SriramNaik Ramavath

SriramNaik Ramavath Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SriramNaik Ramavath, Social Media Agency, Hyderabad.

 #ఎస్సీ_ఎస్టీ_బెస్ట్_ఎవైలబుల్ స్కూళ్ల బకాయిలు రూ.154 కోట్లను తక్షణం విడుదల చేయాలి.*-- *తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక...
17/06/2025

#ఎస్సీ_ఎస్టీ_బెస్ట్_ఎవైలబుల్ స్కూళ్ల బకాయిలు రూ.154 కోట్లను తక్షణం విడుదల చేయాలి.*

-- *తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మ నాయక్, ఆర్ శ్రీరాం నాయక్ లు డిమాండ్ చేశారు.*
*-26 వేల మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం*

దళిత,గిరిజన పేద పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో ఉచితంగా చదివేందుకు గత 35 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన బెస్ట్ ఎవైలబుల్ పథకం నిరాటంకంగా కొనసాగుతూ వస్తుందన్నారు.వివిధ జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందిన ప్రైవేట్ స్కూళ్లలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ప్రభుత్వం చెల్లించే ఫీజులతో ఉచితంగా విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ పథకానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆటంకాలు కల్పిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా చెల్లించాల్సిన ఫీజు బకాయిలను చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నెల 20 వరకు పాఠశాలలు తెరిచే పరిస్థితి లేదని ప్రకటించాయన్నారు. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్చలు జరిపి బకాయి పడ్డ 154 కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోపే బడా కాంట్రాక్టర్లు,రాజకీయ నాయకులకు చెల్లించాల్సిన వేలకోట్ల రూపాయల బిల్లులను ఆగమేఘాల మీద చెల్లించిందన్నారు.కానీ పేద దళిత గిరిజన విద్యార్థులు చదువుతున్న ప్రైవేట్ స్కూళ్లకు చెల్లించాల్సిన ఫీజులను చెల్లించకపోవడం దళితులు గిరిజనుల పట్ల తీవ్ర వివక్ష పాటించడమేనన్నారు. బెస్ట్ అవైలబుల్ క్రమంగా నిర్వీర్యం చేసి పూర్తిగా రద్దు చేయాలని కుట్రలు చేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రభుత్వం రెండేళ్లుగా ఫీజులు చెల్లించకపోవడంతో స్కూళ్ల యాజమాన్యాలు ఆర్థిక భారం పడుతోందని విద్యార్థులను స్కూళ్లల్లోకి విద్యార్థులను రానీయకుండా కొత్త అడ్మిషన్లు సైతం నిరాకరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం గత అనేక సంవత్సరాలుగా అమల్లో ఉండడం వలన వేలాదిమంది దళిత గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ప్రవేట్ కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందే స్థాయికి వెళ్లారని అన్నారు. రెండేళ్లుగా బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 180 ప్రైవేటు స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీ విద్యా ర్థులు 26 వేల మంది చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదికి డే స్కాలర్ కు రూ.28 వేలు, రెసిడెన్షియల్ కు రూ.42 వేలు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. తక్కువ ఫీజులోనే చదువు, భోజనం, దుస్తులు, పుస్తకాలు, వసతి కల్పి స్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా తక్షణం ప్రైవేటు స్కూళ్లకు చెల్లించాల్సిన రూ.154 కోట్లను చెల్లించాలని లేకపోతే దళిత గిరిజన సంఘాలు, విద్యార్థిసంఘాలను కలుపుకొని రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పూనుకుంటామని హెచ్చరించారు.

అభివందనములతో..
ఆర్ శ్రీరాం నాయక్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ గిరిజన సంఘం

 #గిరిజన_హామీల_అమలుకై_రాష్ట్రవ్యాప్త_ఉద్యమం.. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో నేతల పిలుపు..
08/06/2025

#గిరిజన_హామీల_అమలుకై_రాష్ట్రవ్యాప్త_ఉద్యమం.. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో నేతల పిలుపు..

 #పత్రికా_ప్రకటన 07-06-2025*గిరిజన హామీల అమలుకు  రాష్ట్రవ్యాపిత ఉద్యమం**- తెలంగాణ గిరిజన సంఘం  రాష్ట్ర విస్తృత స్థాయి సమ...
07/06/2025

#పత్రికా_ప్రకటన
07-06-2025
*గిరిజన హామీల అమలుకు రాష్ట్రవ్యాపిత ఉద్యమం*

*- తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో నేతల పిలుపు*

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎడాదిన్నర కావస్తున్నా చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో గిరిజనులకు ఇచ్చిన 16 రకాల హామీలలో ఒక్క హామీలు కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ గిరిజనులను మోసం చేస్తోందని ఆరోపించారు. తక్షణం గిరిజన హామీలపై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి అమలకు కార్యాచరణ ప్రకటించాలని లేకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని
శనివారం హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మా నాయక్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో నేతలు హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శులు భూక్యా వీరభద్రం, గూగులోత్ భీమా సాహెబ్,ఎం.బాలు నాయక్,చందు నాయక్, అశ్వినీ,భూక్యా హరి,ఎర్రా నాయక్, అమర్ సింగ్,బాల్యా నాయక్,గోపి,దీప్లా, రాంకుమార్,మహిపాల్ నాయక్,వెంకట్రామ్ నాయక్ తదితరులతోపాటు అన్ని జిల్లాల నుండి రాష్ట్ర,జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గిరిజన హామీలను అమలు చేస్తామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో జరిగిన బహిరంగ సభలో ప్రకటించారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ గిరిజనులను మోసం చేస్తోందని విమర్శించారు. గిరిజన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని గిరిజన ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారన్నారు. హామీల అమలు ఆలస్యం కావడం వల్ల గిరిజనులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.గిరిజన సంక్షేమ శాఖ రాజ్యాంగబద్ధ అధికారాలు కలిగిన 5వ షెడ్యూల్ ప్రాంతంతోపాటు గిరిజనులకు అనేక హక్కులు, చట్టాలు అమల్లో ఉన్నాయన్నారు. గిరిజన ఎమ్మెల్యేలలతో కూడిన గిరిజన సలహామండలిని, గిరిజన శాఖామంత్రిని ఇప్పటివరకు నియమించకుండా గిరిజనులను అవమానపరుస్తోందని ఆరోపించారు. గిరిజనులు ఎదుర్కోంటున్న సమస్యలను విన్నవించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి వద్దే గిరిజన శాఖ ఉండటం వల్ల గిరిజన సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నాయన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ లో ఎస్టీ కమీషన్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామన్నారు,మూడు ఎస్టీ కార్పొరేషన్లు, వాటికి ప్రతియేటా ఒక్కో కార్పోరేషన్ రూ.500కోట్లు,అంబేడ్కర్ అభయహస్తం పథకం ద్వారా ప్రతి ఎస్టీ కుటుంబానికి 12 లక్షలు,పోడు భూముల సాగుదారులందరికీ హక్కుపత్రాలు,మైదాన ప్రాంత గిరిజనుల కోసం కొత్తగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, నిజామాబాద్,మహబూబ్ నగర్ లలో ఐటిడిఎల ఏర్పాటు.సమ్మక్క సారలమ్మ గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా ప్రతి గూడెం, తండా గ్రామ పంచాయితీలకు ప్రతి యేటా 25 లక్షలు,తండా, గ్రామ పంచాయితీలను రెవెన్యూ హోదా ఇచ్చి, తండాల అభివృద్ధి బోర్డు,ఇండ్లు లేని ప్రతి ఎస్టీ కుటుంబానికి ఇంటిస్థలం, ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు, బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్టీ అసైన్డ్ భూములను తిరిగి లబ్దిదారులకు ఇస్తాం,ప్రైవేట్ విద్యా సంస్థలతోపాటు ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందే ప్రైవేట్ పరిశ్రమల్లో రిజర్వేషన్ కల్పిస్తాం, పదో తరగతి నుండి ఉన్నత విద్య అభ్యసించే గిరిజన విద్యార్థికి లక్ష నుండి 5 లక్షల రూపాయలు వంటి వాగ్దానాల్లో ఒక్క వాగ్దానం కూడా అమలుకు నోచుకోలేదని వాటి అమలుకు తక్షణం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటించాలని లేకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో నేతలు హెచ్చరించారు.

అభినందనలతో...
*ఆర్ శ్రీరాం నాయక్*
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ గిరిజన సంఘం

మే 20 వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న  #సార్వత్రిక_సమ్మెకు తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు....
15/05/2025

మే 20 వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న #సార్వత్రిక_సమ్మెకు తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు....

 #మే 20న జరుగుతున్న  #జాతీయసమ్మెకు_గిరిజనసంఘం_సంపూర్ణమద్దతు**-తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ...
14/05/2025

#మే 20న జరుగుతున్న #జాతీయసమ్మెకు_గిరిజనసంఘం_సంపూర్ణమద్దతు*

*-తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ*

కార్మిక, రైతు, సామాజిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మే 20 తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతీయ సమ్మెకు తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మ నాయక్, ఆర్ శ్రీరాం నాయక్, హైదరాబాద్ అధ్యక్షులు రామ్ కుమార్ నాయక్, కిషన్ నాయక్ లు బుధవారం, హైదరాబాద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని టీపీఎస్కే హాల్లో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆర్ శ్రీరాం నాయక్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి లేబర్ కోడ్ ల పేరుతో కార్మిక హక్కులను కాలరాయడమే కాకుండా దేశ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా నూతన చట్టాలను ప్రవేశ పెడుతూ అంబానీ ఆదానీ లాంటి బడా కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూరుస్తుందని ఆరోపించారు. దేశంలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కోట్లాదిమంది గిరిజనులు, దళితులు, బలహీనవర్గాలు, పేదలు ఆధారపడి జీవిస్తుంటే ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలనే కుట్రతో బడ్జెట్లో గతంలో ఎన్నడు లేని విధంగా కోత పెట్టిందని విమర్శించారు. తరతరాలుగా అటవీ, పోడు భూముల పై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీ గిరిజనులను అడవుల నుండి బలవంతంగా గెంటి వేసే విధంగా అటవీ సంరక్షణ నియమాల చట్టం 2023 పేరుతో తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలో ఆదివాసి గిరిజనులకు ఉన్న హక్కులతో పాటు 5, 6 వ షెడ్యూల్ ప్రాంత హక్కులు, చట్టాలపై దాడిని తీవ్రతరం చేసిందని అన్నారు. శతాబ్దాలుగా ఆదివాసీ గిరిజనులు ఆచరిస్తూ వస్తున్న సంస్కృతి, ఆహార అలవాట్లు, ఆచారాలపై మూక దాడులు చేస్తూ బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు హత్యలకు పాల్పడుతున్నాయన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయాలనే కుట్ర లో భాగంగానే ప్రభుత్వ రంగంలోని సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని అన్నారు. ఆదివాసి గిరిజన సంస్కృతి పై మనువాద సంస్కృతిని బలవంతంగా రుద్ది హైందవీకరించేందుకు, రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

ఇటువంటి నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్నిసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా కార్మిక,రైతు,సామాజిక,ప్రజా సంఘాలు ఐక్యంగా మే 20 వ తేదీన సార్వత్రిక సమ్మెను చేపట్టాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సమ్మెలో రాజకీయాలకు అతీతంగా ఆదివాసి గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

అభివందనములతో..
*ఆర్ శ్రీరాం నాయక్*
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ గిరిజన సంఘం

 #నేడు భారత రాజ్యాంగ నిర్మాత, మనువాదాన్ని ఎదిరించిన ధీరుడు.. డాక్టర్ బాబాసాహెబ్  #అంబేద్కర్ గారి  #జయంతి సందర్భంగా  #శుభ...
14/04/2025

#నేడు భారత రాజ్యాంగ నిర్మాత, మనువాదాన్ని ఎదిరించిన ధీరుడు.. డాక్టర్ బాబాసాహెబ్ #అంబేద్కర్ గారి #జయంతి సందర్భంగా #శుభాకాంక్షలు.. తెలంగాణ గిరిజన సంఘం🎉🌹👏🎉🌹👏🎉🌹👏🎉🌹👏🎉🌹👏🎉🌹👏

 #బెస్ట్ అవైలబుల్ స్కీమును రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు... వేలాదిమంది దళిత, గిరిజన పిల్లలకు కార్పొరేట్ వి...
11/04/2025

#బెస్ట్ అవైలబుల్ స్కీమును రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు... వేలాదిమంది దళిత, గిరిజన పిల్లలకు కార్పొరేట్ విద్యకు దూరమయ్యే అవకాశం.. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మ నాయక్, ఆర్ శ్రీరాం నాయక్

 #అనుగారిన_వర్గాల_ఆశాజ్యోతి, భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంఘసంస్కర్త,  #మహాత్మ_జ్యోతిరావు_పూలే గారి  #వర్ధంతి సందర్భంగా త...
11/04/2025

#అనుగారిన_వర్గాల_ఆశాజ్యోతి, భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంఘసంస్కర్త, #మహాత్మ_జ్యోతిరావు_పూలే గారి #వర్ధంతి సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ఘనంగా #నివాళులు_అర్పిస్తున్నది... ఆర్ శ్రీరాం నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ గిరిజన సంఘం 💐👏🌹💐👏🌹👏🌹👏🌹👏🌹👏🌹👏🌹

 #చలో_గిరిజన_సంక్షేమ_భవన్. 219 కోట్ల ట్రైకార్ నిధులను తక్షణం విడుదల చేయాలని గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్.. ఆర్ శ్రీరాం నాయ...
08/04/2025

#చలో_గిరిజన_సంక్షేమ_భవన్. 219 కోట్ల ట్రైకార్ నిధులను తక్షణం విడుదల చేయాలని గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్.. ఆర్ శ్రీరాం నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ గిరిజన సంఘం

https://www.youtube.com/live/m72WCnGUbMU?si=vUMmk8iDTLGv2d5i
07/04/2025

https://www.youtube.com/live/m72WCnGUbMU?si=vUMmk8iDTLGv2d5i

శ్రీ జగదాంబ మాత శ్రీ సేవాలాల్ మహారాజ్ జాతర మహోత్సవం శ్రీ దీక్ష గురు భోజు మహారాజ్,వావిల్ గడ్డ తండా, మహబూబ్ నగర్ మ.....

Address

Hyderabad
500001

Website

Alerts

Be the first to know and let us send you an email when SriramNaik Ramavath posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SriramNaik Ramavath:

Share