05/08/2025
                                            సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న అందాల తార రేణూ దేశాయ్!
తాజాగా ఆమె పెట్టిన ఘాటు పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
"స్టుపిడ్ పొలిటీషియన్స్!" అంటూ ఓ స్టోరీ షేర్ చేసిన రేణూ…
రాజస్థాన్లోని సరిస్కా టైగర్ రిజర్వ్ లో మైనింగ్పై మండిపడ్డారు.
ఒకప్పుడు అక్కడ 3 పులులే ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 50కి పైగా పెరిగిందని చెప్పారు.
అలాంటి చోట మైనింగ్ చేస్తే… జంతువులను చంపేందుకు తెగబడుతున్నట్టే కదా? అంటూ ప్రశ్నించారు.
"చివరి చెట్టు నరికేవరకు వీళ్లకు నిద్రపట్టదా?
వన్య మృగాలు, ప్రకృతి వీళ్ల కుటుంబాలకి అవసరం అనిపించదా?" అంటూ తీవ్రంగా స్పందించారు రేణూ దేశాయ్.
ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి…
ఎకో లవర్స్, జంతు ప్రేమికులు ఆమె వ్యాఖ్యలకు మద్దతుగా నిలుస్తున్నారు.