Telugu Fast News

Telugu Fast News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telugu Fast News, Media/News Company, Hyderabad.

పెళ్లైన మహిళతో ప్రేమ.. సవతి కూతురు కోసం పంతం.. ఈ క్రికెటర్ లవ్ స్టోరీ వింటే షాక్ అవ్వాల్సిందే..భారత క్రికెట్ చరిత్రలో అత...
18/06/2025

పెళ్లైన మహిళతో ప్రేమ.. సవతి కూతురు కోసం పంతం.. ఈ క్రికెటర్ లవ్ స్టోరీ వింటే షాక్ అవ్వాల్సిందే..

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత
గొప్ప స్పిన్ బౌలర్లలో ఒకరిగా అనిల్ కుంబ్లే పేరు సువర్ణాక్షరాలతో లిఖితమైంది. మైదానంలో తన లెగ్-స్పిన్తో ప్రత్యర్థులను గడగడలాడించిన కుంబ్లే, వ్యక్తిగత జీవితంలో కూడా ఆదర్శప్రాయంగా నిలిచారు.

ముఖ్యంగా అతని ప్రేమకథ, వివాహం, తన సవతి కుమార్తెతో అతని అనుబంధం ఎందరికో స్ఫూర్తినిచ్చాయి.

అనిల్ కుంబ్లే, చేతన రామన్ - ఒక అరుదైన బంధం: అనిల్ కుంబ్లే భార్య పేరు చేతన రామన్. వారిద్దరి పరిచయం, ఆ తర్వాత అది ప్రేమగా మారడం ఒక ఆసక్తికరమైన ప్రయాణం. చేతన అప్పటికే వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారని, ఆమెకు అరిణి అనే కుమార్తె ఉందని చాలామందికి తెలీదు. అనిల్ కుంబ్లేకు చేతనతో పరిచయం ఏర్పడినప్పుడు, ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమె కుమార్తె పట్ల ఆమెకున్న ప్రేమను చూసి ఆకర్షితులయ్యారు. వారిద్దరి మధ్య మొదట స్నేహం చిగురించింది, ఆ తర్వాత అది లోతైన ప్రేమగా మారింది.

కుటుంబాల అంగీకారం, ఆ తర్వాతే అసలైన సవాళ్లు: సమాజంలో ఇలాంటి బంధాలపై ఉండే సంప్రదాయ ఆలోచనల కారణంగా, మొదట్లో కొంత ప్రతిఘటన ఎదురైంది. అయితే, అనిల్ కుంబ్లే, చేతన ఇద్దరూ తమ ప్రేమ పట్ల బలంగా నిలబడ్డారు. ఇరు కుటుంబాలకు వారి ప్రేమను, ఒకరికొకరు తోడుగా ఉండాలనే వారి నిర్ణయాన్ని తెలియజేశారు. కుంబ్లే కుటుంబం, అతని తల్లిదండ్రులు చేతనను, ఆమె కుమార్తె అరిణిని మనస్ఫూర్తిగా అంగీకరించారు. ఇది వారి బంధానికి మరింత బలాన్నిచ్చింది. 1999లో అనిల్ కుంబ్లే, చేతన రామన్ వివాహం చేసుకున్నారు.

సవతి కుమార్తె కస్టడీ కోసం పోరాటం: అనిల్ కుంబ్లే ప్రేమకథలో అత్యంత హృదయానికి హత్తుకునే భాగం, తన సవతి కుమార్తె అరిణి కస్టడీ కోసం ఆయన చేసిన పోరాటం. చేతన విడాకులు తీసుకున్నప్పటికీ, అరిణి కస్టడీకి సంబంధించి కొన్ని చట్టపరమైన సమస్యలు ఉన్నాయి. అనిల్ కుంబ్లే, తన భార్య చేతనతో పాటు, అరిణికి ఉత్తమ జీవితాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నారు. ఈ క్రమంలో, అరిణి కస్టడీని పొందేందుకు అనిల్ కుంబ్లే చట్టపరంగా పోరాడారు. ఈ పోరాటం అతని గొప్ప వ్యక్తిత్వాన్ని, అరిణి పట్ల అతనికున్న అపారమైన ప్రేమను తెలియజేస్తుంది. తన సొంత బిడ్డ కాకపోయినా, ఆమెకు తండ్రిగా నిలబడటానికి కుంబ్లే ఎటువంటి రాజీ పడలేదు. చివరకు, న్యాయస్థానం అరిణి కస్టడీని చేతన, అనిల్ కుంబ్లేకు అప్పగించింది.

కుటుంబం - కుంబ్లే జీవితంలో ఒక పిల్లర్: అనిల్ కుంబ్లే, చేతన దంపతులకు స్వయంగా మాయస్, దియా అనే మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అరిణితో కలిపి వారి ముగ్గురు పిల్లలతో కుంబ్లే జీవితం ఆనందమయంగా సాగుతోంది. మైదానంలో ఎంత కఠినమైన బౌలర్ అయినా, కుటుంబం విషయానికి వస్తే కుంబ్లే చాలా సున్నితమైన వ్యక్తి. తన కుటుంబానికి, ముఖ్యంగా తన పిల్లలకు ఆయన చాలా ప్రాముఖ్యతనిస్తారు. అరిణిని తన సొంత కూతురిగానే భావిస్తూ, ఆమెకు తండ్రి ప్రేమను అందిస్తూ, ఆమె ఎదుగుదలలో కుంబ్లే కీలక పాత్ర పోషించారు.

అనిల్ కుంబ్లే ప్రేమకథ ఒక వ్యక్తిగత కథ మాత్రమే కాదు, ఇది ప్రేమకు హద్దులు లేవని, నిజమైన బంధాలకు రక్తం ఒక్కటే ప్రామాణికం కాదని నిరూపించే ఒక సందేశం. తన వృత్తిలో ఒక దిగ్గజంగా రాణించడమే కాకుండా, వ్యక్తిగత జీవితంలో కూడా అనిల్ కుంబ్లే ఎందరికో ఆదర్శంగా నిలిచారు.



🌟 పూరీ జగన్నాథ ఆలయం – శాస్త్రానికి సవాల్ విసేసే ఆధ్యాత్మిక అద్భుతం! 🌟భారతదేశంలోని ఏ ఆలయమైనా ప్రాముఖ్యత కలిగివుండొచ్చు. క...
18/06/2025

🌟 పూరీ జగన్నాథ ఆలయం – శాస్త్రానికి సవాల్ విసేసే ఆధ్యాత్మిక అద్భుతం! 🌟

భారతదేశంలోని ఏ ఆలయమైనా ప్రాముఖ్యత కలిగివుండొచ్చు. కానీ, పూరీ జగన్నాథ ఆలయం అనేది ఒక మిస్టరీ – ఇది విశ్వాసానికి, భక్తికి, సైన్స్‌కు సవాల్ విసిరే జీవంత ఉదాహరణ. ఈ ఆలయం శతాబ్దాలుగా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది. కానీ దీని వెనక దాగి ఉన్న 10 మహా రహస్యాలు నేటికీ శాస్త్రానికి చుక్కలు చూపిస్తున్నాయి.

👇 ఇవి చదివితే మీరు ఆశ్చర్యపోతారు –

1️⃣ గాలికి వ్యతిరేకంగా ఎగురే జెండా – ఇది సాధారణ భౌతిక శాస్త్ర నియమాలను తిరస్కరిస్తుంది.
2️⃣ గోపురానికి నీడ లేదు! – ఎటువంటి సమయానికీ ఆలయం నీడ పడదు. ఇది భౌతిక శాస్త్రానికి ఓ ప్రశ్నే!
3️⃣ సముద్రపు అలల శబ్దం వినిపించదు – ఆలయంలో ప్రవేశించిన వెంటనే సముద్ర శబ్దం మాయమవుతుంది.
4️⃣ గాలి ప్రవాహం కూడా భిన్నంగా ఉంటుంది – సముద్రం నుండి లోపలికి గాలి రాకపోవడం శాస్త్రానికి అర్థంకాని విషయం.
5️⃣ 56 రకాల వంటలు — పై పాత్ర మొదట వండుతుంది – వంటగదిలో వండే ఆహారం మిస్టరీగా తయారవుతుంది.
6️⃣ 2200 కిలోల నీలచక్రం – ఇది ఆలయంపై స్థిరంగా ఉండి, ఎటు నుంచైనా ఒకేలా కనిపిస్తుంది.
7️⃣ పక్షులు ఎగరవు – విమానాలు కూడా కాదు – ఆలయం పై భాగంలో ఎటువంటి జీవులూ ఉండలేవు.
8️⃣ వేల చెట్లు కావాల్సినా — ఎప్పటికీ కలప కొరత రాదు (రథయాత్ర కోసం).
9️⃣ ప్రతి 12 సంవత్సరాలకు విగ్రహ మార్పు – ఇది రాత్రిపూట, అత్యంత రహస్యంగా జరుగుతుంది. ఇందులో పాల్గొనేవారు జీవితాంతం మౌనం పాటిస్తారు.
🔟 సుదర్శన చక్రం – ఎటు నుంచైనా ఒకేలా కనబడుతుంది. ఇది ఒక ఆర్కిటెక్చర్ మిస్టరీ.

💫 ఇవన్నీ చదివితే మీరు కూడా అనుకోవచ్చు: “ఇది ఆధ్యాత్మిక శక్తుల పని కాదు అంటే ఇంకేమిటి?”

🙏 జగన్నాథుని అద్భుతం ముందు శాస్త్రం సైతం మౌనమవుతుంది!
భారతం గొప్పదనం ఇది!
మీరు ఆలయాన్ని చూడకపోతే తప్పిపోయిన అనుభూతే! ఈ సమాచారం మీ స్నేహితులతో పంచుకోండి – మన సంస్కృతిని మనం గొప్పగా చెప్పుకోవాలి!

🕉️ జయ జగన్నాథ! 🙏 #పూరీ_జగన్నాథ్_ఆలయం



#జగన్నాథుడు



#రహస్యఆలయాలు










అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో  300 మందికి పైగా మరణించగా ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథఆకాష్,ప్రియ అనే ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీ...
18/06/2025

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 300 మందికి పైగా మరణించగా ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ
ఆకాష్,ప్రియ అనే ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆరోజు ఇదే ప్లెయిన్ లో లండన్ వెళుతూ ప్రాణాలు కోల్పోయారు .

ఇక వివరాల్లోకి వెళితే ..... ప్రియ గుజరాత్ లోని వడోదర లో జన్మించింది ఆమె చిన్నతనంలోనే రోడ్ ఆక్సిడెంట్ లో ఆమె తల్లి తండ్రులు ఇద్దరు మరణించగా ఆస్తులు ఏమి లేని ఈమెను బంధువులు ఎవరు పట్టించుకోక పోవడంతో అనాథ శరణా లయంలో ఉంటూ కష్టపడి బీటెక్ పూర్తి చేసుకొని జాబ్ చేసుకుంటూ ఉన్నది

ఇక ఆకాష్ విషయానికి వస్తే అతని తండ్రి చిన్నప్పుడే కాలం చెయ్యగా అతని తల్లి కష్టపడి కొడుకుని బీటెక్ చదివించుకుంది అతను ఒక ఉద్యోగం చేసుకుంటూ వున్న తరుణంలో ప్రియకు ఆకాష్ కు పరిచయం పెరిగి అది ప్రేమగా మారింది .

ఆకాష్ తన తల్లి దగ్గరకు ప్రియ ను తీసుకొని వెళ్ళి పరిచయం చేయగా ప్రియ పద్ధతులు మాటతీరు నచ్చి వారిద్దరూ మంచిగా తరచూ కలుస్తూ వున్న టైమ్ లో ఆకాష్ తల్లికి హార్ట్ ఎటాక్ వచ్చి మరణించగా ఎవరు లేక ఆకాష్ అనాథగా మారిపోయాడు..

ఈ సమయంలో వీళ్ళ ప్రేమ విషయం తెలుసుకొని స్నేహితులు దగ్గరుండి వీళ్ళ పెళ్ళి చెయ్యగా వీళ్లకు ఒక పాప జన్మించింది ఆ పాపకు సమీరా అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా చూసుకుంటూ ఆకాష్ ఆ పాపలో తన తల్లిని.చూసుకునేవాడు

ఇక్కడ ఆదాయాలు సరిపోక ప్రియా మరియు ఆకాష్ గత రెండేళ్లుగా లండన్ లో జాబ్స్ కి ప్రయత్నం.చేయగా చేతి ఒక కంపెనీ లో జాబ్ వచ్చింది..ఇక ప్రియ ఆకాష్ మరియు సమీరా ల వీసా ప్రాసెస్ పూర్తి అయి ప్రయాణానికి సిద్ధ పడగ ఆరేళ్ళ సమీరా కు జ్వరం వచ్చి బాధ పడుతూ వుండగా ఎలా చెయ్యాలి అని వీళ్ళు ఇద్దరు తర్జన బర్జన పడుతూ వుండగా ఆకాష్ స్నేహితుడు రాహుల్ పాపని నేను చూసుకుంటాను అనుకున్న ప్రకారం మీరు వెళ్ళి అక్కడ అన్ని చూసుకొని వీలు చూసుకొని పాపను తీసుకొని వెళ్ళండి అని చెప్పగా సరే అనుకుని ఆకాష్ ప్రియ బయలుదేరి వెళుతూ ప్రాణాలు కోల్పోయారు .

విమానం ప్రమాదం తెలుసుకొని ఆకాష్ స్నేహితుడు రాహుల్ పాపని తీసుకొని సంఘటన స్థలం కి.చేరుకోగా అక్కడ శవాల గుట్ట గుర్తించటం వీలుకాని స్థితి చూసి ఆ పాప ఒక శవం దగ్గర చేరి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఏడుస్తూ వుండటం అందరి కి కంట తడి తెప్పించింది . పాప dna తొ తల్లి తండ్రులను గుర్తించి శవాలను అప్పగించే ప్రక్రియలో అధికారులు వున్నారు..

పరిస్థితి చూసి రాహుల్ గుండె ముక్కలయ్యల ఏడుస్తూ అనాథగా మిగిలిన ఆరేళ్ల పాపను ఓదారుస్తూ ఇక పాప బాధ్యతలు తనే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాడు.

ఇలా విమాన ప్రమాదం ఒక్కొక్కరి జీవితాల్ని చిన్నాభిన్నం చేసింది ఓదార్చలేని దుఃఖాన్ని మిగిలించింది .

( సేకరణ )

పేద రైతులు సాయం చేయమని మా ఇంటికి రావొద్దు.. ట్విస్ట్ ఇచ్చిన పల్లవి ప్రశాంత్
18/06/2025

పేద రైతులు సాయం చేయమని మా ఇంటికి రావొద్దు.. ట్విస్ట్ ఇచ్చిన పల్లవి ప్రశాంత్

బిగ్‌బాస్‌ విజేతకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ అని ప్రకటించారు. కానీ ప్రిన్స్‌ యావర్‌ రూ.15 లక్షల సూట్‌కేసు తీసుకున్నా....

కుమారేశన్ దురై స్వామి రెడ్డియార్ గారు ...ఈయన స్క్రీన్ పేరు నెపోలియన్ . Jeevan Technologies and Jeevan Foundation. పేరిట ...
18/06/2025

కుమారేశన్ దురై స్వామి రెడ్డియార్ గారు ...ఈయన స్క్రీన్ పేరు నెపోలియన్ . Jeevan Technologies and Jeevan Foundation. పేరిట ఎంతో సోషల్ వర్క్ చేసున్నారు ..ఈయన కొడుకుకి వచ్చిన muscular డెస్ట్రోఫీ అనే కండరాల వ్యాధి సామాన్యులకు వస్తే తట్టుకోలేరని తలచి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఫ్రీ గా ఇస్తున్న మహానుభావుడు .మానసిక వికలాంగులు అయినా పిల్లలకు ,పేదవారి ఎడ్యుకేషన్ కోసం తన ఆస్తిలో అధికభాగం ఖర్చుచేస్తున్న ధన్యజీవి !!

గూగుల్ లో jeevan foundation అని కొడితే వస్తుంది

శ్రీశ్రీశ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయం  బెల్లడోన గ్రామం  చిప్పగిరి మండలం కర్నూలు జిల్లా
18/06/2025

శ్రీశ్రీశ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయం బెల్లడోన గ్రామం
చిప్పగిరి మండలం
కర్నూలు జిల్లా

🌹మహాదేవా సమస్త ప్రాణులకు నీవే తండ్రివట. కర్మల ఫలితాన్ని ఇచ్చేది నీవేనట. కర్మల ఫలితాన్ని తగ్గించగలవట.🌹ఆ కర్మల ఫలితాన్ని  ...
18/06/2025

🌹మహాదేవా సమస్త ప్రాణులకు నీవే తండ్రివట. కర్మల ఫలితాన్ని ఇచ్చేది నీవేనట. కర్మల ఫలితాన్ని తగ్గించగలవట.

🌹ఆ కర్మల ఫలితాన్ని పూర్తిగా కూడా తీసేయగలవట. స్మశానవాసివట.. భూతప్రేతములతో వసిస్తావట.

🌹భూతప్రేతాది గణములను కూడా అలరించి , అనుగ్రహించి ఉద్దరిస్తావట. ఇంతటి దయాసముద్రుడివి...

🌹సమస్త జీవులను నీదయతో కరుణతో లాలించి పాలించే కారుణ్యమూర్తివి. ఈ కట్టె పై నీకరుణ కలిగేది ఎప్పుడు తండ్రీ

🌹నీ దయతో ఉద్ధరింపబడే ఆ క్షణం ఎన్నడో...

*🙏అరుణాచలశివ శరణు🙏*

🛕  #జగన్నాథుడు 15 రోజులు ఎందుకు అనారోగ్యానికి గురవుతారు?జగన్నాథుని లీలలు అపారమైనవి. ప్రతీ సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమినాడు ప...
18/06/2025

🛕 #జగన్నాథుడు 15 రోజులు ఎందుకు అనారోగ్యానికి గురవుతారు?

జగన్నాథుని లీలలు అపారమైనవి. ప్రతీ సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమినాడు ప్రత్యేకంగా జరిగే స్నాన యాత్ర అనంతరం, భగవంతుడు 15 రోజులు అనారోగ్యానికి గురవుతారు. ఈ అనంత విశ్రాంతిని అనసార లీల అంటారు.

📌 అనసార లీల అంటే ఏమిటి?
ఈ సమయంలో ఆలయం తలుపులు మూసివేయబడతాయి. భగవంతుని భౌతిక రూపమైన శరీరం జ్వరంతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటుందని భక్తుల నమ్మకం. ఈ సమయంలో దయిత్గన్ అనే ప్రత్యేక సేవకులు మాత్రమే సేవ చేస్తారు. దేవునికి ఆహారం ఇవ్వరు – ఆయుర్వేద మూలికలు మాత్రమే అందిస్తారు. వంటగది కూడా మూసివేస్తారు.

🌿 ఈ లీల వెనుక భక్తి కథ
భగవంతుని గాథలో ఓ భాగమైన ఈ అనసార లీల వెనుక ఉన్న కథ భక్తుడి ప్రేమను చాటే కథ. మాధవదాస్ అనే భక్తుడు జీవితాంతం భగవంతుని సేవలో ఉండే ప్రయత్నం చేశాడు. శారీరకంగా బలహీనుడైపోయిన తరువాత కూడా, ఆయన సేవ తీయనంటాడు. దాన్ని చూసిన జగన్నాథుడు తన భక్తుడిని సేవించేందుకు స్వయంగా వచ్చాడు. భక్తుడికి వచిన అనారోగ్యాన్ని స్వయంగా తనపై వేసుకున్నాడు.

🙏 "నీ ప్రేమ ముందు నాకైనా మారాల్సిందే," అని జగన్నాథుడు అన్నాడు.
అందుకే భగవంతుడు 15 రోజులు అనారోగ్యానికి గురవుతాడని నమ్ముతారు.

👑 పూరి రాజు కల కథ
ఒక మరొక కథ ప్రకారం, పూరి రాజుకు కలలో భగవంతుడు దర్శనమిచ్చి తాను చల్లని నీటిలో స్నానం చేసి ఏకాంతంగా ఉండాలని కోరాడు. అలా 15 రోజుల విశ్రాంతి అనంతరం ఆయన తిరిగి భక్తుల దర్శనానికి సిద్ధమవుతాడు.

📿 ఈ సమయంలో ఆలయం మూసివేస్తారు. ఆ తరువాతే జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. లక్షలాది మంది భక్తులు ఆయన దివ్య రథాన్ని చూడడానికి తరలివస్తారు.

🕉️ జగన్నాథుని లీలలు – భక్తులకు జీవితం పాఠాలు.
అనారోగ్యం, విశ్రాంతి, సంరక్షణ – ఇవన్నీ భగవంతుడే మానవులకు ఇచ్చిన సందేశాలు.

ఐదుగురు భర్తలు ఉన్న ద్రౌపతి పతివ్రతా ఎలా అయిందో తెలుసా? ఎందుకు మీకా సందేహం…ద్రౌపతి నిజంగా పతివ్రతే. అదెలాగండీ..ఒకే భర్త ...
18/06/2025

ఐదుగురు భర్తలు ఉన్న ద్రౌపతి పతివ్రతా ఎలా అయిందో తెలుసా? ఎందుకు మీకా సందేహం…ద్రౌపతి నిజంగా పతివ్రతే. అదెలాగండీ..ఒకే భర్త గల స్త్రీ పతివ్రత అవుతుంది కానీ…అయిదుగురు భర్తలు గల ద్రౌపతి పతివ్రత ఎలా అవుతుందండీ? అబ్బ..ఎందుకండీ అంత కోపం..కాస్త శాంతంగా ఉంటే, మీ సందేహానికి సరైన సమాదానం నేను చెప్తాను కదా. ఇంద్రుడే ఐదు రూపాలుగా పాండవులుగా జన్మించాడు. అతని భార్య శచీదేవి.. ద్రౌపతిగా జన్మించింది.

ముందుగా ఒక చిన్న లెక్క. ఒక రూపాయికి వంద పైసలు.,పది పైసలు పది..,పావలాలు (ఇరవై ఐదు పైసలు) నాలుగు..,అర్థరూపాయిలు రెండు.అలాగే పాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు. ఏ ఒక్కరు తగ్గినా పూర్తి ఇంద్రుడు కాజాలడు. పంచపాండవులు, ద్రౌపతి, నవమాసాలు మాతృ గర్భంలో ఉండి యోనిజులుగా జన్మించిన వారు కాదు. వీరందరూ అయోనిజులే. ద్రౌపతి యఙ్ఞకుండం నుంచి ఉద్భవించిన కారణజన్మురాలు. ఇక ధర్మరాజాదులు కుంతి, మాద్రులకు ఎలా జన్మించారో జగతికి తెలిసిన కథే. కానీ… అలా జన్మించడానికి వెనుక ఉన్న అసలు కథ చాలా మందికి తెలియదు. ఆ అసలు కథ ఏమిటంటే..

త్వష్ట్రప్రజాపతి కుమారుడైన ‘త్రిశిరుని’ ఇంద్రుడు సంహరించాడు. ఆ కారణంగా ఇంద్రునికి బ్రహ్మహత్య పాతకం సంక్రమించి స్వర్గలోకాధిపత్యార్హతను కోల్పోయాడు. అప్పుడు ఇంద్రుడు దేవగురువు అయిన బృహస్పతిని కలిసి బ్రహ్మహత్య పాతకం పోయే మార్గం చెప్పమని అర్థించాడు. ‘మహేంద్రా.. ఎంతటి పాపమైనా తపస్సుతో తొలగిపోతుంది. కనుక తపస్సు చెయ్యి. అయితే.. బ్రహ్మహత్య దోషంతో ఉన్న నీకు, ప్రస్తుతం దైవీకశక్తులు ఏవీ తోడుగా ఉండవు. అటువంటి నిన్ను సంహరించడం రాక్షసులకు పెద్ద కష్టం కాదు. కనుక, నీ పంచ ప్రాణశక్తులలో నాలుగు ప్రాణశక్తులను నీకు నమ్మకమైన మిత్రుల దగ్గర దాచివుంచి, ఒక ప్రాణశక్తిని నీదగ్గర ఉంచుకుని తపస్సు చేసి బ్రహ్మహత్యపాతక పరిహారం చేసుకో’ అని సలహా ఇచ్చాడు. గురుదేవుని ఆదేశంతో మహేంద్రుడు తన నాలుగు ప్రాణశక్తులను యమడు, వాయువు, అశ్వినీదేవతల దగ్గర దాచి తపస్సు ప్రారింభించాడు.

పాండురాజు భార్యలు

పాండురాజు భార్యలైన కుంతి, మాద్రులు… దూర్వాసుడు అనుగ్రహించిన సంతాన సాఫల్య మంత్ర మహిమతో పంచపాండవులకు తల్లులయ్యారు. కుంతి ప్రార్థనకు ప్రసన్నులైన యముడు, వాయువు, ఇంద్రుడు తమ దగ్గర ఉన్న మహేంద్ర ప్రాణశక్తులను అనుగ్రహించగా..ధర్మజ, భీమ, అర్జునులు జన్మించారు. ఇక మాద్రి ప్రార్థనకు ప్రసన్నులైన అశ్వినీదేవతలు తమ దగ్గరున్న మహేంద్ర ప్రాణశక్తులను అనుగ్రహించగా..నకుల, సహదేవులు జన్మించారు.

కనుక., పంచపాండవులు ఐదుగురు కలిస్తేనే ‘ఇంద్రుడు’. ఏ ఒక్కరు తగ్గినా.. పరిపూర్తి ఇంద్రుడు కాజాలడు. ఇక..ఇంద్రుడు బ్రహ్మహత్యపాతక నివారణకై తపస్సు చేస్తున్న కాలంలో, అతని భార్య శచీదేవి, అసురుల ఆగడాలకు భయపడి, తన భర్త తిరిగి వచ్చేవరకు తనకు ఆశ్రయం ఇమ్మని అగ్నిదేవుని అర్థించి ఆయన నీడలో కాలం గడుపుతోంది. తన భర్త అయిన మహేంద్రుడు ఐదురూపాలతో భూలోకంలో జన్మించాడు అని తెలుసుకున్న శచీదేవి..యఙ్ఞకుండం నుంచి ద్రౌపతిగా జన్మించి, పంచపాండవులకు అర్థాంగి అయింది. భౌతికంగా పాండవులు ఐదుగురుగా కనిపిస్తున్నా.. నిజానికి వారందరూ కలిసి ఒక్కరే. ఒక్కరితో (ఒకే భర్త అయిన ఇంద్రునితో) ధర్మబద్ధమైన సంసారయాత్ర సాగించిన ‘ద్రౌపతి’(శచీదేవి) కచ్చితంగా పతివ్రతే.

అరుణాచలం 🙏
17/06/2025

అరుణాచలం 🙏

మీకో విషయం తెలుసాపాకిస్థాన్ అణు బాంబు కెపాసిటీ : మూడు కిలో టన్నులుభారత్ అణు బాంబు కెపాసిటీ : 150 కిలో టన్నులుపాకిస్థాన్ ...
17/06/2025

మీకో విషయం తెలుసా

పాకిస్థాన్ అణు బాంబు కెపాసిటీ : మూడు కిలో టన్నులు
భారత్ అణు బాంబు కెపాసిటీ : 150 కిలో టన్నులు

పాకిస్థాన్ వద్ద ఉన్న అణు బాంబులలో పెద్దగా శుద్ది చేయని యురేనియం ఉపయోగించారుట. కాని భారత్ మాత్రం 11 సార్లు శుద్ధి చేసిన యురేనియం ను అణు బాంబుల తయారీకు ఉపయోగించిందిట. ఒక అంచనా ప్రకారం పాకిస్థాన్ అణుబంబు కంటే భారత్ అణుబాంబు 210 రెట్లు శక్తివంతమైనదిట. పాకిస్థాన్ న్యూక్లియర్ టెక్నాలజీ ను యూరప్ (బహుశా హాలెండ్ అనుకుంటా) నుండి దొంగతనం చేసింది. ఇక నిజానికి పాకిస్థాన్ వద్దనున్నవి అణు బాంబులు కాదు, వాటిని డర్టీ బాంబులు అంటారు (జోక్ కాదు ఫ్రెండ్స్, సీరియస్ గానే వాటిని డర్టీ బాంబులు అంటారు). వాటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. సూటిగా చెప్పాలి అంటే అసలు అవి పేలతాయో లేదో కూడా తెలియదు

ఓ బిచ్చగాడు ఓకచోట కూర్చుని అడుక్కుంటున్నాడు. అక్కడ గోడమీద " నేను అంధుడిని  .....ధర్మం చేయండి " అని వ్రాయబడి ఉన్నది. అందర...
17/06/2025

ఓ బిచ్చగాడు ఓకచోట కూర్చుని అడుక్కుంటున్నాడు. అక్కడ గోడమీద
" నేను అంధుడిని .....ధర్మం చేయండి " అని వ్రాయబడి ఉన్నది.

అందరూ, తమకు తోచినట్టుగా చిల్లర వేసి వెళుతున్నారు.

ఒకతను ..... నీకు వచ్చే చిల్లర నీ ఆకలి తీరుస్తుందా .....అని బిచ్చగాడిని అడిగాడు.

ఏదో సరిపోతోంది .... ఒక పూట తిని ఇంకో పూట పస్తులతో ఉంటున్నాను బాబు ..... అని
చెప్పాడా బిచ్చగాడు.

నీ బోర్డు మీద రాసి ఉన్నది మార్చి రాస్తాను అని, ఆబోర్డు మీద ఉన్నది చెరిపేసి,
ఇంకేదో వ్రాసి వెళ్ళి పోయాడు అతను.

సాయంత్రానికి ఆ బిచ్చగాడికి రోజూ వచ్చేదానికన్నా రెండు రెట్లు డబ్బులు వచ్చాయి.

బిచ్చగాడి దగ్గరకు వెళ్ళిన ఇతను, ఈరోజు ఎక్కువ మెుత్తం వచ్చాయి కదా సంతోషమేనా అని అడిగాడు.

అతని గొంతు గుర్తు పట్టిన బిచ్చగాడు , మీరు బోర్డు మీద ఏమని రాశారు? అనడిగాడు.

ఏమీ లేదు, "నేను అంధుడిని " అని
వ్రాసినదానిని చెరిపేసి,

"ఈరోజు అందమైన రోజు, కానీ నేను చూడలేను "
అని వ్రాశాను.

మెుదటిది, నీ లోపాన్ని తెలిపితే,
రెండవది భగవంతుడు మాకెంత మేలుచేశాడో తెలుపుతున్నది.

నీలాంటి వారిపట్ల .....మేమెలా ఉండాలో తెలుపుతున్నది.
ఆలోచింపచేస్తున్నది...... అని అన్నాడు .

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Fast News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

మన సంస్కృతి

ఒక సమాజం చేసిన, వాడిన పరికరాలు, నిర్మించిన కట్టడాలు, వారి సంగీత, కళ, జీవన విధానం, ఆహారం, శిల్పం, చిత్రం, నాటకం, నాట్యం, సినిమా - ఇవన్నీ ఆ సమాజపు సంస్కృతిని సూచిస్తాయి.ఒక సమాజంలో ఉన్న వస్తు వినియోగం, సంపన్నత, జానపద వ్యవహారాలు కూడా సంస్కృతిగా భావింపబడుతాయి.వస్తువుల వినియోగమే కాకుండా ఆటి ఉత్పత్తి విధానం, వాటిని గురించిన దృక్పధం, సమాజంలో ఆ వస్తువులతోపాటు పెనవేసుకొని పోయిన సంబంధాలు, ఆచారాలు కూడా సంస్కృతిలోనివే అనిమానవ శాస్త్రజ్ఞులుభావిస్తారు. కనుక కళలు, విజ్ఞానం, నైతికత కూడా సంస్కృతేనని వీరి అభిప్రాయం.