Legend

Legend Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Legend, Media/News Company, Telangana, .

రాష్ట్ర, జాతీయ వార్తా విశేషాలు, రాజ కీయాలు, న్యూస్ వీడియోలు, డిబేట్స్, ఎనాలిసిస్, ప్రముఖల ఇంటర్వ్యూలు, రాజకీయ నాయకులపై స్పెషల్ ఫోకస్ వీడియోలు ఎక్స్ క్లూజివ్ గా మీ Abhi TVఛానల్లో చూడండి...

60 చేతుల నరసింహ స్వామిషష్టి హస్త నరసింహ" అంటే అరవై చేతులు కలిగిన నరసింహ స్వామి యొక్క రూపం. ఇది మన భారతీయ కళాకారుల అద్భుత...
01/08/2025

60 చేతుల నరసింహ స్వామి

షష్టి హస్త నరసింహ" అంటే అరవై చేతులు కలిగిన నరసింహ స్వామి యొక్క రూపం. ఇది మన భారతీయ కళాకారుల అద్భుత నైపుణ్యానికి నిలువెత్తు రూపం. ముఖ్యంగా ఖజురహోలో కనిపించేది. ఈ రూపం 60 చేతులతో ఉంటుంది, ప్రతి చేయి నరసింహ స్వామి యొక్క వివిధ లక్షణాలను సూచిస్తుంది. దురదృష్టవశాత్తు ఈ కళాఖండాన్ని నాటి ముష్కరమూకలు ధ్వంసం చేశారు. ఇది భారతీయ కళకు జరిగిన పెద్ద నష్టం.

01/08/2025

మారుతున్న జీవనశైలితో సంతానలేమి

సమాజంలో మారుతున్న జీవన శైలిని ఆసరాగా కొంతమంది తమ స్వార్థానికి వాడుకుంటున్నారు.ఇటీవల కాలంలో యువతీ యువకులు తమ కేరీర్ ను ప్రధానంగా చేసుకుని,తాము అనుకున్న లక్ష్యం సాధించేవరకూ వివాహం మాట తలపెట్టడంలేదు. దాంతో ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగడంలేదు. మహిళలకు నేటి వివాహం వయస్సు 30- 35 మధ్యకు చేరింది. వివాహం తరువాత సంతానం కోసం కొంతకాలం విరామం పాటిస్తున్నారు. వారు కావాలనుకున్నప్పుడు సంతాన ఉత్పత్తి కష్టమవుతున్నది. ముఖ్యంగా సాఫ్టువేర్,ఇతర వృత్తి ఉద్యోగాల్లో ఉన్న యువతీ యువకులు జీవితంలో స్ధిరపడేసరికీ 35 ఏళ్లు దాటి పోతున్నాయి.ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన మహిళలల్లో అండం ఉత్పత్తి శాతం తగ్గిపోయి సంతానం కలగడంలేదు. పురుషుల్లో కూడా జీవన శైలితో వారి వీర్య బలం తగ్గి సంతానం కలగడం లేదు. దాంతో సంతానసాఫల్య కేంద్రాలు చుట్టూ తిరుగుతున్నారు. ఈ కేంద్రాలు చేసే అక్రమాలు అన్నీ ఇవన్నీ కాదు. ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంతానసాఫల్య కేంద్రం అక్రమాలు బయటపడిన విషయం విదితమే.సాధారణంగా ప్రతి మహిళ కు 20-35 వయస్సులో ఆరోగ్యకరమైన అండాలు ఉత్పత్తి అవుతాయి.వారు ఆ వయసు లో కేరీర్ లో బిజీలో ఉండడంతో "ఎగ్ ఫ్రీజింగ్" పేరుతో అండాలను నిల్వ చేసే సంస్థలు వెలిశాయి. దీనికి సుమారు రెండు లక్షల రూపాయలు వసూలు చేసి అండాలను నిల్వ చేస్తున్నారు.మళ్లీ ప్రతి ఏడాదీ 30 వేలు చెల్లించాల్సిఉంది.అవి 20 ఏళ్ల వరకూ పని చేస్తాయి. మగవారి వీర్యం నిలువ చేసే బ్యాంకులు ఎప్పటినుంచో పనిచేస్తున్నాయి.నేటి ఆధునిక వైద్యశాస్త్రం అభివృద్ధితో పిండాలను నిల్వచేసే విధానం కూడా వచ్చింది.దానిని ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటారు.దీనిని మహిళ గర్భంలో ప్రవేశ పెట్టవచ్చు.పిండం భద్రపరిస్తే భవిష్యత్తు లో పనికిరాదనే అపోహలు ఉన్నాయి.కాని ఇది నిజం కాదని పునరుత్పత్తి నిపుణులు చెబుతున్నారు. పిండం నిల్వకు రెండుమూడు లక్షలరూపాయల ఖర్చు అవుతుంది.మళ్లీ ప్రతి సంవత్సరం 50 వేల పైగా కట్టాల్సి ఉంది.కాని అన్నింటిలోనూ ఇంత ఖర్చుచేసి అండాలు,వీర్యాలను నిలువ చేసుకునే పరిస్థితి లేదు.వారికి అవగాహన ఉండదు.వారు వివాహం అయినతరువాత ఐదేళ్లు దాటిన తరువాత సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.ఒకేసారి మూడు నాలుగు లక్షల రూపాయల ఖర్చుతో సరిపోతుందని భావిస్తారు. దీన్ని ఆసరాతో ఈ కేంద్రాలు వచ్చే జంటలకు నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు.సరోగసి అద్దె గర్భాల విధానం కూడా ఈ సంతానం సాఫల్య కేంద్రాలు నిర్వహిస్తున్నాయి.వీర్యం,అండాలు సురక్షితంగా లేని జంటలకు వేరేవారి వీర్యాలు,అండాలను ఉపయోగిస్తున్నారు. సంతానభాగ్యంలేని దంపతులు కొంతమంది ఈ బ్యాంకుల నుంచి వీర్యం,అండాలు ఉపయోగించుకుంటున్నారు. కాని వారు ఆరోగ్య వంతమైన మేధావుల వీర్యం,అండాలు ఆశిస్తారు. కాని ఈ బ్యాంకుల వారు సంతానకేంద్రాలవారితో కుమక్కై బిచ్ఛగాళ్లు,కూలీల వీర్యాలు నిలువ చేస్తున్నారు.అలాగే అండాలను డబ్బిచ్చి కొంటున్నారు. సంతానం కావాలనుకునే వారిని అడ్డంగా మోసం చేస్తున్నాయి ఈ కేంద్రాలు.ప్రజల జీనన శైలిని మారితేనే ఇలాంటి ఉపద్రవాలు తప్పుతాయి. పూర్వం ఆడపిల్లలకు 20 ఏళ్లకు,మగవారు 30 ఏళ్ల లోపు వివాహం చేసుకుంటే సంతాన సమస్య ఉండేదికాదు. కేరీర్ పేరుతో వారు తమ జీవితాలలోని ఆనందాలకు ఫుల్ స్టాప్ పెట్టుకుంటున్నారు.పెళ్లి అయిన తరువాత కూడా కేరీర్ కొనసాగించవచ్చని చెప్పే పెద్దలు మాట చెల్లుబాటు కావడంలేదు.యువతీ యువకులు తమ జీవన శైలి మార్చుకోకపోతే ఈ అనైతిక సంతానసాఫల్య కేంద్రాలు పుట్టుకొస్తాయి. సంతానం లేమికి జంటల అవసరాన్ని అవకాశంగా తీసుకొని వారు తమ లాభం కోసం ఎలాంటి అనైతికత పనికన్నా సిద్ధపడుతున్నారు. వారికి అవకాశం ఇవ్వకుండా యువతీ యువకులు సరైన వయస్సులో వివాహం చేసుకోవాలి.వారి తల్లిదండ్రులు కూడా లేట్ మ్యారేజ్ వల్ల కలిగే అనర్ధాలు వివరించాలి.కేరీర్ తో పాటు వివాహం, సంతానం కూడా అవసరమని వివరించాలి.ఇటీవల కొన్ని జంటలు అవివాహితులు గానే ఉంటున్నారు.మరికొంతమంది సహజీవనం చేస్తున్నారు.జీవితమంటే ఆనందంగా గడపడమే తప్ప సంతానం అవసరం లేదని మరి కొన్ని జంటలు భావిస్తున్నాయి. ఇలా భారతీయ సమాజం కొనసాగితే రాబోయే రోజుల్లో వృద్ధుల జనాభా పెరిగి జపాన్ లా తయారవుతుంది.యువశక్తి లేక ఆర్ధిక వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది.అందుకని యువతీ యువకులు ఆరోగ్యవంతమైన సంతాన్ని సమాజానికి అందించాలి.అలాగే వారిని భవిష్యత్తు లో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి.
సంతానం లేమికి జీవన శైలితో పాటు మన ఆహార అలవాట్లు కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. నేడు పట్టణాల్లో,నగరాల్లో ఆర్గానిక్ ఫుడ్ పట్ల అవగాహన పెరిగింది. ఫలితంగా ఆహార పదార్ధాల కాలుష్యం తగ్గుతోంది. కాని అది చాలా తక్కువ శాతమే.అత్యధికులు బయటి ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఫుడ్ సెంటర్లు,టిఫెన్ సెంటర్లు సందుకొకటి వెలుస్తున్నాయి.అక్కడ పెట్టే ఆహారం ఎంతవరకూ ఆరోగ్యదాయకం అనేది ప్రభుత్వ శాఖలు నిర్ణయించే పరిస్థితి లేదు.ఎందుకంటే లంచావతారాలు పెరగడమే కారణం. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసుకునే కుటుంబాలు శని ఆదివారాలు బయటే తింటున్నారు. రోజూ ఆర్డర్ మీద తెప్పించుకుని తినే కుటుంబాలు ఉన్నాయి. బయటి ఆహారం తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాయి. అలాగే చల్లని పానీయాలు విషపూరితమని శాస్త్రవేత్త లు ఆధారాలతో సహా నిరూపించినా అమ్మకాలను ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి.ప్రజలు తాగుతున్నారు.ఇలా చెప్పుకుంటూ పోతే సంతానం లేమికి మన జీవన శైలితో పాటు మారిన మన ఆహార అలవాట్లు కారణమవుతున్నాయి. మనం చేసే కర్మను అనుసరించే ఫలితం ఉంటుందని భగవద్గీత లో గీతా చార్యుడు చెప్పింది నేడు కళ్ళముందు కనిపిస్తున్నది.మరి మారాలా వద్దా అనేది మనచేతుల్లోనే ఉంది.

యం.వి.రామారావు

ట్రంప్ టారిఫ్స్ దెబ్బ 💸 విలువ కోల్పోతున్న రూపాయి ..💰ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ కువైట్ దినార్……. 💵నేడు ఒక్క దినార్ ...
30/07/2025

ట్రంప్ టారిఫ్స్ దెబ్బ 💸 విలువ కోల్పోతున్న రూపాయి ..💰

ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ కువైట్ దినార్……. 💵

నేడు ఒక్క దినార్ భారత్ కరెన్సీ విలువ రూ॥ 285/- Rs చేరింది …💶

ట్రంప్ టారిఫ్స్.. మనం ఎలా నష్టపోతామంటే?

ట్రంప్ విధించిన 25% సుంకాలతో భారత ఫార్మా, టెక్స్టైల్, గోల్డ్, డైమండ్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కెమికల్ రంగాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. టారిఫ్స్ వల్ల USలో ధరలు పెరిగి మన కంపెనీలకు తక్కువ ఆర్డర్లు వస్తాయి. ఫలితంగా మన దేశంలో కొందరు ఉద్యోగాలు కోల్పోతారు. ఎగుమతి ఆదాయం తగ్గి రూపాయి విలువ బలహీన పడుతుంది. భారత్ నుంచి అమెరికాకు ప్రతి ఏటా 87 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు, సేవలు ఎగుమతి అవుతాయి.

ఒక అమెరికన్ డాలర్, నేడు భారతీయ 87.65/-Rs లలో కోనసాగుతుంది

NISAR ప్రయోగం… NASA కు అసూయ…  ISRO కు గర్వం..!భారతదేశం, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, భారతదేశ పట్టుదలనూ స్పష్...
29/07/2025

NISAR ప్రయోగం… NASA కు అసూయ… ISRO కు గర్వం..!

భారతదేశం, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, భారతదేశ పట్టుదలనూ స్పష్టంగా చాటిచెప్పే కీలక ఘట్టానికి శ్రీహరికోట వేదిక కానుంది… అత్యాధునికమైన నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ (NISAR) ఉపగ్రహం జూలై 30న ప్రయోగానికి సిద్ధంగా ఉంది…

బిలియన్ డాలర్ల విలువైన ఈ భూ పరిశీలన ఉపగ్రహం, ప్రపంచంలోని అతి పురాతన, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సహకారానికి నిదర్శనం… ఇది విపత్తుల అంచనా, వాతావరణ పర్యవేక్షణలో గణనీయమైన ముందడుగు వేయనుంది…
‘నాసాకు అసూయ, భారత్‌కు గర్వం’గా అభివర్ణించబడుతున్న ఈ NISAR ఉపగ్రహాన్ని భారతదేశానికి చెందిన GSLV మార్క్- 2 ద్వారా ప్రయోగిస్తున్నారు… ఈ రాకెట్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన క్రయోజెనిక్ ఇంజిన్‌తో నడుస్తుంది…
2,392 కిలోల బరువున్న NISAR ఉపగ్రహం ప్రతి 12 రోజులకు ఒకసారి ప్రపంచాన్ని స్కాన్ చేయడానికి రూపొందించబడింది… ఇది అన్ని వాతావరణ పరిస్థితులలో, పగలు రాత్రి డేటాను అందిస్తుంది, ఇది అనేక రకాల అనువర్తనాలకు కీలకం…

భూమి ఉపరితలంలో సంభవించే చిన్న మార్పులను (భూకంపాలు, కొండచరియలు విరిగిపడటాన్ని అంచనా వేయడానికి), మంచు పలకల కదలికలు, వృక్షసంపద డైనమిక్స్ వంటి వాటిని గుర్తించగల సామర్థ్యం దీనికి ఉంది… ఈ డేటా రాబోయే ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రాణనష్టాల్ని తగ్గించడానికి గేమ్-ఛేంజర్‌గా మారే అవకాశం ఉంది…

లులు మాల్‌కి బెజవాడ పాత బస్టాండ్‌ స్థలంలులు సూపర్ మార్కెట్ మాల్ కు విజయవాడలో ఆర్టీసీ స్థలం కేటాయించడంపై టీడీపీ సమర్థిస్త...
29/07/2025

లులు మాల్‌కి బెజవాడ పాత బస్టాండ్‌ స్థలం

లులు సూపర్ మార్కెట్ మాల్ కు విజయవాడలో ఆర్టీసీ స్థలం కేటాయించడంపై టీడీపీ సమర్థిస్తుండగా, వైకాపా, ఇతర ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయాలు తెలపండి.

23/07/2025

సూర్యరష్మీ పడకపోతే జరిగే అనర్ధాలు**

మీ శరీరానికి విటమిన్-డి తగినంతగా అందకపోతే ప్రధానంగా ఐదు లక్షణాలు కనిపిస్తాయి. అవి-

గాయాలు మానే ప్రక్రియ నెమ్మదించడం

ఎముకలు, కండరాల నొప్పి

శక్తి తక్కువుండటం, త్వరగా అలసిపోవడం

తరచూ జలుబు, ఇన్ఫెక్షన్ల బారినపడటం

భావోద్వేగాలు అకస్మాత్తుగా మారడం, కుంగుబాటుకు గురవడం
ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే, క్రమం తప్పకుండా శరీరంపై ఉదయపు సూర్యకాంతి పడేలా జాగ్రత్తలు తీసుకోండి.

- సుమిత్ శర్మ, వైద్యుడు

*హృదయ పరివర్తనం* కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజు హస్తినకు రాజయ్యాడు.. ధర్మబద్ధంగా పాలన చేస్తూ ప్రజల మన్ననలు...
22/07/2025

*హృదయ పరివర్తనం*

కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన
తర్వాత ధర్మరాజు హస్తినకు
రాజయ్యాడు..

ధర్మబద్ధంగా పాలన చేస్తూ ప్రజల
మన్ననలు అందుకోసాగాడు..

కొన్నాళ్లకు ధర్మరాజు తీర్థయాత్ర
చేయాలని భావించాడు..

సోదరులను, సామంత రాజులకు
తన మనోభీష్టాన్ని తెలిపాడు..

వారిలో కొందరు ధర్మరాజుతో
కలిసి యాత్ర చేయాలని
నిశ్చయించుకున్నారు..

అదే సమయంలో ధర్మజుడు
శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్లి..

‘కృష్ణా! నేను, మరికొంత మంది
తీర్థయాత్రలకు వెళ్తున్నాము..

నువ్వు కూడా మాతో వస్తే
అంతకన్నా భాగ్యం మరొకటి
ఉండదు’ అన్నాడు..

యాత్రలు చేసే సమయం తనకు
లేదన్నాడు కృష్ణుడు..

ధర్మరాజు పట్టు వీడలేదు..

అప్పుడు కృష్ణుడు..

ధర్మజుడికి ఒక
సొరకాయను ఇచ్చి..

‘ధర్మరాజా! పనుల ఒత్తిడి వల్ల
నీతో పాటు యాత్రలకు
రాలేకపోతున్నాను..

నా ప్రతినిధిగా ఈ సొరకాయను
నీ వెంబడి తీసుకుని వెళ్లు’
అని చెప్పాడు..

కృష్ణుడి ఆదేశం
ప్రకారం ధర్మరాజు..
సొరకాయను నెత్తిన
పెట్టుకుని యాత్రలకు
వెళ్లాడు..‌

మూడు నెలల తర్వాత
యాత్రలన్నీ పూర్తి చేసుకుని
తిరిగి హస్తినకు చేరుకున్నాడు..

మర్నాడు అన్న సమారాధన
చేయాలని భావించాడు..

శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లి..
‘కృష్ణా! మా యాత్ర
విజయవంతంగా
పూర్తయింది..

నీవు ఇచ్చిన సొరకాయను
నేను మునిగిన అన్ని
తీర్థాల్లో ముంచాను..

రేపు అన్న సమారాధన ఉంది.
నీవు తప్పకుండా
రావాల’ని కోరాడు..

అప్పుడు కృష్ణుడు.. ‘ధర్మరాజా! అన్న
సమారాధనలో ఈ సొరకాయను
వండి అందరికీ ప్రసాదంగా
పంచండి’ అన్నాడు. అలాగే
చేశాడు ధర్మరాజు..

సొరకాయతో వండిన పదార్థం
తిన్నవారంతా చేదు భరించలేక
వాంతులు చేసుకున్నారు..

‘రాజా! చేదుగా ఉన్న
సొరకాయతో ఎందుకు
వంట చేయించారు’
అని ప్రశ్నించారు..

కలత చెందిన ధర్మరాజు
సమారాధనకు వచ్చిన
కృష్ణుడితో..

‘స్వామీ! మీరిచ్చిన
సొరకాయ చేదుగా
ఉన్నది’ అన్నాడు..

కృష్ణుడు నవ్వి..

‘ధర్మరాజా! ఆ సొరకాయ
చేదుగా ఉందని నాకు
ముందే తెలుసు..

నీతో పాటు ఎన్నో
తీర్థాల్లో మునక వేసింది
కదా..! దాని చేదుదనం
పోయిందేమో అనుకున్నాను..
ఇంకా అలాగే ఉన్నట్లుందే..?’
అన్నాడు..

ధర్మరాజుకు విషయం అర్థమై..
కృష్ణుడికి దండప్రణామాలు చేశాడు..

వేలమంది నిత్యం
తీర్థయాత్రలు
చేస్తూ ఉన్నారు..

జపతపాలు
చేస్తున్నారు..

కానీ,,

మనసులో గూడు
కట్టుకుని ఉన్న
అసుర గుణాలు,
పాప సంస్కారాల
గురించి చింతించడం
లేదు..

హృదయ పరివర్తనం
లేని యాత్రలు
ఎన్ని చేసినా,
తీర్థాల్లో ఎన్నిసార్లు
మునిగినా ఫలితం
ఉండదు...

హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

🚩సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🚩

✍🏻🚩 సర్వే జనాః సుఖినోభవంతు 🚩

యానాం: మాంసాహార ప్రియులు అత్యంత ఇష్టంగా తినే పులసల సీజన్ యానాం లో మొదలైంది...యానాం గౌతమి గోదావరికి ఎర్ర నీరు పోటెత్తిన స...
20/07/2025

యానాం: మాంసాహార ప్రియులు అత్యంత ఇష్టంగా తినే పులసల సీజన్ యానాం లో మొదలైంది...

యానాం గౌతమి గోదావరికి ఎర్ర నీరు పోటెత్తిన సమయంలో మత్స్యకారులకు చిక్కుతున్న పులసలు...

యానాంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సుమారు రెండు కేజీల బరువు ఉన్న రెండవ పులస వలకి చిక్కింది...

దీనిని వేలం పాటలో మార్కెట్ లో చేపల విక్రయించే పోనమండ భద్రం రత్నం దంపతులు 22,000 కి వేలంపాటలో అత్యధిక ధరకు దక్కించుకున్నారు.

దుర్గాబాయి ధైర్యం...నెహ్రూ ప్రశంసఅది 1923వ సంవత్సరం.ఇప్పటి ఆంధ్రప్రదేశ్ కాకినాడలో కాంగ్రెస్ మహాసభలు జరుగుతున్నాయి.ఈ సందర...
17/07/2025

దుర్గాబాయి ధైర్యం...నెహ్రూ ప్రశంస

అది 1923వ సంవత్సరం.ఇప్పటి ఆంధ్రప్రదేశ్ కాకినాడలో కాంగ్రెస్ మహాసభలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా ఖాదీ ప్రదర్శన ఏర్పాటు చేసారు.దానికి రుసుం నిర్ణయించారు.ఇంతలో కోలాహలం వినిపించింది.కాంగ్రెస్ అగ్రనాయకుడు పండిట్ నెహ్రూ ఈ ప్రదర్శనలో పాల్గోనాల్సిఉంది. ఆయన అక్కడికి వచ్చారు.ఒక మహిళా వాలంటీర్ ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. టికెట్ చూపించమన్నారు.ఆయన లేదన్నారు.నిర్వాహకులు వారించినా ఆమె అనుమతించలేదు. చివరకు నెహ్రూ ప్రదర్శన రుసుం టికెట్ కొన్నతర్వాతే ఆమె అనుమతించింది. ఆమె స్వాతంత్య్ర సమరయోధురాలు,మహిళాభ్యదయ సంస్కర్త దుర్గాబాయి దేశ్ ముఖ్. ఆమె చేసిన పనికి అనంతరం నెహ్రూ ప్రశంసలు అందుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించిన మహిళా శిరోమణి దుర్గాబాయి.
మహాత్మాగాంధీ రాజమండ్రి వచ్చినప్పుడు ఉద్యమానికి విరాళాలు వసూలు చేసి ఇచ్చింది.తన చేతులకున్న బంగారుగాజులు విరాళంగా ఇచ్చింది.అప్పుడు ఆమె వయస్సు 12సంవత్సరాలు.హిందీభాష నేర్చుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంలో హిందీభాష అవసరాన్ని గుర్తించింది. 12ఏట బాలికల హిందీ ప్రచారసభ ప్రారంభించారు. అప్పటి నుంచి ఆమె గాంధీని అనుసరించారు. అదే స్వాతంత్య్ర ఉద్యమంలో ఆమె తొలిఅడుగు.
1909 జులై 15వ తేదీ రాజమండ్రిలో కృష్ణవేణమ్మ,రామారావు దంపతులకు దుర్గాబాయి జన్మించింది. హిందీలో పాండిత్యం,బెనారస్ విశ్వవిద్యాలయంలో మెట్రిక్,ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ,1942లో ఎల్ఎల్బీ పూర్తిచేసారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టు అయ్యారు.1937లో చెన్నై లో ఆంధ్రమహిళాసభ ప్రారంభించారు. 1951లో ఆంధ్ర మహిళా పత్రిక స్థాపించి సంపాదకత్వబాధ్యతను చేపట్టారు. రాజ్యాంగ నిర్మాణసభ సభ్యురాలుగా 1946-50మధ్య ఉన్నారు.మహిళా అభ్యుదయం,సాంఘిక సంక్షేమ పథకాల రూపకల్పనలో కీలకపాత్ర వహించారు. స్వాతంత్య్రం అనంతరం ప్రణాళికా సంఘసభ్యురాలుగా దేశాభివృద్ధి పథకాల రచనలో పాలుపంచుకున్నారు. అక్కడ పరిచయం అయిన సిడి దేశ్ ముఖ్ ను 1953లో వివాహం చేసుకున్నారు.ఆయన కేంద్ర మంత్రివర్గ సభ్యులు.ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసారు.
1958లో ఆమె హైదరాబాద్లో ఆంధ్రమహిళాసభ ప్రారంభించారు.రాష్ట్రం అంతటా మహిళలకు కళాశాలలు,వసతిగృహాలు,నర్సింగ్ హోంలు,వృత్తివిద్యాకేంద్రాలు నెలకొల్పారు. వయోజనవిద్యాసేవలకు ఆమెకు
1971లో ఆంధ్రవిశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది.భారత్ ప్రభుత్వం చే 1975లో పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించింది.అలాగే ఆమె గౌరవార్థం తపాలబిళ్ల విడుదల చేసింది.రాజమండ్రిలో శిలావిగ్రహం నెలకొల్పారు.1981లో ఆమె హైదరాబాదులో అస్తమించారు.
1998లో ఆమె పేరుమీద కేంద్రసాంఘిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసారు.
ఆమె తన అనుభవాలను స్టోన్స్ దట్ స్పీక్ అనే పుస్తకం రాసారు.ఒక సంకల్పశక్తి గల వ్యక్తి కాలాన్ని ఎలా వినియోగించుకోవాలో ఇలా రాసారు.'.కాలం విలువను అర్ధం చేసుకున్నవ్యక్తి ప్రణాళికాబద్ధంగా తాను సాధించాలనుకున్న దానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటాడు.లోభ,మోహాలను జయించిన వాడు కోట్లరూపాయలను సంపాదించగలడేమోగాని,కోట్ల రూపాయలు అటువంటి వ్యక్తిని తీసుకు రాలేవు,అటువంటి వ్యక్తి దేశ చరిత్రను తిరగరాస్తారు. 'అని చెప్పారు.ఇది అక్షరాలా నిజం కదా?

15/07/2025

14/07/2025

Address

Telangana

500020

Alerts

Be the first to know and let us send you an email when Legend posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share