Manjeera News

Manjeera News తాజా సమాచారం కోసం మంజీర న్యూస్ ను లైక్, షేర్ మరియు ఫాలో చేయగలరు...
మీ మంజీర న్యూస్...manjeera news

19/01/2026
20/10/2025

సంగారెడ్డి పట్టణం 37వార్డులో BRS యువ నేత అడ్వకేట్ జలంధర్ రావ్ దీపావళి పండుగ సందర్బంగా కాలనీ బస్తీల్లో ఇంటింటికి తిరుగుతూ స్వీట్లు టపాసులు పంపిణి చేస్తూ అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు...

13/10/2025

ఎన్నికల కమిషన్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

09/10/2025

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన హన్వాడ మండల ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసి కట్టుగా పని చేయాలనీ కోరారు. గ్రామాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉందని, ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులకు విజయ అవకాశలు ఎక్కువ ఉన్నాయని తెలిపారు. ప్రజలకి బాకీ కార్డును ఇచ్చి ప్రభుత్వం చేసిన మోసం వివరించాలని చెప్పారు.

09/10/2025

మేడ్చల్ నియోజకవర్గంలో BRS పార్టీ చేపట్టిన ఇంటి ఇంటికీ కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి గారు.

కాంగ్రెస్ బాకీ కార్డు ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని, నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన మల్లారెడ్డి గారు

రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో కైవసం చేసుకుంటుందన్నారు.

09/10/2025

*_బీసీ రిజర్వేషన్ లపై ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలతోనే హైకోర్ట్ స్టే విధించింది : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు...._*

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో జీ.వో.నెం.9 ను శాస్త్రీయ పద్ధతిలో కాకుండా తమకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం వల్లే హైకోర్టు స్టే ఇవ్వాల్సి వచ్చిందని బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

🔥 బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వ విధానం శాస్త్రీయంగా, సరిగ్గా లేదని బిఆర్ఎస్ పార్టీ తరపున అసెంబ్లీ వేదికగా మా నాయకులు, మేము ఎన్నోసార్లు ప్రభుత్వానికి హితవు పలికామని, రేవంత్ సర్కార్ మాత్రం మా సలహాలను, సూచనలను పెడచెవిన పెట్టడం వల్లే నేడు హైకోర్టులో స్టే విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

🔥 ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుతో పాటు అనేక హామీలను కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సాక్షిగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు కావస్తున్న బీసీ రిజర్వేషన్ల అమలు, వారికి ఇచ్చిన హామీల అమలులో తూతూ మంత్రంగా వ్యవహరిస్తూ చేతులు దులుపుకుంటున్నారే తప్పా హామీల అమలులో ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి కనిపించడం లేదు.

🔥 బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పిన రేవంత్ సర్కార్ మాటతప్పి ఢిల్లీకి పోయి ధర్నాల పేరుతో నాటకాలు ఆడారు.

🔥 రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా చేయాల్సిన పోరాటాలను గల్లీలో చేస్తూ బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

🔥 ఇప్పటికైనా ప్రభుత్వం కామారెడ్డి వేదికగా బిసి డిక్లరేషన్ అమలు విషయంలో అఖిలపక్షం సభ్యుల సూచనలను, సలహాలను పెడచెవిన పెట్టకుండా శాస్త్రీయబద్ధంగా రూపొందించాలి. లేకపోతే వెనుకబడిన వర్గాల తరఫున పోరాడేందుకు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అన్నారు.

09/10/2025

రేవంత్ రెడ్డి ప్రభుత్వం తలా తోక లేని ప్రభుత్వం అని మరోసారి నిరూపితం అయ్యింది.

జీవో ద్వారా బీసీ రిజర్వేషన్లు ఇస్తే చట్టబద్ధత ఉండదు అని తెలిసి కూడా జీవో తెచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసింది అన్నారు

- శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి

09/10/2025

ఎమ్మెల్సీ శ్రీ అద్దంకి దయాకర్ గారి ప్రెస్ మీట్ గాంధీ భవన్

Address

Hyderabad
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Manjeera News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Manjeera News:

Share