Shoban Mood

Shoban Mood Shoban Tribal Students’ federation was formed through its First Conference which was held at Miryalaguda between October 1st in the year 2015.

09/06/2024

అరిబడి లక్ష్మీ నారాయణ 6 వ స్మారకోపన్యాసం మారుతున్న వాతావరణంలో సాగు యాజమాన్యం డాక్టర్ సి హిచ్ శ్రీనివాస రావు

15/09/2023

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం - మహిళల పాత్ర
వెబినార్ I బత్తుల హైమావతి, ఐద్వా సీనియర్ నాయకురాలు Iనిర్వహణ : తెలంగాణ రైతు సంఘం - రాష్ట్ర కమిటి

07/08/2023
My Article published in Namasthe Telangana newspaperఆహార భద్రతకు బడ్జెట్‌ పద్దుల భయం2023- 24 ఆర్థిక సంవత్సరం కోసం కేంద్ర...
03/02/2023

My Article published in Namasthe Telangana newspaper

ఆహార భద్రతకు బడ్జెట్‌ పద్దుల భయం

2023- 24 ఆర్థిక సంవత్సరం కోసం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కార్పొరేట్‌ కుబేరులు, సంపన్నుల కోరిక మేరకు రూపొందించినట్టుగా స్పష్టమవుతున్నది. ఈ బడ్జెట్‌ రైతులు, పేదలు, కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్‌ కేటాయింపులు తక్కువగా ఉన్నాయి. ఎం.ఎస్‌.స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల ప్రకారం… కనీస మద్దతు ధరలను (ఎంఎస్‌పీ) అమలు చేయడానికి కేంద్రం నిరాకరించింది. రైతుల కష్టాలను తగ్గించడం కోసం ఎంఎస్‌పీకి చట్టపరమైన హామీని నిలబెట్టుకోలేదు. కార్పొరేట్‌ అనుకూల మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు పోరాటం చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమం కారణంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర అవమానానికి గురైంది. దానికి ప్రతీకారంగా గ్రామీణ ఉపాధి హామీ, ఆహారభద్రత, ఎరువుల సబ్సిడీ మొదలైన వాటిపై భారీగా కోత విధించినట్టుగా కేంద్ర బడ్జెట్‌ ప్రతిని చూస్తే అర్థమవుతున్నది.

2022- 23 బడ్జెట్‌లో కేంద్రం వ్యవసాయం కోసం రూ.1,24,000 (అంచనా) కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం 1,15,531.79 కోట్లు కేటాయించింది. ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’కి గత ఏడాది కేటాయించిన బడ్జెట్‌తో పోలిస్తే ఈ ఏడాది కేటాయింపులు పెంచలేదు. ఈ పథకం కోసం రూ.60,000 కోట్లు కేటాయింపులు చేసింది. దాదాపు 12 కోట్ల మంది లబ్ధిదారులకు ‘కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ అందుతుందంటూ కేంద్రం చేసే వాదనలను పరిగణనలోకి తీసుకున్నా… రూ.72,000 కోట్లు కేటాయించాలి. కానీ కేంద్రం అలా చేయలేదు. ‘ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన’పై కూడా 2022-23 బడ్జెట్‌ రూ.15,500 (అంచనా) కోట్లతో పోలిస్తే ఈ బడ్జెట్‌లో రూ.13,625 కోట్లు మాత్రమే కేటాయించింది.

‘హరిత విప్లవం’ పథకాన్ని కేంద్రం ఇంతకుముందు కోర్‌ స్కీమ్‌గా ప్రచారం చేసింది. అందుకోసమే 2021-22 బడ్జెట్‌లో రూ.6,747 కోట్లు కేటాయించింది. కానీ, ప్రస్తుత బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు జరపలేదు. 2022-23కి గాను ఎరువుల సబ్సిడీలలో రూ.2,25,000 (అంచనా) కోట్లు కేటాయించింది. 2023-24 బడ్జెట్‌లో రూ.1,75,000 (అంచనా) కోట్లు కేటాయించింది. అంటే రూ.50 వేల కోట్లతో 22 శాతం కోత విధించింది. ఇలాంటి చర్య ఆహారధాన్యాల ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ బడ్జెట్‌లో సేంద్రియ వ్యవసాయానికి రూ.459 కోట్లు కేటాయింపులు చేసింది. ఇది మొక్కుబడి మాత్రమే. గత బడ్జెట్‌లో ‘రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన’కు రూ.10,433 కోట్లు కేటాయించిన కేంద్రం ఈ యేడు రూ.7,150 కోట్లు కేటాయించి భారీగా కోత విధించింది. 2022-23 బడ్జెట్‌లో ‘ప్రధానమంత్రి కిసాన్‌ సంచార్‌ యోజన’ కోసం రూ.12,954 కోట్లుగా ఉన్న కేటాయింపులు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.10,787 కోట్లకు తగ్గాయి. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌, ప్రైస్‌ సపోర్ట్‌ స్కీమ్‌ కోసం గత బడ్జెట్‌ 2022-23లో రూ.1500 కోట్లు కేటాయిస్తే.. 2023-24 బడ్జెట్‌లో కనీసం ఆ ప్రస్తావనే లేదు.

2022-23లో గ్రామీణ ఉపాధి కోసం రూ.1,53,525.41 కోట్లు (సవరించిన అంచనాల్లో)గా ఉన్న కేటాయింపులు 2023-24లో బడ్జెట్‌ అంచనాల్లో రూ.1,01,474.51 కోట్లకు భారీగా తగ్గించబడ్డాయి. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కోసం కేటాయింపులు 2022-23 రూ.89,000 కోట్ల (సవరించిన అంచనాల్లో) నుంచి 2023-24 బడ్జెట్‌ అంచనాల్లో రూ.60,000 కోట్లకు తగ్గించబడ్డాయి. చట్టబద్ధంగా హామీ ఇచ్చిన 100 రోజుల ఉపాధిని కల్పించాలని ప్రభుత్వం భావిస్తే 2.72 లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసిన తరుణం ఇది. ఈ బడ్జెట్‌ కేటాయింపులు దాని సొంత ఆర్థిక సర్వేను విస్మరించాయి. ఇది గ్రామీణ ఉపాధి పథకం కింద ఇప్పటికీ మహమ్మారి ముందుకాలం కంటే ఎక్కువగా డిమాండ్‌ ఉందని చూపింది. ఇది గ్రామీణ కష్టాలను సూచిస్తుంది. కీలకమైన పథకం కింద నిధుల కేటాయింపులు సరిపోకపోవడంపై నిరంతర నివేదికలు వచ్చాయి. ఇది చెల్లింపులు ఆలస్యం కావడానికి, రాష్ట్రవ్యాప్తంగా పను లను నిలిపివేసేందుకు దారితీసింది. తద్వారా అందుబాటులో ఉన్న ఉపాధి రోజులను దూరం చేసింది. ఈ ఏడాది బడ్జెట్‌ దేశంలోని గ్రామీణ పేదల పట్ల ప్రభుత్వ ఉదాసీనతను ప్రతిబింబిస్తున్నది. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన’కు కేటాయింపులు కూడా రూ.5,7 58 కోట్ల నుంచి రూ.2,273 కోట్లకు తగ్గాయి. ఏటా 2 కోట్ల మందికి ఉపాధి కల్పించాలన్న మాటలన్నీ సునాయాసంగా మర్చిపోయారు.

ఆహార సబ్సిడీ బిల్లులో అతి పెద్ద పతనం కనిపించింది. 2022-23లో రూ.2,87,194 కోట్ల నుంచి 2023-24లో రూ.1,97,350 కోట్లకు (31 శాతం) తగ్గించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆహారధాన్యాలకు, వికేంద్రీకృత సేకరణకు బడ్జెట్‌ కేటాయింపులు 2022-23లో రూ.72,282.50 కోట్ల నుంచి రూ.59,793.00 కోట్లకు తగ్గించింది. దాదాపు రూ.12,500 కోట్లు (17 శాతానికి) తగ్గాయి. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు ఆహార సబ్సిడీ కేటాయింపును భారీగా తగ్గించారు. 1,45,920 కోట్ల నుంచి రూ.1,37,207 కోట్లకు తగ్గించారు. ద్రవ్యోల్బణ ధోరణులను పూర్తిగా తగ్గించలేనప్పుడు ఈ చర్యలు రైతుల ఆదాయాల పరంగానే కాకుండా భారతదేశ ఆహారభద్రతపై కూడా ఆందోళన కలిగిస్తాయి. 2022-23లో రూ.500 కోట్లు కేటాయించారు. కానీ సవరించిన అంచనాల్లో రూ.150 కోట్లకు తగ్గించారు. వ్యవసాయం కోసం డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ చర్చ రైతులకు కాకుండా కార్పొరేట్‌ కంపెనీలకు సహాయం చేయడానికి కూడా ఉద్దేశించబడింది.

‘అమృత్‌ కాల్‌’ గురించిన చర్చలన్నీ బూటకమైనవి. భారతదేశంలోని ఆహార ఉత్పత్తిదారులకు, కార్మిక ప్రజానీకానికి, పేదలకు గణనీయమైన ఉపశమనం లభించలేదు. అసలు కేటాయింపులను ఒకసారి పరిశీలిస్తే ఆర్థికమంత్రి ప్రసంగంలో చేసిన వాదనలు అవాస్తవాలుగా బయటపడుతాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చివరి బడ్జెట్‌ సారాంశం ఏమంటే.. ప్రజా వ్యతిరేక, రైతు, కార్మిక అనుకూల విధానాలను విస్మరించారనేది వాస్తవం.

ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రతపరంగా బడ్జెట్‌లో ప్రజలకు ఎలాంటి ఉపశమనం జరగలేదు. మైనారిటీల అభివృద్ధికి నిధులను రూ.1,810 కోట్ల నుంచి రూ.610 కోట్లకు తగ్గించడం ద్వారా బీజేపీ ప్రభుత్వం తన మతతత్వ స్వభావాన్ని మరోసారి బయటపెట్టుకున్నది.

(వ్యాసకర్త: తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి)
-మూడ్‌ శోభన్‌
99497 25951

01/02/2023

#కేంద్ర #బడ్జెట్‌ #2023-24
#రైతులు, #పేదలు, #కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధం
✍️ మూడ్‌ శోభన్‌, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, 9949725951

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించిన కేంద్ర బడ్జెట్‌ 2023-24 సంపన్నుల కోసం బడ్జెట్‌, కార్పొరేట్‌ కుబేరుల కోరిక మేరకు తయారు చేయబడింది. ఇది రైతులు, పేదలు, కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధం. వ్యవసాయం, గ్రామీణాభివ ద్ధికి కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయి. ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సి2+50శాతం సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధరలను అమలు చేయడానికి బిజెపి ప్రభుత్వం నిరాకరించింది. రైతుల కష్టాలను తగ్గించడం కోసం ఎంఎస్‌పికి చట్టపరమైన హామీని నిలబేట్టుకోలేదు. 3 కార్పొరేట్‌ అనుకూల వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని పోరాటం చేసిన చారిత్రాత్మక ఐక్య రైతు ఉద్యమం చేతిలో ఎదురైన అవమానంపై బిజెపి ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటుంది. గ్రామీణ ఉపాధి, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ, ఆహార భద్రత, ఎరువుల సబ్సిడీ మొదలైన వాటిపై భారీగా కోత విధించారు.
ఈ బడ్జెట్‌ రైతుల్లో విశ్వాసాన్ని కలిగించలేకపోయింది. ఇందులో రైతాంగం, కార్మికుల ఆదాయాలు పెంచేందుకు ఏమీ లేదు.

🔥 వ్యవసాయం కోసం బడ్జెట్‌ అంచనా 2022-23లో 1,24,000 కోట్ల నుండి ఈ సంవత్సరం 1,15,531.79 కోట్లకు గణనీయంగా తగ్గించబడింది.

🔥 ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి గత ఏడాదితో పోలిస్తే పెరగలేదు. కేటాయింపు రూ.60,000 కోట్లు. దాదాపు 12 కోట్ల మంది లబ్ధిదారులకు సంబంధించిన ప్రభుత్వ వాదనను తీసుకుంటే కనీసం రూ.72,000 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది.

🔥 ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజనపై కూడా 2022-23 బడ్జెట్‌ అంచనాలు రూ.15,500 కోట్లతో పోలిస్తే ఈ బడ్జెట్‌ రూ.13625 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇంతకుముందు కోర్‌ స్కీమ్‌గా ప్రచారం చేయబడి, 2021-22లో రూ.6,747 కోట్లు కేటాయించిన హరిత విప్లవానికి గత, ప్రస్తుత బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేవు.

🔥 ఎరువుల సబ్సిడీలలో 2022-23 సవరించిన అంచనాలలో రూ.2,25,000 కోట్ల నుండి 2023-24 బడ్జెట్‌ అంచనాలలో రూ.1,75,000 కోట్లకు, రూ.50,000 కోట్లతో 22 శాతం కోత విధించబడింది.

🔥 ఈ ఏడాది సేంద్రీయ వ్యవసాయానికి 459 కోట్ల రూపాయల కేటాయింపు అంతంత మాత్రమే. రాష్ట్రీయ క షి వికాస్‌ యోజనకు కేటాయింపులు రూ.10,433 కోట్ల నుంచి రూ.7,150 కోట్లకు భారీగా తగ్గాయి.

🔥 ప్రధాన మంత్రి కిసాన్‌ సించారు యోజన కోసం 2022-23 లో రూ.12,954 కోట్లుగా ఉన్న కేటాయింపులు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.10,787 కోట్లకు తగ్గించబడ్డాయి. 2022-23 సవరించిన అంచనాలలో రూ.1500 కోట్లుగా ఉన్న మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌, ప్రైస్‌ సపోర్టు స్కీమ్‌ కోసం కేటాయింపులు 2023-24 బడ్జెట్‌లో ప్రస్తావించబడలేదు.

🔥 2022-23 సవరించిన అంచనాలలో గ్రామీణ ఉపాధి కోసం రూ.1,53,525.41 కోట్లుగా ఉన్న కేటాయింపులు 2023-24 బడ్జెట్‌ అంచనాలలో రూ.1,01,474.51 కోట్లకు భారీగా తగ్గించబడ్డాయి.

🔥 ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కోసం కేటాయింపులు 2022-23 సవరించిన అంచనాలో రూ.89,000 కోట్ల నుండి 2023-24 బడ్జెట్‌ అంచనాలలో కేవలం రూ.60,000 కోట్లకు తగ్గించబడ్డాయి. చట్టబద్ధంగా హామీ ఇచ్చిన 100 రోజుల ఉపాధిని కల్పించాలని ప్రభుత్వం భావిస్తే 2.72 లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా.

🔥 ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజనకు కేటాయింపులు రూ.5758 కోట్ల నుంచి రూ.2273 కోట్లకు తగ్గాయి. ప్రతి ఏటా 2 కోట్ల మందికి ఉపాధి కల్పించాలన్న మాటలన్నీ సునాయాసంగా మర్చిపోయారు.

🔥 ఆహార సబ్సిడీ 2022-23 లో 2,87,194 కోట్ల నుండి 2023-24 లో 1,97,350 కోట్లకు, 31 శాతం భారీ తగ్గించారు.

🔥 జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆహారధాన్యాలకు వికేంద్రీక త సేకరణకు బడ్జెట్‌ కేటాయింపులు (2022-23)లో 72,282.50 కోట్ల నుండి ఈ సంవత్సరంలో కేవలం 59,793.00 కోట్లకు తగ్గించబడ్డాయి, దాదాపు 12500 కోట్లు (17 శాతానికి) తగ్గాయి.

🔥 ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు ఆహార సబ్సిడీ కేటాయింపును 1,45,920 కోట్ల నుంచి రూ.1,37,207 కోట్లకు (రూ.8,713 కోట్లు) భారీగా తగ్గించారు. ద్రవ్యోల్బణ ధోరణులను పూర్తిగా తగ్గించలేనప్పుడు ఈ చర్యలు రైతుల ఆదాయాల పరంగానే కాకుండా భారతదేశ ఆహార భద్రతపై కూడా ఆందోళన కలిగిస్తాయి.

🔥 సహకార సంఘాలను కేంద్రీకరించడానికి, యూనియన్‌ ప్రభుత్వం నియంత్రణ సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల హక్కులకు విరుద్ధం.

🔥 అగ్రి స్టార్టప్‌లు, వికేంద్రీక త కోల్డ్‌ స్టోరేజీలను ప్రోత్సహించడానికి అగ్రికల్చర్‌ యాక్సిలరేటర్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయడం గురించి పెద్ద వాదనలు సాధారణ వాక్చాతుర్యంలో భాగంగా ఉన్నాయి. ఇది కూడా చాలా ఆర్భాటంగా ప్రకటించబడిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధికి కూడా అదే విధిని అందజేసే అవకాశం ఉంది. 2022-23లో 500 కోట్లు కేటాయించారు. కానీ సవరించిన అంచనాల్లో 150 కోట్లకు తగ్గించారు.

🔥 వ్యవసాయం కోసం డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ యొక్క చర్చ రైతులకు కాకుండా కార్పొరేట్‌ కంపెనీలకు సహాయం చేయడానికి ఉద్దేశించబడింది.

🔥 అమ త్‌ కల్‌ గురించిన చర్చలన్నీ బూటకమైనవి.

🔥 భారతదేశంలోని ఆహార ఉత్పత్తిదారులకు, కార్మిక ప్రజానీకానికి, పేదలకు గణనీయమైన ఉపశమనం అందించబడలేదు.

🔥 అసలు కేటాయింపులను ఒకసారి పరిశీలిస్తే ఆర్థిక మంత్రి ప్రసంగంలో చేసిన వాదనలు అబద్ధాలు

🔥 ఈ ప్రభుత్వ చివరి పూర్తి బడ్జెట్‌ తన ప్రజా వ్యతిరేక, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను విస్మరించారని చెప్పడానికి ఏ మాత్రం సందేహం లేదు.

🔥 మైనారిటీల అభివ ద్ధికి గొడుగు కార్యక్రమం కోసం రూ.1200 కోట్ల కేటాయింపులను రూ.1810 కోట్ల నుంచి రూ.610 కోట్లకు తగ్గించడం ద్వారా బీజేపీ ప్రభుత్వం తన మతతత్వ స్వభావాన్ని బయటపెట్టింది.

*అవే విధానాలతో ఆదాయమెలా రెట్టింపవుతుంది?* ప్రధాని మోదీ 2018 ఫిబ్రవరి 3న ఒకసారి, 2019 జూన్‌ 10న మరోసారి, 2022 నాటికి ‘రైత...
22/07/2022

*అవే విధానాలతో ఆదాయమెలా రెట్టింపవుతుంది?*

ప్రధాని మోదీ 2018 ఫిబ్రవరి 3న ఒకసారి, 2019 జూన్‌ 10న మరోసారి, 2022 నాటికి ‘రైతుల ఆదాయం రెట్టింపు’ చేస్తానని ప్రకటించారు. ఆ సంవత్సరం వచ్చి సగం పూర్తయింది. రెట్టింపు ఆదాయం సూచనలేమీ లేవు. ప్రధాని ప్రకటన తరువాత మార్కెట్‌లో దళారీలు మరింత బలపడ్డారు. లక్షల కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నారు. ఉత్పాదకత పెంచడం, గిట్టుబాటు ధర, మంచి ఉపకరణాలు, ఇరిగేషన్‌ సౌకర్యం, విత్తన బదలాయింపు, తగినంత ఎరువుల వాడకం... నూతన టెక్నాలజీ వినియోగం ఆదాయం రెట్టింపునకు తోడ్పడతాయని వాటిని అందుబాటులోకి తెస్తానని పదేపదే మోదీ చెప్పారు. ఏదీ నెరవేర లేదు.

ఉత్పాదకత పెంచాలంటే విత్తనాలపై పరిశోధనలు జరపాలి. గత నాలుగేళ్లుగా ప్రభుత్వ రంగంలోని పరిశోధనలను మూసివేశారు. విదేశాల నుంచి విత్తన టెక్నాలజీని దిగుమతి చేసుకుంటున్నారు. మంచి ఉపకరణాలకు బదులు నాణ్యత లేనివి, కల్తీ ఉన్నవి ఎక్కువ ధరలకు రైతులకు అంటగడుతున్నారు. వాటి వలన పంటల దిగుబడి తగ్గి, ఆదాయం పడిపోయింది. విత్తన బదలాయింపు పథకం అటకెక్కింది. ఉపకరణాల ధరలు ప్రధాని ప్రకటించిన తరువాత నేటికి రెట్టింపు పెరిగాయి. ఇరిగేషన్‌ సౌకర్యం కల్పనకు నిర్దేశించిన ‘ప్రధాని క్రిషి సంచాయి యోజన’ పథకాన్ని 2021–22 నుంచి కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అంతకుముందు దేశం మొత్తానికి రూ. 4000కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ నిధులతో ఎన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి? తగినంత ఎరువులు వాడాలంటే ధరలు అందుబాటులో ఉండాలి. అన్ని ఎరువుల ధరలు 25 నుంచి 50 శాతం పెరిగాయి. బ్లాక్‌ మార్కెట్టులో ఎరువులు అమ్ముతున్నారు. కాంప్లెక్స్ ఎరువులలో 50 శాతం కల్తీ ఎరువులే అమ్ముతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా 60 శాతం పెరగడంతో ప్రతి ఎకరాపై రైతుకు రూ.2500– 3000 అదనపు భారం పడింది. ఉన్న ఆదాయానికి విత్తనాలు, ఎరువులు, డీజిల్‌ ధరల పెరుగుదల గండి కొట్టింది. నూతన టెక్నాలజీ వినియోగం రైతులకు అందుబాటులో లేకుండా పోయింది. కాలం చెల్లిన టెక్నాలజీలనే కంపెనీలు రైతులకు సరఫరా చేసి ఉత్పత్తిని దెబ్బతీస్తున్నాయి. చివరగా మార్కెట్‌లో గిట్టుబాటు ధర కనుచూపుమేరలో కూడా కనబడుటలేదు. కనీస మద్దతు ధర కూడా లేదు. ప్రభుత్వం నిర్ణయించే ధర రైతు పెట్టిన పెట్టుబడి కన్న తక్కువగా ఉంటున్నది.

కనీస మద్దతు ధరలు 23 వ్యవసాయ ఉత్పత్తులకే నిర్ణయిస్తున్నారు. అమెరికాలో 100 పంటలకు ధరలు నిర్ణయిస్తున్నారు. నిర్ణయించిన విధంగానూ ఈ దేశంలో అమలు కావడం లేదు. దీనివలన రైతులు 3 లక్షల కోట్ల రూపాయల వరకు నష్టపోతున్నారని ప్రముఖ ఆర్థికవేత్త అశోక్‌ గులాటి చెప్పారు. మార్కెట్‌లు, మండీలు రైతులకు ఉపయోగపడని విధంగా మార్పులు చేశారు. ఏదో విధంగా రైతుల భూములను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడానికి, రైతులను దివాలా తీయించడానికి ఈ ధరల విధానాలను కొనసాగిస్తున్నారు. మార్కెట్‌లో ధర తగ్గితే ఆ తగ్గిన ధరను ఆధార్‌ కార్డు ప్రకారం రైతు అకౌంటులో జమ చేస్తామని ఇచ్చిన వాగ్దానం ఎక్కడైనా అమలు జరుగుతున్నదా? రైతుల, ఉత్పత్తిదారుల అర్గనైజేషన్‌ (ఎఫ్‌పిఓ)లను ఏర్పాటు చేసి, నాబార్డు సహాయంతో రైతులకు లాభం కలిగే విధంగా మధ్య దళారీలను తొలగిస్తానని మరో మాట చెప్పారు. అది మొదటనే గండి పడింది. కనీసం ప్రచారం కూడా జరగలేదు.

ప్రధాని పంటల బీమా పథకం కింద ఏటా దాదాపు రూ. 15000 కోట్లు బడ్జెట్‌ కేటాయిస్తున్నారు. రైతులు 1.5శాతం / 2శాతం/ 5శాతం ప్రీమియం చెల్లించాలని చెప్పినప్పటికీ దేశంలోని 15 కోట్ల మంది రైతు కుటుంబాల్లో మూడు కోట్ల మంది కూడా ప్రీమియం చెల్లించడం లేదు. బీమా కంపెనీలు మాత్రం 3000–4500 కోట్లు లాభాలు సంపాదిస్తున్నాయి. ఇది బీమా కంపెనీల కోసం ఏర్పాటు చేసిన పథకమే తప్ప రైతుల కోసం ఏర్పాటు చేసిన పథకం కాదు. సుమారు తొమ్మిదివేల కోట్ల ఎకరాల్లో పంటలు ప్రకృతి వైపరీత్యాల వలన ప్రతి సంవత్సరం దెబ్బతింటున్నాయి. అటు కేంద్ర పథకం సహాయం అందక, ఇటు రాష్ట్రాలు బీమా పథకాన్ని అమలు చేయకపోవడం వలన 50 వేల కోట్ల వరకు పంటలను రైతులు నష్టపోతున్నారు. ఈ పథకం నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, ఝార్ఖండ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు బయటికి వచ్చాయి. ఆ రాష్ట్రాలు పోగా, మిగిలిన రాష్ట్రాలకు కూడా ఈ పథకం అమలు కావడం లేదు.

జాతీయ భూ రికార్డుల నవీనీకరణ పథకం ప్రారంభించి దానిని నిర్దిష్ట కాలంలో పూర్తి చేస్తామని ప్రధాని ప్రకటించారు. కానీ ఆ వైపే ఏ రాష్ట్రం చూడలేదు. ఒకవేళ సర్వే చేస్తే పాలక వర్గాల భూ ఆక్రమణ లోపాలన్నీ బట్టబయలవుతాయి. భూమిపై హక్కులేక చివరికి కౌలుదారీ చట్టం వర్తించకపోవడంతో 20కోట్ల మంది కౌలుదారులు పంటలకు దూరమయ్యారు. ప్రభుత్వ పథకాలు లభించక ప్రైవేటు ఋణాలు తెచ్చి అప్పుల పాలై 12,600 మంది రైతులు గత సంవత్సరం ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇదేనా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం?

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే తక్షణం చేపట్టాల్సిన చర్యలు కొన్ని ఉన్నాయి. వాస్తవ సాగుదారుల పేర్లు నమోదు చేయాలి. ఉపకరణాలు, సాగునీరు ఉచితంగా ఇవ్వాలి. సకాలంలో తగినన్ని వడ్డీ లేని ఋణాలు ఇవ్వాలి. బహుళజాతి సంస్థలకు వ్యవసాయంలో ఎలాంటి జోక్యం ఉండరాదు. మధ్య దళారీలను పూర్తిగా తొలగించాలి. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి, వ్యవసాయ పరిశోధనలు వేగవంతం చేసి హెక్టారుకు 2.5 టన్నులకు బదులు 8 టన్నులు దిగుబడి వచ్చే విధంగా కొత్త విత్తనాలను ఆవిష్కరించాలి. రైతులందరికీ ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి, పంటల పరిహారం ఇవ్వాలి. అన్ని పంటలకూ ప్రకృతి వైపరీత్యాల పరిహారాన్ని అందించాలి. పంటలను వేసేటప్పుడే ధర నిర్ణయించి ఆ ధరలను అమలు చేయాలి. లోటు వస్తే ప్రభుత్వం బ్యాంకు ద్వారా చెల్లించాలి. బావులు, లిఫ్ట్ పథకాలు, రాష్ట్రాల నీటిపారుదల అభివృద్ధి శాఖలు నిర్వహించాలి. వ్యవసాయ ఉత్పత్తులలో స్వయంపోషకత్వం సాధించి దిగుమతులను నియంత్రించాలి. తగినన్ని నిల్వగోదాములను నిర్మించాలి. 60 సంవత్సరాలు దాటిన రైతుకు నెలకు రూ.5000 పెన్షన్‌ ఇవ్వాలి. దళిత, గిరిజనులకు నూతన టెక్నాలజీ, ఉపకరణాలు ఉచితంగా ఇవ్వాలి. ప్రతి 2500 ఎకరాలకు ఒక ఏఈఓను నియమించాలి. మండల కేంద్రాల్లో సన్నకారు రైతులకు ఉపయోగపడే విధంగా అద్దె–కొనుగోలు పద్ధతిపై యంత్రాలను ఇవ్వాలి. రైతులను వ్యవసాయ క్షేత్రాలకు, ఇతర దేశాల పంటల పరిశీలనకు తీసుకువెళ్ళాలి. ప్రతి మండలంలో వ్యవసాయ శిక్షణ కళాశాలను ఏర్పాటు చేయాలి. పై పనులు జరిగినప్పుడు మాత్రమే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది తప్ప, ప్రస్తుత విధానాల వల్ల రెట్టింపు అయ్యే అవకాశం లేదు. అందువల్ల ప్రస్తుత విధానాలను ప్రభుత్వం మార్పు చెయ్యాలి.

*మూడ్‌ శోభన్‌*
తెలంగాణ రైతు సంఘం
రాష్ట్ర కార్యదర్శి
9949725951

10/07/2022
15/04/2022
March Forward Comrades! ✊🏾❤
06/04/2022

March Forward Comrades!
✊🏾❤

Address

1-8-1/B/25/A, Bagh Lingampally
Hyderabad
500044

Opening Hours

Monday 12am - 11:59pm
Tuesday 12am - 11:59pm
Wednesday 12am - 11:59pm
Thursday 12am - 11:59pm
Friday 12am - 11:59pm
Saturday 12am - 11:59pm
Sunday 12am - 11:59pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Shoban Mood posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shoban Mood:

Share