Vasireddy Publications

Vasireddy Publications Started by Vasireddy Venugopal,senior journalist with 25 years of experience in media.Bangaram,sahakara jeevanam are some of the popular published books

పదకొండో ఏట కవిత్వం రాయడం ప్రారంభించింది స్రష్టవాణి. పద్దెనిమిదో ఏట కవితా సంపుటి వెలువరించింది. పాత్రికేయ మిత్రుడు కొల్లి...
01/09/2018

పదకొండో ఏట కవిత్వం రాయడం ప్రారంభించింది స్రష్టవాణి. పద్దెనిమిదో ఏట కవితా సంపుటి వెలువరించింది. పాత్రికేయ మిత్రుడు కొల్లి అరవింద్ గారి కుమార్తె స్రష్ట రాసిన టీన్ పొయెట్రీ Wild Wings ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది. మీడియాలో చర్చకు దారితీస్తోంది. రానున్న రోజుల్లో అనేక అద్భుతాలను, రికార్డులను సృష్టించబోతున్న ఈ కవితా సంపుటి ఇప్పుడు Flipkart ద్వారా ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చింది.
ఆ పుస్తకాన్ని కొనుగోలు చేసి.. ఆ చిన్నారిని ఆశీర్వదించాల్సిందిగా మనవి.
https://www.flipkart.com/wild-wings/p/itmf8jsem2jdwpjn?pid=9788192412863&lid=LSTBOK97881924128630OEJHB&marketplace=FLIPKART&srno=s_1_1&otracker=search&fm=SEARCH&iid=b9572f4f-9105-46f7-8cf9-c53c8bdb013d.9788192412863.SEARCH&ppt=SearchPage&ppn=Search&ssid=vnmr2ey1c00000001535786979393&qH=4ebb14e89f793150

పుస్తక ప్రియులకు విజ్ఞప్తి...పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలకు ప్రతి ఏటా ...
10/04/2018

పుస్తక ప్రియులకు విజ్ఞప్తి...
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలకు ప్రతి ఏటా పురస్కారాలు అందజేస్తుంటారు. ఈసారి ఈ పురస్కారాలకు ఎంపిక చేసే పుస్తకాల విషయంలో పాఠకుల సలహాలు, సూచనలను కూడా ఆహ్వానిస్తున్నారు.
వాసిరెడ్డి పబ్లికేషన్స్ ఇంతవరకూ ఈ పురస్కారాలకోసం ఏ పుస్తకాన్నీ పంపలేదు. కేవలం పాఠకుల సాధికారిక పురస్కారమే ప్రామాణికంగా తన పుస్తకాలను ప్రచురిస్తూ వచ్చింది. అదే పాఠకులు తమ సూచనలు ఇవ్వడానికి ఒక అవకాశం వచ్చింది. వాసిరెడ్డి పబ్లికేషన్స్ పుస్తకాలలో మీకు నచ్చినవి ఏమైనా వుంటే.. తెలుగు యూనివర్శిటీవారి అధికారిక పురస్కారంకోసం, వారికి తెల్లకాగితంపై రాసి సిఫారసు చేయవచ్చు.
పాఠకుల సౌలభ్యంకోసం.. సూచించగల పుస్తకాల వివరాలు అందజేస్తున్నాను.
1. ఫేస్ బుక్ గైడ్ ( మొదటి ముద్రణ 2013 డిసెంబర్)- రచయిత: Nagesh Beereddy
2. ఒక నజియాకోసం (మొదటి ముద్రణ 2015 ఆగస్టు)- రచయిత: Nagesh Beereddy
3. రిలేషన్స్ (మొదటి ముద్రణ 2015 ఏప్రిల్) – రచయిత: Nallamothu Sridhar
4. దేవరహస్యం (మొదటి ముద్రణ 2014 నవంబర్) – రచయిత: Kovela Santosh Kumar
5. హైకూలు (మొదటి ముద్రణ 2015 జూలై) – రచయిత: Bvv Prasad
6. నీలో కొన్నిసార్లు (మొదటి ముద్రణ 2015 జూలై) – రచయిత: Bvv Prasad
7. గాలి అద్దం (మొదటి ముద్రణ 2016 ఏప్రిల్) – రచయిత: Ms Naidu
8. చరిత్ర వాహినిలో పెరిక కులం (మొదటి ముద్రణ 2013 ఫిబ్రవరి) – రచయిత: Kanuganti Madhukar
9. ప్రయాణం (మొదటి ముద్రణ – 2014) – రచయిత: Odela Venkateswarlu
10. చేతిచివర ఆకాశం (మొదటి ముద్రణ 2015 జూలై) – రచయిత: Shailaja Bhandari
11. రోటిపచ్చళ్లు (మొదటి ముద్రణ 2016 డిసెంబర్) – రచయిత: Vasireddy Venugopal

రోటి పచ్చళ్ల ప్రాధాన్యతను, ఆవశ్యకతను తెలియజేస్తూ ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో వచ్చిన వ్యాసం. ‘రోటి పచ్చళ్లు’ పుస్తకంపై ...
26/02/2017

రోటి పచ్చళ్ల ప్రాధాన్యతను, ఆవశ్యకతను తెలియజేస్తూ ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో వచ్చిన వ్యాసం. ‘రోటి పచ్చళ్లు’ పుస్తకంపై సమీక్షలు..

20/12/2016

వాసిరెడ్డి పబ్లికేషన్స్ సగర్వ సమర్పణ.. ‘‘రోటి పచ్చళ్లు’’ పుస్తకం ఇప్పుడు హైదరాబాద్ బుక్ ఫేర్ లో స్టాల్ నెంబర్ 137లో అందుబాటులో వుంది. వెల: 150 రూపాయలు.
ఈ పుస్తకాన్ని ఫ్లిప్ కార్ట్ ద్వారా కూడా పొందవచ్చు. షిప్పింగ్ చార్జీలు అదనం.
https://www.flipkart.com/roti-pachallu/p/itmepg7x4fcuqztq?pid=RBKEPG7XTFHKFBEF&srno=s_1_2&otracker=search&lid=LSTRBKEPG7XTFHKFBEF2HQMKH&qH=1782cd05af4fc6e4

Buy Roti Pachallu for Rs.150 online. Roti Pachallu at best prices with FREE shipping & cash on delivery. Only Genuine Products. 30 Day Replacement Guarantee.

23/04/2016

ఈ రోజు World Book Day. సుప్రసిద్ధ రచయిత విలియం షేక్స్ పియర్ 400వ జయంతి కూడా. అంతర్జాతీయంగా పుస్తక పఠనాన్ని, ప్రచురణను, కాపీరైట్ ను ప్రోత్సహించడానికి యునెస్కో ప్రతి ఏటా ప్రపంచ పుస్తక దినోత్సవం నిర్వహిస్తోంది. ఈ శుభ సందర్భంగా వాసిరెడ్డి పబ్లికేషన్స్ పుస్తకాలను పాఠకులు నేరుగా ఇంటికే తెప్పించుకోవచ్చు.
http://www.flipkart.com/search?q=vasireddy+publications&as=off&as-show=on&otracker=start

Vasireddy Publications - Buy Products Online at Best Price in India. India's Leading E-commerce Company - Free Home Delivery - All Categories | Flipkart.com

తమకమూ + తాత్వికత = గాలి అద్దం!కాలం కాసేపు కదలకుండా కవిత్వం అవ్వడం అంటే గాలి అద్దంలో మనల్ని చూసుకోవడం కాబోలు అనిపించేలా ,...
22/04/2016

తమకమూ + తాత్వికత = గాలి అద్దం!
కాలం కాసేపు కదలకుండా కవిత్వం అవ్వడం అంటే గాలి అద్దంలో మనల్ని చూసుకోవడం కాబోలు అనిపించేలా , ఎన్ని ఊహాలు ఎన్ని ఊసులు .
చదువరికి ఒకో పేజి తిప్పుతున్నప్పుడు ఒకో పాదం గుండా పదాల సరిగమల్లో సాహితీకరణ చెందుతున్నప్పుడు ప్రతి అనుభూతి తనదే అనిపించాలి , భవిష్యత్తు వర్తమానం కన్నా కూడా ఎదో జ్ఞాపకాల వీచికలో బలంగా కొట్టుకుపోతున్న భావనలో కాసేపు నలిగి కరగాలి . అపుడది కవిత్వం అవుతుంది ఇంకా సరిగ్గా చెప్పాలంటే గాలి అద్దం అవుతుంది .

విప్పేసిన జ్ఞాపకాలనే
తిరిగి తిరిగి తొడుక్కుని
మరణ ప్రవాహంలో ఈదుతావు
నిశ్శబ్దాన్ని నిశ్శబ్దంతో వింటూ తేలిపోతుంటావు
కవిత్వమేనా ఇదంతా కాదేమో ,కవి ఆత్మ కవితాత్మతో ముడిపడి సున్నితంగా గుండెకోత జరిపే క్షణాల అనుభవమేమో . నమ్మకం కలగలేదా అయితే
“ ఈ రాత్రినే
దాచిపెట్టు నేలవంకకి తెలియకుండా “
ఈ వాక్యంలో నిన్నోమారయిన పోగొట్టుకున్నావా నేస్తం ? లేదంటే ఇలా చూడు
“పాడుబడ్డ పదాల పేద గూటిలో
పెంచుకున్న వాక్య పక్షి ఎగరదు
దిగంతాల దుఃఖమేది అందదు .
Hmmm కాసేపో విషాదం కమ్ముకున్న మేఘంలో ఒంటరి ప్రయాణం .

సోషల్ మీడియాలో అక్కడక్కడా సత్యంగా చెప్పుకోవాలంటే చాలా అరుదుగా మెరిసే మెరుపులా చమక్కులా మాత్రమే ఎం ఎస్ నాయుడు గారు తెలిసిన నాలాంటి చదువరులు “ గాలి అద్దం” పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకోగానే ముందు కవర్పేజీల నలుపు తెలుపు రంగుల్లో రమణజీవి , శంకర్ పామర్తి గారి గీతలలో మిస్టిక్ వాసనలకి మైమరిచిపోయి కాసేపలా ఆగిపోవడం ఒక వంతయితే పేజీలు తిప్పడం మొదలు పెట్టగానే నెమ్మదిగా మొదలయ్యే ఉద్వేగం , ప్రాణం ఎక్కడ ఆగుతుందో , కవిత యే జ్ఞాపకాల పరదాలు చీల్చుకొని ఏ కణంలో సున్నితంగానే అయినా కస్సుమని దిగుతుందో చెప్పడం అంత సులువేం కాదు .
నిజానికి గాలి అద్దంలో ప్రతి కవిత ఒక రోలర్ కోస్టర్ రైడ్గానే చెప్పుకోవాలి
మనసొక శోకవాయువు అని మొదలు పెట్టి ఇపుడైనా గెంతెయ్యాలి మనసు మట్టి మీద నుంచి అని రాసుకోగలిగే కవులు ఎంత మంది ఉంటారు , ఆ కవితా సముద్రంలో కాసేపు ఉక్కిరిబిక్కిరికాకుండా మనం ఎలా ఉండగలం .
టాగోర్ ఆరాధన నుండి భయటికి రావడానికి ఇష్టపడని సాహితీప్రియులు “ విసిరేసిన వక్షోజాలు జారుడుబల్లలో ఆగిపోయి కలలు కంటున్నాయి “ లాంటి వాక్యాలకి ఎంతగా ఉలిక్కి పడతారో తెలియదుగాని , ఈ పుస్తకంలో “ డాలీనందుకోలేక “ కవితలాంటివి అలాగే స్థలంకై స్తనంకై లాంటి టైటిల్స్ , ఎం ఎస్ గారి పదాల్లో బోల్డ్ నేచర్కి న్యూ ఏజ్ కవులు ఒక సలాం కొట్టాల్సిందే . పుస్తకం మొదట్లో కంటే కూడా లోలోపలకి చేరేకొద్దీ కవితో పాటు రీడర్ తనలోకి తానూ చేసే ఏకాంత ప్రయాణమొక నిజ అనుభవం . కొన్ని క్షణాల స్టిల్ లైఫ్ . అందుకే అన్నది ప్రాణమెక్కడ ఆగిందో పదమెక్కడ గుచ్చుకుందో చెప్పడం అంత సులువేం కాదు .
Thomas Gray ప్రఖ్యాత వాక్యం చెప్పినట్లు Poetry is thought that breathe and words that burn అని సెగలు , శ్వాసలు , శ్వాసల సెగలలో సగం సగం కాలిపోయి నిలబడటం గాలి అద్దంస్పెషాలిటీ ఖచ్చితంగా . జీవితపు తమకానికి తాత్వికత అద్దితే అదే ఎం ఎస్ నాయుడి గారి గాలి అద్దం. సాహితీవ్రణాలకో అవసరమైన మలాం .
( వెబ్ మేగజైన్ సారంగలో ‘నిశీధి’ సమీక్ష. ఈ పుస్తకాన్ని flipkart.com ద్వారా తెప్పించుకోవచ్చు)
http://www.flipkart.com/gali-addam/p/itmehs9rx4r84hav?pid=RBKEHS9R7WMVBBHN&al=EQptd37KWsCGQD3pY%2FdZy8ldugMWZuE7%2BW7da8XnwKSlSHP0XRCFTMFklyNySfbmnYueEJFv1Tg%3D&ref=L%3A-1980716996700976080&srno=p_3&otracker=from-search

Buy Gali Addam for Rs.160 online. Gali Addam at best prices with FREE shipping & cash on delivery. Only Genuine Products. 30 Day Replacement Guarantee.

BOOK BUCKET CHALLENGE...ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు.. పుస్తక ప్రేమికుల రోజు కూడా..ప్రపంచవ్యాప్తంగా 14వ తేదీని Give a Bo...
10/02/2016

BOOK BUCKET CHALLENGE...
ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు.. పుస్తక ప్రేమికుల రోజు కూడా..
ప్రపంచవ్యాప్తంగా 14వ తేదీని Give a Book Day/ Interntional Book Giving Day గా కూడా జరుపుకుంటారు. ఆ రోజున మనం కూడా ఓ పుస్తకాన్ని బహుమతిగా ఇద్దాం. పుస్తకాలు కొనుక్కోవడానికి స్తోమతలేని పేద విద్యార్థులకు బహుమతిగా ఇచ్చి, పుస్తకాల పట్ల, పిల్లల పట్ల మన ప్రేమను చాటుకుందాం.
అనాధ పిల్లల శరణాలయాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో వీటిని అందజేయవచ్చు. ఇలా అందజేయడంకోసం కొంత బాలసాహిత్యాన్ని సేకరించి వుంచాం. ఓసారి పరిశీలించండి.
ప్రముఖులు రచించిన మొత్తం 9 పుస్తకాల సెట్టు వెల: 107 రూపాయలు.
అందులో కథలు, స్ఫూర్తిదాయకమైన జీవిత చరిత్రలు, విజ్ఞానాన్ని పెంపొందించే అంశాలు వున్నాయి. వాటిని పిల్లలకు అందుబాటులోకి తేవడంకోసం ఫిబ్రవరి 14ని ఓ సందర్భంగా ఎంచుకోండి. మీ వీలునుబట్టి, సందర్భాన్నిబట్టి.. ఉదాహరణకు బర్త్ డే లాంటివి.. మిగతా రోజుల్లోనూ ఇవ్వవచ్చు. కనీసం పదిమంది విద్యార్థులకు ఇలా అందజేస్తే.. మీకు అదొక తీపి జ్ఞాపకంగా వుంటుంది. పిల్లల్లో పఠనాభిలాషను పెంపొందించడంలో మీ వంతు కర్తవ్యం నెరవేర్చిన వారు అవుతారు. సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాను.
ఫోన్ నెంబరు: 9000528717. కొరియర్ ద్వారా, పోస్టల్ ద్వారా, ఎఎన్ఎల్ పార్సిల్ ద్వారా.. మీకు అనుకూలమైన పద్ధతిలో పుస్తకాలు పంపగలం.
పుస్తకాల వివరాలు:
1. బాలదీపికలు (రచన: నాయని రమాదేవి, వెల: రూ.12),
2. రాణి రుద్రమదేవి (పింగళి పార్వతీప్రసాద్, వెల: 11)
3. ఫిడేలు నాయుడుగారు (పాలగుమ్మి విశ్వనాధం, వెల: 18),
4. ప్రముఖ వాగ్గేయకారులు (జి.కృష్ణ, వెల: 12),
5. బంగారు కుందేలు (డాక్టర్ రావూరి భరద్వాజ, వెల: 12),
6. పుష్కర నదులు (గోవాడ సత్యారావు, వెల: 12),
7. జాతీయ విషయాలపై నెహ్రూ భావనలు (ఎన్.ఎన్.చటర్జీ, వెల: 5),
8. ప్రపంచ క్రీడారంగంలో భారతదేశం (కొండుభట్ల రామచంద్రమూర్తి, వెల: 15),
9. జూడీ లక్ష్మీ (1962 నాటి భారతదేశ పరిస్థితులను వివరించే నవల- నయోమీ మిచిసన్, వెల: 10).
మీరు మీ ప్రియమైన వారికి పుస్తకాలు అందజేస్తున్న ఫోటోలను ముఖపుస్తకం‌లో జతచేస్తే మేమూ ఆనందిస్తాం. అభినందిస్తాం.
“Long Live International Book Giving Day”

‘‘ ఒక నజియా కోసం’’ నవల.. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయాన్ని పాఠకులు వినియోగించుకోవచ్చు.....
04/02/2016

‘‘ ఒక నజియా కోసం’’ నవల.. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయాన్ని పాఠకులు వినియోగించుకోవచ్చు...
http://www.flipkart.com/oka-nazia-kosam/p/itmefku4kadbtred?pid=RBKEFKU4EDHCWBUQ&icmpid=reco_pp_historyFooter_na_na_1

Buy Oka Nazia Kosam for Rs.150 online. Oka Nazia Kosam at best prices with FREE shipping & cash on delivery. Only Genuine Products. 30 Day Replacement Guarantee.

ఈ పుస్తకం కావాల్సిన వారు వాసిరెడ్డి పబ్లికేషన్స్ కి 80 రూపాయలు, 30 రూపాయలు కొరియర్ ఛార్జిలు పంపగలరు.
14/09/2015

ఈ పుస్తకం కావాల్సిన వారు వాసిరెడ్డి పబ్లికేషన్స్ కి 80 రూపాయలు, 30 రూపాయలు కొరియర్ ఛార్జిలు పంపగలరు.

ఒక నజియా కోసం…1947 నాటి చరిత్రాత్మక వీర తెలంగాణ సాయుధ పోరాట నేపధ్యంలో జరిగిన ప్రేమకథ అని చదివాను. ఇవన్నీ అంతగా ఇష్టపడని ...
07/09/2015

ఒక నజియా కోసం…
1947 నాటి చరిత్రాత్మక వీర తెలంగాణ సాయుధ పోరాట నేపధ్యంలో జరిగిన ప్రేమకథ అని చదివాను.
ఇవన్నీ అంతగా ఇష్టపడని నేను ఏమోలే అనుకుని వదిలేశాను.
ఎప్పటికప్ప్పుడు ఆ పుస్తకంపై వారికున్న నమ్మకాన్ని నగేష్ గారు, వాసిరెడ్డి గారు తమ పోస్టుల ద్వారా తెలియచేస్తూనే ఉన్నారు..
అయినా అంతగా ఆసక్తి కలగలేదు.
అనన్య పర్వం పేరుతో ముందు మాటను ముందుంచినా.. ఇదో హైటెక్ టెక్నిక్ అనుకున్నాను.
అదే టైంలో ఈ గ్రూప్ లోని ఒకరికి పాప పుట్టడం... ఆ పాపకు అనన్య అని పేరు పెట్టడం జరిగాయని కూడా తెలియచెప్పారు.
ఆ పాప ఈ బుక్ కు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పారు. చాలా చిత్రంగా అనిపించింది... ఒక బుక్ కోసం ఇంత చేస్తున్నారు అని.
ఒక నజియా కోసం పుస్తకం మోషన్ కవర్ డిజైన్ చేసినది ఇద్దరమ్మాయిలు. కాస్త కొత్తగా అనిపించింది. "మోషన్ కవర్" అన్నది.
తరువాత "టి షర్టులు" అన్నారు.. తరువాత "ప్రణి ఆర్ట్స్"తో డిజైనింగ్.. అటు తరువాత "బుర్ర కథ" కథ.. ఇలా ఎన్నో మలుపులు తిరుగుతూ చివరికి 23 ఆగస్టున విడుదలయింది.
విడుదలయింది అని ఎందుకు అన్నాను అంటే... ఒక సినిమాకు ఎంతలా ప్రచారం చేస్తారో అంత చేసారు అందుకు.
మా ఊరు వచ్చి మా చేతికి అందే సరికి మరో 10 రోజులు.. నా చేతికి వచ్చిన పుస్తకాన్ని చూసి ఇదన్నమాట పుస్తకం అనుకుని పక్కన పెట్టాను.
శనివారం సెలవు హడావిడి.. రాత్రి ఎప్పటికో తీరిక దొరికింది.. అప్పుడు తీసుకున్నా పుస్తకాన్ని చేతుల్లోకి.ఏముందో ఏమిటో ఇందులో అంతలా ప్రచారం కల్పించారనుకుంటూ ఓపెన్ చేశాను.

ముందు మాట కట్టా శేఖర్ రెడ్డి గారు రాశారు.
"కాలానికి జీవితం ఉంటుంది. జీవితం గతం నుండి వర్తమానం మీదుగా భవిష్యత్తుకు తీసుకుపోతుంది. కానీ గతం ఒక స్మృతిగా మారి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది."
ఎక్కడో ఏదో స్ఫురించినట్టనిపించింది.

అనన్య పర్వం... ఇది హైటెక్ హంగామాలా ఒకప్పుడు నేననుకున్నా...
కానీ ఈ కథకి అది ఎంత అవసరమో ఆ క్షణం తెలిసింది.
ఆ పర్వంలో రచయిత తనని తాను పరిచయం చేసుకున్న పద్ధతి బావుంది.టెక్నాలజీతో పాటు మనుషుల అంతరంగాలను తడుముతూ కథ మొదలవుతుంది.

నాజియా అన్నది కరెక్ట్ పదం అని ఎవరో చెబితే తెలిసింది.
నాజియా నజియా ఎలా అయింది?
రచయిత అద్భుతమయిన ప్రతిభను కనబరుస్తూ.. తను రాసిన పుస్తకానికి అసలు పేరుకి మధ్య సమన్వయం కుదర్చటం చాలా నచ్చింది.
కాస్త చదివి పక్కన పెట్టేద్దామనుకున్నా..కానీ మొత్తం చదివేశాను.. 4 గంటలు పట్టింది.

60 ఏళ్ళ తరువాత వెనక్కి తిరిగొచ్చిన ఉత్తరం..
అది చూసి కుప్పకూలిన తాతయ్య
ఆఖరి కోరిక తీర్చాలనుకునే కుటుంబం
పాత డైరీల సాయంతో ముంబాయి నుండి హైదరాబాదు ప్రయాణం.

యాదయ్య (కథలో హీరో )తన గురించి చెబుతూ ముందు మాతృభూమి
తరువాత కన్నతల్లి అని తన వ్యక్తిత్వాన్ని చూపారు.
భాష కాస్త కొత్తగా తెలంగాణా నేపధ్యం కావున కాస్త( బాగానే) సమయం తీసుకుంటుంది ...

యాదయ్య మాటల్లో పుస్తకం చదువుతున్నా... 70ఎం.ఎం.లో సినిమా చూస్తున్నట్టుగా కళ్ళముందు కనబడుతున్నట్టే ఉంది.
ఆ కాలంలో సైకిల్ ఎంత గొప్పదో వివరిస్తూ భలే చెప్పారు.
అన్యాయం జరుగుతుంటే ఎదురించటానికి చదువు కాదు ధైర్యం కావాలని యాదయ్య ద్వారా చూపారు.
రజాకారులను ఎదురించిన మన హీరో యాదయ్య కాస్త రామస్వామిగా మారి మొదట హైదరాబాదు చేరుకుంటాడు.
అప్పుడు మొదలవుతుంది అసలు కథ.
తొలిప్రేమ తాకిడి పలవరింతలు పులకరింతల నడుమ వాస్తవ పరిస్థితులను చూపుతూ "ఆళ్ళనీ ఈళ్ళనీ ఏసుడు కాదుకంటే ఆ నిజాం నవాబునే ఏసెద్దాం" అని రామస్వామి అంటే ..
అప్పటికే ఉద్యమాలలో తలలు పండినవారు సైతం ఆశ్చర్యపోయారు యాదయ్య ధైర్యానికి.
అలా మొదలయిన ప్రస్థానం ప్రేమతో పాటు మలుపులు తిరుగుతూ...
అలకల మార్గంలో (ఈ మజ్జ నన్ను పట్టించుకుంటలెవ్.. "నాకీ మీద నీకి ప్రేమ తగ్గింది")అంటూనే బాధ్యతకు నెరవక రామస్వామిని నజియా సాగనంపిన వైనం నవాబు చేతిలో నుండి తప్పించుకుని వచ్చిన రామస్వామిని చూసి భయం కలిగినా..
తన గురించి ఆలోచించుకోక చాలా సమయస్పూర్తితో ముంబై పంపటం..
వెళ్ళిన రామస్వామి అనుకోకుండా బాధ్యతలలో కూరుకుపోయి నజియాని మర్చిపోయాడా లేదా?
మర్చిపోతే ఉత్తరం ఎందుకు రాశాడు?
ఉత్తరం రాస్తే హైదరాబాదు అడ్రెసుకు ఎందుకు చేరలేదు?

ఇలాంటి సస్పెన్స్ తో ముందుకు సాగుతూ..
రామస్వామి మనవడు నజియా ఏమయిందో వెతకటానికి రావటం
ఎలా వెతికారు దానివల్ల వారి మానసిక స్థితి..
నజియా దొరికిందా లేదా?
దొరికితే ఇన్నాళ్ళూ ఎక్కడుంది?
ఏం చేస్తూ ఉంది ఇన్నాళ్ళూ?
ఇలా చాలా ప్రశ్నలు
ప్రశ్నలకు సమాధానాలుగా వారి మానసిక పరిణితిని చూపుతూ రాసిందే "ఒక నజియా కోసం".
ఒక మంచి పుస్తకం చదివినందుకు సంతోషంగా ఉంది.
(గౌరవ పాఠకురాలు R Tulasi Chowdary రాసిన మాటలు ఇవి. పుస్తకం చదువుతూ వారు సంతోషంగా దిగిన ఫోటోలను మీతో షేర్ చేసుకుంటున్నాము)

ఆగస్టు 23 న "ఒక నజియా కోసం "పుస్తకావిష్కరణకు వెళ్లడం , రచయిత నగేష్ బీరెడ్డి గారి చేతుల మీదుగా పుస్తకం అందుకోవడం,ఇంకా పలు...
03/09/2015

ఆగస్టు 23 న "ఒక నజియా కోసం "పుస్తకావిష్కరణకు వెళ్లడం , రచయిత నగేష్ బీరెడ్డి గారి చేతుల మీదుగా పుస్తకం అందుకోవడం,ఇంకా పలువురు కవి మిత్రులను ముఖ్యంగా వాసిరెడ్డి వేణుగోపాల్ గారిని కలవడం ,నా కవితా సంఫుటి "చేతి చివర ఆకాశాన్ని" వారందరికీ అందించడం ..ఇలా ఎన్నో జ్ఞాపకాలను మూటకట్టుకుని వచ్చాను.ఇక అప్పటి నుంచి మొదలు..బుక్ షెల్ఫ్ లోంచి ఒక నజియా తనను చదవమని పిలవడం..అంతలోనే ఏదో ఒక పనిలో తలమునకలుగా మునిగిపోవడం....
ఇక ఆరోజు రానే వచ్చింది.సెప్టెంబర్ 1,మంగళవారం.ఉదయం ఆరింటికి లేచానేమో ..!ఇంటిపని,వంటపని బ్రేక్ ఫాస్ట్ తో సహా అయిపోయాయి.ఉదయం 9-9.30 గంటల మధ్యలో డైనింగ్ టేబుల్ పై కూర్చుని పిల్లల ఆటాపాటా చూస్తున్నాను.
బుక్ షెల్ఫ్ లో ఒక నజియా పలుకరించింది.మురిపెంగా చేతుల్లోకి తీసుకున్నాను.టైటిల్ ని తడిమాను.నజియా పదాలు మునివ్రేళ్లకు తగిలాయి.1947 నాటి చరిత్రాత్మక వీర తెలంగాణా ప్రేమకథ.....అన్వేషణా యాత్ర మొదలుపెట్టాను..
ఆపరేషన్ హైద్రాబాద్ -2 వరకు చదివాక ...ఒక ఉద్వేగం.., తర్వాత ఏం జరిగిందో తెల్సుకోవాలన్న ఉత్సుకత...అసలు నజియా ఎవరు ? అన్న ఆరాటం నిలువనీయలేదు.కళ్లు అలా అక్షరాల వెంట పరుగులు తీస్తున్నాయి.అసలు చదవడానికి ముందుగా ..నేను ఇవాళ కొంత ,రేపు మరికొంత చదువుదామనుకున్నాను.కానీ ఎక్కడ...లంచ్ చేయాలన్న విషయం మరిచి ..అలా చదివేశాను.
రచయిత మనల్ని నిజాం నాటి కాలానికి..,స్వాతంత్ర్యం వచ్చిన నాటి తొలిరోజులకు తీసుకెళ్తాడు.ఆనాటి రజాకార్ల సమయంలోని దుర్భర పరిస్తితులను కళ్లకు కట్టినట్లు చూపిస్తాడు.నిజాం ఏలుబడిలో రజాకార్ల ఆగడాలకు ముఖ్య పాత్రధారితో పాటు మన కళ్లూ ఎరుపెక్కుతాయి.2009 నాటి తెలంగానా మలి ఉద్యమ పోరాట స్పూర్తిని ఒక్కసారి గుర్తుకు తెస్తాడు ఈ నవలలో.అసలు ఇది నవలనా ..లేక నిజంగా జరిగిందా అన్న భ్రమ కల్పిస్తాడు రచయిత.
తాను రాసే ప్రేమ కథను ,నిజాం కాలాన్ని సమన్వయపరచుకుంటూ ఒక కథ అల్లడం నిజంగా సాహసమే.ఎక్కడా బోర్ కొట్టకుండా ,సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ,ఆసాంతం చదివేలా చేయడం ..ఒక్కో పార్టు చదువుతూ ఉంటే ఆ frames అన్నీ కళ్ల ముందు కదలాడేలా చేసిన రచయిత అద్భుత ప్రతిభకు సలాం....చదువుతూ..చదువుతూ....నజియా అన్వేషణలో మనమూ ఒక భాగమైపోతాము.
నజియా ప్రేమను నాలో నిల్పుకుంటూ ...నా మనసులో అనిపించిన నాలుగు వాక్యాలు మన మిత్రులందరితో ఇలా పంచుకుంటున్నాను.ఈ నవలలో రచయిత చెప్పిన మాటలు.....
1) నువ్వు ఏదైనా సాధించాలని బలంగా .సంకల్పించుకుంటావో దాన్ని సాధించడంలో ఈ విశ్వం అంతా కుట్ర పన్ని నువ్వు సాధించడంలో సహాయం చేస్తుంది.
2)డబ్బుతో కొనలేనివి కొన్ని ఉంటాయి.అవేంటో తెలిసినప్పుడే నీకు జీవితం అంటే ఏమిటో అర్థం అవుతుంది.
3)ప్రేమంటే కలిసి బ్రతకడం మాత్రమే కాదని..నువ్వక్కడ ..నేనిక్కడ ఉన్నా..నువ్వక్కడ , నేనిక్కడ లేకున్నా ప్రేమ ప్రేమ గానే ఉంటుందని..ప్రేమ ప్రేమని ప్రేమిస్తూనే ఉంటుందని ..
ఒక్కటే మాట .....208 పేజీల "ఒక నజియా కోసం "ఒక నవల కాదు.ఒక చరిత్ర....తెలంగాణా సాయుధ పోరాట చరిత్ర...ఉద్యమ నేపథ్యమున్న ప్రేమకథ...ఇంత చక్కని పుస్తకాన్ని రచించిన నగేష్ బీరెడ్డి గారికి అభినందనలు.నమస్తే తెలంగానా దినపత్రికలో ఫీచర్స్ పేజీ" జిందగీ" ఇంచార్జ్ గా పనిచేస్తున్న వారు ఇంకా ఎన్నొ మంచి పుస్తకాలు రచించాలని అభిలషిస్తూ...
- Shailaja Bandari (చేతి చివర ఆకాశం.. కవయిత్రి.. )

Address

Hyderabad
500060

Telephone

9000528717

Website

Alerts

Be the first to know and let us send you an email when Vasireddy Publications posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category