12/06/2026
"పరువు కోసం కన్న కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు"
శ్రీకాకుళం జిల్లా బ్రాహ్మణతర్లాకు చెందిన హరిణి(24)ని, టెక్కలి మండలం సొర్లిగాం గ్రామానికి చెందిన తన మేనమామ దంతేశ్వరరావుకు ఇచ్చి వివాహం చేసిన తల్లిదండ్రులు.. వీరికి ఒక కుమారుడు.!!
పెళ్లయ్యాక డిగ్రీ పూర్తి చేసి, గ్రూప్-1 పరీక్షల శిక్షణ కొరకు హైదరాబాద్కు వెళ్ళిన హరిణికి పరిచయం అయిన నాగేంద్ర అనే వ్యక్తి!!
భర్తకు విడాకులు ఇచ్చి అతనిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన హరిణిని పలుమార్లు నిర్బంధించి, కొట్టిన కుటుంబసభ్యులు.. వీటిపై గతంలోనే బాలానగర్ పీఎస్లో ఫిర్యాదు.!!
గత నెల 30న స్వగ్రామానికి వెళ్లి విడాకుల వ్యవహారం గురించి మాట్లాడుదామని హరిణిని తీసుకెళ్లిన తల్లిదండ్రులు!!
ప్రమాదాన్ని ముందే గ్రహించి జూన్ 5లోగా తాను తిరిగి రాకపోయినా, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా తనకు ఆపద తలపెట్టి ఉంటారని వీడియో రికార్డ్ చేసి నాగేంద్రకు పంపిన హరిణి.!!
పథకం ప్రకారమే హరిణిని గత నెల 31 అర్ధరాత్రి హత్య చేసి, గుండెనొప్పితో చనిపోయిందని, ఆత్మహత్య చేసుకుందని బంధువులకు చెప్పి అంత్యక్రియలు కూడా పూర్తి చేసిన తల్లి, భర్త, తాత!!
5వ తేదీ వరకు ఆమె నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో, వీడియోను శక్తి యాప్లో నాగేంద్ర పంపగా సొర్లిగాం గ్రామానికి వెళ్లి విచారించిన పోలీసులు.!!
హరిణి మరణించి అప్పటికే 6 రోజులు అయిందని తేలగా, దర్యాప్తు జరిపి భర్త, తల్లి, తాతను అరెస్ట్ చేసిన పోలీసులు.!!
#పెద్దన్న