Samayam Telugu

Samayam Telugu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Samayam Telugu, Media/News Company, Hyderabad.

SAMAYAM TELUGU is a Telugu news brand from Times Internet, India's largest digital products company which is a part of Times of India group.
టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపునకు చెందిన, భారత్‌లోనే అతిపెద్ద డిజిటల్ ప్రొడక్ట్స్ కంపెనీ అయిన టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ నుంచి వచ్చిన తెలుగు న్యూస్ సంస్థ ‘సమయం తెలుగు’. వార్తా విభాగంలో అపూర్వ అనుభవం ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా తన సేవలను ప్రాంతీయ భాషలకు సైతం విస్తరించింది

. దీనిలో భాగంగా తెలుగులో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలను అందించేందుకు ‘సమయం తెలుగు’ను 2015 జులై లో నెలకొల్పింది. అంతకంతకు పెరిగిపోతున్న డిజిటల్ ప్రపంచంలో నూతన టెక్ ఆవిష్కరణలకు అనుగుణంగా వినూత్న పద్ధతిలో సమయం తెలుగు వార్తలను అందిస్తోంది. డెస్క్ టాప్, మొబైల్ ఫార్మాట్, మొబైల్ యాప్, సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు వార్తా కథనాలను చేరవేస్తోంది. తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తా విశేషాలు, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఎడ్యుకేషన్ కథనాలను ఎప్పటికప్పుడు అందజేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ రికార్డుల్లో 'ఇతరులు' పేరుతో ఉన్న భూములకు మ్యుటేషన్లు నిలిపివేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసు...
18/10/2025

ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ రికార్డుల్లో 'ఇతరులు' పేరుతో ఉన్న భూములకు మ్యుటేషన్లు నిలిపివేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్య చేపట్టారు. దీనివల్ల నిజమైన హక్కుదారులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. వెబ్‌ల్యాండ్‌లో తప్పుడు నమోదులు, నిర్లక్ష్యం కారణంగా ఇలా జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం ఈ సమస్యలపై ఫోకస్ పెట్టి పరిష్కరించే పనిలో ఉంది.

తిరుమల శ్రీవారి దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా షెడ్యూల్ వచ్చేసింది! 2026 జనవరి నెలకు సంబంధించిన టికెట్ల విడుదల త...
18/10/2025

తిరుమల శ్రీవారి దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా షెడ్యూల్ వచ్చేసింది! 2026 జనవరి నెలకు సంబంధించిన టికెట్ల విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది. అక్టోబర్ 19 నుంచి వివిధ రకాల దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయని టీటీడీ తెలిపింది. ఇక తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలకు కూడా విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లో అద్దె ఇంటి యజమాని చేసిన దారుణం వెలుగు చూసింది. అశోక్ యాదవ్ అనే యజమాని, అద్దెకు ఉంటున్న దంపత...
17/10/2025

హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లో అద్దె ఇంటి యజమాని చేసిన దారుణం వెలుగు చూసింది. అశోక్ యాదవ్ అనే యజమాని, అద్దెకు ఉంటున్న దంపతుల బాత్‌రూమ్ బల్బ్ హోల్డర్‌లో సీక్రెట్ కెమెరా అమర్చించాడు. ఇది గమనించిన బాధిత మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా.. యజమాని అశోక్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన అద్దె ఇళ్లలో ఉండే వారి భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రహస్య కెమెరాలను గుర్తించడానికి.. గదిలో లైట్లు ఆపి టార్చ్ లైట్‌తో పరిశీలిస్తే.. కెమెరా ఫ్లాష్ బ్లింక్ అవుతుంది. ఈ విధంగా కనిపెట్టవచ్చు.

తెలంగాణలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి స్థానంలో వచ్చిన భూభారతి నూతన చట్...
17/10/2025

తెలంగాణలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి స్థానంలో వచ్చిన భూభారతి నూతన చట్టం కింద ఈ ప్రక్రియ మొదలైంది. 2014 జూన్ 2కు ముందు తెల్ల కాగితాలపై భూములు కొనుగోలు చేసిన చిన్న, సన్నకారు రైతులు అర్హులు. భూమిని 12 ఏళ్లకు పైగా ఆధీనంలో ఉంచుకున్న వారికి మాత్రమే ఈ క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. అయితే.. పాత యజమాని నుంచి అఫిడవిట్ పొందాలనే నిబంధన రైతులకు ప్రస్తుతం సమస్యగా మారుతోంది. నల్గొండ జిల్లాలో ఎంతమంది దరఖాస్తు చేశారు.. ఎంత మందికి నోటీసులు వచ్చాయి అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

తెలంగాణలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రోడ్లు-భవనాల (R&B) శాఖ రూ. 10,547...
17/10/2025

తెలంగాణలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రోడ్లు-భవనాల (R&B) శాఖ రూ. 10,547.38 కోట్లతో 5,566.15 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పనులను 32 ప్యాకేజీలుగా విభజించి, వచ్చే 30 నెలల్లో పూర్తి చేయనున్నారు. మరోవైపు, పంచాయతీరాజ్ శాఖ కూడా రూ. 6,294 కోట్లతో 7,449 కిలోమీటర్ల గ్రామీణ రోడ్ల నిర్మాణానికి నోటిఫికేషన్ జారీ చేసింది.

పాకిస్తాన్-ఆఫ్గానిస్థాన్ సరిహద్దు ఘర్షణల తర్వాత.. సోషల్ మీడియాలో 93000 అనే సంఖ్య వైరల్ అవుతోంది. పాక్ సైనికులు పారిపోయిన...
17/10/2025

పాకిస్తాన్-ఆఫ్గానిస్థాన్ సరిహద్దు ఘర్షణల తర్వాత.. సోషల్ మీడియాలో 93000 అనే సంఖ్య వైరల్ అవుతోంది. పాక్ సైనికులు పారిపోయినప్పుడు వారి దుస్తులను అఫ్గాన్ దళాలు ప్రదర్శించడాన్ని.. నెటిజన్లు 1971 భారత్-పాక్ యుద్ధంతో పోల్చుతున్నారు. 1971లో 93 వేల మంది పాక్ సైనికులు భారత్ ముందు లొంగిపోయినందుకు గుర్తుగా అఫ్గాన్ యాక్టివిస్ట్‌లు దీన్ని "93000 pants ceremony 2.0" అని అభివర్ణించారు. సోషల్ మీడియాలో చేస్తున్న ఈ ట్రోలింగ్ పాకిస్తాన్‌కు 1971 నాటి అత్యంత అవమానకర సైనిక క్షణాలను గుర్తు చేస్తోంది.

అమ్మాయిలకు సంబంధించి.. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమ్మాయిలు జిమ్‌కు ...
17/10/2025

అమ్మాయిలకు సంబంధించి.. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమ్మాయిలు జిమ్‌కు వెళ్లొద్దంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిమ్‌లకు వెళ్లకుండా.. ఇంట్లోనే యోగా చేసుకోవాలని బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలకు తెరతీశారు. భారీ కుట్ర జరుగుతోందని.. జిమ్ ట్రైనర్లను నమ్మకూడదని.. వారు మోసం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలవడం ఆ ఎమ్మెల్యేకు ఇదే మొదటిసారి కాదు.

17/10/2025

ఢిల్లీ: చితక్కొట్టుకున్న ఖజురహో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ క్యాటరింగ్ స్టాఫ్.. హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఘటన

17/10/2025

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై మంత్రి నారాయణ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం.. ఆ ప్రచారంపై విశాఖలో నారాయణతో కలిసి స్పందించిన వర్మ

17/10/2025

మాజీ మంత్రి హరీష్‌రావుకి మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్.. అబద్ధాలను ప్రచారం చేస్తోన్న పత్రికకు నిలువెత్తు సేల్స్‌మేన్ అంటూ సెటైర్లు

"చంద్రబాబు ఆగమంటే ఆగుతా. దూకమంటే దూకుతా. అసత్య ప్రచారాలను పట్టించుకోను. టీడీపీలో నేను  పిల్లర్‌లాంటి వాడిని. నారాయణ చేసి...
17/10/2025

"చంద్రబాబు ఆగమంటే ఆగుతా. దూకమంటే దూకుతా. అసత్య ప్రచారాలను పట్టించుకోను. టీడీపీలో నేను పిల్లర్‌లాంటి వాడిని. నారాయణ చేసిన కామెంట్లను సోషల్ మీడియాలో పేటిఏం బ్యాచ్ తప్పుగా రకరకాలుగా తిప్పుతున్నారు." అంటూ పిఠాపురం వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి వర్మ చేసిన వ్యాఖ్యలపై మీ స్పందనేంటి?

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ2 ఫలితాల వేళ మధ్యంతర డివిడెండ్ రూ. 23 చొప్పున ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్‌లో కో ఫౌండ...
17/10/2025

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ2 ఫలితాల వేళ మధ్యంతర డివిడెండ్ రూ. 23 చొప్పున ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్‌లో కో ఫౌండర్ నారాయణ మూర్తి కుటుంబానికి కోట్లాది షేర్లు ఉండగా.. వీరికి డివిడెండ్ కారణంగానే రూ. 347 కోట్లు అందనున్నాయి.

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Samayam Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Our Story

SAMAYAM TELUGU is a Telugu news brand from Times Internet, India's largest digital products company which is a part of Times of India group. ప్రముఖ తెలుగు డిజిటిల్ న్యూస్ ఫ్లాట్ ఫాం అయిన సమయం తెలుగు విజయవంతగా ఐదు వసంతలు పూర్తి చేసుకుంది. భారత్‌లోనే అతిపెద్ద డిజిటిల్ ప్రొడక్ట్స్ కంపెనీ టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్‌లో సమయం తెలుగు ఒకటి. రాష్ట్రం, దేశం, ప్రపంచం ఎలా ఎక్కడ ఏమూల ఏం జరిగిన క్షణాల్లో ఆ వార్తను అందించడంలో సమయం తెలుగు ఎప్పడూ ముందుంది. మారుతున్న డిజిటల్ ప్రపంచానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో సమయ తెలుగు వార్తల్ని అందిస్తో వస్తోంది. డెస్క్ టాప్, మొబైల్ ఫార్మాట్, మొబైల్ యాప్, సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు వార్తా కథనాలను చేరవేస్తోంది. ఫేక్ వార్తలకు చెక్ పెట్టి... నిజమైన వార్తా విశేషాల్ని అందిస్తూ వస్తోంది. ప్రేక్షకులు, వీక్షకుల సహాయ సహకారాలతో సమయం తెలుగు సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు ఆరవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అందరికీ ఇవే మా శుభాకాంక్షలు.