BHARAT TV

BHARAT TV Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BHARAT TV, Broadcasting & media production company, HYDERABAD/. TELANGANA, Hyderabad.

*స్త్రీ సాధికారతే సమాజ పురోగతి – ఎమ్మెల్యే గళ్ళా మాధవి**అసెంబ్లీలో మహిళా సాధికారత గురించి జరిగిన చర్చలో ప్రసంగించిన ఎమ్మ...
27/09/2025

*స్త్రీ సాధికారతే సమాజ పురోగతి – ఎమ్మెల్యే గళ్ళా మాధవి*

*అసెంబ్లీలో మహిళా సాధికారత గురించి జరిగిన చర్చలో ప్రసంగించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి*

స్త్రీ సాధికారతే సమాజ పురోగతి అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. తిరుపతిలో సెప్టెంబర్‌ 14, 15 తేదీల్లో జరిగిన జాతీయ మహిళా సాధికారిత సదస్సు గురించి శనివారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొని,ప్రసంగించారు.

*అసెంబ్లీలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ.....*

“సమాజ పురోగతి, దేశ అభ్యున్నతి అనేవి ఆ దేశంలోని స్త్రీల స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి. బాధ్యత గల ప్రభుత్వాలు ఎప్పుడూ స్త్రీ సాధికారతను విస్మరించవు. ఈ క్రమంలోనే దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా సాధికారతపై ఇంత పెద్ద కాన్ఫరెన్స్ మన రాష్ట్రంలో జరగడం సంతోషకరమే కాక గర్వకారణం కూడా” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు

మహిళల అభ్యున్నతి, జెండర్ సెన్సిటివ్ పాలసీలు, జెండర్ బడ్జెటింగ్, స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ల వంటి అంశాలపై రెండు రోజుల పాటు అనేక రాష్ట్రాల మహిళా నాయకులు విలువైన సూచనలు ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రస్తావించారు. “ఇంతమంది ప్రతిభావంతులైన మహిళా నేతలను ఒకే వేదికపై కలుసుకునే అవకాశం కల్పించినందుకు గౌరవ స్పీకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు” తెలిపారు .

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల పట్ల తీసుకుంటున్న నిర్ణయాలు, సంక్షేమ పథకాలు దేశంలోనే ఉన్నత స్థాయిలో ఉన్నాయని గళ్ళా మాధవి తెలిపారు. ఆడవారికి ఆస్తిలో సమాన హక్కు, మహిళా సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారికి, ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు గారికి, పురందరేశ్వరి గారికి, మహిళా సంక్షేమ కమిటీ చైర్మన్ చరిత గారికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

27/09/2025

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ;
ప్రెస్ నోట్,: 27-09-25.

ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం ఉధృతంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.83 లక్షల క్యూసెక్కులు ఉందని పేర్కొన్నారు. రాత్రికి మొదటి హెచ్చరిక జారీ చేయనున్నట్లు తెలిపారు. రేపు రాత్రి లేదా ఎల్లుండికి దాదాపు రెండవ హెచ్చరిక స్ఠాయికి కృష్ణా వరద ప్రవాహం చేరే అవకాశం ఉందన్నారు.

మరోవైపు గోదావరి నది వరద భద్రాచలం వద్ద 44.5 అడుగులు ఉందని, ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 10.14 లక్షల క్యూసెక్కులు ఉందని మొదటి హెచ్చరిక కొనసాగుతుందని వెల్లడించారు. రేపు దాదాపుగా 11 నుంచి 12 లక్షల క్యూసెక్కుల వరకు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందన్నారు.

ఇప్పటికే ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేశామని, క్షేత్రస్థాయిలో అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి 24/7 అందుబాటులో ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అలెర్ట్ మేసేజ్లు పంపిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 సంప్రదించాలన్నారు. కృష్ణా, గోదావరి నదీపరీవాహక, లోతట్టు ప్రాంతప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.

ఆదివారం (28-09-2025) : ఉత్తరాంధ్ర, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బుధవారం నాటికి ఉత్తర, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు.

, ‘భారత్ గౌరవ్’ ప్రత్యేక టూరిస్ట్23 సెప్టెంబర్ 2025న, ‘భారత్ గౌరవ్’ ప్రత్యేక టూరిస్ట్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ...
08/09/2025

, ‘భారత్ గౌరవ్’ ప్రత్యేక టూరిస్ట్

23 సెప్టెంబర్ 2025న, ‘భారత్ గౌరవ్’ ప్రత్యేక టూరిస్ట్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి జ్యోతిర్లింగ (SCZBG47)తో కూడిన దివ్య దక్షిణ యాత్ర (7 రాత్రులు / 8 రోజులు) కోసం బయలుదేరుతుంది.

*తిరువణ్ణామలై:* అరుణాచలం ఆలయం
*రామేశ్వరం:* రామనాథస్వామి ఆలయం
*మధురై* : మీనాక్షి అమ్మన్ ఆలయం
*కన్యాకుమారి:* రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ టెంపుల్
*త్రివేండ్రం:* శ్రీ పద్మనాభస్వామి ఆలయం
*తిరుచ్చి:* శ్రీ రంగనాథస్వామి ఆలయం
*తంజావూరు:* బృహదీశ్వరాలయం

రైలు సికింద్రాబాద్ నుండి మధ్యాహ్నం 12:00 గంటలకు (మధ్యాహ్నం) బయలుదేరుతుంది, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది.
ఛార్జీ (ప్రతి వ్యక్తి కి):
* స్లీపర్: ₹14,100/-
* 3AC: ₹22,500/-
* 2AC: ₹29,500/-

ప్యాకేజీలో రోజుకు మూడు భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు మరియు ప్రతి కోచ్‌లో IRCTC సిబ్బంది అందుబాటులో ఉంటారు. IRCTC తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాసులను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రోత్సహిస్తుంది.

మరింత సమాచారం కోసం: సందర్శించండి: www.irctctourism.com.
కాల్: 9701360701, 9281030726, 9281030740, 9281495845.

IRCTC Tourism is Offering Affordable Online Package Booking for Encouraging Tourism in India. The Ministry of Tourism Provide Best Travel and Tour Packages. Book Now!

14/08/2025

*ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ*
స్క్రోలింగ్ 14-08-25@6AM

అల్పపీడనం ప్రభావంతో ఇవాళ చెదురుమదురుగా భారీ వర్షాలు

అల్లూరి, కోనసీమ, ఏలూరు,ఎన్టీఆర్,కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు,

గుంటూరు, బాపట్ల, పల్నాడు,ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
****

ప్రకాశం బ్యారేజ్ వద్ద పెరుగుతున్న వరద

ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.50 లక్షల క్యూసెక్కులు

కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు,లంకగ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పంట్లు,నాటుపడవలతో నదిలో ప్రయాణించవద్దు.

వరద నీటిలో ఈతకు వెళ్ళడం,చేపలు పట్టడం లాంటివి చేయరాదు.

అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయండి.

దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకోండి.

~ ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.

31/07/2025

*జర్నలిజం విలువలు పడిపోవడానికి ప్రధాన కారణాలు.!*

*ఆంధ్ర ప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (APIJA) రాష్ట్ర అధ్యక్షులు యం.రాజా*

జర్నలిజం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక మూలస్తంభం. నిజాయితీ, నిష్పక్షపాతత, ప్రజలకి సరైన సమాచారం అందించడం వంటి విలువలపై జర్నలిజం ఆధారపడి ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో జర్నలిజం విలువలు తగ్గిపోతున్నాయన్న ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. ఈ పరిస్థితికి అనేక కారణాలు ఉన్నాయి:

*కార్పొరేట్ మీడియా వలయం*

బహుళజాతి కంపెనీలు మీడియా సంస్థలను కొనుగోలు చేయడం వల్ల వార్తలు వ్యాపార ప్రయోజనాలకే కేటాయించబడుతున్నాయి. ముఖ్యంగా పత్రికలు, టీవీ ఛానల్స్ ఇప్పుడు వ్యాపార సంస్థల చేతిలో ఉండటం వలన నిజాయితీ కంటే లాభం ముఖ్యం అయ్యింది.

*రేటింగ్ (TRP) పోటీ*

న్యూస్ ఛానల్స్ ఎక్కువగా దృష్టి పెట్టింది టీవీ రేటింగ్ పాయింట్స్ (TRP) పై. దీని వల్ల ఉత్కంఠ కలిగించే కథనాలు, సెన్సేషన్, గాసిప్స్, మరియు అనాధికార వార్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా ప్రజలకు సరైన సమాచారాన్ని అందించే బాధ్యత మరుగున పడుతోంది.

*పోలిటికల్ ప్రెజర్ (రాజకీయ ఒత్తిడి)*

ప్రభుత్వాలు లేదా రాజకీయ పార్టీలు మీడియా సంస్థలపై ప్రభావం చూపిస్తూ, తమకు అనుకూలంగా వార్తలు ప్రసారం చేయిస్తుండటం జరగుతోంది. దీంతో నిజాన్ని చూపే స్థానంలో ప్రచార పద్ధతులు పెరుగుతున్నాయి.

*సోషల్ మీడియా ప్రభావం*

సోషల్ మీడియా ద్వారా వార్తలు చాలా వేగంగా వ్యాపించడంతో ఫేక్ న్యూస్ అనేది పెద్ద సమస్యగా మారింది. ట్రాఫిక్ కోసమే ఫ్యాక్ట్ చెకింగ్ లేకుండా వార్తలు ప్రచురించడం జరగుతోంది. దీనివల్ల ప్రజల్లో జర్నలిజం మీద నమ్మకం తగ్గిపోతుంది.

*జర్నలిస్టుల పై భద్రతా లోపం.*

కొన్ని దేశాల్లో లేదా పరిస్థితుల్లో నిజం వెలికి తీసే జర్నలిస్టులకు ప్రమాదం ఏర్పడుతోంది. వారిని బెదిరించడం, అరెస్టు చేయడం, లేదా హత్య చేయడం వంటి సంఘటనలు జరగడం వల్ల జర్నలిస్టులు స్వేచ్ఛగా పని చేయలేకపోతున్నారు.

*మూల్యాలపై శిక్షణ లోపం*.

కొన్ని సందర్భాల్లో జర్నలిస్టులు జర్నలిజం యొక్క అసలు విలువలు నిష్పక్షపాతత, పరిశోధనాత్మక ధోరణి, సమగ్ర సమాచారం ఇచ్చే బాధ్యత వీటిపై తగిన శిక్షణ పొందకుండా పనిచేస్తున్నారు. దీనివల్ల పాఠకులకు అసంపూర్తి, లేదా వికృత సమాచారం చేరుతుంది.

*జర్నలిజం మళ్లీ పునరుజ్జీవించాల్సిన అవసరం ఉంది.*

జర్నలిజం విలువలు పునరుద్ధరించాలంటే, మీడియా సంస్థలు తమ సామాజిక బాధ్యతను గుర్తించాలి. జర్నలిస్టులకు తగిన స్వేచ్ఛ, రక్షణ, మరియు శిక్షణ అవసరం. ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందాలంటే నిజాయితీతో కూడిన, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకున్న జర్నలిజం మళ్లీ పునరుజ్జీవించాల్సిన అవసరం ఉంది.

*రాజకీయ పరిశోధనా పాత్రికేయులు అంటే,*

రాజకీయ పరిశోధన పాత్రికేయులు అంటే సున్నితమైన, బాధ్యతతో కూడిన పాత్రను వహించేవాళ్లు. వారు ప్రజల పక్షాన నిలబడి అధికారంలో ఉన్నవారి చర్యలను ప్రశ్నించే, నిజాలు వెలికితీసే ధైర్యవంతులూ, నిష్పక్షపాతులూ కావాలి. మంచి రాజకీయ పరిశోధన పాత్రికేయుడిగా ఉండాలంటే ఈ కింద ఇచ్చిన లక్షణాలు, నైపుణ్యాలు ఉండాలి:

*ముఖ్యమైన లక్షణాలు:*

1. నిష్పక్షపాత దృక్పథం: ఎలాంటి పార్టీ పక్షపాతం లేకుండా నిజం వైపు ఉండాలి.

2. ధైర్యం: అధికారుల అవినీతి, దుర్వినియోగాలను బయటపెట్టడానికి ధైర్యంగా ముందుకు రావాలి.

3. సూక్ష్మ పరిశోధన సామర్థ్యం: డాక్యుమెంట్లు, లెక్కలు, రిపోర్టులు, ప్రకటనలు ఇవన్నింటినీ బాగా విశ్లేషించగలగాలి.

4. ప్రశ్నించే శక్తి: సాధారణంగా ఎవ్వరూ అనుమానించని విషయాల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి, ఆలోచింపజేసే ప్రశ్నలు అడగాలి.

5. వినయం, బాధ్యత: వార్తను సత్యంగా, సమగ్రంగా అందించాలే కానీ, సెన్సేషన్ కోసం కాకూడదు.

ఆంధ్ర ప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అసోసియేషన్ // (APIJA) రాష్ట్ర అధ్యక్షులు యం.రాజా

*నైపుణ్యాలు:*

డేటా జర్నలిజం పరిజ్ఞానం సర్వేలు, గణాంకాలు చదవగలగడం,

ఆర్ టి ఐ ఉపయోగించగలగడం ఆ సమాచారంతో విశ్లేషణతో కూడిన వార్త ప్రభుత్వ అధికారులకు ప్రజలకు వార్త క్లుప్తంగా అందించడం.

సమావేశాలు, ఎన్నికల ప్రచారాలను విశ్లేషించగలగడం కోర్టు, అసెంబ్లీ రికార్డులను చదవడం
రహస్య వనరులను రక్షిస్తూ సమాచారం తీసుకోవడం, నైతిక విలువలు,నిజాయితీ
బాధ్యతాయుతమైన రిపోర్టింగ్ చేయడం, ప్రజాస్వామ్యంపై నమ్మకంగా ఉండడం,
ప్రజల గొంతుకగా ఉండే తత్వం, ఈ లక్షణాలు ఉన్న వారే రాజకీయ పరిశోధన పాత్రికేయులుగా సమాజంలో గుర్తింపు పొందుతారు.

ఏసీబీ వలలో మరో  అవినీతి అధికారి..కృష్ణాజిల్లా: మచిలీపట్నం..రూ.40వేలు లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడ్డ ఆర్డీఓ సీసీ త్రినా...
31/07/2025

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి..

కృష్ణాజిల్లా: మచిలీపట్నం..

రూ.40వేలు లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడ్డ ఆర్డీఓ సీసీ త్రినాథ్..

ల్యాండ్ మ్యూటేషన్ కు సంబంధించిన ఫైల్ ని ప్రాసెస్ చేసేందుకు రూ.40వేలు డిమాండ్ చేసిన సీసీ త్రినాథ్..

లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న ఏసీబీ అధికారులు..

ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు ఆధ్వర్యంలో దాడులు.._

మొత్తం 5 లక్షలు డిమాండు..తీసుకున్న  2 లక్షల రూపాయలు....హోటల్ ను జప్తు చేయకుండా ఉండటంద్వారా హోటల్ ప్రతిష్టను దెబ్బతీయకుండ...
31/07/2025

మొత్తం 5 లక్షలు డిమాండు..

తీసుకున్న 2 లక్షల రూపాయలు....

హోటల్ ను జప్తు చేయకుండా ఉండటంద్వారా హోటల్ ప్రతిష్టను దెబ్బతీయకుండా ఉండటానికి మరియు భవిష్యత్తులో అట్టి హోటల్ వ్యాపారాన్ని సజావుగా నడిపించుకోవడానికి" అతని నుండి రూ.5,00,000/- డిమాండ్ చేసి అందులో నుండి రూ.2,00,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ ఏసిబి అధికారులకు పట్టుబడిన హైదరాబాద్‌లోని జి.హెచ్.ఎం.సి - రాజేంద్ర నగర్ పురపాలక సంఘం, ఒకటవ వలయం యొక్క డిప్యూటీ కమీషనర్ - కె.రవి కుమార్‌.

19/05/2025

భారత్ టీవీ: పెట్రోల్ బంకులు, సీఎన్జీ బంకుల్లో టాయిలెట్లు తప్పనిసరిగా ఉండాలి. తాగు నీరు సౌకర్యం కల్పించాల్సిందే. అలాగే టైర్లకు గాలి వంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉంచాలి. ఈ సదుపాయాలు కల్పించకపోతే మొదటి మూడుసార్లకు జరిమానా విధిస్తారు. ముఖ్యంగా తొలిసారి ఉల్లంఘిస్తే రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రెండో సారి అతిక్రమిస్తే రూ.25,000 ఫైన్ వేస్తారు. ఇక మూడో సారి కూడా అలాగే చేస్తే.. రూ.10 వేల జరిమానా విధిస్తారు. అలాగే 45 రోజుల పాటు అమ్మకాలు నిలిపివేస్తారు.

పెట్రోల్ పంపుల్లో ఏవేవీ ఉచితమంటే..?

1. పెట్రోల్ పంపుల్లో వాహనాల టైర్లలో గాలిని ఉచితంగా నింపుకోవచ్చు. దీని కోసం ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. డబ్బు అడిగితే వారిపై కేసు పెట్టవచ్చు.

2. పెట్రోల్ బంకుల వద్ద ఉచితంగా తాగు నీరు అందుబాటులో ఉంచాలి. ప్రతి ఒక్కరూ నీరు తాగేలా సౌకర్యం కల్పించాలి.

3. పెట్రోల్ బంకుల్లో టాయిలెట్లు సౌకర్య తప్పనిసరి. ఎవరైనా, ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. టాయిలెట్ వాడుకునేందుకు నిరాకరించే హక్కు యజమానికి కూడా లేదు.

4. అత్యవసర సమయాల్లో పెట్రోల్ బంకుల్లోని టెలిఫోన్ ద్వారా ఎవరికైనా ఉచితంగా కాల్ చేయవచ్చు. దీనికి ఎటువంటి డబ్బులు వసూలు చేసే వీలు లేదు.

5. పెట్రోల్ బంకుల్లో ప్రథమ చికిత్స కిట్ అందుబాటులో ఉంచాలి. ముఖ్యమైన మందులు, బ్యాండేజీలు ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో వాడుకునే సౌకర్యం కల్పించాలి.

జూన్ లో కైలాస మానస సరోవర యాత్ర- ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం- మే 13 ఆఖరు తేదీహిందువులు, బౌద్ధులు, జైనులు పవిత్రంగా ...
27/04/2025

జూన్ లో కైలాస మానస సరోవర యాత్ర

- ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం
- మే 13 ఆఖరు తేదీ

హిందువులు, బౌద్ధులు, జైనులు పవిత్రంగా భావించే కైలాస మానస సరోవర యాత్రను జూన్ నెలలో నిర్వహించాలని భారత్, చైనా నిర్ణయించాయి. అయిదేళ్ల విరామం అనంతరం ఈ యాత్ర మళ్లీ జరగనుంది. తొలుత కరోనా కారణంగా 2020లో ఈ యాత్రను రద్దు చేయగా, అనంతరం తూర్పు లద్దాఖ్ లో చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం కారణంగా నిలిపి వేశారు. రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించేందుకు ఈ యాత్ర నిర్వహణపై దృష్టి పెట్టారు. జూన్ నుంచి ఆగస్టు వరకు యాత్ర జరుగుతుందని విదేశీ వ్యహారాల శాఖ ప్రకటించింది. ఉత్తరాఖండ్ లోని లిపులేఖ్ పాస్, సిక్కింలోని నాథులాపాస్ మార్గాల్లో యాత్ర సాగుతుందని పేర్కొంది. దరఖాస్తులను kmy.gov.in వెబ్సైట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా యాత్రికుల ఎంపిక జరుగుతుంది.

26/04/2025

ఫేక్ న్యూస్‌ ప్రచారం పై అప్రమత్తంగా ఉండండి
- ఆంధ్రప్రదేశ్ డీజీపీ హెచ్చరిక

* పహల్గాం దాడి నేపథ్యంలో ఫేక్ న్యూస్ ప్రచారం

* “భారత ప్రభుత్వం అత్యవసర భద్రతా సలహా” పేరిట వదంతులు.

* ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలను హై-అలర్ట్ జోన్లుగా ప్రకటిస్తూ వదంతులు

* భారత ప్రభుత్వం
* లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు.

* వదంతులను నమ్మవద్దు

* వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు

* ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

- భారత్ టీవీ - అమరావతి

26/04/2025

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో మరొకరు అరెస్ట్‌. ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన సిట్‌ అధికారులు. సజ్జల శ్రీధర్‌రెడ్డిని హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తరలింపు. నేడు ఏసీబీ కోర్టులో శ్రీధర్‌రెడ్డిని హజరు పరచనున్న సిట్‌.

- "భారత్ టీవీ" న్యూస్

Address

HYDERABAD/. TELANGANA
Hyderabad
500072

Alerts

Be the first to know and let us send you an email when BHARAT TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to BHARAT TV:

Share