Legend

Legend Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Legend, Media/News Company, Telangana, Hyderabad.

రాష్ట్ర, జాతీయ వార్తా విశేషాలు, రాజ కీయాలు, న్యూస్ వీడియోలు, డిబేట్స్, ఎనాలిసిస్, ప్రముఖల ఇంటర్వ్యూలు, రాజకీయ నాయకులపై స్పెషల్ ఫోకస్ వీడియోలు ఎక్స్ క్లూజివ్ గా చూడండి...

24/05/2026

ఈసారి ఐపీఎల్ ట్రోపీని ఏ జట్టు గెలుస్తుందో కామెంట్ చేయండి

తిరుమలలో భారీ రద్దీతిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ  కొనసాగుతోంది. సెలవు దినాలు కావడంతో దేశం నలుమూలల నుండి భ...
24/05/2026

తిరుమలలో భారీ రద్దీ
తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవు దినాలు కావడంతో దేశం నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో స్వామివారి దర్శనార్థం తరలివస్తున్నారు. టోకెన్లు లేని సర్వదర్శనం (ఉచిత దర్శనం) కొరకు కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోయి.

భక్తుల సంఖ్య: నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 97,561 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
హుండీ ఆదాయం: నిన్న స్వామివారికి భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా తిరుమల హుండీ ఆదాయం రూ. 3.76 కోట్లుగా నమోదైంది.
తలనీలాలు: మొక్కులు చెల్లించుకునేందుకు నిన్న 57,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. రద్దీ దృష్ట్యా భక్తులు ఓపికతో సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మళ్లీ భారత్‌పై పాకిస్థాన్ బడాయి కామెంట్లు!క్షేత్రస్థాయిలో చావుదెబ్బ తిన్నా, ఇంటర్నెట్‌లో పాక్ నేతల వీరత్వాలు! ❌పాకిస్థాన...
23/05/2026

మళ్లీ భారత్‌పై పాకిస్థాన్ బడాయి కామెంట్లు!

క్షేత్రస్థాయిలో చావుదెబ్బ తిన్నా, ఇంటర్నెట్‌లో పాక్ నేతల వీరత్వాలు! ❌

పాకిస్థాన్ హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ మరోసారి ఇండియాను ఉద్దేశించి అత్యంత హాస్యాస్పదమైన, బడాయి కామెంట్స్ చేశారు. గతేడాది భారత్-పాక్ దేశాల మధ్య జరిగిన 4 రోజుల సైనిక ఘర్షణను ప్రస్తావిస్తూ.. తమ సైన్యానికి చెందిన డ్రోన్లు ఏకంగా ఢిల్లీలోని భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం పైవరకు వెళ్లాయని మొహ్సిన్ నఖ్వీ అన్నారు.
డబ్బా కొట్టుకుంటున్న పాక్ నేతలు
భారత్‌పై ఇలాంటి నిరాధారమైన కామెంట్స్ చేసిన మొదటి పాకిస్థానీ మంత్రి మొహ్సిన్ నఖ్వీ మాత్రమే కాదు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా పలు సందర్భాల్లో.. ఆ 4 రోజుల యుద్ధంలో తామే గెలిచామని, భారత్‌ను ఓడించామని సొంత డబ్బా కొట్టుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో దారుణంగా దెబ్బతిన్నప్పటికీ.. పాక్ నేతలు మాత్రం ఇంటర్నెట్ వేదికగా తమకు తామే వీరులమంటూ వెన్ను తట్టుకుంటున్నారు.

*కర్ణాటక రాజకీయాల్లో TVK పార్టీ ఎంట్రీ..?*బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి విజయ్ నేతృత్వంలోని TVK సిద్ధమ...
23/05/2026

*కర్ణాటక రాజకీయాల్లో TVK పార్టీ ఎంట్రీ..?

*బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి విజయ్ నేతృత్వంలోని TVK సిద్ధమవుతోందన్న ప్రచారం.*

*తమిళనాడుకు బయట కూడా పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టినట్లు రాజకీయ వర్గాల చర్చ.*

*దక్షిణాదిలో ప్రాంతీయ రాజకీయ సమీకరణాలపై TVK వ్యూహం ఆసక్తికరం.

#విజయ్ #టివికె #కర్ణాటకరాజకీయాలు

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి - తిరుపతి మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు! 🚄🙏హైదరాబాద్ నుంచి తిరుమల శ్రీవెంక...
23/05/2026

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి - తిరుపతి మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు! 🚄🙏

హైదరాబాద్ నుంచి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. చర్లపల్లి - తిరుపతి మధ్య రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును కొత్తగా ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ కొత్త రైలు నల్గొండ-కడప మార్గంలో ప్రయాణిస్తుందని తెలిపింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వారికి తిరుపతి చేరుకోవడం సులభమవుతుంది.ఈ సర్వీస్ ఈ నెల 28న ప్రారంభం కానుంది.

ఇప్పటి వరకు చర్లపల్లి - తిరుపతి మార్గంలో ప్రత్యేక రైలుగా నడిచిన సర్వీసును ఇక నుంచి రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా కొనసాగిస్తారు. తిరుపతి నుంచి గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం రోడ్, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. అలాగే, చర్లపల్లి నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు బయలు దేరుతుంది.

విజయ్ కు మద్దతు పై AIADMK చీలక వర్గం యూ టర్న్తమిళనాడు రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. సీఎం విజయ్ అసెంబ్లీలో బల పరీక...
23/05/2026

విజయ్ కు మద్దతు పై AIADMK చీలక వర్గం యూ టర్న్

తమిళనాడు రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. సీఎం విజయ్ అసెంబ్లీలో బల పరీక్ష వేళ మద్దతుగా నిలిచిన అన్నా డీఎంకే చీలక వర్గం ఇప్పుడు యూ టర్న్ తీసుకుంటోంది. తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్దమైంది. ఈ మేరకు మంత్రాంగం మొదలైంది. విజయ్ కేబినెట్ విస్తరణలో తమకు అవకాశం దక్కకపోవటం పైన చీలక వర్గం నేతలు అసహనంతో ఉన్నారు. దీంతో, వీరు తిరిగి పళినిస్వామితో కలిసి పని చేసేందుకు సిద్దం అవుతున్నారు.





🚩 దేశం కోసం, ధర్మం కోసం నిస్వార్థ సేవ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ప్రస్థానం!రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RS...
23/05/2026

🚩 దేశం కోసం, ధర్మం కోసం నిస్వార్థ సేవ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ప్రస్థానం!

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) వందేళ్ళుగా దేశం కోసం, ధర్మం కోసం నిస్వార్థసేవ చేస్తూ స్వామి వివేకానందుడు ఆశించిన యువశక్తిని తయారుచేస్తోందని, పంచపరివర్తన ద్వారా హిందూ సమాజంలో తామంతా ఒక్కటేనన్న భావనను కలిగిస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నదని RSS-తెలంగాణ శుక్రవారం నిర్వహించిన సంఘ శిక్షావర్గ (సామాన్య) - సార్వజనికోత్సవంలో వక్తలు కొనియాడారు. భాగ్యనగర్‌లోని నాదర్‌గుల్‌లో ఉన్న విద్యాభారతి విజ్ఞానకేంద్రంలో జరిగిన సార్వజనికోత్సవం హిందూ సంఘటనకు, భారతీయతకు ప్రతిబింబమై శిక్షార్థుల దేశభక్తికి ప్రతిభాపాటవాలకు వేదికై నిలిచింది.

ముఖ్య అతిథిగా పాల్గొన్న లోహియా గ్రూప్ అధినేత కన్హయ్య లాల్ లోహియా ప్రసంగిస్తూ RSS సారథ్యంలో రాష్ట్ర చేతనకు నడుంబిగించిన స్వయంసేవకుల ముఖాలలో ఆ చైతన్యాన్ని తాను చూస్తున్నానని ప్రశంసించారు. స్వాతంత్రోద్యమ కాలంలోను, దేశవిభజన సమయంలోను జాతికి స్వయంసేవకులు అండగా నిలిచారని, విపత్తుల వేళ ప్రజలకు తోడై నిలిచి ఆకలి తీర్చడంతో పాటు ఔషధాలు అందించి, అంతిమ సంస్కారాలు సైతం చేసిన సందర్భాలను తాను కళ్ళారా చూశానని, కేవలం దేశభక్తి గలవారు మాత్రమే ఇలా చెయ్యగలరని అన్నారు. సంఘ్‌లో ఏమి నేర్పినా అవన్నీ దేశం కోసమే తప్ప వ్యక్తిగతం కాదన్నారు. తాము వ్యాపారం చేస్తున్నప్పటికీ అది కేవలం లాభాల కోసం కాదని, దేశ వికాసం కూడా అందులో భాగమై ఉందని కన్హయ్య లాల్ పేర్కొన్నారు.

🔥 బండి భగీరథ్ పోక్సో కేసు: ఆర్ఎస్ఎస్ సీరియస్.. దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక! ⚠️తెలంగాణ రాజకీయాల్...
22/05/2026

🔥 బండి భగీరథ్ పోక్సో కేసు: ఆర్ఎస్ఎస్ సీరియస్.. దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక! ⚠️

తెలంగాణ రాజకీయాల్లో పెను తుఫాను రేపుతున్న బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆరెస్సెస్ తెలంగాణ యూనిట్.. తాజాగా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. బండి భగీరథ్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు కావడం వల్ల.. ఇందులోకి ఆరెస్సెస్ శాఖను లాగుతున్నారని.. తెలంగాణ ప్రాంత సంఘచాలక్ బర్ల సుందర్ రెడ్డి.. ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా బండి భగీరథ్ కేసు విషయంలో ఆర్ఎస్ఎస్‎పై దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కింగ్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్‌తో తమిళనాడు సీఎం విజయ్.. వైరల్ అవుతున్న క్రేజీ పిక్! 😎ముఖ్యమంత్రి విజయ్‌కి కోహ్లీ సంతకం చ...
22/05/2026

కింగ్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్‌తో తమిళనాడు సీఎం విజయ్.. వైరల్ అవుతున్న క్రేజీ పిక్! 😎

ముఖ్యమంత్రి విజయ్‌కి కోహ్లీ సంతకం చేసిన ఎంఆర్ఎఫ్ బ్యాట్ గిఫ్ట్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్‌తో ఫోటోకు పోజులిచ్చారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో అభిమానుల దృష్టిని త్వరగా ఆకర్షించింది. ముఖ్యమంత్రి విజయ్‌ని టైర్ల తయారీ దిగ్గజ సంస్థ ఎంఆర్‌ఎఫ్ ప్రతినిధులు ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ స్వయంగా సంతకం చేసిన ఎంఆర్ఎఫ్ బ్యాట్‌ను ఆయనకు బహుమతిగా అందించారు. ఆ బ్యాట్‌ను చేతిలోకి తీసుకున్న విజయ్, చిరునవ్వుతో ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Address

Telangana
Hyderabad
500020

Alerts

Be the first to know and let us send you an email when Legend posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share