరే మహిళతో ఉన్న భర్త వంశీని అతని భార్య స్వాద్విని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు భార్య, ఆమె బంధువులు దేహశుద్ధి చేసి ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.

కుటుంబాన్ని పోషించడానికి ఇతర రాష్ట్రానికి కూలిగా వెళ్లిన భర్త. ప్రియుడిని ఇంటికి పిలుచుకున్న భార్య. రెడ్ హ్యండెడ్ గా పట్...
22/05/2026

కుటుంబాన్ని పోషించడానికి ఇతర రాష్ట్రానికి కూలిగా వెళ్లిన భర్త. ప్రియుడిని ఇంటికి పిలుచుకున్న భార్య. రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్న అత్తమామ. లవర్ కు దేహశుద్ధి చేసిన స్థానికులు. బీహార్ లో ఘటన!

శ్యామలకి అండగా నిలిచిన నిర్మాత దిల్ రాజు.. పూర్తి వైద్య చికిత్సకు భరోసాప్రముఖ హాస్య నటి పావలా శ్యామల ఆరోగ్య పరిస్థితిపై ...
16/05/2026

శ్యామలకి అండగా నిలిచిన నిర్మాత దిల్ రాజు..
పూర్తి వైద్య చికిత్సకు భరోసా

ప్రముఖ హాస్య నటి పావలా శ్యామల ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన వార్తలు సినీ వర్గాలను కలచివేశాయి. గుండె సంబంధిత వ్యాధితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్యామల, నిన్న రాత్రి చికిత్స నిమిత్తం కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం. అయితే వైద్య చికిత్సకు సరిపడా డబ్బులు లేకపోవడంతో ఆసుపత్రి వారు ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించారని వార్తలు వచ్చాయి.

అర్థరాత్రి సమయంలో ఓ క్యాబ్ డ్రైవర్ శ్యామలను వై జంక్షన్ ఫుట్‌పాత్ వద్ద దింపి వెళ్లిపోయాడని, అక్కడ ఆమెను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారని తెలిసింది. అనంతరం పోలీసులు పావలా శ్యామలను ఆర్కే ఫౌండేషన్‌కు తరలించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ సమాచారం తెలుసుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు వెంటనే స్పందించారు. తన మేనేజర్ల ద్వారా శ్యామల ప్రస్తుతం కూకట్‌పల్లిలోని ప్రసాద్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారని ట్రేస్ చేయించి తెలుసుకున్నారు. అనంతరం దిల్ రాజు స్వయంగా ఆసుపత్రి వైద్యులను ఫోన్‌లో సంప్రదించి శ్యామల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా డాక్టర్ దిల్ రాజుకు వివరించిన సమాచారం ప్రకారం…
మరో ప్రైవేట్ ఆసుపత్రి వారు శ్యామలకు చికిత్స నిరాకరించి బయటకు పంపించారని, అనంతరం నిన్న రాత్రి ఆమెను తీవ్ర కడుపునొప్పితో తమ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ విభాగంలో చేర్చుకున్నామని తెలిపారు.

పరీక్షల్లో శ్యామల గాల్‌బ్లాడర్‌లో సమస్య ఉన్నట్లు గుర్తించామని, abdomen CT Scan మరియు Ultrasound పరీక్షలు నిర్వహించామని చెప్పారు. అలాగే abdominal creatinine స్థాయిలు అధికంగా ఉన్నాయని, ఇప్పటికే ఆమెకు cardiac issues కూడా ఉన్నాయని వెల్లడించారు.

ప్రస్తుతం తల నుంచి పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, 2D ECO మరియు stomach scan కూడా చేసినట్లు తెలిపారు. రిపోర్టులు వచ్చిన తరువాత పరిస్థితిని బట్టి కేవలం medical management‌తో చికిత్స కొనసాగించాలా, లేక surgical management అవసరమా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని డాక్టర్లు వివరించారు.

డాక్టర్లతో మాట్లాడిన దిల్ రాజు, “శ్యామల గారికి పూర్తిస్థాయి చికిత్స అందించండి. అవసరమైన అన్ని చర్యలు తీసుకోండి. మా మేనేజర్లు మీతో టచ్‌లో ఉంటారు. నేను కూడా ఎప్పుడైనా ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటాను” అని భరోసా ఇచ్చినట్లు సమాచారం.

మధ్యప్రదేశ్‌లోని ఖన్‌గోర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కస్రావాడ్ అనే గ్రామంలో జరిగిన హల్దీ వేడుక వికటించి 21 ఏళ్...
16/05/2026

మధ్యప్రదేశ్‌లోని ఖన్‌గోర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కస్రావాడ్ అనే గ్రామంలో జరిగిన హల్దీ వేడుక వికటించి 21 ఏళ్ల రాఖీ అనే యువతి మృతి చెందింది. పెళ్లికి ముందు ఆచారం ప్ర‌కారం రాఖీ ఇంట్లో హ‌ల్దీ వేడుక నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో పెళ్లి కూతురితో పాటు ఇత‌ర బంధువులు పాల్గొన్నారు. ఫంక్ష‌న్ లో అతిధులు, బంధువులు రాఖీకి ప‌సుపుతో పాటు ఓ ప‌ర్ఫ్యూమ్ క‌లిపి పూయ‌గా అది వికటించింది. పెళ్లి కూతురు గొంతు వాచిపోవ‌డంతో పాటు పెద‌వులు ఉబ్బిపోయాయి. శ‌రీరం అంత‌టా ఎర్ర‌టి ద‌ద్దుర్లు వ‌చ్చాయి. దీంతో వెంట‌నే తల్లిదండ్రులు ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో ఐసీయూలో చేర్పించారు. చికిత్స అందిస్తున్న స‌మ‌యంలోనే గొంతు మ‌రింత వాచిపోయింది. ప్రైవేట్ ఆస్ప‌త్రిలో వైద్యానికి ఎక్కుడ ఖ‌ర్చు అవ్వ‌డంతో డ‌బ్బులు లేక యువ‌తి కుటుంబ స‌భ్యులు డ‌బ్బులు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అంబులెన్స్ లో వెళుతున్న స‌మ‌యంలోనే ఆరోగ్యం మ‌రింత విష‌మించి యువ‌తి మ‌ర‌ణించింది. దీంతో కుటుంబ స‌భ్యులు ఇంటిముందు వేసిన మండ‌పాన్ని తొల‌గించి, పెళ్లి జ‌రిపించాల్సిన రోజే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల్సి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న యువ‌తి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. దీంతో ఖ‌ర్గోన్ జిల్లా ముఖ్య వైద్యాధికారి డాక్ట‌ర్ దౌల‌త్ సింగ్ చౌహాన్ స్థానిక వైద్యాధికారి నేతృత్వంలో విచార‌ణ‌కు ఆదేశించారు. యువ‌తికి రాసిన ప‌సుపు, ప‌ర్ఫ్యూమ్ ల శాంపిల్స్ సేక‌రించి ప‌రీక్షిస్తున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ‌వైర‌ల్ అవుతోంది.

15/05/2026

ఓ తల్లి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తన ఇద్దరు పిల్లల ప్రాణాలను కాపాడింది. ఆమెతో పాటు ఉన్న మరో ఇద్దరు మహిళల ప్రాణాలతో బయటపడ్డారు. బీహార్‌లోని షాహ్‌పూర్ పటోరి రైల్వే స్టేషన్ లో ఓ మహిళ తన ఇద్దరు పిల్లులు, మరో ఇద్దరు మహిళలు ట్రాక్ దాటే ప్రయత్నం చేశారు. అయితే అదే సమయంలో ట్రైన్ అత్యంత వేగంగా రావడంతో ఆ తల్లి తన బిడ్డలను కాపాడుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
15/05/2026

పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

ఇక ఇప్పటివరకు ఇంటర్మీడియట్‌లో కేవలం సెకండ్ ఇయర్‌లో మాత్రమే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండేవి. కానీ తాజాగా తీసుకువచ్చిన మార్పు...
14/05/2026

ఇక ఇప్పటివరకు ఇంటర్మీడియట్‌లో కేవలం సెకండ్ ఇయర్‌లో మాత్రమే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండేవి. కానీ తాజాగా తీసుకువచ్చిన మార్పుల ప్రకారం.. ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్‌ను నిర్వహించనున్నారు. ఇప్పటిదాకా.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో 30 మార్కుల చొప్పున సెకండియర్‌లో ప్రాక్టికల్స్ ఉండేవి. అయితే వీటిని ఫస్టియర్‌లో 15 మార్కులు, సెకండియర్‌లో 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్‌కు విడగొట్టారు. ఈ నిర్ణయం వల్ల ఫస్టియర్ నుంచే విద్యార్థులకు ప్రాక్టికల్స్‌పై పట్టు ఉంటుందని పేర్కొంటున్నారు.

14/05/2026

Address

Hyderabad
500004

Website

Alerts

Be the first to know and let us send you an email when Sardak One posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sardak One:

Share