
27/09/2025
*స్త్రీ సాధికారతే సమాజ పురోగతి – ఎమ్మెల్యే గళ్ళా మాధవి*
*అసెంబ్లీలో మహిళా సాధికారత గురించి జరిగిన చర్చలో ప్రసంగించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి*
స్త్రీ సాధికారతే సమాజ పురోగతి అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. తిరుపతిలో సెప్టెంబర్ 14, 15 తేదీల్లో జరిగిన జాతీయ మహిళా సాధికారిత సదస్సు గురించి శనివారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొని,ప్రసంగించారు.
*అసెంబ్లీలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ.....*
“సమాజ పురోగతి, దేశ అభ్యున్నతి అనేవి ఆ దేశంలోని స్త్రీల స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి. బాధ్యత గల ప్రభుత్వాలు ఎప్పుడూ స్త్రీ సాధికారతను విస్మరించవు. ఈ క్రమంలోనే దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా సాధికారతపై ఇంత పెద్ద కాన్ఫరెన్స్ మన రాష్ట్రంలో జరగడం సంతోషకరమే కాక గర్వకారణం కూడా” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు
మహిళల అభ్యున్నతి, జెండర్ సెన్సిటివ్ పాలసీలు, జెండర్ బడ్జెటింగ్, స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ల వంటి అంశాలపై రెండు రోజుల పాటు అనేక రాష్ట్రాల మహిళా నాయకులు విలువైన సూచనలు ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రస్తావించారు. “ఇంతమంది ప్రతిభావంతులైన మహిళా నేతలను ఒకే వేదికపై కలుసుకునే అవకాశం కల్పించినందుకు గౌరవ స్పీకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు” తెలిపారు .
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల పట్ల తీసుకుంటున్న నిర్ణయాలు, సంక్షేమ పథకాలు దేశంలోనే ఉన్నత స్థాయిలో ఉన్నాయని గళ్ళా మాధవి తెలిపారు. ఆడవారికి ఆస్తిలో సమాన హక్కు, మహిళా సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారికి, ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు గారికి, పురందరేశ్వరి గారికి, మహిళా సంక్షేమ కమిటీ చైర్మన్ చరిత గారికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.