i News

i News Official page For iNews Channel

Official page For iNews Channel

రూ.4 కోట్ల మోసం కేసు.. కొండపల్లి గణేష్‌ పై లుక్‌అవుట్‌ నోటీసు?గచ్చిబౌలి మైహోమ్ భూజాలో వరుసగా రెండుసార్లు గణేష్ లడ్డూను ద...
08/08/2026

రూ.4 కోట్ల మోసం కేసు.. కొండపల్లి గణేష్‌ పై లుక్‌అవుట్‌ నోటీసు?

గచ్చిబౌలి మైహోమ్ భూజాలో వరుసగా రెండుసార్లు గణేష్ లడ్డూను దక్కించుకున్న కొండపల్లి గణేష్‌ పై లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం..

రియల్ ఎస్టేట్, మద్యం వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించి బాధితుల నుంచి రూ.4 కోట్లు వసూలు చేసి మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి..

ముందస్తు బెయిల్‌ నిరాకరణతో ఏప్రిల్‌లో గణేష్ పరారైనట్లు పోలీసులు తెలిపారు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ కేసులోనూ ఆయన కోసం గాలింపు కొనసాగుతోంది..

దేశం విడిచి పారిపోకుండా లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేసే దిశగా పోలీసులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

థాయ్‌లాండ్‌లో స్కూల్‌లో కాల్పులు.. ఐదుగురు టీచర్లు మృతి..!బ్యాంకాక్ సమీపంలోని నొంతబురి ప్రావిన్స్‌లోని ఓ పాఠశాలలో 14 ఏళ్...
08/08/2026

థాయ్‌లాండ్‌లో స్కూల్‌లో కాల్పులు.. ఐదుగురు టీచర్లు మృతి..!

బ్యాంకాక్ సమీపంలోని నొంతబురి ప్రావిన్స్‌లోని ఓ పాఠశాలలో 14 ఏళ్ల విద్యార్థి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు ఉపాధ్యాయులు మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. కాల్పులకు ముందు నిందితుడు తన తాత, అమ్మమ్మలను కూడా కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. అనంతరం పాఠశాలలోనే ఆత్మహత్య చేసుకున్నాడు..

నిందితుడు 20కి పైగా రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

నిందితుడు పాఠశాల సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు ప్రధాని అనుతిన్ చార్న్‌విరాకుల్ తెలిపారు.

08/08/2026

😮ప్రతిభతో ఫ్లయింగ్ వాహనం! బిలియనీర్ల పిల్లలు ఐస్‌క్రీమ్ బ్రాండ్లు.. మధ్యతరగతి యువకుడు ఫ్లయింగ్ వాహనం!

ఏఐతో జీఎస్టీ మోసాలకు చెక్‌.. సీఎం రేవంత్‌కు అరవింద్ సుబ్రమణియన్ ప్రజెంటేషన్..!ఏఐ (కృత్రిమ మేధ)ను వినియోగించి జీఎస్టీ పన్...
08/08/2026

ఏఐతో జీఎస్టీ మోసాలకు చెక్‌.. సీఎం రేవంత్‌కు అరవింద్ సుబ్రమణియన్ ప్రజెంటేషన్..!

ఏఐ (కృత్రిమ మేధ)ను వినియోగించి జీఎస్టీ పన్ను లీకేజీలు, మోసాలను అరికట్టవచ్చని ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ తెలిపారు..

రాష్ట్ర ఆదాయాన్ని పెంచే మార్గాల పై సీఎం రేవంత్ రెడ్డికి ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొని ఆదాయ వనరుల పెంపు పై చర్చించారు.

ట్రంప్ కీలక ఆదేశాలు.. బర్త్ టూరిజం పై కఠిన చర్యలు!అమెరికాలో పుట్టుకతో పౌరసత్వం అంశం పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఆ...
08/08/2026

ట్రంప్ కీలక ఆదేశాలు.. బర్త్ టూరిజం పై కఠిన చర్యలు!

అమెరికాలో పుట్టుకతో పౌరసత్వం అంశం పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. బర్త్ టూరిజాన్ని అడ్డుకునేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు..

అమెరికాకు పర్యాటకులుగా వచ్చి పిల్లలను కనడం ద్వారా పౌరసత్వం పొందే ప్రయత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రభుత్వం తెలిపింది..

విదేశీ ప్రభుత్వ ఉద్యోగులు, కొన్ని ఇతర వర్గాలకు చెందిన తల్లిదండ్రుల పిల్లలకు పుట్టుకతో పౌరసత్వం నిరాకరించేలా ఆదేశాల్లో నిబంధనలు ఉన్నట్లు సమాచారం..

అయితే ఈ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని వలస వ్యవహారాల నిపుణులు విమర్శిస్తున్నారు. గతంలో ట్రంప్ జారీ చేసిన ఇలాంటి ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.

08/08/2026

‘జనసేనతో కూడా పొత్తు పెట్టుకోం’! | No Alliance with JanaSena in Telangana, Says BJP’s Ramchander Rao

కృష్ణా జలాల పై కీలక భేటీ.. 13న త్రిసభ్య కమిటీ సమావేశం..!కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ సమావేశం ఈ నెల 1...
08/08/2026

కృష్ణా జలాల పై కీలక భేటీ.. 13న త్రిసభ్య కమిటీ సమావేశం..!

కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ సమావేశం ఈ నెల 13న హైదరాబాద్ జలసౌధలో జరగనుంది.

శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి లభ్యతతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజ్ రెండు రాష్ట్రాలకు లేఖ రాశారు.

08/08/2026

హైడ్రా ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోటెత్తు..! సరూర్‌నగర్ స్టేడియం వద్ద తోపులాట

డీసీసీ అధ్యక్షుల పై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఫోకస్.. మార్పులకు రంగం సిద్ధం?ఉత్తర తెలంగాణకు చెందిన నలుగురు డీసీసీ అధ్యక్షులను...
08/08/2026

డీసీసీ అధ్యక్షుల పై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఫోకస్.. మార్పులకు రంగం సిద్ధం?

ఉత్తర తెలంగాణకు చెందిన నలుగురు డీసీసీ అధ్యక్షులను మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం.

ఇటీవల ఢిల్లీలో జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో డీసీసీ అధ్యక్షుల పనితీరుపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, నాయకుల సమన్వయం తదితర అంశాల ఆధారంగా జిల్లాల వారీగా ర్యాంకింగ్స్ ఇచ్చినట్లు సమాచారం.

పనితీరు సరిగా లేదని భావిస్తున్న ముగ్గురు లేదా నలుగురు డీసీసీ అధ్యక్షులను త్వరలో మార్చే అవకాశం ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన తమనే టార్గెట్ చేస్తున్నారని కొందరు డీసీసీ అధ్యక్షులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు సంగారెడ్డి, రంగారెడ్డి, రామగుండం టౌన్ అధ్యక్షుల నియామకానికి ఏఐసీసీ పరిశీలకులను నియమించినట్లు సమాచారం.

08/08/2026

మంచిర్యాల యువకుడికి భరోసా.! | Dubai Road Accident: KTR Extends Support to Man from Mancherial

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when i News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to i News:

Shortcuts

Share

Category