15/08/2026
కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల టిడిపి కన్వీనర్ కొండా పురుషోత్తం జన్మదిన వేడుకలు మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పిటిసి సభ్యుడు ఏరూరు మీనాక్షి నాయుడు, సింగిల్ విండో అధ్యక్షుడు కొండా రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజల అడుగుజాడల్లో నడుస్తూ.. ప్రజాసేవను తన బాధ్యతగా భావిస్తూ.. ప్రజల మధ్య ఉంటూ, ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ ముందుకు సాగుతున్న టిడిపి యువ నాయకుడు, మండల కన్వీనర్ కొండా పురుషోత్తం అని వారు కొనియాడారు. పదవి, పేరు కోసం కాదు.. సేవ కోసం ప్రజల కోసం పాటుపడుతున్న వ్యక్తిగా ఆయనను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #టిడిపికార్యకర్తలు #తెలుగుదేశంపార్టీ #ఆంధ్రప్రదేశ్