24/04/2026
బిగ్ బ్రేకింగ్-సంచనలం!
-------------------------
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభలో ఆప్ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా సంచలన ప్రకటన చేశారు. అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ లతో కలిసి ఆయన బీజేపీలో చేరారు. "రాజ్యసభలో ఆప్ కు చెందిన మూడింట రెండు వంతుల మంది సభ్యులు భారత రాజ్యాంగం ప్రకారం బిజెపిలో విలీనం కావాలని నిర్ణయించుకున్నాము" అని ఆయన తెలిపారు. ఆయన పార్టీ సహచరులు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
`రాజ్యసభలో ఆప్ కు 10 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో 2/3 వంతు మందికి పైగా మాతో ఉన్నారు. ఈ మేరకు సంతకం చేసిన లేఖను, ఇతర పత్రాలను రాజ్యసభ చైర్మన్ కు సమర్పించాము. మాతో పాటు హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ, స్వాతి మాలివాల్ కూడా ఉన్నారు.` అని తెలిపారు.
గతంలో చద్దా స్థానంలో రాజ్యసభ డిప్యూటీ లీడర్ గా మిట్టల్ నియమితులైన విషయం తెలిసిందే. ఇప్పుడు చద్దాతోపాటు మిట్టల్ బీజేపీ గూటికి చేరడం గమనార్హం.
బిగ్ బ్రేకింగ్-సంచనలం!
-------------------------
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభలో ఆప్ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా సంచలన ప్రకటన చేశారు. అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ లతో కలిసి ఆయన బీజేపీలో చేరారు. "రాజ్యసభలో ఆప్ కు చెందిన మూడింట రెండు వంతుల మంది సభ్యులు భారత రాజ్యాంగం ప్రకారం బిజెపిలో విలీనం కావాలని నిర్ణయించుకున్నాము" అని ఆయన తెలిపారు. ఆయన పార్టీ సహచరులు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
`రాజ్యసభలో ఆప్ కు 10 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో 2/3 వంతు మందికి పైగా మాతో ఉన్నారు. ఈ మేరకు సంతకం చేసిన లేఖను, ఇతర పత్రాలను రాజ్యసభ చైర్మన్ కు సమర్పించాము. మాతో పాటు హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ, స్వాతి మాలివాల్ కూడా ఉన్నారు.` అని తెలిపారు. కేజ్రీవాల్తో అంటీముట్టనట్టు ఉంటున్న చద్దాను గతంలో రాజ్యసభ డిప్యూటీ లీడర్ గా తొలగించి ఆయన స్థానంలో మిట్టల్ నియమితులైన విషయం తెలిసిందే. ఇప్పుడు చద్దాతోపాటు మిట్టల్ బీజేపీ గూటికి చేరడం గమనార్హం.