News 24 Scribe

News 24 Scribe Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from News 24 Scribe, Digital creator, Telangana, Hyderabad.

"తెలుగు ప్రజలకు అంకితమైన నమ్మకమైన వార్తా వేదిక! రాజకీయాలు, ఆర్థికం, క్రీడలు, వినోదం, జీవనశైలి, ఆరోగ్యం, భక్తి—ఇలా ప్రతి కోణం నుంచి తాజా వార్తలు. మీ కోసం ప్రామాణికమైన విశ్వసనీయ సమాచారాన్ని అందించే మా లక్ష్యం, మీకు నిత్యం అప్‌డేట్స్ అందించడమే!"

15/05/2025

11/05/2025
S - 400 ఎలా పనిచేస్తుంది?మనకు S - 400 వ్యవస్థ ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవాలంటే, దాని భాగాలను ముందుగా గుర్తించాలి.ఒక ...
11/05/2025

S - 400 ఎలా పనిచేస్తుంది?

మనకు S - 400 వ్యవస్థ ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవాలంటే, దాని భాగాలను ముందుగా గుర్తించాలి.

ఒక సాధారణ S - 400 సిస్టమ్‌లో ఆరు ముఖ్యమైన భాగాలు ఉంటాయి:

మిస్సైల్ లాంచింగ్ వాహనం

క‌మాండ్ అండ్ కంట్రోల్ పోస్టు

బిగ్ బర్డ్ అనే లాంగ్ రేంజ్ సర్వైలెన్స్ రాడార్

గ్రేవ్‌స్టోన్ అనే ఎంగేజ్‌మెంట్ అండ్ ఫైర్ కంట్రోల్ రాడార్

ఆల్ ఆల్టిట్యూడ్ అక్విజిషన్ రాడార్

మొబైల్ మాస్ట్ సిస్టమ్

ఇప్పుడు ఒక్కో భాగాన్ని వివరంగా చూద్దాం.

మొదటగా — మిస్సైల్ లాంచ్ వాహనం:
ఇది బజ్ ట్రాక్టర్ ట్రక్క్, దీనిపై మిస్సైళ్లు అమర్చబడ్డాయి.
ఇంకొక ప్రత్యామ్నాయం మాజ్ సిరీస్ వాహనం.
ఈ ట్రక్కులో నాలుగు మిస్సైల్ ట్యూబ్స్ ఉంటాయి. ఇవి నాలుగు రకాల దూరాలకి తగిలే మిస్సైళ్లు:

40 కిలోమీటర్ల చిన్న దూరం మిస్సైల్

120 కిలోమీటర్ల మధ్యదూర మిస్సైల్

250 కిలోమీటర్ల దీర్ఘదూర మిస్సైల్

400 కిలోమీటర్ల అత్యంత దీర్ఘదూర మిస్సైల్

రాడార్ వ్యవస్థ:
S-400 లో మూడు ప్రధాన రాడార్ వ్యవస్థలు ఉన్నాయి:

బిగ్ బర్డ్ (91N6E) – దీన్ని NATO కోడ్ "టూమ్‌స్టోన్" అని పిలుస్తారు.
ఇది ఒక మల్టీ-ఫంక్షనల్ రాడార్. 600 కిలోమీటర్ల పరిధిలో విమానాలు, డ్రోన్లు, మిస్సైళ్లు గుర్తించగలదు. ఒకేసారి 300 టార్గెట్లను ట్రాక్ చేయగలదు.

గ్రేవ్‌స్టోన్ ఫైర్ కంట్రోల్ రాడార్ – దీని పరిధి 400 కిలోమీటర్లు.
ఇది లక్ష్యాన్ని గుర్తించి దాని మీద మిస్సైల్ గైడ్ చేయడంలో కీలకం.

40V6 మిస్టర్ – ఇది కొంతమంది రాడార్ కాదని, పైన మౌంట్ చేయగల టవర్ మాత్రమే అని అంటున్నారు.
ఇది లోలెవెల్ టార్గెట్లు ట్రాక్ చేయడానికి వాడుతుంది.

కమాండ్ అండ్ కంట్రోల్ పోస్టు:
యూరాల్ ట్రక్కులో ఇది అమర్చబడి ఉంటుంది. ఇది మొత్తం వ్యవస్థను నియంత్రిస్తుంది — టార్గెట్ గుర్తింపు నుండి మిస్సైల్ దాడి వరకు.

ఇప్పుడు పనితీరు ఎలా జరుగుతుందో తెలుసుకుందాం:

దశ 1: బిగ్ బర్డ్ రాడార్ లక్ష్యాలను గుర్తిస్తుంది. ఒకేసారి 300 టార్గెట్లను ట్రాక్ చేయగలదు.

దశ 2: ఈ సమాచారం కమాండ్ పోస్టుకి పంపుతుంది. అక్కడ లక్ష్యం శత్రువా మిత్రుడా అనే విషయాన్ని నిర్ణయిస్తారు. ఆ తర్వాత మిస్సైల్ లాంచ్ చేసేందుకు ఆదేశాలు పంపుతారు.

దశ 3: లక్ష్యం ఆధారంగా సరైన రేంజ్ మిస్సైల్‌లను లాంచ్ చేస్తారు. ఒక్క లక్ష్యాన్ని తాకేందుకు రెండు మిస్సైళ్లు వదిల్తారు – ఒకటి మిస్ అయితే రెండవది పని చేస్తుంది.

దశ 4: ఎంగేజ్‌మెంట్ రాడార్ సహాయంతో టార్గెట్ మీదకు మిస్సైళ్లు గైడ్ చేయబడతాయి.

దశ 5: క్రూజ్ మిస్సైళ్లు వంటి తక్కువ ఎత్తులో వచ్చే టార్గెట్ల కోసం మొబైల్ మాస్ట్ సిస్టమ్ ఉపయోగిస్తారు. అప్పుడు కమాండ్ పోస్ట్ మిడియం రేంజ్ మిస్సైల్ లాంచ్ చేసి టార్గెట్‌ను నాశనం చేస్తుంది.

S-400 ఒకేసారి 300 లక్ష్యాలను ట్రాక్ చేయగలదు, వాటిలో 60-80 టార్గెట్లపై దాడి చేయగలదు. 160 మిస్సైళ్లను ఒకేసారి గైడ్ చేయగలదు.

ఇప్పుడు కొన్ని పరిమితుల గురించి మాట్లాడదాం:

S-400 చాలా శక్తివంతమైనది అయినా, భూభాగపు వంపు (Earth's curvature) వల్ల దాని రాడార్ పరిధికి ఒక హద్దు ఉంటుంది.

తక్కువ ఎత్తులో ప్రయాణించే క్రూజ్ మిస్సైళ్లు లేదా విమానాలు చాలా దగ్గరకి వచ్చాక మాత్రమే కనిపించవచ్చు. ఇది 40 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే అవి కనిపించేలా చేయవచ్చు.

India Won.... కాళ్ళ బేరానికి పాక్
10/05/2025

India Won.... కాళ్ళ బేరానికి పాక్

01/05/2025

HIT 3 రివ్యూ: నాని షో, కానీ స్టోరీ ఎక్కడ?

హిట్, ది థర్డ్ కేస్! నాని నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్, ఇది తీవ్రమైన వైలెన్స్, రాఆ ఎమోషన్స్, మరియు యాక్షన్ సన్న...
01/05/2025

హిట్, ది థర్డ్ కేస్! నాని నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్, ఇది తీవ్రమైన వైలెన్స్, రాఆ ఎమోషన్స్, మరియు యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో కథ పెద్దగా లేకపోయినా, బ్రూటల్ వైలెన్స్ మరియు నాని పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటుంది. అయితే, ఇది కేవలం యాక్షన్ ప్రేమికులకు మాత్రమే సరిపోతుంది, కుటుంబ ప్రేక్షకులు లేదా సున్నితమైన హృదయాల వారికి ఇది సరైన ఎంపిక కాదు.

మొదటి భాగంలో సినిమా ఒక బ్రూటల్ ఇంట్రోతో శక్తివంతంగా ప్రారంభమవుతుంది, ఇది సినిమా యొక్క టోన్‌ను సెట్ చేస్తుంది. అయితే, “కోడి మేడకాయ్ మనిషి తలకాయ్” పాట కొంత సినిమా లెన్త్ తగ్గించి ఉంటే, 4 నిమిషాలు ఆదా అయ్యేవి. ఈ పాట కథను కొంత స్లో చేసింది. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది, కానీ గుర్తుండిపోయే సన్నివేశాలు, పాటలు లేవు. మొత్తంగా, మొదటి భాగం సంతృప్తికరంగా ఉంది, కానీ అద్భుతమైన అనుభూతిని మాత్రం ఇవ్వదు.

ఇక రెండవ భాగంలో కథ కొంత సాదాసీదాగా సాగుతుంది, ముఖ్యంగా ఏజే డెన్‌లోకి ఎంటర్ అయ్యాక అయితే, క్లైమాక్స్‌లో తీవ్రమైన హింస మరియు బ్రూటల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. చివర్లో కొంత డ్రామా, అరుపులు కనిపిస్థాయి, కానీ కథలో డెప్త్ లేదు, సస్పెన్స్ అస్సలు ఉండదు. నాని తన నటనలో మరో కొత్త కోణాన్ని చూపించాడు, ఇది చిత్రానికి ఒక హైలైట్. శ్రీనిధి శెట్టి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు, ఆమె పాత్రకి దాదాపు ఉనికి లేనట్టే.

ఇక సాంకేతిక అంశాలకు వస్తే సంగీతం, పాటలు చిత్రానికి పెద్దగా ఉపయోగపడలేదు. వీటిని తొలగిస్తే సినిమా మరింత గట్టిగా ఉండేది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమర్థవంతంగా ఉన్నప్పటికీ, అద్భుతంగా అనిపించదు.

సినిమాటోగ్రఫీ & యాక్షన్ విషయానికి వస్తే యాక్షన్ సన్నివేశాలు బాగా రూపొందించబడ్డాయి, ముఖ్యంగా హింసాత్మక సన్నివేశాలు హైలైట్ గా ఆకట్టుకుంటాయి.

ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే, సినిమా ఎక్కడా బోర్ కొట్టకపోయినా, కొన్ని సన్నివేశాలు కుదించి ఉంటే మరింత గట్టిగా ఉండేది.

ఫైనల్గా.ఈ సినిమా యాక్షన్ మరియు వైలెన్స్ ప్రేమికులకు పర్ఫెక్ట్. కొన్ని సన్నివేశాల్లో బూతులు ఉన్నాయి, సినిమా ఈవెంట్ లలో నాని స్వయంగా చెప్పినట్టు, ఇది కుటుంబ ప్రేక్షకులు, పిల్లలు, లేదా సున్నిత హృదయాల వారికి అస్సలు సరిపోదు.

మొత్తానికి
హిట్, ది థర్డ్ కేస్ ఒక రాఆ బ్రూటల్, యాక్షన్ థ్రిల్లర్, ఇది నాని యొక్క నటన మరియు భారీ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. అయితే, కథ లేకపోవడం మరియు సస్పెన్స్ లేకపోవడం వల్ల ఇది అందరికీ నచ్చకపోవచ్చు. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్, కానీ కుటుంబ ప్రేక్షకులు దీనికి దూరంగా ఉండటం మంచిది.

3Dలో రీ రిలీజ్ కాబోతున్న ఇండస్ట్రీ హిట్ మూవీ..?3D లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీ రిలీజ్ – మే 9న థియేటర్లలో మంత్రం!🔹 ...
30/04/2025

3Dలో రీ రిలీజ్ కాబోతున్న ఇండస్ట్రీ హిట్ మూవీ..?

3D లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీ రిలీజ్ – మే 9న థియేటర్లలో మంత్రం!
🔹 రీరిలీజ్ ట్రెండ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి సెన్సేషన్
🔹 ఇండస్ట్రీ హిట్ మూవీ.. ఇప్పుడు 3Dలో!
🔹 శ్రీదేవి, చిరు జోడీ మళ్లీ తెరపైకి
🔹 మే 9న 2D, 3Dలో గ్రాండ్ రీ రిలీజ్?

తెలుగు సినిమాల రీరిలీజ్ టెంపో ఇంకా తగ్గలేదు! తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన అల్ల టైం ఇండస్ట్రీ హిట్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. అదీ గదా.. ఈసారి 3D లో! 1990లో ప్రేక్షకులను మంత్రిముగ్దుల్ని ఈ సినిమాను మళ్లీ 3డీ టెక్నాలజీలో తీసుకురావడం విశేషం.

దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు మాయాజాలంతో, ఇళయరాజా సంగీత మంత్రంతో, శ్రీదేవి అందంతో, అశ్విని దత్ నిర్మాణ విలువలతో ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాను వైజయంతి మూవీస్ మళ్లీ థియేటర్లలోకి తీసుకొస్తుంది.

ఇప్పటికే విడుదల చేసిన స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మే 9న 2D మరియు 3D వర్షన్లలో థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి మళ్లీ భారీ స్పందన దక్కుతుందా అన్నది ఆసక్తికరమైంది.

తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్‌ కోలుకున్నాడు4 నెలల 25 రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ – బిడ్డ ఆనందంతో తండ్రి కన్నీటి సందే...
30/04/2025

తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్‌ కోలుకున్నాడు
4 నెలల 25 రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ – బిడ్డ ఆనందంతో తండ్రి కన్నీటి సందేశం!
🔹 పుష్ప-2 బెనిఫిట్ షోలో జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి
🔹 తొమ్మిదేళ్ల శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన విషాద ఘటన
🔹 4 నెలల 25 రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
🔹 పుష్ప-2 టీం, సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ చేశారని తండ్రి వ్యాఖ్య

పూర్తి వివరాల్లోకి వెళితే...
పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ RTC X రోడ్స్ వద్ద సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనను మరచిపోలేం. ఆ సమయంలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అక్కడే మరణించగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మంగళవారం రోజున అతను డిశ్చార్జ్ అయ్యాడు.

శ్రీతేజ్‌ను ఇప్పుడు రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించి, అక్కడ 15 రోజుల ఫిజియోథెరపీ నిర్వహించనున్నారు. తరువాతే ఇంటికి తీసుకెళ్లవచ్చని వైద్యులు సూచించారు. 4 నెలల 25 రోజులపాటు చికిత్స పొందిన శ్రీతేజ్‌.. ఇప్పుడిప్పుడే మళ్లీ సాధారణ జీవనానికి చేరుకుంటున్నాడు.

తన కుమారుడి ఆరోగ్యంపై పుష్ప-2 టీం, సీఎం రేవంత్ రెడ్డి, కిమ్స్‌ హాస్పిటల్ చాలా మద్దతుగా ఉన్నారని శ్రీతేజ్ తండ్రి తెలిపారు. ‘‘వైద్యులు ఒక్క రూపాయి కూడా డబ్బులు అడగలేదు. చివరికి డిశ్చార్జ్ సమయంలో కూడా ఒత్తిడి చేయలేదు’’ అని చెప్పారు. "చెల్లెలు ‘అమ్మ ఎక్కడ?’ అని అడుగుతోంది" అంటూ బాధను వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై హీరో అల్లు అర్జున్పై సహా థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదు అయ్యాయి. అల్లు అర్జున్‌ను ఏ11 నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేయగా, అనంతరం బెయిల్ మంజూరైంది. కానీ బెయిల్ పేపర్లు ఆలస్యం కావటంతో ఒక రోజు రాత్రి చంచల్‌గూడ జైలులో ఉండాల్సి వచ్చింది.

ఇప్పుడు ఈ ఘటనకు ఐదు నెలలు పూర్తవుతున్న వేళ శ్రీతేజ్‌ కోలుకోవడం ఒక శుభవార్త. ఒక అమాయక బాలుడు బతికి బయటపడటం వెనక ఎంతోమంది అండ ఉంది.

సింహాచల గోడకూలిన ఘటనపై ప్రభుత్వం గట్టి చర్యలు!హోంమంత్రి వంగలపూడి అనిత కీలక ప్రకటన – రూ.25 లక్షల పరిహారం, నిందితులకు కఠిన...
30/04/2025

సింహాచల గోడకూలిన ఘటనపై ప్రభుత్వం గట్టి చర్యలు!

హోంమంత్రి వంగలపూడి అనిత కీలక ప్రకటన – రూ.25 లక్షల పరిహారం, నిందితులకు కఠిన శిక్షలు!

🔹 గోడ కూలిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ – హోంమంత్రి అనిత
🔹 ఏడు మంది మృతి.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం
🔹 ఎవరి హయాంలో గోడ కట్టారో విచారణకు ఆదేశాలు
🔹 సీఎం చంద్రబాబు రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు

పూర్తి వివరాల్లోకి వెళితే...
సింహాచల అప్పన్న స్వామి సన్నిధిలో జరిగిన చందనోత్సవం సందర్భంగా జరిగిన గోడకూలిన ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ‘‘ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. ఎవరి హయాంలో గోడ కట్టారో, ఆ కాంట్రాక్టర్ ఎవరో స్పష్టతకు వస్తాం. తప్పించిన వారిని వదిలిపెట్టం’’ అంటూ కఠిన వ్యాఖ్యలు చేశారు.

ఈ ప్రమాదంలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు మృతి చెందారని తెలిపారు. గాయపడిన వారికి అత్యుత్తమ చికిత్స అందిస్తున్నామని అన్నారు. ‘‘రెండు రోజుల క్రితం ఏర్పాట్లను పరిశీలించాను.. కానీ వర్షానికి గోడ కూలుతుందని ఎవరూ ఊహించలేదు’’ అని తెలిపారు. తనతో సహా మంత్రులు కూడా చందనోత్సవంలో పాల్గొన్నట్టు చెప్పిన ఆమె.. ప్రమాదం తెలిసిన వెంటనే సహాయ చర్యలు ప్రారంభించామన్నారు.

అదే సమయంలో సీఎం చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఘటనపై మూడు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అదీ కాకుండా దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో బాధిత కుటుంబాలకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించేందుకు కూడా ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గోడ కూలిన ప్రాంతంలో SDRF, NDRF బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. బాధిత కుటుంబాలకు మానసిక, ఆర్థికంగా ప్రభుత్వం అండగా ఉండనుంది.

సింహాచల దుర్ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన‘‘ఈ వార్త కలచివేసింది.. భక్తుల మృతికి ఆవేదనతో ఉన్నా’’ – ట్విట్టర్ ద్వారా సాను...
30/04/2025

సింహాచల దుర్ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన

‘‘ఈ వార్త కలచివేసింది.. భక్తుల మృతికి ఆవేదనతో ఉన్నా’’ – ట్విట్టర్ ద్వారా సానుభూతి
🔹 సింహాచలం ఆలయంలో గోడ కూలిన ఘటనపై స్పందించిన రేవంత్ రెడ్డి
🔹 మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన తెలంగాణ సీఎం
🔹 ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించిన సీఎం
🔹 ప్రమాదంపై ఇప్పటికే స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పూర్తి వివరణ ఇలా ఉంది:
విశాఖ సింహాచలంలో జరిగిన చందనోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న ఘోర దుర్ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని సింహాచలం ఆలయంలో గోడ కూలి భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అంటూ వ్యాఖ్యానించారు.

ఈ ఘటన అర్థరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా చోటుచేసుకుంది. రూ.300 టికెట్ క్యూ కాంప్లెక్స్ సమీపంలోని 20 అడుగుల పొడవున్న సిమెంట్ గోడ ఒక్కసారిగా కుప్పకూలి, భక్తులు దాని కింద చిక్కుకుపోయారు. ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ కలెక్టర్, సీపీ శంకబ్రత బాగ్చి తదితరులు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. NDRF, SDRF బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా రాష్ట్ర మంత్రులు ఈ ఘటనపై స్పందించారు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా తన స్పందన తెలియజేయడం భావోద్వేగాన్ని కలిగించింది.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయాల వద్ద భద్రతా చర్యలు కఠినంగా ఉండాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

💔 సింహాచలంలో అపశృతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్పందనసీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత ఘటనా స్థలాన్ని సమీక్షిస్తుండగ...
30/04/2025

💔 సింహాచలంలో అపశృతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్పందన
సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత ఘటనా స్థలాన్ని సమీక్షిస్తుండగా.. ప్రభుత్వమే బాధితులకు అండ
🔹 సింహాచలంలో చందనోత్సవ సమయంలో గోడ కూలి ఏడుగురు మృతి
🔹 ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
🔹 ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ
🔹 హోంమంత్రి అనిత సహాయక చర్యలు పర్యవేక్షణలో

పూర్తి సమాచారం ఇలా ఉంది:
విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో చందనోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న గోడ కూలిన ఘోర ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై ప్రభుత్వ పెద్దలు తీవ్ర స్పందన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ‘‘ఇది దురదృష్టకర ఘటన. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుంది. ఎవరూ ఆందోళన చెందకండి. ధైర్యంగా ఉండండి’’ అంటూ ప్రజలను ప్రోత్సహించారు.

డిప్యూటీ సీఎం అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సమయంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి.

ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. ‘‘సింహాచలం ఘటన కలచివేసింది. కలెక్టర్, ఎస్పీతో ఇప్పటికే మాట్లాడా. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నా’’ అని పేర్కొన్నారు.

ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు భక్తులు మృతిచెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖ KGH ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఇప్పటికే ముగ్గురిని గుర్తించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఇటువంటి భక్తుల సమూహాలు ఉండే ప్రాంతాల్లో భద్రతా చర్యలు మరింత బలపరిచేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.

🚨 సింహాచలం విషాదం: చంద్రబాబు దిగ్భ్రాంతివరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలిన ఘటనపై సీఎం స్పందన🔹 చందనోత్సవ వే...
30/04/2025

🚨 సింహాచలం విషాదం: చంద్రబాబు దిగ్భ్రాంతి
వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలిన ఘటనపై సీఎం స్పందన
🔹 చందనోత్సవ వేడుకలో భారీ విషాదం
🔹 భారీ వర్షానికి గోడ కూలి ఏడుగురు భక్తుల మృతి
🔹 ఘటనపై అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
🔹 గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు

వివరాల్లోకి వెళ్తే:
విశాఖ జిల్లా సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో అర్థరాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. రూ.300 టికెట్ క్యూకాంప్లెక్స్ సమీపంలోని 20 అడుగుల పొడవైన సిమెంట్ గోడ ఒక్కసారిగా కుప్పకూలడంతో 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా, వారిని వెంటనే విశాఖ KGH ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ విషాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలిపారు. గాయపడినవారికి అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశించారు.

చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, "చందనోత్సవ సమయంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం మనసును కలచివేస్తోంది. గోడ కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు.

ఇటువంటి ఆధ్యాత్మిక వేడుకల్లో భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనదో మరోసారి ఈ ఘటన గుర్తు చేస్తోంది. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలవాలని ప్రజలు ఆశిస్తున్నారు.

Address

Telangana
Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when News 24 Scribe posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share