BHARAT TV

BHARAT TV Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BHARAT TV, Broadcasting & media production company, HYDERABAD/. TELANGANA, Hyderabad.

19/05/2025

భారత్ టీవీ: పెట్రోల్ బంకులు, సీఎన్జీ బంకుల్లో టాయిలెట్లు తప్పనిసరిగా ఉండాలి. తాగు నీరు సౌకర్యం కల్పించాల్సిందే. అలాగే టైర్లకు గాలి వంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉంచాలి. ఈ సదుపాయాలు కల్పించకపోతే మొదటి మూడుసార్లకు జరిమానా విధిస్తారు. ముఖ్యంగా తొలిసారి ఉల్లంఘిస్తే రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రెండో సారి అతిక్రమిస్తే రూ.25,000 ఫైన్ వేస్తారు. ఇక మూడో సారి కూడా అలాగే చేస్తే.. రూ.10 వేల జరిమానా విధిస్తారు. అలాగే 45 రోజుల పాటు అమ్మకాలు నిలిపివేస్తారు.

పెట్రోల్ పంపుల్లో ఏవేవీ ఉచితమంటే..?

1. పెట్రోల్ పంపుల్లో వాహనాల టైర్లలో గాలిని ఉచితంగా నింపుకోవచ్చు. దీని కోసం ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. డబ్బు అడిగితే వారిపై కేసు పెట్టవచ్చు.

2. పెట్రోల్ బంకుల వద్ద ఉచితంగా తాగు నీరు అందుబాటులో ఉంచాలి. ప్రతి ఒక్కరూ నీరు తాగేలా సౌకర్యం కల్పించాలి.

3. పెట్రోల్ బంకుల్లో టాయిలెట్లు సౌకర్య తప్పనిసరి. ఎవరైనా, ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. టాయిలెట్ వాడుకునేందుకు నిరాకరించే హక్కు యజమానికి కూడా లేదు.

4. అత్యవసర సమయాల్లో పెట్రోల్ బంకుల్లోని టెలిఫోన్ ద్వారా ఎవరికైనా ఉచితంగా కాల్ చేయవచ్చు. దీనికి ఎటువంటి డబ్బులు వసూలు చేసే వీలు లేదు.

5. పెట్రోల్ బంకుల్లో ప్రథమ చికిత్స కిట్ అందుబాటులో ఉంచాలి. ముఖ్యమైన మందులు, బ్యాండేజీలు ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో వాడుకునే సౌకర్యం కల్పించాలి.

జూన్ లో కైలాస మానస సరోవర యాత్ర- ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం- మే 13 ఆఖరు తేదీహిందువులు, బౌద్ధులు, జైనులు పవిత్రంగా ...
27/04/2025

జూన్ లో కైలాస మానస సరోవర యాత్ర

- ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం
- మే 13 ఆఖరు తేదీ

హిందువులు, బౌద్ధులు, జైనులు పవిత్రంగా భావించే కైలాస మానస సరోవర యాత్రను జూన్ నెలలో నిర్వహించాలని భారత్, చైనా నిర్ణయించాయి. అయిదేళ్ల విరామం అనంతరం ఈ యాత్ర మళ్లీ జరగనుంది. తొలుత కరోనా కారణంగా 2020లో ఈ యాత్రను రద్దు చేయగా, అనంతరం తూర్పు లద్దాఖ్ లో చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం కారణంగా నిలిపి వేశారు. రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించేందుకు ఈ యాత్ర నిర్వహణపై దృష్టి పెట్టారు. జూన్ నుంచి ఆగస్టు వరకు యాత్ర జరుగుతుందని విదేశీ వ్యహారాల శాఖ ప్రకటించింది. ఉత్తరాఖండ్ లోని లిపులేఖ్ పాస్, సిక్కింలోని నాథులాపాస్ మార్గాల్లో యాత్ర సాగుతుందని పేర్కొంది. దరఖాస్తులను kmy.gov.in వెబ్సైట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా యాత్రికుల ఎంపిక జరుగుతుంది.

26/04/2025

ఫేక్ న్యూస్‌ ప్రచారం పై అప్రమత్తంగా ఉండండి
- ఆంధ్రప్రదేశ్ డీజీపీ హెచ్చరిక

* పహల్గాం దాడి నేపథ్యంలో ఫేక్ న్యూస్ ప్రచారం

* “భారత ప్రభుత్వం అత్యవసర భద్రతా సలహా” పేరిట వదంతులు.

* ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలను హై-అలర్ట్ జోన్లుగా ప్రకటిస్తూ వదంతులు

* భారత ప్రభుత్వం
* లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు.

* వదంతులను నమ్మవద్దు

* వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు

* ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

- భారత్ టీవీ - అమరావతి

26/04/2025

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో మరొకరు అరెస్ట్‌. ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన సిట్‌ అధికారులు. సజ్జల శ్రీధర్‌రెడ్డిని హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తరలింపు. నేడు ఏసీబీ కోర్టులో శ్రీధర్‌రెడ్డిని హజరు పరచనున్న సిట్‌.

- "భారత్ టీవీ" న్యూస్

ఏపీలో జిల్లాల వారీగా పదోతరగతి ఫలితాల పర్సంటేజి వివరాలివే..- ఏపీలో పదోతరగతి ఫలితాలు విడుదల- మే 19 నుంచి 28 వరకు ఫెయిల్ అయ...
26/04/2025

ఏపీలో జిల్లాల వారీగా పదోతరగతి ఫలితాల పర్సంటేజి వివరాలివే..

- ఏపీలో పదోతరగతి ఫలితాలు విడుదల

- మే 19 నుంచి 28 వరకు ఫెయిల్ అయినవారికి సప్లిమెంటరీ పరీక్షలు.

- ఉత్తీర్ణత సాధించిన 4,98,585 మంది విద్యార్థులు.

- 81.14శాతం మంది విద్యార్థుల ఉత్తీర్ణత.

- పరీక్షలకు హాజరైన 6,14,459 మంది విద్యార్థులు.

- 100శాతం ఫలితాలు సాధించిన 1680 పాఠశాలలు.

22/04/2025
డిఎస్సీ 2025, ఆయా జిల్లాల వారీగా ఖాళీల వివరాలు..
22/04/2025

డిఎస్సీ 2025, ఆయా జిల్లాల వారీగా ఖాళీల వివరాలు..

ప్రధాని  గారు తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టంతో వెనుకబడిన ముస్లిం వర్గాలు అభ్యున్నతి సాధిస్తాయి. వక్ఫ్ బోర్డుకు ప్రాతినిథ్య...
21/04/2025

ప్రధాని గారు తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టంతో వెనుకబడిన ముస్లిం వర్గాలు అభ్యున్నతి సాధిస్తాయి. వక్ఫ్ బోర్డుకు ప్రాతినిథ్యం వహిస్తాయి.

ప్రధాని  గారు తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టంతో వెనుకబడిన ముస్లిం వర్గాలు అభ్యున్నతి సాధిస్తాయి. వక్ఫ్ బోర్డుకు ప్రాతినిథ్య...
21/04/2025

ప్రధాని గారు తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టంతో వెనుకబడిన ముస్లిం వర్గాలు అభ్యున్నతి సాధిస్తాయి. వక్ఫ్ బోర్డుకు ప్రాతినిథ్యం వహిస్తాయి.

భారత్ టీవీ: విశాఖపట్నం*_ఏసీబీ వలలో  జీవీఎంసీ ఉద్యోగులు** లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంట్రీ ఆపరేటర్, అవుట్ సోర్సింగ్ ...
07/04/2025

భారత్ టీవీ: విశాఖపట్నం

*_ఏసీబీ వలలో జీవీఎంసీ ఉద్యోగులు*

* లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంట్రీ ఆపరేటర్, అవుట్ సోర్సింగ్ సూపర్వైజర్..

* *_విశాఖ:_*

* విశాఖ జ్ఞానాపురం జీవీఎంసీ కార్యాలయంలో ఏసీబీ దాడులు..

* 20వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు చిక్కిన డేటా ఎంట్రీ ఆపరేటర్ చంద్రశేఖర్ , అవుట్ సోర్సింగ్ సూపర్వైజర్ వెంకటరమణ..

* మరణ ధ్రువీకరణ పత్రానికి 40 వేలు డిమాండ్..

* 20వేలు ఒప్పందం కుదుర్చుకొని లంచం తీసుకుంటుండగా పట్టుబడిన సిబ్బంది..

* జీవిఎంసీ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ బృందం..

Address

HYDERABAD/. TELANGANA
Hyderabad
500072

Alerts

Be the first to know and let us send you an email when BHARAT TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to BHARAT TV:

Share