Samayam Telugu

Samayam Telugu Samayam Telugu – Your daily source for news, politics, cinema, sports & lifestyle.

Play Store
https://play.google.com/store/apps/details?id=com.til.telugusamayam&hl=en_IN

App Store
https://apps.apple.com/us/app/samayam-telugu-telugu-news/id1469015977 SAMAYAM TELUGU is a Telugu news brand from Times Internet, India's largest digital products company which is a part of Times of India group.
టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపునకు చెందిన, భారత్‌లోనే అతిపెద్ద డిజిటల్ ప్రొడక్ట్స్ కంపెనీ అయిన ట

ైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ నుంచి వచ్చిన తెలుగు న్యూస్ సంస్థ ‘సమయం తెలుగు’. వార్తా విభాగంలో అపూర్వ అనుభవం ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా తన సేవలను ప్రాంతీయ భాషలకు సైతం విస్తరించింది. దీనిలో భాగంగా తెలుగులో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలను అందించేందుకు ‘సమయం తెలుగు’ను 2015 జులై లో నెలకొల్పింది. అంతకంతకు పెరిగిపోతున్న డిజిటల్ ప్రపంచంలో నూతన టెక్ ఆవిష్కరణలకు అనుగుణంగా వినూత్న పద్ధతిలో సమయం తెలుగు వార్తలను అందిస్తోంది. డెస్క్ టాప్, మొబైల్ ఫార్మాట్, మొబైల్ యాప్, సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు వార్తా కథనాలను చేరవేస్తోంది. తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తా విశేషాలు, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఎడ్యుకేషన్ కథనాలను ఎప్పటికప్పుడు అందజేస్తోంది.

ఇలాంటి పరిస్థితి ఏ యువకుడికి రాకూడదేమో. భార్యాభర్తల మధ్య గొడవలు కారణంగా పుట్టింటికి వెళ్లిపోయిన భార్య వరకట్నం వేధింపుల క...
08/06/2026

ఇలాంటి పరిస్థితి ఏ యువకుడికి రాకూడదేమో. భార్యాభర్తల మధ్య గొడవలు కారణంగా పుట్టింటికి వెళ్లిపోయిన భార్య వరకట్నం వేధింపుల కేసుల పెట్టింది. దీంతో ఇరు కుటుంబాలు పెద్దల్లో పంచాయితీ పెట్టాయి. ఇక అమ్మాయి నీతో ఉండనంటోంది కాబట్టి వరకట్నం డబ్బులు వెనక్కి ఇచ్చేసి సెటిల్‌మెంట్ చేసుకో అన్నారు పెద్దలు. అప్పటికే ఉద్యోగం లేక ఇబ్బందిపడుతోన్న భర్త.. డబ్బులు వెనక్కి ఇవ్వలేక తీవ్ర మనస్థాపానికి గురై ప్రాణాలు తీసుకున్నాడు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్‌ జలసంధి ద్వారా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడినా, భారతదేశం సులువుగా తట్టుకోగలదని ప...
08/06/2026

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్‌ జలసంధి ద్వారా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడినా, భారతదేశం సులువుగా తట్టుకోగలదని పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు.

మహాసేన రాజేష్.. వైసీపీ నుంచి టీడీపీలో చేరి కూటమి కోసం పనిచేస్తున్న వ్యక్తి. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ సమక్షంలో వైస...
08/06/2026

మహాసేన రాజేష్.. వైసీపీ నుంచి టీడీపీలో చేరి కూటమి కోసం పనిచేస్తున్న వ్యక్తి. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు మహాసేన రాజేష్. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఆ పార్టీకి దూరం జరిగారు. అనంతరం 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే సీటు కూడా సంపాదించుకున్నారు. అయితే ఊహించని రీతిలో పోటీ చేసే అవకాశం చేజారింది. ఈ నేపథ్యంలో వైసీపీలో తాను చేరిన సందర్భాన్ని గుర్తుచేసుకుని ఆరోజు ఏం జరిగిందనే వివరాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు మహాసేన రాజేష్.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ.. ఈ సినిమా స్కేల్ (నిర్మాణ వ్యయం), సాంకేతిక నైపుణ్యం అత్యున్నత స్థాయిలో ఉన్నాయని క...
08/06/2026

తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ.. ఈ సినిమా స్కేల్ (నిర్మాణ వ్యయం), సాంకేతిక నైపుణ్యం అత్యున్నత స్థాయిలో ఉన్నాయని కొనియాడారు. తాను తన కెరీర్‌లో ఇప్పటివరకు ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లో పనిచేయలేదని ఆమె స్పష్టం చేశారు. ‘‘ఈ చిత్రంలో పనిచేయడం సరికొత్త అనుభూతిని ఇచ్చింది. ఎందుకంటే ఇది సాంకేతికంగా అత్యంత అధునాతనమైన ప్రొడక్షన్. భారతదేశం ఇప్పటివరకు ఇలాంటి విజువల్ వండర్‌ను ఎప్పుడూ చూసి ఉండదు. నటీనటులుగా మేమంతా ఇలాంటి సాంకేతికతతో కూడిన పాత్రలను చేయడం ఇదే మొదటిసారి. ఇది పూర్తిగా మన భారతీయ కథ, మన హృదయాలకు ఎంతో దగ్గరైన కథ’’ అని కాజల్ చెప్పుకొచ్చారు.

నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడితో పాటు పరశురాముడి పాత్రలోనూ కనిపించనుండగా.. సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. అలాగే లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, దశరథ మహారాజుగా అరుణ్ గోవిల్ (పాత దూరదర్శన్ రామాయణంలో రాముడిగా నటించిన నటుడు), రావణుడిగా యష్ నటిస్తున్నారు. ఈ ఎపిక్ మూవీని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై యష్, నమిత్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా ఇది గుర్తింపు పొందింది.

భారీ అంచనాలున్న ఈ పౌరాణిక చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ‘రామాయణ’ మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుండగా, రెండవ భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదలయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

హైదరాబాద్‌లో ఓ క్యాబ్ డ్రైవర్‌పై నటుడు సుప్రీత్ రెడ్డి దాడి చేసిన వార్త ఉదయం నుంచి వైరల్ అవుతోంది. ఈ మేరకు క్యాబ్ డ్రైవర...
08/06/2026

హైదరాబాద్‌లో ఓ క్యాబ్ డ్రైవర్‌పై నటుడు సుప్రీత్ రెడ్డి దాడి చేసిన వార్త ఉదయం నుంచి వైరల్ అవుతోంది. ఈ మేరకు క్యాబ్ డ్రైవర్ శ్రీహరి.. కీసర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత అతను నటుడు అని తనకు తెలిసిందని శ్రీహరి అంటున్నారు.

ఓ డిప్యూటీ కలెక్టర్ భూ దందాలు, అక్రమ రిజిస్ట్రేషన్ల బాగోతం బయటికి వచ్చింది. ప్రభుత్వ భూములను అక్రమంగా ఇతరుల పేరు మీదికి ...
08/06/2026

ఓ డిప్యూటీ కలెక్టర్ భూ దందాలు, అక్రమ రిజిస్ట్రేషన్ల బాగోతం బయటికి వచ్చింది. ప్రభుత్వ భూములను అక్రమంగా ఇతరుల పేరు మీదికి బదిలీ చేసి.. ఆ తర్వాత మరొకరికి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే విచారణ జరిపిన అధికారులకు ఆ డిప్యూటీ కలెక్టర్ మరిన్ని భూ ఆక్రమణలకు సంబంధించిన వివరాలు తెలిపాయి. దీంతో వెంటనే ఆ డిప్యూటీ కలెక్టర్‌ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి హెచ్చరించారు.

'పెద్ది' సినిమాలో హీరోయిన్ తల్లి పాత్రలో అలరించిన నటి పులి సీత.. తాజా ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన...
08/06/2026

'పెద్ది' సినిమాలో హీరోయిన్ తల్లి పాత్రలో అలరించిన నటి పులి సీత.. తాజా ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూనే, ఆయన్ను కలవడానికి పడిన కష్టాలను చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఇండస్ట్రీకి వచ్చి పదకొండేళ్లు దాటినా చిరంజీవిని కలవలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఒకసారి సహాయం కోసం వెళ్తే అక్కడి సిబ్బంది, బాడీగార్డ్స్ తనను ఎంతో దారుణంగా మాట్లాడి పంపించేశారని.. ఈ విషయాలేవీ చిరంజీవి గారికి తెలియవని, ఆయన్ను చుట్టుముట్టి ఉండేవారి వల్లే ఇలా జరుగుతోందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడా...
08/06/2026

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, అన్ని శాఖలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

"పెద్ది సినిమాలో చివరి 40 నిమిషాలు నేను ఏదైతే నమ్మానో అదే జరిగింది. నేను థియేటర్లో సినిమా చూస్తుంటే కన్నీరు కారుస్తూ సిన...
08/06/2026

"పెద్ది సినిమాలో చివరి 40 నిమిషాలు నేను ఏదైతే నమ్మానో అదే జరిగింది. నేను థియేటర్లో సినిమా చూస్తుంటే కన్నీరు కారుస్తూ సినిమా చూస్తున్నారు. ఐమాక్స్‌లో చరణ్‌తో సినిమా చూస్తుంటే హాస్పిటల్ సీన్ చూసి నేషనల్ అవార్డ్ గ్యారెంటీ అంటున్నారు. నేను దేనికోసం అయితే సినిమా చేశానో అది నెరవేరింది." అంటూ పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యలపై మీ స్పందనేంటి???

బెంగళూరు దావణగెరెకు చెందిన ప్రవీణ్, ప్రియాంకకు 17 ఏళ్ల క్రితం వివాహం కాగా.. వీరికి ఒక కుమారుడు (15), కుమార్తె (6) సంతానం...
08/06/2026

బెంగళూరు దావణగెరెకు చెందిన ప్రవీణ్, ప్రియాంకకు 17 ఏళ్ల క్రితం వివాహం కాగా.. వీరికి ఒక కుమారుడు (15), కుమార్తె (6) సంతానం. కాడుగోడిలో ఉంటున్న సమయంలో ప్రియాంకకు తన బాల్య స్నేహితుడు మోహన్ కనిపించగా.. రెండేళ్లుగా అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి భర్త మందలించడంతో కొడుకుని భర్త వద్ద విడిచిపెట్టి మోహన్‌తో కలిసి సహజీవనం చేస్తోంది. 3 నెలల క్రితం కుమార్తె మరణించిందని ప్రవీణ్‌కు ఫోన్ చేసి చెప్పి.. ఆస్పత్రిలో ఇచ్చిన పోస్ట్‌మార్టం రిపోర్ట్ పంపించింది. ఆ రిపోర్టును విదేశాల్లో ఉంటున్న మెడికో ఫ్రెండ్‌కి ప్రవీణ్ పంపించగా.. అనుమానం వ్యక్తం చేశాడు. ఆహారం వికటించి పాప మరణించలేదని, హత్య చేసి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని చెప్పడంతో.. ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మోహన్‌ను అరెస్టు చేయగా.. ప్రియాంక పరారీలో ఉంది. రిపోర్ట్ ఇచ్చిన ఆస్పత్రిపైనా కేసు నమోదు చేశారు.

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Samayam Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share