19/05/2025
భారత్ టీవీ: పెట్రోల్ బంకులు, సీఎన్జీ బంకుల్లో టాయిలెట్లు తప్పనిసరిగా ఉండాలి. తాగు నీరు సౌకర్యం కల్పించాల్సిందే. అలాగే టైర్లకు గాలి వంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉంచాలి. ఈ సదుపాయాలు కల్పించకపోతే మొదటి మూడుసార్లకు జరిమానా విధిస్తారు. ముఖ్యంగా తొలిసారి ఉల్లంఘిస్తే రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రెండో సారి అతిక్రమిస్తే రూ.25,000 ఫైన్ వేస్తారు. ఇక మూడో సారి కూడా అలాగే చేస్తే.. రూ.10 వేల జరిమానా విధిస్తారు. అలాగే 45 రోజుల పాటు అమ్మకాలు నిలిపివేస్తారు.
పెట్రోల్ పంపుల్లో ఏవేవీ ఉచితమంటే..?
1. పెట్రోల్ పంపుల్లో వాహనాల టైర్లలో గాలిని ఉచితంగా నింపుకోవచ్చు. దీని కోసం ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. డబ్బు అడిగితే వారిపై కేసు పెట్టవచ్చు.
2. పెట్రోల్ బంకుల వద్ద ఉచితంగా తాగు నీరు అందుబాటులో ఉంచాలి. ప్రతి ఒక్కరూ నీరు తాగేలా సౌకర్యం కల్పించాలి.
3. పెట్రోల్ బంకుల్లో టాయిలెట్లు సౌకర్య తప్పనిసరి. ఎవరైనా, ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. టాయిలెట్ వాడుకునేందుకు నిరాకరించే హక్కు యజమానికి కూడా లేదు.
4. అత్యవసర సమయాల్లో పెట్రోల్ బంకుల్లోని టెలిఫోన్ ద్వారా ఎవరికైనా ఉచితంగా కాల్ చేయవచ్చు. దీనికి ఎటువంటి డబ్బులు వసూలు చేసే వీలు లేదు.
5. పెట్రోల్ బంకుల్లో ప్రథమ చికిత్స కిట్ అందుబాటులో ఉంచాలి. ముఖ్యమైన మందులు, బ్యాండేజీలు ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో వాడుకునే సౌకర్యం కల్పించాలి.