SriramNaik Ramavath

SriramNaik Ramavath Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SriramNaik Ramavath, Social Media Agency, Hyderabad.

 #లంబాడీలను_ఎస్టీ_జాబితానుండితొలగించాలనడంరాజ్యాంగ_వ్యతిరేకం**- కాంగ్రెస్ పార్టీ ప్రజా  ప్రతినిధులుగా ఉంటూ లంబాడీలను ఎస్ట...
02/09/2025

#లంబాడీలను_ఎస్టీ_జాబితానుండితొలగించాలనడంరాజ్యాంగ_వ్యతిరేకం*

*- కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులుగా ఉంటూ లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలనే వైఖరి తీసుకున్న సోయం బాబురావు,ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుల తీరుపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరి ప్రకటించాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.*

గత 50 సంవత్సరాలుగా ఎస్టీ జాబితాలో ఉన్న లంబాడి గిరిజనులను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు లు డిమాండ్ చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని సోమవారం, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మ నాయక్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్, ఉపాధ్యక్షులు,సహాయ కార్యదర్శులు వాంకుడోత్ వీరన్న, మూడ్ బాలు,భూక్యా హరి,అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు.

గత పార్లమెంటు,అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఆనాడున్న సోయం బాబురావు ద్వారా లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేయిస్తూ గిరిజన తెగల్లో ఘర్షణ సృష్టించి లబ్ధి పొందిందని అన్నారు. కొంతమంది బిజెపి పార్లమెంటు సభ్యులతో సంతకాలు చేయించి ప్రధాని నరేంద్ర మోడీకి మెమొరాండం సమర్పించారని గుర్తు చేశారు. బిజెపి సహకారంతో సోయం బాబురావు లంబాడీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్ద సభ నిర్వహించి రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని అన్నారు. అదే సోయం బాబురావు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి అదే వైఖరిని అనుసరిస్తూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీం కోర్టులో కేసు వేయడం, ఆ పేరుతో విద్వేష ప్రసంగాలు చేస్తూ గిరిజన తెగల్లో ఘర్షణ సృష్టిస్తున్నారని ఆరోపించారు.వీరు వ్యక్తిగతంగా చేస్తున్నారా లేక కాంగ్రెస్ పార్టీ విధానమా అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా అనేకసార్లు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కేసులు వేసి ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేశారని గుర్తుచేశారు.అయినా సోయం బాబురావు,తెల్లం వెంకట్రావు లాంటి కొంత మంది పరిష్కారం కానీ రాజ్యాంగ వ్యతిరేక డిమాండ్ ను పదే పదే ముందుకు తెస్తూ న్యాయస్థానాల్లో కావాలని కేసులు వేస్తూ గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. వీరికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కోట్లాదిమంది ఆదివాసి గిరిజనుల హక్కులను, షెడ్యూల్డ్ ప్రాంత రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన అటవీ సంరక్షణ నియమాల చట్టం 2023 కు వ్యతిరేకంగా పోరాడాలని హితవుపలికారు. షెడ్యూల్ ప్రాంతంలో 100% స్థానిక గిరిజనులకు రిజర్వేషన్ కల్పిస్తూ గత 25 ఏళ్లుగా అమలైన జీఓ నెంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టి వేసి ఐదేళ్లు గడుస్తున్నా కొత్త జీవో కొరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఎందుకు పోరాడటం లేదని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 1/70 చట్టం, పీసా చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఆదివాసీల భూములు, అటవీ సంపదను బడా కార్పొరేట్లకు, భూస్వాములకు కట్టబెడుతున్నా ఆ పార్టీలోని గిరిజన ప్రజాప్రతినిధులు ఒక్క మాట మాట్లాడటం లేదని విమర్శించారు. గిరిజన బంధు తరహాలో ప్రతి గిరిజన కుటుంబానికి 12 లక్షలు ఇస్తాం, ప్రతి గిరిజన గూడెం, తండాల పంచాయతీలకు ప్రతి ఏటా 25 లక్షలు ఇస్తాం, పోడు భూములకు హక్కులు కల్పిస్తాం, మైదాన ప్రాంతంలో ఐటిడీఏలను నిర్మిస్తాం, రిజర్వేషన్లను 10 నుండి 12 శాతానికి పెంచుతామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 15 రకాల హామీలపై గిరిజనులు పోరాడకుండా దృష్టిని మళ్లించడానికే కుట్రపూరితంగా ఆ పార్టీ వ్యవహరిస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీం కోర్టులో కేసు వేశామనే పేరుతో సోషల్ మీడియాలో అవాస్తవాలు మాట్లాడుతూ,విద్వేషాలను రెచ్చగొడుతూ ఘర్షణ సృష్టించే వారిపట్ల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు బిజెపి, కాంగ్రెస్ పార్టీల మాయలో గిరిజనులు పడోద్దని విజ్ఞప్తి చేశారు.

అభివందనములతో..
*ఆర్ శ్రీరాం నాయక్*
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ గిరిజన సంఘం

 #పోడుగిరిజనులపై_అక్రమకేసులు_పెట్టిన_అటవీఅధికారులపై_చర్యలుతీసుకోవాలి.* *బాధిత గిరిజనులతో కలిసి  #రాష్ట్రమానవహక్కులకమిషన్...
26/08/2025

#పోడుగిరిజనులపై_అక్రమకేసులు_పెట్టిన_అటవీఅధికారులపై_చర్యలుతీసుకోవాలి.*

*బాధిత గిరిజనులతో కలిసి #రాష్ట్రమానవహక్కులకమిషన్ లో #ఫిర్యాదు చేసిన తెలంగాణ #గిరిజనసంఘం రాష్ట్ర నాయకులు*

గత 70 సంవత్సరాలుగా పోడు భూములను గిరిజనులు సాగు చేస్తున్నారు.గిరిజనుల భూములను అటవీ శాఖ అధికారులు బలవంతంగా లాక్కొని మొక్కలు నాటారు. అడ్డుకున్న గిరిజనులపై అక్రమ కేసులు పెట్టి వేదిస్తున్న అటవీ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యాదర్శులు ఎం ధర్మ నాయక్, ఆర్ శ్రీరాం నాయక్, వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం బాల్యా నాయక్,బాధిత గిరిజనులు ముడావత్ మంగమ్మ,బొజ్జమ్మ, హునీ బాయి,మోతి బాయి, గోపాల్, భోజ్యా, లాలు, రమేష్ లతో కలిసి సోమవారం హైదరాబాద్,నాంపల్లి లోని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు.

వనపర్తి జిల్లా పానల్ మండలం, కిష్టాపూర్ తండా శివారులోని సర్వే నెం:34/8 లో 12 ఎకరాల పోడు భూములను గత 70 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు.ఈ భూములపై 30 సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేసింది. సాగుచేస్తూ జీవిస్తున్న గిరిజన రైతులు గత ఏడాది బ్రతుకు తెరువు కోసం వలసలు వెళ్లిన సమయంలో వీరి భూముల్లో అటవీ శాఖ అధికారులు బలవంతంగా మొక్కలు నాటారు. అన్యాయమని అడ్డుకున్న 12 మంది గిరిజనులపై అక్రమంగా కేసులు నమోదు చేశారు.తీవ్రమైన నేరాలు చేసిన వారిపై పెట్టే పీడీ కేసులను గిరిజనులపై పెట్టారు.అటవీ చట్టం సెక్షన్ 447, 427 ఐపిసి 329(3), 324 (4) బిఎన్ఎస్ ఆఫ్ పిడిపిపి లాంటివి పెట్టి తీవ్ర వేధింపులకు గురించేస్తున్నారు. గిరిజనులు సాగుచేస్తున్న భూముల్లో వ్యవసాయ బోర్లు, బావులు, విధ్యుత్ కనెక్షన్లు,సహకార బ్యాంకుల ద్వారా పంట ఋణాలు పొందుతున్నారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం వీరికి హక్కుపత్రాలివ్వాలి.దరఖాస్తులు పెట్టినా ఇవ్వకుండా అటవీ అధికారులు అడ్డుపడుతున్నారు.పోడు భూములపై గిరిజనులకు ఉన్న రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న అటవీ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, గిరిజనులపై పెట్టిన అక్రమ ఎత్తివేసేలాగా అదేశాలివ్వగలరని విజ్ఞప్తి చేశారు.

అభివందనములతో..
*ఆర్ శ్రీరాం నాయక్*
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ గిరిజన సంఘం.

 #తెలంగాణగిరిజనసంఘం ఆధ్వర్యంలో  #వివిధ_జిల్లాల్లో_జరిగిన  #ప్రపంచగిరిజనహక్కులదినోత్సవం.. పత్రికల్లో వచ్చిన పేపర్ కటింగ్స...
10/08/2025

#తెలంగాణగిరిజనసంఘం ఆధ్వర్యంలో
#వివిధ_జిల్లాల్లో_జరిగిన
#ప్రపంచగిరిజనహక్కులదినోత్సవం.. పత్రికల్లో వచ్చిన పేపర్ కటింగ్స్..

 #నేడు_ప్రపంచగిరిజనహక్కులదినోత్సవం సందర్భంగా మిత్రులందరికీ  #శుభాంక్షలు..*🎉🎊🌹
09/08/2025

#నేడు_ప్రపంచగిరిజనహక్కులదినోత్సవం సందర్భంగా మిత్రులందరికీ #శుభాంక్షలు..*🎉🎊🌹

07/08/2025

#ఈపాటవ్రాసినజయరాజన్నకు_పాడిన_విజయ్_యేసుదాసు_గార్లకు #శిరస్సువంచినమస్కరించాలి.
ఈ పాట చాలాసార్లు విన్నాను. వింటుంటే మనసులోని భావాలు మనసులో ప్రశాంతత మానవ జీవితం ఎలా ఉండాలి? ఎలా ఉంటుంది ? తెలిసి తెలియకుండా ప్రవర్తిస్తున్న మనిషికి, అంధకారంలో ఉన్న మానవుడికి కనువిప్పు కలిగిస్తుంది. వారి హృదయం స్పందిస్తుంది. మానవ జీవితం గురించి ఒక పాటలో చెప్పారు. ఈ పాట నా హృదయాన్ని కదిలించింది. పదిమందికి వినిపించండి. 🙏🙏🙏🏻

 #కేంద్ర_ప్రభుత్వం చేపడుతున్న 2027  #జనాభా_లెక్కల్లో  #మతం అనే కాలంలో షెడ్యూల్ ట్రైబ్ లేక  #ప్రకృతిఆరాదకులుగా ప్రత్యేక క...
30/07/2025

#కేంద్ర_ప్రభుత్వం చేపడుతున్న 2027 #జనాభా_లెక్కల్లో #మతం అనే కాలంలో షెడ్యూల్ ట్రైబ్ లేక #ప్రకృతిఆరాదకులుగా ప్రత్యేక క్యాటగిరిగా గిరిజన తెగలను గుర్తించాలని కోరుటగురించి..
#గవర్నర్_ను_కలిసినప్రతినిధిబృందంలో.. మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు.
డాక్టర్ మిడియం బాబురావు.
మాజీ శాసన సభ్యులు,
టిజీఎస్ సలహాదారులు జూలకంటి రంగారెడ్డి,తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంఘం పూసం సచిన్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవి కుమార్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మ నాయక్, ఆర్ శ్రీరాం నాయక్ లు ఉన్నారు.

   #తెలంగాణరాష్ట్రగవర్నర్_కు_మెమొరాండం.కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 2027 జనాభా లెక్కల మతం కాలంలో షెడ్యూల్ ట్రైబ్ లేక ప్రక...
29/07/2025

#తెలంగాణరాష్ట్రగవర్నర్_కు_మెమొరాండం.కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 2027 జనాభా లెక్కల మతం కాలంలో షెడ్యూల్ ట్రైబ్ లేక ప్రకృతి ఆరాదకులుగా ప్రత్యేక క్యాటగిరిగా గిరిజన తెగలను గుర్తించాలని కోరుటగురించి..

===

తెలంగాణ రాష్ట్రంలో 33 తెగలు 33 లక్షల మంది ఉన్నారు. వీరు ప్రధానంగా ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో 1180 షెడ్యూల్డ్ గ్రామాలు, మైదాన ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో నివసిస్తున్నారు. ఆదివాసి గిరిజన తెగల్లో ముఖ్యంగా కోయ, గోండి,కొలామి, లంబాడా,ఎరుకల భాషలు స్వంత మాండలికాలలో మాట్లాడతారు. వీరు మాట్లాడే భాషలకు లిపి లేకపోవడం వలన ఉనికిని కోల్పోతున్నాయి. ఆదివాసి గిరిజన తెగలు తరతరాలుగా పూర్వీకుల నుండి కొండలు, నదులు, చెట్లు, జంతువులు,ప్రకృతిని దైవంగా కొలుస్తారు.ఇవి వారి వారి తెగల సాంప్రదాయ మతపరమైన ఆచారంగా కొనసాగుతువస్తున్నది.వీరు విగ్రహారాధన కాకుండా ప్రకృతినే ఆరాధ్య దైవంగా కొలుస్తూ వస్తున్నారు. తెగల సంస్కృతి,ఆచారాలు,క్రతువులు పాటిస్తూ ఇతర మతాల ఆచారాలకు దూరంగా ఉంటూవస్తున్నారు.గత కొన్ని సంవత్సరాలుగా ఇతర మతాల ప్రభావంలో పడుతున్నారు.దీనివలన ఆదివాసి గిరిజన తెగల స్వంత సాంస్కృతిక మరియు సామాజిక అస్థిత్వం ప్రమాదంలో పడుతోంది.

దేశంలో ఇప్పటివరకు జరిగిన జనాభా లెక్కల్లో ఇతర మతపరమైన ఆచారాలలో నమోదు చేయబడ్డారు. వారు వేర్వేరు ఆదివాసి గిరిజన విశ్వాసాలు మరియు ఆచారాలకు చెందినవారనే వాస్తవాన్ని ఇది అస్పష్టం చేస్తుంది.

కావునా తెలంగాణలోని 33 షెడ్యూల్ తెగల ప్రజల గణన కోసం కేంద్ర ప్రభుత్వం 2027లో చేపడుతున్న జనాభా లెక్కల్లో మతం అనే క్యాటగిరిలో షెడ్యూల్ తెగలు లేదా ప్రకృతి ఆరాదకులుగా ప్రత్యేక కాలంను చేర్చేవిధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తగు సూచనలు ఇవ్వగలరని కోరుతున్నాము.

*నాన్ షెడ్యూల్ లో ఉన్న వెయ్యి గిరిజన గ్రామాలను షెడ్యూల్ లో చేర్చాలి.*

తెలంగాణ రాష్ట్రంలో ఐదవ షెడ్యూల్ ప్రాంతానికి అనుకొని ఉన్న 50 శాతం నుండి 100శాతం గిరిజన జనాభా కలిగిన నాన్ షెడ్యూల్ గ్రామాలను షెడ్యూల్ ప్రాంతంలో చేర్చాలి. ఈ గ్రామాలలో గిరిజనులు ఐటిడిఏ పథకాలు పొందలేకపోతున్నారు. వారి భూములకు 1/70,పీసా చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. తెగ సర్టిఫికెట్ పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున ఈ గ్రామాలను ఐదవ షెడ్యూల్లో చేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయగలరని మనవి చేస్తున్నాము.

#గవర్నర్_ను_కలిసినప్రతినిధిబృందంలో.. మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు.
డాక్టర్ మిడియం బాబురావు.
మాజీ శాసన సభ్యులు,
టిజీఎస్ సలహాదారులు జూలకంటి రంగారెడ్డి,తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంఘం పూసం సచిన్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవి కుమార్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మ నాయక్, ఆర్ శ్రీరాం నాయక్ లు ఉన్నారు.

 #ఆగస్టు 9  #ప్రపంచ_ఆదివాసి_గిరిజనహక్కులదినోత్సవం సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 11న హైదరాబాద్ లో  #గిర...
28/07/2025

#ఆగస్టు 9 #ప్రపంచ_ఆదివాసి_గిరిజనహక్కులదినోత్సవం సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 11న హైదరాబాద్ లో #గిరిజనహక్కులగర్జన.....

 #ఆగస్టు11న_గిరిజన_హక్కులగర్జన**-కరపత్రాలను విడుదల చేసిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు*ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి గిర...
27/07/2025

#ఆగస్టు11న_గిరిజన_హక్కులగర్జన*

*-కరపత్రాలను విడుదల చేసిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు*

ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి గిరిజన హక్కుల దినోత్సవాన్ని ఆగస్టు 9 నుండి 11వ తేదీ వరకు తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తండాలు, మండల కేంద్రాల్లో నిర్వహిస్తూ ఆగస్టు 11వ తేదీన హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రస్థాయి గిరిజన హక్కుల గర్జన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సందర్భంగా ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మ నాయక్, ఆర్ శ్రీరాం నాయక్ లు ఆదివారం,హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కరపత్రాలను విడుదల చేశారు.

వారు మాట్లాడుతూ రాజ్యాంగంలోని గిరిజన హక్కులను కాపాడుకుందాం,అడవులు, భూముల నుండి గిరిజనులను గెంటివేయడాన్ని ఆపాలి,గిరిజనులకు ఇచ్చిన హామీల అమలుకై పోరాడుదాం అనే నినాదాలతో ప్రపంచ ఆదివాసి గిరిజన హక్కుల దినోత్సవాన్ని జరుపుతున్నట్లు తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ గిరిజన తెగలు తమ హక్కుల సాధన కోసం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవాన్ని హక్కుల దినోత్సవంగా జరుపుకోవాలని 1994 లో ఐక్యరాజ్యసమితి తీర్మానించిందని అన్నారు. అందులో భాగంగా గిరిజనులను చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా గిరిజన హక్కుల దినోత్సవంగా జరుపుతున్నామని తెలిపారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి భారత రాజ్యాంగంలో ఆదివాసీ గిరిజనులకు కల్పించిన హక్కులు, చట్టాలను గతంలో ఎన్నడులేని విధంగా కాలరాసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అడవులు, అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టపెట్టేందుకు గిరిజన హక్కులను కాలరాస్తూ నూతన అటవీ సవరణ చట్టాన్ని 2023లో ఆమోదించిందని ఆరోపించారు. దీనివలన కోట్లాదిమంది ఆదివాసి గిరిజనులు అడవుల నుండి గెంటి వేయబడి నిరాశ్రయులుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ,క్రిస్టియన్ మతాల ప్రభావం వలనా ఆదివాసి గిరిజనులు తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ప్రత్యేక సంస్కృతి,భాష,ప్రకృతి ఆరాధనా వంటి ఆచారాలు కలుషితం కావడం వలన గిరిజన తెగల ఉనికి ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన తెగల ఉనికిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం 2027లో నిర్వహిస్తున్న జనాభా లెక్కల మతం కాలంలో షెడ్యూల్ ట్రైబ్ విశ్వాసాలు లేక ప్రకృతి ఆరాధికులు అనే ప్రత్యేక కాలాన్ని పొందుపరచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గిరిజనులకు ఇచ్చిన 16 రకాల వాగ్దానాలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ గిరిజనులను మోసం చేస్తుందని విమర్శించారు. సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నామని గొప్పలు చెపుతున్న ప్రభుత్వం ఇప్పటివరకు గిరిజన శాఖకు గిరిజన మంత్రిని ఎందుకు నియమించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలపై రాబోయే కాలంలో పోరాడేందుకు ఉద్యమ కార్యాచరణను ఆగస్టు 11న జరిగే గిరిజన హక్కుల గర్జన లో ప్రకటిస్తామని తెలిపారు. గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సౌత్ జిల్లా అధ్యక్షులు రాంకుమార్ నాయక్, రంగారెడ్డి జిల్లా నాయకులు ఎం గోపి నాయక్, ఆర్ శేఖర్,కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

అభివందనములతో...
ఆర్ శ్రీరాం నాయక్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ గిరిజన సంఘం

 #ఆదివాసుల_మతం_ఏమిటి?.. ప్రో.     గారు ఆంధ్రజ్యోతికి రాసిన వ్యాసం..
24/07/2025

#ఆదివాసుల_మతం_ఏమిటి?.. ప్రో. గారు ఆంధ్రజ్యోతికి రాసిన వ్యాసం..

 #మహబూబాబాద్ లో ఐటీడీఏను ఏర్పాటు చేయాలి.**-తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ శ్రీరాం నాయక్ డ...
19/07/2025

#మహబూబాబాద్ లో ఐటీడీఏను ఏర్పాటు చేయాలి.*
*-తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ శ్రీరాం నాయక్ డిమాండ్*

*మహబూబాబాద్ (18/07/2025)
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం మహబూబాబాద్ లో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ను ఏర్పాటు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ శ్రీరాంనాయక్ డిమాండ్ చేశారు.
మహబూబాబాద్ పట్టణంలోని పెరుమాళ్ళ జగన్నాథం భవన్ లో బానోత్ వెంకన్న అధ్యక్షతన జరిగిన తెలంగాణ గిరిజన సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే నుండి సర్పంచ్ దాకా గిరిజనులే ప్రజాప్రతినిధులుగా ఉన్నా గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ట్రైకార్ సంస్థలో రుణాల కోసం వేలాది మన గిరిజనలు అర్హత సాధించి, చెక్కులు సిద్ధమైనా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేయడం లేదన్నారు. గిరిజనుల లబ్ధిదారులకు 10 లక్షల వరకు రుణాలను మంజూరు చేసే ట్రైకార్ సంస్థను నిర్వీర్యం చేసి కేవలం నాలుగు లక్షల రుణ సౌకర్యం కల్పిస్తామంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవుల కేటాయింపులో సామాజిక న్యాయాన్ని అమలు చేశామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం 10 శాతం ఉన్న గిరిజనులకు కేవలం ఒక మంత్రి పదవి ఇచ్చి గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. గిరిజన సంక్షేమ శాఖకు ప్రత్యేకంగా మంత్రిని ఏర్పాటు చేయకపోవడం వలన గిరిజనుల రాజ్యాంగ హక్కులకు విఘాతం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ శాఖను అనాధ శాఖగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోడుభూములను సాగు చేస్తున్న గిరిజనులకు హక్కు పత్రాలు ఇస్తామన్న వాగ్దానం ఇంతవరకు నెరవేరలేదని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి భూక్య హరి నాయక్, మాలోత్ కిషన్ నాయక్, గూగులోత్ పార్వతి, భుక్య పుల్ సింగ్ నాయక్, బానోత్ రెడ్యానాయక్, కళ్యాణ్ నాయక్, వెంకన్న నాయక్, వివిధ మండలాల నుండి సంఘం కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Address

Hyderabad
500001

Website

Alerts

Be the first to know and let us send you an email when SriramNaik Ramavath posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SriramNaik Ramavath:

Share