Telugu Fast News

Telugu Fast News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telugu Fast News, Media/News Company, Hyderabad.
(1)

ఇది కేదార్నాథ్ ఆలయం. జ్యోతిర్లింగ క్షేత్రం ఈ ఆలయం ఆరునెలలు ఇలా మంచుతో కప్పబడి ఉంటుంది. అలా మంచు తో కప్పబడిన ఆరు నెలలు  ఆ...
23/10/2025

ఇది కేదార్నాథ్ ఆలయం. జ్యోతిర్లింగ క్షేత్రం ఈ ఆలయం ఆరునెలలు ఇలా మంచుతో కప్పబడి ఉంటుంది. అలా మంచు తో కప్పబడిన ఆరు నెలలు ఆలయాన్ని మూసే ఉంచుతారు. ఆలయాన్ని మూసే రోజు అఖండ జ్యోతిని వెలిగిస్తారు. అలా ఆరు నెలలు ఆ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. మళ్లీ ఆలయం తెరిచేంతవరకు. అలా మంచుతో కప్పబడిన ఆలయంలోకి ఆక్సిజన్ ఎలా వెళుతుంది, ఆ జ్యోతి ఎలా వెలుగుతుంది, అంతా శివ లీల.
ఓం నమశ్శివాయ 🚩 🚩

పరమ శివుని అనుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికి మంచి విందు ...
23/10/2025

పరమ శివుని అనుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని అనుకున్నాడు కుబేరుడు.

దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు. శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు,నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో........ అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు.

శివుడు సర్వాంతర్యామి. ఎవరెవరు..... ఎప్పుడెప్పుడు...... ఏమనుకుంటున్నారో.... అన్నీ తెలుసుకోగలడు. కుబేరుని అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి పధకాన్ని అర్దం చేసుకుంది.

కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి, మహాదేవా! మీరు, పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు. శివుడు తనకు కుదరదన్నాడు......, భర్త రాకుండా తానుకూడా రానన్నది పార్వతీ దేవి.

ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే 'అమ్మా! ఆకలేస్తోంది, తినడానికి ఏదైనా ఉంటే పెట్టు' అన్నాడు గణపతి. పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి 'కుబేరా! మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు' అనగా, శివుడు 'ఔనౌను, గణపతికి విందు భోజనం అంటే మహాఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకు వెళ్ళు......' అన్నాడు పరమశివుడు.

హా! ఈ పసిపిల్లవాడా...., నా ఇంటికి విందుకోచ్చేది. ఎంత తింటాడులే... అనుకుంటూనే గణపతిని తీసుకుని తన భవనంలోకి తీసుకెళ్ళి, అక్కడ ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపించసాగాడు. ఇవన్నీ వ్యర్ధం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా, కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు.

వెంటనే బంగారు కంచం పెట్టి, రకరకాల తీపి పదార్థాలు, పానీయాలు, కూరలు, పండ్లు..... గణపతికి వడ్డించారు. కుబేరుడు చూస్తుండగానే ఒక్కపెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి, ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు. సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గనపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు.

వంటవారికి ఆహారం వండడం గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది. విషయం కుబేరునికి తెలిసింది. తన సంపద మొత్తం తరిగిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడంలేదు, ఏమి చేయాలో అర్ధంకాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని, నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావా అంటూ పలికాడు.

కుబేరుడికి విషయం అర్ధమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏ మాత్రం సంతృప్తి పరచలేదని, అన్నీ ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్ళాడు.

శివా! శంకరా! నేవే దిక్కు. ధనానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్నీ ఖాళీ చేసి, అన్నీ ఇచ్చిన భగవంతుడే, అహంకరించినవారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు.

మీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను. ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. అప్పుడు శివుడు "కుబేరా! నువ్వు ఇంతసేపు అహకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావల్సినది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం, నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మాత్రమే గణపతి చూస్తాడు.

ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకుని, అహంకారం విడిచి, చేసిన తప్పుని ఒప్పుకుని పరమభక్తితో గణపతికి సమర్పించు" అన్నాడు.

కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పేడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేన్పులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు.

మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం. కుబేరుడి అహంకారాన్ని అణిచివేసిన గణపతి, మనలోని అహంకారాన్ని కూడా పటాపంచలు చేయుగాక..!!

అరుణాచల👏ఒకరోజు కళ్ళ డాక్టర్ ఆశ్రమానికి వచ్చారు. చదవటానికి సరిగాలేని మహర్షి కళ్లజోడును ఆ డాక్టరుకు చూపించారు. వాటిని పరిశ...
22/10/2025

అరుణాచల👏
ఒకరోజు కళ్ళ డాక్టర్ ఆశ్రమానికి వచ్చారు. చదవటానికి సరిగాలేని మహర్షి కళ్లజోడును ఆ డాక్టరుకు చూపించారు. వాటిని పరిశీలించిన డాక్టర్ తన స్వంత కళ్లజోడు మహర్షి కళ్ళకి సరిగ్గా సరిపోతుందన్నాడు.
అక్కడేఉన్న ఒక ఆశ్రమ భక్తుడు, డాక్టర్ కళ్ళజోడుని మహర్షికి చూపగా, మహర్షి చూపుకి అది సరిపోయింది.
ఆశ్రమ భక్తుడు డాక్టర్ని ఒప్పించి , డాక్టర్ కళ్లజోడును మహర్షికి ఇచ్చి, మహర్షి ఈ కళ్ళజోడును ఉపయోగించాలి అని కోరారు. కాని మహర్షి ఆ కళ్ళజోడును ఉపయోగించడానికి ఒప్పుకోలేదు.
ఆ భక్తుడు , కళ్ళజోడును తీసుకోమని మహర్షిని ఒత్తిడి చేశాడు. అప్పుడు మహర్షి ఆ భక్తుని వంక చూసి, “హూఁ! నేను వద్దన్న వాటిని తీసుకోవాలని అట్లా బలవంతం చేస్తావు ఏమిటి?" అని కోపంగా అన్నారు.
మహర్షి హుంకారం చూసి ఆ భక్తుడు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆ సంఘటన జరిగిన నిమిషం నుండి ఆ భక్తునిలో ఒక పెద్ద మంట ప్రారంభమయింది. ఆ భక్తుడు ఏ పనిలో ఉన్నా ఆ మంట అతనిని కాల్చేస్తోంది. ఇంక ఆ బాధను భరించలేక, భక్తులతో కూర్చున్న మహర్షి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు.
మహర్షి పాదాలపై పడి “స్వామి! నన్ను క్షమించి అనుగ్రహించండి. ఆ కళ్లజోడు తీసుకోమని నేను మిమ్మల్ని బలవంతం చేసి అపరాధం చేసాను. నా మీద హుంకరించారు. తమ హుంకారం ( అరుణాగ్ని ) నా వెంటబడి కాలుస్తోంది. నేనింక తట్టుకోలేను. రెండు రోజులుగా, రాత్రింబవళ్లు భరించాలని చూసాను. ఇంక నా వల్ల కాదు. నా కర్మే నన్ను కాలుస్తోంది. నన్ను కరుణా దృష్టితో చూచి ఈ అగ్నిని ఆర్పండి” అన్నాడు.
మహర్షి, ఆ భక్తుని వంక చూచి, “ఏమిటి ఇదంతా! నాకు నీ మీద కోపం రాలేదే! గొడవ పడకు; కూర్చో; అంతా సర్దుకుంటుంది” అన్నారు.
ఆశ్చర్యంగా కొంత సమయంలో ఆ భక్తుని బాధంతా పోయి సంతోషంగా ఉన్నాడు. అక్కడి భక్తులు ఆనందించారు.

జీవితాన్ని కొత్తకోణం లో  చూపిన TCS ఇంటర్ నేషనల్  కల్చరల్  ఎక్స్‌ ఛేంజ్ ప్రోగ్రాం -  కె.రిడ్జ్ International School.విలువ...
22/10/2025

జీవితాన్ని కొత్తకోణం లో చూపిన TCS ఇంటర్ నేషనల్ కల్చరల్ ఎక్స్‌ ఛేంజ్ ప్రోగ్రాం - కె.రిడ్జ్ International School.

విలువలతో కూడిన సమాజాలు ఎలా ఉంటాయి?
వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే అద్భుత చర్చతో ఇంటర్ నేషనల్ కల్చరల్ ఎక్స్‌ ఛేంజ్ ప్రోగ్రాం జరిగింది.

6 నెలలు ప్యారిస్ జర్మని రష్యా వంటి దేశాలకు అతిధులు గా విద్యార్డులు ఎలా వెళతారో తెలుసా ?

ఆ వివరాలు విద్యార్డులకు తెలియజేసేందుకు కెరిడ్జ్ లో ఒక సదస్సు జరిగింది. వందలాది విదేశీ విద్యార్థు లను భారతదేశానికి తీసుకు వచ్చి ' వివిధ విదేశీ విద్యా సంస్థల కు విద్యార్డును కల్చరల్ ఎక్స్‌ఛేంజ్ పై పంపించే అనుభనజ్ఞడు TCS ( Trust Consultancy for studies) సంస్థ అధ్యక్షులు రెహమాన్ గారిని పోలీగ్లాట్ పూలబాల కే రిడ్డ్కి తీసుకు వచ్చారు.

రహమాన్ గారు ప్ప్రిస్స్పాల్ బర్నబాస్ గారిని కలిసి కేరిడ్డ్ స్కూల్ ని సందర్శించారు. మద్యాహ్న భోజనానంతరం జరిగిన సదస్సులో విద్యార్ధుల నుద్దేశించి ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగించారు.
విదేశాలలో విద్య జీవితంలో కొత్తవిషయాలను సంసృతిని గ్రహించడానికి ఉపయోగ పడుతుందని. జీవితాని కొత్తకోణం లో చూడడానికి ఉపయోగ పడుతుందని చెప్పారు. ఈ సమావేశం లో కెరి ర్డ్ విద్యార్డులు ఉపాద్యాయులు పాల్గన్నారు.
చివరిలో పూలబాల రెహమాన్ గారి తో వ్యక్తిత్య వికాశానికి దోహద పడే అనేక విషయాలను ప్రశ్నాకార్యక్రమం చేపట్టి అనేక కొత్త విషయాలు తెలియ జేయడం ద్వారా ఆనంద పరిచారు.కెరిడ్జ్ చైర్మన్ నాతాని వెంకటేశ్వరులు గారుఇలాటి కార్యక్రమాలు వేల్యూ ఎడిషన్ గా పేర్కొని ఈ కార్యక మం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. పూలబాలను అభినందించారు.

🔱 మహా మృత్యుంజయ మంత్రం 🔱ఓం త్రయంబకం యజామహేసుగంధిం పుష్టి వర్ధనంఉర్వారుక మివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్ఓం త్రయంబకం అ...
21/10/2025

🔱 మహా మృత్యుంజయ మంత్రం 🔱

ఓం త్రయంబకం యజామహే
సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాన్
మృత్యోర్ముక్షీయ మామృతాత్

ఓం త్రయంబకం అర్థం
​ఓం: పరమేశ్వరునికి సూచిక.
​త్రయంబకం: మూడు కన్నులు (భూత, భవిష్యత్, వర్తమాన జ్ఞానం) కలవాడు.
​యజామహే: ఆరాధిస్తున్నాము.
​సుగంధిం: మంచి సువాసన (గొప్ప పేరు/జ్ఞానం) కలవాడు.
​పుష్టి వర్ధనం: పోషణని, ఆరోగ్యాన్ని పెంచేవాడు.
​ఉర్వారుక మివ: దోసకాయ పండులాగా.
​బంధనాన్: కాండం బంధనం నుండి (బంధాల నుండి).
​మృత్యోర్ముక్షీయ: మృత్యువు నుండి విముక్తిని ఇవ్వు.
​మామృతాత్: మోక్షం నుండి (లేదా అమరత్వం నుండి) కాకుండా.
​మొత్తం అర్థం:
​ముక్కంటి, దివ్య పరిమళం, పోషణని పెంచేవాడా! దోసకాయ పండు ఎలాగైతే తన కాండాన్ని విడిచిపెడుతుందో, అలాగే నన్ను మృత్యువు బంధాల నుండి విముక్తుడిని చేసి, మోక్షాన్ని లేదా అమరత్వాన్ని ప్రసాదించు.

పక్షుల్లో గద్ద ఒక ప్రత్యేకమైన పక్షి.. గద్ద అంటే అందరూ అశుభం అనుకుంటారు... పక్షులకే రాజు గద్ద... దీని జీవితం గురించి... మ...
21/10/2025

పక్షుల్లో గద్ద ఒక ప్రత్యేకమైన పక్షి..
గద్ద అంటే అందరూ అశుభం అనుకుంటారు...
పక్షులకే రాజు గద్ద...
దీని జీవితం గురించి...
మిగతా పక్షులకంటే గద్ద జీవితం చాలా భిన్నంగా ఉంటుంది.

గద్ద తన దృష్టికి ఉన్న శక్తితో మేఘాలపై నుంచి కూడా భూమిపై తన లక్ష్యాన్ని చూడగలదు.
అంతటి శక్తి గద్ద చూపుకు ఉంటుంది.
వివిధ రకాల ఆకారాల్లో చాలా చురుకుగా గద్ద ఆకాశంలో ఎగురుతుంది. గద్ద గురించి మనం చెప్పుకోవలసిన మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది.
అదే గద్ద పునర్జన్మ.
గద్దకు పునర్జన్మ ఏంటి అనుకుంటున్నారా...?
గద్ద పునర్జన్మ గురించి తెలుసుకోవాలంటే గద్ద జన్మ రహస్యం గురించి తెలుసుకోవాల్సిందే.

గద్ద సుమారు 70 సంవత్సరాల వరకు జీవించగలదట.
గద్దకు 30 నుండి 40 సంవత్సరాల వయసు రాగానే అది క్రమంగా బలహీన పడడం మొదలవుతుంది.
ఈ సమయంలోనే గద్ద పంజాలు బలహీన పడి వేటాడడానికి సహకరించవట.
ముక్కు బాగా పెరిగిపోయి ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది.
రెక్కలు బాగా పెరిగి సరిగ్గా ఎగరలేదు.
అంటే ఓ రకంగా ముసల్ది అయిపోయి ఏ పని చేయలేదనమాట.
ఇలాంటి విపత్కర సమయంలో గద్ద ముందు రెండే ఆప్షన్స్‌ ఉంటాయి.
ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఇదే శరీరంతో ఆహారం లేక మరణించడం...
లేక కొత్త జీవితాన్ని ప్రారంభించడమా...
కానీ గద్ద మాత్రం రెండో దారిని ఎంచుకుని పునర్జన్మ ఎత్తడానికి సిద్ధమవుతుందట..

కఠోర శ్రమతో తనను తాను మార్చుకోవడానికి సిద్దమైన గద్ద ఒక ఎత్తైన పర్వతానికి చేరుకుంటుంది.
అక్కడ తాత్కాలికంగా నివాసాన్ని ఏర్పరుచుకుంటుంది. ముందుగా ఆహారం తీసుకోవడానికి వీలు లేకుండా పెరిగిన తన ముక్కును బండరాయికి పొడుచుకోవడం ప్రారంభిస్తుందట...
నొప్పి పెడుతున్నప్పటికీ పెరిగిన ముక్కును అరగదీస్తుంది…
అలాగే గుబురుగా పెరిగి ఎగరడానికి సహకరించని తన రెక్కలను ఒక్కొక్కటిగా తానే తొలగించుకుంటుంది.

ఇక చివరగా తన పంజాలను బండరాయికి వేసి కొడుతూ విరగ్గొట్టుకుని కొత్త పంజాల కోసం ఎదురు చూస్తుంది.
ఇలా 150 రోజుల పాటు శ్రమించిన తరువాత గద్ద కొత్త రెక్కలతో, కొత్త ముక్కుతో, కొత్త పంజాతో నవ యవ్వనంగా నూతనోత్తేజంతో కొండ శిఖరంపై ఎగురుతుంది.
ఆత్మ విశ్వాసం కోల్పోకుండా ఎలాగైనా బతకాలనే సంకల్పంతో 5 నెలల పాటు తనను తాను కొత్తగా మార్చుకున్న గద్ద మిగతా 30 సంవత్సరాల పాటు హాయిగా జీవిస్తుందట...
భలే ఉంది కదా..!

కుదిరితే పరిగెత్తు..లేకపోతే నడువు..అదీ చేతకాకపోతే పాకుతూ పో..అంతేకాని ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు’’.. అంటూ మహాకవి శ్రీశ...
20/10/2025

కుదిరితే పరిగెత్తు..లేకపోతే నడువు..అదీ చేతకాకపోతే పాకుతూ పో..అంతేకాని ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు’’.. అంటూ మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలను ఆమె అక్షరాలా అమలు చేస్తున్నారు. 93 ఏళ్ల వయసులోనూ మొక్కవోని దీక్షతో రోజూ రానూపోనూ 140 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ విద్యార్థులకు ఫిజిక్స్‌ పాఠాలు చెబుతున్నారు. కాలం ఎంతో విలువైనదని..దానిని ఎప్పుడూ, ఎవరూ వృథా చేయకూడదని చెబుతున్న ఆమె పేరు ప్రొఫెసర్‌ చిలుకూరి శాంతమ్మ.

పంచే కొద్దీ జ్ఞానం పెరుగుతుందని నమ్మే శాంతమ్మ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించగా విజయనగరం జిల్లా సెంచూరియన్‌ యూనివర్శిటీలో రెండు ఊత కర్రల సాయంతో నడుస్తూ... విద్యార్థులకు భౌతిక శాస్త్ర పాఠాలు బోధిస్తూ కనిపించారామె. వయసు మీదపడిందనే సంకోచం ఏమాత్రం ఆమెలో కనిపించలేదు. ఈ వయసులోనూ సంపూర్ణ ఆరోగ్యంతో అధ్యాపకురాలిగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న శాంతమ్మ తన జీవన ప్రయాణం గురించి ‘సాక్షిప్రతినిధి’కి చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే..

‘‘మా స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం..1929 మార్చి 8న జన్మించాను. నా తండ్రి సీతారామయ్య, న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు. నేను ఐదు నెలల పసికందుగా ఉన్నప్పుడే ఆయన మా నుంచి దూరమయ్యారు. మా అమ్మ వనజాక్షమ్మ మాత్రం 104 ఏళ్లు జీవించారు. రాజమండ్రి, మదనపల్లి ప్రాంతాల్లో నా పాఠశాల విద్యాభ్యాసం గడిచింది. విశాఖపట్నం మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏవీఎన్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివాను.

అప్పుడే మహారాజా విక్రమ్‌ దేవ్‌ వర్మ నుండి భౌతికశాస్త్రంలో బంగారు పతకాన్ని అందుకున్నాను. ఫిజిక్స్‌ అంటే అంత ఇష్టం. అందులోనే బీఎస్సీ ఆనర్స్‌ చేశాను. ఆంధ్రా యూనివర్సిటీ నుండి మైక్రోవేవ్‌ స్పెక్ట్రోస్కోపీలో పీహెచ్‌డీకి సమానమైన డీఎస్సీ పూర్తి చేసి, ఆ తర్వాత 1956లో ఆంధ్రా యూనివర్సిటీలోని కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఫిజిక్స్‌ లెక్చరర్‌గా చేరాను. లెక్చరర్‌ నుండి ప్రొఫెసర్, ఇన్వెస్టిగేటర్, రీడర్‌ వరకూ అనేక బాధ్యతలు నిర్వర్తించాను.

ఇవన్నీ చేసే సరికి తెలియకుండానే 60 ఏళ్ల వచ్చేశాయి. 1989లో తప్పనిసరై పదవీ విరమణ చేశాను. విద్యార్థులకు ఇంకా పాఠాలు చెప్పాలనిపించింది. మళ్లీ ఆంధ్రా యూనివర్సిటీలో గౌరవ అధ్యాపకురాలిగా చేరాను. అక్కడే ఆరేళ్లు గడిచిపోయింది. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్, యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో పరిశోధనాత్మక ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశాను.

పాఠాలు భోదిస్తూ...
వృత్తిలో భాగంగా చాలా దేశాలు వెళ్లొచ్చాను. యూఎస్, బ్రిటన్, కెనడా, స్పెయిన్‌తో సహా అనేక దేశాల్లో జరిగిన సమావేశాలకు హాజరయ్యాను. అటామిక్‌ స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యులర్‌ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన అంశాలపై చేసిన విశ్లేషణ 2016లో వెటరన్‌ సైంటిస్ట్స్‌ క్లాస్‌లో అనేక అవార్డులతో పాటు బంగారు పతకాన్ని సాధించిపెట్టింది. 12 మంది విద్యార్థులు నా పర్యవేక్షణలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.

నా భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మూడేళ్లు ఆయన మంచంపైనే ఉన్నారు. అంతకు ముందు వరకూ రోజూ నన్ను ఎక్కడికైనా ఆయనే తీసుకువెళ్లేవారు. ఆయన తెలుగు ప్రొఫెసర్‌ కావడంతో నాకు ఉపనిషత్తుల గురించి బోధించేవారు. ఆయన వల్లనేమో పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులపై కూడా ఆసక్తి ఏర్పడింది. భగవద్గీత శ్లోకాలను ఆంగ్లంలోకి అనువాదం చేసి ‘భగవద్గీత ది డివైన్‌ డైరెక్టివ్‌‘ అనే పుస్తకాన్ని రచించే వరకూ వెళ్లింది.

వయసుతో వచ్చే సమస్యలు నన్నేమీ చేయలేకపోయాయి. రెండు మోచిప్పలకూ శస్త్ర చికిత్స జరిగి ఇరవై ఏళ్లయ్యింది. అయినా ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాను. చనిపోయేవరకూ చదువు చెప్పాలనేది నా సంకల్పం. నేను క్లాస్‌ తీసుకుంటే విద్యార్థులెవరూ మిస్‌ అవ్వరు. అలాగే క్లాస్‌కి ఆలస్యంగా వెళ్లడం నా డిక్షనరీలో లేదు. సెలవు రోజుల్లోనూ ప్రత్యేక క్లాసులకు వస్తుంటాను. ఎందుకంటే యూనివర్శిటీలోని విద్యార్థులే నా పిల్లలు.

పొద్దున్న 4 గంటలకే నిద్ర లేస్తాను. విశాఖపట్నంలో బయలుదేరి విజయనగరం చేరుకుంటాను. ఇక్కడి సెంచూరియన్‌ యూనివర్శిటీలో రోజుకు కనీసం ఆరు క్లాసులు తీసుకుంటాను. చిత్రమేమిటంటే ఆంధ్రా యూనివర్శిటీ మాజీ వీసీ, ఇప్పుడు సెంచూరియన్‌ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్‌ జీఎస్‌ఎన్‌ రాజు నా దగ్గరే చదువుకున్నారు. ప్రపంచంలోనే పెద్ద వయసు ప్రొఫెసర్‌ను నేనేనట. గిన్నిస్‌బుక్‌ వాళ్లకు నా పేరును సూచిస్తానని నా శిష్యుడు రాజు ఈ మధ్యనే అన్నారు.

మాది ఆరెస్సెస్‌ నేపథ్యం ఉన్న కుటుంబం... డబ్బు, ఆస్తిపాస్తులపై మమకారం లేదు. మా వారు ఇంటిని కూడా వివేకానంద మెడికల్‌ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చేద్దామంటే సరే అన్నారు. ఇప్పుడు అద్దె ఇంటిలో ఉంటున్నాను. మావారికి ఆరోగ్యం బాగోలేనప్పడు ఒక అబ్బాయి నాకు తోడుగా ఉండేవాడు. అతనిని చదివించి, పెళ్లి చేశాను. అతనికి ముగ్గురు పిల్లలు.. అతనితోపాటు అతని భార్య, పిల్లలు కలిపి ఇంట్లో మొత్తం ఆరుగురం. అందరం అదే అద్దె ఇంటిలో జీవిస్తున్నాం’’.

 #బ్రహ్మ,విష్ణువు, మహేశ్వరుడు కలిసి ఉన్న ఆలయం మీకు తెలుసా? అదీ మన తెలుగు రాష్ట్రంలో ? * #ఒకే గుహలో చెక్కిన 9 ఆలయాలు *ప్ర...
20/10/2025

#బ్రహ్మ,విష్ణువు, మహేశ్వరుడు కలిసి ఉన్న ఆలయం మీకు తెలుసా? అదీ మన తెలుగు రాష్ట్రంలో ? *
#ఒకే గుహలో చెక్కిన 9 ఆలయాలు *
ప్రకాశం జిల్లా..అదేనండీ..మన ఆంధ్ర ప్రదేశ్ లో ప్రకాశం జిల్లానే…అందులో సి.యస్. పురం మండలం..సి.యస్.పురం అంటే పూర్తిపేరు చంద్రశేఖరపురం. ఆ మండలంలో వున్నది అంబవరం కొత్తపల్లి అనే ఊరు. ఆ ఊళ్ళోనే వున్నది అందాలకి ఆటపట్టు, అద్భుతాలకు నెలవైన లోయ #భైరవకోన. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దులలో వున్నదీ ప్రదేశం.
ప్రకాశంజిల్లా ముఖ్యపట్టణమైన ఒంగోలుకు 120 కి.మీ.ల దూరంలో వున్నది అంబవరం కొత్తపల్లి. అంబవరం కొత్తపల్లి మరియు సి.యస్. పురం దాకా బస్సులున్నాయి. అక్కడనుండీ ప్రైవేటు వాహనాల్లో ఇక్కడికి చేరుకోవాలి. సమయాభావం వున్నవారు ముందు నుంచి వారు ఏర్పాటు చేసుకున్న వాహనాలలో వెళ్ళివస్తే మంచిది. ఈ ప్రాంతమంతా నల్లమల అడవులు వ్యాపించి వున్నాయి. అడవుల అద్బుత సౌందర్యమేకాదు..7, 8 శతాబ్దాలలో పల్లవ రాజుల సమయంలో నిర్మింపబడిన అందాల ఆలయాలు కూడా చూపరుల మనసులు దోచుకుంటాయి. ఇవే కాకుండా ఇక్కడవున్న మిగతా విశేషాలేమిటంటే ….
ఈ కోనలో కారు దిగగానే కనిపించేది పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం. ఆయన పక్కనుంచే వున్న దోవలో లోపలకి వెళ్తే 200 మీటర్ల ఎత్తునుంచి దూకే జలపాతం. జలపాతంలో నీరు వున్నా వేసవికాలంలో నీరు అతి తక్కువగా వుంటుంది. కొండలమీద నుంచి కారే ఆ అతి తక్కువ నీరు కింద నిర్మింపబడ్డ పెద్ద సిమెంటు టబ్లలో చేరుతాయి. వచ్చినవారందరూ అక్కడ స్నానం చేస్తున్నారు. ఈ జల ప్రవాహం తను పయనించే దోవలో వున్న వివిధ వైద్య మూలికలను ఒరుసుకుని ప్రవహించటంతో ఆ నీటిలో స్నానం చేసినవారికి అనేక రుగ్మతల నుంచి విముక్తి లభిస్తుందని ఇక్కడివారి నమ్మకం. అందుకే నీరు ఎంత తక్కువ వున్నా వచ్చిన వారిలో చాలామంది స్నానం చేస్తుంటారు.
ఇక్కడి ఇంకొక విశేషం నిత్యాన్నదానం. జలపాతం దగ్గరకెళ్ళే దోవలోనే కుడివైపు నిత్యాన్నదానశాల వుంది. ఇక్కడ మధ్యాహ్నం, రాత్రి వచ్చినవారందరికీ భోజనం పెడతారు. ఈ దోవలోనే ఎడమవైపు దేవస్ధానం వారివే రెండు కాటేజ్ లు వున్నాయి. మరీ అవసరమైతే అక్కడ వుండవచ్చు. ఆ మొదట్లోనే టీ షాపు వున్నది. ఇవి తప్పితే ఈ ప్రాంతంలో ఇంకేమీ దొరకవు. రాత్రిళ్ళు మనుష్య సంచారం తక్కువ వున్నా ఏమీ భయం లేదని టీ కొట్టువాళ్ళు చెప్పారు. వాళ్ళు 15 సంవత్సరాల నుంచీ అక్కడే వుంటున్నారుట.
అడవులూ, జలపాతమే కాదు సుమండీ..వాటిని మించిన సుందర దృశ్యమాలిక కావాలంటే మీరు కారాపిన చోటికి రండి. అక్కడ ఎదురుగా ఒక వంతెన, కొంచెం ఎడమవైపు వెళ్తే ఇంకో వంతెన వస్తుంది. వీటిలో దేనిమీదయినా బయల్దేరండి. మీరే ఊపిరి బిగబట్టి మరీ చూస్తారాసుందర దృశ్యాలని..
ఒకే కొండరాతిలో చెక్కిన తొమ్మిది గుహాలయాలు. అన్నీ శివాలయాలు. అవి శశినాగ, రుద్రేశ్వర, విశ్వేశ్వర, నగరికేశ్వర, భార్గేశ్వర, రామేశ్వర, మల్లికార్జున, పక్షమాలిక లింగ. గుహలంటే మరీ లోతుగా వుండవు. మనం లోపలకు వెళ్ళక్కరలేకుండానే దైవ దర్శనం చేసుకోవచ్చు. ఆ గుహాలయాల వెలుపల అందమైన శిలా మూర్తులు. భారత దేశంలో ఎక్కడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఒకే చోట పూజించే ఆలయాలు వున్నట్లు లేదు. కానీ ఇక్కడ మాత్రం, త్రిమూర్తులు ఒకే చోట కొలువై వున్నారు. శివుని కోసం చెక్కిన ఈ గుహాలయాలలో శివుడు మధ్యన గర్భగుడిలో లింగరూపుడై పూజలందుకుంటుంటే, ఆలయ ప్రవేశ గోడమీద బ్రహ్మ, విష్ణువుల విగ్రహాలు చెక్కి వున్నాయి. ప్రతి ఆలయానికి ముందు ఎడమవైపు విఘ్నేశ్వరుడు, కుడివైపు ఆలయం చెక్కిన శిల్పి (పూజారిగారు చెప్పారు..ముందు మేము కుబేరుడనుకున్నాము), విగ్రహాలుంటాయి. ఈ ఆలయాలన్నీ ఒకే శిల్పి చేత చెక్కబడటం విశేషం.
ఈ శివాలయాలన్నీ పై వరసలో వుంటే కింద ఆలయంలో త్రిముఖ దుర్గ, ముందు శివలింగం పూజలందుకుంటున్నాయి. ఈ దుర్గ కుడివైపు ముఖం మహాకాళి..నోట్లోంచి జ్వాల వస్తూ వుంటుంది. మధ్యన మహలక్ష్మి, ప్రసన్నవదన. ఎడమవైపు మహా సరస్వతీదేవి. ఎక్కడా లేనట్లు ఇక్కడ సరస్వతీదేవి అద్దం చూసుకుంటూ వుంటుంది. కారణం అడిగితే పూజారిగారు తన భీకరమైన స్వరూపం భక్తులు చూస్తే తట్టుకోలేరని అలా అద్దం ద్వారా చూస్తే కొంత తీవ్రత తగ్గుతుందని చెప్పారు. నా కోతి బుధ్ధి అంగీకరించలేదు. నాకు తెలిసి సరస్వతీదేవి సౌందర్యవతి, జ్ఞాన ప్రదాత.. తను ఉగ్ర రూపిణి కాదు అంటే…అయితే ఆవిడ తన అలంకరణ చూసుకుంటోంది అనుకోండి అన్నారు.
ఇక్కడ నన్ను అమితంగా బాధించినదేమిటంటే..ఆ ఆలయాలు నిర్మింపబడి ఇన్ని వందల సంవత్సరాలయినాయి. ఇదివరకు రోజుల సంగతి మనకి తెలియదు. ఇప్పుడు ఇన్ని సౌకర్యాలు, సాధనాలు అందుబాటులో వున్నాయి. చదువు, తెలివిగల ప్రజలు, ప్రభుత్వమూ వుంది. వీరెవ్వరూ వీటిని గురించి ఎందుకు పట్టించుకోవటం లేదు.?? కనీసం ఇలాంటి కొన్ని ప్రదేశాల చరిత్రలన్నా పరిశోధించి ప్రజలకందజేస్తే, మన గత వైభవం అందరికీ పరిచయం చేసిన వారవుతారుకదా. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి నిర్మించిన ఇలాంటి అపురూప నిర్మాణాల చరిత్ర కాలగర్భంలో కలిసిపోయి ఎవరికి తోచిన కథలు వారు చెప్పుకోవలసినదేనా!!?? ఇదే ఏ విదేశాలలోనన్నావుంటే ఎంత శ్రధ్ధ తీసుకునేవారోకదా అని.
పూజారిగారు చెప్పిన ఇంకొన్ని విశేషాలు.
ఈ ప్రాంతంలో కోటి ఒక్క శివలింగాలు, 101 కొలనులు వున్నాయి.
అమ్మవారి ఆలయానికి ఎదురుగా చిన్న కోనేరు మూసి వున్నది హైదరాబాదులో ఇళ్ళల్లో వుండే నీటి సంపుల్లా. కార్తీక పౌర్ణమినాడు చంద్రకిరణాలు ఆ నీటిలోపడి (ఆ రోజు మూత తీస్తారు) ఆ ప్రతిబింబం అమ్మవారిమీద పడుతుందిట. ఆ అద్భుతం చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారుట.
పక్కన ఒక గుహలో సొరంగ మార్గం వున్నది. అది హనుమనగిరి దాకా వెళ్తుంది. ఆ ఆలయాలన్నీ చెక్కిన శిల్పి సమాధి అక్కడ వుంది.
ఒక కొండమీదకి మెట్లు వున్నాయి. పైన ఏమున్నదంటే దుర్గాలయం అన్నారు. అలసిపోయుండటంతో ఎక్కలేదు. ఇంకో చిన్న కొండమీదకి మెట్లు..లక్ష్మీ, అన్నపూర్ణాలయాలనే బోర్డు కనబడింది. పైకి వెళ్తే చిన్ని గుహ, మనిషి కూర్చుని వెళ్ళాలి లోపలికి.. లోపల 2, 3 కూర్చోవచ్చు. లోపల లక్ష్మీదేవి, అన్నపూర్ణేశ్వరీదేవి చిన్న విగ్రహాలున్నాయి. అక్కడ పూజారిగారు శ్రీ కాశీరెడ్డి నాయనగారి శిష్యులు. ఆయన ఈ ప్రాంతం గురించి చెప్పిన విశేషాలు...
పూర్వం ఈ ప్రాంతాన్ని భైరవుడు అనే రాజు పాలించేవాడు కనుక భైరవకోన అనే పేరు వచ్చిందని కొందరంటారు. పూర్వం మునులు ఇక్కడ భైరవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి తపస్సు చేశారుకనుక భైరవకోన అనే పేరని ఇంకొందరంటారు. ఏది ఏమైనా, ఈ కోన క్షేత్రపాలకుడు భైరవుడు. ఆయనకో చిన్న ఆలయం వున్నది త్రిముఖ దుర్గాలయానికి ఎదురుగా గట్టుమీద.
పూర్వం ఈ ప్రాంతాన్ని అభివృధ్ధిపరచినవారిలో శ్రీ అన్నకావిళ్ళ సుబ్బయ్యతాత అనే ఆయన ముఖ్యులు. ఈయన విగ్రహం ఇక్కడ వున్నది. ఇక్కడ అన్నపూర్ణేశ్వరీమాత కొలువైవుండటానికికూడా ఆయనే కారణం. ఆయన శివ భక్తుడు. శివుడు స్వప్న దర్శనమిచ్చి నిన్ను కరుణిస్తానన్నాడట. కానీ ఎన్నాళ్ళకూ కనికరించలేదుట. అప్పుడాయన అమ్మతో మొరబెట్టుకున్నాడుట. అమ్మ ఆయన ఆర్తి గమనించి అన్నపూర్ణేశ్వరీ రూపాన కనిపించినదట. మరి నిన్ను నేను కరుణిస్తే నాకేమిస్తావని భక్తుడికి పరీక్షపెట్టినదట. అప్పుడా భక్తుడు నాదగ్గరకొచ్చిన వాళ్ళకి నేను మంచి చెయ్యాలి. అలా నాకు వరమివ్వు. నేను బతికున్నంతకాలం నీకు ఏదోవిధంగా నైవేద్యం పెడతానని చెప్పాడుట. ఆయన పరోపకార తత్వాన్ని గ్రహించిన జగజ్జనని ఆయన్ని అనుగ్రహించటమేగాక అన్నపూర్ణాదేవిగా అక్కడే స్ధిరపడ్డది.
కాలచక్ర భ్రమణంలో కొంతకాలం మరుగునబడిన ఈ ప్రదేశం తిరిగి 1932లో బయటపడింది. 1949లో శ్రీ కాశీరెడ్డినాయన ద్వారా అందరికీ తెలిసింది. అద్భుతమైన పర్యాటకప్రాంతంగా అభివృధ్ధి చెయ్యటానికి అన్నివిధాలా తగిన ప్రదేశం ఇది. ఇలాంటి అద్భుత క్షేత్రాలను పర్యాటక స్ధలాలుగా అభివృధ్ధి పరచి, పరిశోధనలు జరిపించి వాటి చరిత్ర ప్రజలకందజేస్తే ఈ కళలకాణాచిలు మన వైభవాన్ని వేనోళ్ళ చాటుతూ ఎల్లకాలమూ నిలచివుంటాయి కదా..*
#శివయ్యా!
నీవు మాతోనే ఉన్నావా లేదా మాలో కొలువై ఉన్నావా??
నీవు మా హృదయంలో వెలుగై, ప్రతి శ్వాసలో నీ పేరు మ్రోగేలా ఉన్నావు. నీ జటాజూటంలో ప్రవహించే గంగలా మా మనసులు కూడా పవిత్రమవ్వాలి అని కోరుకుంటాం. నీ కంఠంలోని నీలి కాంతి మా జీవితంలోని అంధకారాన్ని పారదోలుతుందని నమ్ముతాం. శివయ్యా, నీ ధ్యానంలో కూర్చుంటే సమాధి వంటి శాంతి వస్తుంది, నీ నామం జపిస్తే భయమంటే తెలియదు. మా చిన్న మనసులు నీలో లీనమై, నీ కరుణతో నిండిపోవాలని కోరుకుంటున్నాము....*

మనం రోజూ వాడే బాల్ పాయింట్ పెన్స్ పూర్తిగా వాడకుండానే పారేసుకుంటుంటాము. దీని వల్ల ఎన్నో లక్షల పెన్స్ భూమిలో కలిసిపోతున్న...
20/10/2025

మనం రోజూ వాడే బాల్ పాయింట్ పెన్స్ పూర్తిగా వాడకుండానే పారేసుకుంటుంటాము. దీని వల్ల ఎన్నో లక్షల పెన్స్ భూమిలో కలిసిపోతున్నాయి.

ఏ పెన్ అయినా మొత్తం ప్లాస్టిక్ తోనే తయారవుతుంది.ప్లాస్తిక్ వల్ల పర్యావరణానికి హాని కాబట్టి మనం వల్ల పారేయబడే పెన్స్ వల్ల భూమండలం పై ఎన్నో లక్షల సంఖ్యలో పేరుకుపోతున్నాయి.

దీనికి తన స్రుజనతో కేరళకు చెందిన లక్ష్మి మేనన్ గారు పేపర్ తో పెన్స్ తయారు చేస్తున్నారు.ఆ పేపర్ పెన్ కు చివరి భాగంలో ఒక విత్తనం గింజను చొప్పించారు.

మనం ఎక్కడైనా ఈ కాగితం పెన్ను ను జార విడిచినా అది భూమిలో కలిసి ఒక మొక్క మొలుస్తుంది.ఈ కాగితం పెన్ ద్వారా ప్లాస్తిక్ పెన్ వల్ల వచ్చే కాలుష్యాన్ని 85 శాతం తగ్గించగలిగారు.

మీరు ఎన్ని సార్లు వెళ్ళారో చెప్పండి.
20/10/2025

మీరు ఎన్ని సార్లు వెళ్ళారో చెప్పండి.

20/10/2025
అహోబిలం శ్రీ మాలోల నరసింహార్ మూలవార్ దివ్య సేవ.... 🙏🌿🙏
19/10/2025

అహోబిలం శ్రీ మాలోల నరసింహార్ మూలవార్ దివ్య సేవ.... 🙏🌿🙏

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Fast News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

మన సంస్కృతి

ఒక సమాజం చేసిన, వాడిన పరికరాలు, నిర్మించిన కట్టడాలు, వారి సంగీత, కళ, జీవన విధానం, ఆహారం, శిల్పం, చిత్రం, నాటకం, నాట్యం, సినిమా - ఇవన్నీ ఆ సమాజపు సంస్కృతిని సూచిస్తాయి.ఒక సమాజంలో ఉన్న వస్తు వినియోగం, సంపన్నత, జానపద వ్యవహారాలు కూడా సంస్కృతిగా భావింపబడుతాయి.వస్తువుల వినియోగమే కాకుండా ఆటి ఉత్పత్తి విధానం, వాటిని గురించిన దృక్పధం, సమాజంలో ఆ వస్తువులతోపాటు పెనవేసుకొని పోయిన సంబంధాలు, ఆచారాలు కూడా సంస్కృతిలోనివే అనిమానవ శాస్త్రజ్ఞులుభావిస్తారు. కనుక కళలు, విజ్ఞానం, నైతికత కూడా సంస్కృతేనని వీరి అభిప్రాయం.