Telangana Studio.

Telangana Studio. స్పోర్ట్స్, సినిమా,వినోదం, రాజకీయాలు, గాసిప్స్, మొదలగు విషయాలపై... తెలంగాణ మరియు జాతీయ, అంతర్జాతీయ. అన్ని రకాల వార్తలు రెగ్యులర్గా ఇక్కడ మీరు చూడవచ్చు..

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి షాక్‌ తగిలింది. ఎమ్మెల్యే మిశ్రిలాల్‌ యాదవ్‌ శనివారం బీజేపీకి రాజీనామా చేశారు....
12/10/2025

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి షాక్‌ తగిలింది. ఎమ్మెల్యే మిశ్రిలాల్‌ యాదవ్‌ శనివారం బీజేపీకి రాజీనామా చేశారు. అలీనగర్‌ ఎమ్మెల్యే, ప్రముఖ ఓబీసీ నేతగా పేరొందిన ఆయన పార్టీలో జరుగుతున్న అవమానం కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ‘బీజేపీలో ఉండటం మేము అవమానంగా భావిస్తున్నాం. పార్టీలో మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు. అవమాన పరుస్తున్నారు, మా ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నారు’ అని పాట్నాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఆరోపించారు. బీజేపీలో దళితులు, ఓబీసీలకు వారి హక్కులు లభించడం లేదని ఆయన విమర్శించారు.

‘సీనియర్‌ ఎమ్మెల్యేగా.. రెండుసార్లు మంత్రిగా కొనసాగుతున్న.. మాకు ఆత్మాభిమానం ఉండొద్దా?’ అని మంత్రి కొండా సురేఖ పార్టీ అధ...
12/10/2025

‘సీనియర్‌ ఎమ్మెల్యేగా.. రెండుసార్లు మంత్రిగా కొనసాగుతున్న.. మాకు ఆత్మాభిమానం ఉండొద్దా?’ అని మంత్రి కొండా సురేఖ పార్టీ అధిష్ఠానం దగ్గర తన ఆవేదనను వెళ్లబోసుకున్నారు. తమపై ఆధిపత్యం చెలాయించడమే పనిగా పెట్టుకున్నట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యహరిస్తున్నారని ఆమె మరోసారి అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు ప్రచారం సాగుతున్నది. అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మొదటి నుంచి తమ వ్యతిరేక వర్గాన్ని పెంచిపోషిస్తున్నారని పార్టీ అధిష్ఠానానికి నివేదించారు. ఆమె చెప్పిన అనేక విషయాలను సావధానంగా విన్న పార్టీ అధిష్ఠానం.. అంతా తమకు తెలుసని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు అవసరమైన సూచనలు చేస్తామని పేర్కొన్నట్టు తెలిసింది.

బనకచర్లపై మౌనమెందుకు రేవంత్‌?బనకచర్లపై ఏపీ ముందుకెళ్తుంటే మొద్దునిద్ర పోతున్నవ్‌టెక్నో ఎకనామికల్‌ అప్రైజల్‌ కోసం బనకచర్ల...
12/10/2025

బనకచర్లపై మౌనమెందుకు రేవంత్‌?
బనకచర్లపై ఏపీ ముందుకెళ్తుంటే మొద్దునిద్ర పోతున్నవ్‌
టెక్నో ఎకనామికల్‌ అప్రైజల్‌ కోసం బనకచర్ల పీఎఫ్‌ఆర్‌
వచ్చిందని ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి పాటిల్‌ లేఖ
కర్ణాటక, మహారాష్ట్ర తమ అభ్యంతరాలు చెప్పినయ్‌
మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
కర్ణాటకకు పోయి ఆల్‌ ఈజ్‌ వెల్‌ అనుకుంట వచ్చినవ్‌
ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని ఒక్క మాట చెప్పకపోతివి?
బనకచర్లపై మీరు వెళ్లకున్నా మేం సుప్రీంకోర్టుకు పోతం
తెలంగాణభవన్‌లో మీడియాతో మాజీ మంత్రి హరీశ్‌ కేంద్రంలోని బీజేపీ సహకారంతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ఏపీ ప్రభుత్వం ముందుకుపోతుంటే సీఎం రేవంత్‌రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటూ ఏపీకి పూర్తిగా సహకరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. టెక్నో ఎకనామికల్‌ అప్రైజల్‌ కోసం బనకచర్ల ప్రాజెక్టు పీఎఫ్‌ఆర్‌ వచ్చిందని, అనుమతుల ప్రక్రియ ప్రోగ్రెస్‌లో ఉన్నదని జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ సెప్టెంబర్‌ 23న సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారని, 20 రోజులైనా దాన్ని వ్యతిరేకించాల్సింది పోయి పరోక్షంగా సహకరిస్తున్నారని నిప్పులు చెరిగారు. మన దేశంలో వరద జలాల మీద డీపీఆర్‌ అప్రైజల్‌ ఉండదని, నికర జలాల మీద డీపీఆర్‌ ఉంటుందని, కానీ వరద జలాల మీద ఉండదని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), నదీ జలాల పంపిణీ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. వరద జలాల మీద డీపీఆర్‌ అప్రైజల్‌ను వ్యతిరేకిస్తూ కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి లేఖ రాస్తే రేవంత్‌రెడ్డి మాత్రం మౌనంగా ఉన్నారని ధ్వజమెత్తారు. తెలంగాణభవన్‌లో శనివారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, డాక్టర్‌ సంజయ్‌, ఎమ్మెల్సీలు ఎల్‌ రమణ, దాసోజు శ్రవణ్‌తో కలిసి హరీశ్‌ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి పాటిల్‌ రాసిన లేఖను, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కేంద్రానికి పంపిన లేఖలను మీడియాకు చూపించారు. బనకచర్ల పురోగతి.. తాజా పరిణామాలను మీడియా సాక్షిగా ప్రజల ముందు బయట పెడుతున్నానని చెప్పారు. బనకచర్ల డీపీఆర్‌ కోసం రూ.9కోట్లకు ఏపీ సర్కారు టెండర్లు కూడా పిలిచిందని, అయినా మన సీఎం మొద్దునిద్ర పోతున్నారని విమర్శించారు.

| బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 9పై హైకోర్టు మ...
09/10/2025

| బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై స్టే ఇచ్చింది. రిజర్వేషన్ల అంశంపై విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది. నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. బీసీ రిజర్వేషన్లపై రెండురోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ విలువడిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్‌పై సైతం హైకోర్టు స్టే విధించింది. దాంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనున్నది.

రేవంత్‌ రెడ్డి వంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావటం ఒక సహజమైన పతన పరిణామం వంటిదే తప్ప అందులో ఆశ్యర్యపడవలసింది ఏమీ లేదు. అటువంట...
23/09/2025

రేవంత్‌ రెడ్డి వంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావటం ఒక సహజమైన పతన పరిణామం వంటిదే తప్ప అందులో ఆశ్యర్యపడవలసింది ఏమీ లేదు. అటువంటి నాయకుని వ్యవహరణ ఇట్లుండటంతో పాటు తన సైకాలజీ, భాష ఈ విధంగా రూపు తీసుకోవటం కూడా సహజ క్రమమే. అందువల్ల ఆయనను చూసి అలెగ్జాండర్‌ నుంచి మొదలుకొని, డొనాల్డ్‌ ట్రంప్‌, కేసీఆర్‌ల వరకు అందరూ సానుభూతి చూపాలి. మరోవిధంగా ఏమీ అనుకోనక్కరలేదు. పై సదస్సులో పాల్గొన్నవారు కూడా బహుశా సానుభూతి మాత్రమే చూపి ఉంటారు తప్ప మరేమీ అనుకొని ఉండరు.

హైదరాబాద్‌లోని గాజులరామారంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఆక్రమణల పేరుతో హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. గాజులరామారం ...
21/09/2025

హైదరాబాద్‌లోని గాజులరామారంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఆక్రమణల పేరుతో హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. గాజులరామారం సర్వే నంబర్‌ 397లో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొగిస్తున్నారు.

రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన జర్నలిస్టుపై పోలీసులు ఉల్టా కేసులు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శ...
12/09/2025

రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన జర్నలిస్టుపై పోలీసులు ఉల్టా కేసులు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం. గడిచిన 2 నెలలుగా రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్న మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టడం శోచనీయం. శాంతిభద్రతల నిర్వహణను పక్కన పెట్టి ప్రజల గొంతు నొక్కేందుకు పోలీసులను వాడడం అప్రజాస్వామీకం. జర్నలిస్ట్ సాంబశివరావుపై పెట్టిన కేసులను తక్షణం ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీని డిమాండ్ చేస్తున్నాం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సభ ప్రారంభం కాబట్టి ...
30/08/2025

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సభ ప్రారంభం కాబట్టి అసెంబ్లీకి వచ్చానని.. రేపటి నుంచి రానని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన.. గన్‌పార్క్‌ వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ… ప్రజలు వరద కష్టాల్లో ఉన్నారని.. వారికి అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. వరద సమయంలో మనం ఉండాల్సింది ప్రజల్లో కానీ అసెంబ్లీలో కాదని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ప్రజల్లో ఉండి, వారి కష్టాలు తీర్చడమే తన లక్ష్యమని చెప్పారుకామారెడ్డి ప్రాంతంలో వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తన అనుచరులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించి వారికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అందువల్లే తాను అసెంబ్లీకి మళ్లీ రానని వివరించారు. ఇక మంత్రి పదవిపైనా రాజగోపాల్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరికైనా సరే పదవి శాశ్వతం కాదని అన్నారు. మంచి వ్యక్తిత్వం, సేవ చేయాలనే గుణమే శాశ్వతమని పేర్కొన్నారు. సేవాగుణం చచ్చేవరకూ ఉంటుందని.. కానీ పదవి మాత్రం ఉండదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా కాకుండా ఒక వ్యక్తిగా సహాయం చేస్తానని ప్రకటించారు. ప్రభుత్వమే అన్నీ చేయాలని అనుకుంటే సాధ్యం కాదు కదా అంటూ వ్యాఖ్యానించారు.

మరోవైపు అసెంబ్లీ వద్ద కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అనుచరులు బల ప్రదర్శనకు దిగారు. తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలంటూ నిరసనకు దిగారు.

రైతన్నకు కష్టం వస్తే ఆంక్షలు లెక్క చేయం.. ఇనుప కంచెలను లెక్క చేయం : హ‌రీశ్‌రావు Harish Rao | నాడు ఉద్య‌మంలో అధికార కాంగ్...
30/08/2025

రైతన్నకు కష్టం వస్తే ఆంక్షలు లెక్క చేయం.. ఇనుప కంచెలను లెక్క చేయం : హ‌రీశ్‌రావు Harish Rao | నాడు ఉద్య‌మంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ముచ్చెట‌మ‌లు ప‌ట్టించిన ఆరడుగుల బుల్లెట్.. నేడు ప్ర‌తిప‌క్షంలోనూ అదే కాంగ్రెస్ పార్టీకి చుక్క‌లు చూపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు హ‌రీశ్‌రావు.తాజాగా యూరియా కొర‌త తీర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స‌చివాల‌యాన్ని హ‌రీశ్‌రావు ముట్ట‌డించారు. బీఆర్కే భ‌వ‌న్ వైపు నుంచి స‌చివాల‌యం దిశ‌గా హ‌రీశ్‌రావు ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చి అన్న‌దాత‌ల త‌ర‌పున నిర‌స‌న తెలిపారు. ఈ క్ర‌మంలో ఇనుప కంచెల‌ను, పోలీసు ఆంక్ష‌ల‌ను హ‌రీశ్‌రావు లెక్క‌చేయ‌లేదు. స‌చివాల‌యం ప్ర‌ధాన గేటు వ‌ద్ద‌కు చేరుకుని హ‌రీశ్‌రావు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

రైతన్నకు కష్టం వస్తే ఆంక్షలు లెక్క చేయం.. ఇనుప కంచెలను లెక్క చేయం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. యూరియా రైతుల హక్కు… అది అందకుండా చేయడం కాంగ్రెస్, బీజేపీల తప్పు అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

ఇవాళ ఉద‌యం గ‌న్ పార్కు వ‌ద్ద బీఆర్ఎస్ నేత‌లు వినూత్న ప‌ద్ధ‌తుల్లో నిర‌స‌న వ్య‌క్తం చేశారు. అనంత‌రం అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు. శాస‌న‌స‌భ వాయిదా ప‌డిన త‌ర్వాత వ్య‌వ‌సాయ శాఖ క‌మిష‌న‌ర్ కార్యాల‌యానికి వెళ్లి యూరియా కొర‌త తీర్చాలంటూ క‌మిష‌న‌ర్‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. అనంత‌రం కార్యాల‌యం ముందు ధ‌ర్నాకు దిగారు. పోలీసులు అరెస్టు చేశారు. త‌ద‌నంత‌రం స‌చివాల‌యాన్ని ముట్ట‌డించి రైతుల త‌ర‌పున నిర‌స‌న వ్య‌క్తం చేశారు. అక్క‌డ పోలీసులు భారీగా మోహ‌రించి బీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను మ‌ళ్లీ అరెస్టు చేశారు.

సుంకాల పెంపు రాజ్యాంగ విరుద్ధం.. ట్రంప్‌కు ఆ హక్కులేదన్న యూఎస్‌ కోర్టు
30/08/2025

సుంకాల పెంపు రాజ్యాంగ విరుద్ధం..
ట్రంప్‌కు ఆ హక్కులేదన్న యూఎస్‌ కోర్టు

| జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఎక్కడున్నారు..? : అమిత్‌షాకు సంజయ్‌రౌత్‌ లేఖర్లమెంట్‌ వర్షాకాల సమావేశాల వేళ ఉప రాష్ట్రపతి (Vice-Presi...
11/08/2025

| జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఎక్కడున్నారు..? : అమిత్‌షాకు సంజయ్‌రౌత్‌ లేఖ
ర్లమెంట్‌ వర్షాకాల సమావేశాల వేళ ఉప రాష్ట్రపతి (Vice-President) జగదీప్‌ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankhar) అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జూలై 21న రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమే తాను ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని ధన్‌ఖడ్‌ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 67(ఏ) అధికరణ కింద ఇది తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఈ లేఖను విడుదల చేసింది. తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తి సహకారాన్ని అందచేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరో రెండేండ్లు పదవీకాలం ఉండగానే ధన్‌ఖడ్‌ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

Address

Hyderabad
500035

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana Studio. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share