Manjeera News

Manjeera News తాజా సమాచారం కోసం మంజీర న్యూస్ ను లైక్, షేర్ మరియు ఫాలో చేయగలరు...
మీ మంజీర న్యూస్...manjeera news

14/03/2025
14/03/2025

రాంమందిర్ వద్ద డీజే పాటలతో అభిమానులు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఉత్సాహంగా డాన్సులు చేసిన జగ్గారెడ్డి...
సంగారెడ్డిలో TPCCవర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వాహంచారు..
పాత బస్టాండ్ రాంమందిర్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డీజే పాటలతో అభిమానులు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఉత్సాహంగా డాన్సులు చేసిన జగ్గారెడ్డి...

*రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలు అడిగారు: మాజీ మంత్రి కేటీఆర్* హైదరాబాద్: జనవరి 09ఫార్ములా -ఈ కేసులో కేటీఆర్‌ ...
09/01/2025

*రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలు అడిగారు: మాజీ మంత్రి కేటీఆర్*

హైదరాబాద్: జనవరి 09
ఫార్ములా -ఈ కేసులో కేటీఆర్‌ విచారణ ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లంచ్‌ బ్రేక్‌ మినహా ఏడు గంటల పాటు ఏసీబీ అధికారులు కేటీఆర్‌ ను ప్రశ్నించారు.

ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసిన సమాచారం ఇచ్చాను. వాళ్లు ఎన్నిసార్లు విచార ణకు పిలిచినా వస్తానని చెప్పిన. ఇదో చెత్త కేసు.. ప్రభుత్వ ఒత్తిడిలో మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియడం లేదు అని చెప్పిన.

రాజకీయ కక్ష సాధింపుల కోసం రేవంత్‌ పెట్టిన ఈ కేసుతో సాధించేది ఏమీ లేదు. ''రేవంత్‌ రెడ్డి రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలను తిప్పితిప్పి 40 రకాలుగా ప్రశ్నించారు. మేము ఇక్కడి నుంచి పైసలు పంపినం.. వాళ్లకు అక్కడ పైసలు ముట్టినయి..

ఇక్కడ కరప్షన్‌ ఎక్కడుం దని నేను అడిగిన.. వాళ్లదగ్గర సమాధానం లేదు.'' అన్నారు. పోలీసు లతో తీరుపై కేటీఆర్‌ అసహనం మీడియాతో మాట్లాడితే పోలీసులకు ఎందుకు భయమని కేటీఆర్‌ ప్రశ్నించారు.

తన విచారణ ముగిసిన తర్వాత ఏసీబీ ఆఫీస్‌ నుంచి బయటకు వచ్చిన కేటీఆర్‌ అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈక్రమంలోనే పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలనిసూచించారు.

మీడియా ప్రతినిధులు అక్కడే ప్రశ్నలు అడుగు తుండటంతో పోలీసులు తోసేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల తీరుపై కేటీఆర్‌ మండిపడ్డారు. తాను అక్కడ మాట్లాడు తంటే ఎందుకు అంత భయమని ప్రశ్నించారు. అన్ని బారికేడ్లే పెట్టి ట్రాఫిక్‌ అలో చేస్తామని చెప్పడం ఏమిటని నిలదీశారు.

*VVM బాక్స్ క్రికెట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్* కుత్బుల్లాపూర్ నియోజవర్గం పరిధిలోని కూన కృష్ణా మహాలక...
28/12/2024

*VVM బాక్స్ క్రికెట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్*

కుత్బుల్లాపూర్ నియోజవర్గం పరిధిలోని కూన కృష్ణా మహాలక్ష్మి నగర్, మెట్కాన్ గూడలో వివిఎం బాక్స్ క్రికెట్ ప్రారంభించిన కూన శ్రీశైలం గౌడ్ గారు.. అనంతరం అక్కడున్న యువకులతో మాట్లాడుతూ క్రీడల వల్ల యువకుల శరీరానికి వ్యాయామం జరుగుతుంది.. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గారు తెలిపారు...

ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు బుచ్చిరెడ్డి, నిర్వాహకులు వెంకటేష్, యాదయ్య మరియు ఆంజనేయులు, శ్రీనివాస్,నాగరాజు, శ్రీధర్,రఘుపతి రెడ్డి, రాధాకృష్ణ, ధనిష్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు..

*స్నేహ సెలూన్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు* కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఉషోదయ కాలనిలో స్న...
28/12/2024

*స్నేహ సెలూన్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఉషోదయ కాలనిలో స్నేహ సెలూన్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మరియు కాంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ గారు...

ఈ కార్యక్రమంలో యువజన నాయకులు బుచ్చిరెడ్డి, సెలూన్ నిర్వాహకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు..

*శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మధుసూదనాచారి*  మహ...
28/12/2024

*శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మధుసూదనాచారి*

మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ చందనం చెరువు సమీపంలో శ్రీమద్విరాట్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి విగ్రహం ఆవిష్కరించిన *మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మధుసూదనాచారి గారు*

ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ
కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు. శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామివారి వలన ప్రసిధ్ది పొందుట చేత కందిమల్లయ్యపల్లె తర్వాతి కాలములో బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగిన ఇది వీరబ్రహ్మేంద్రస్వామివారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరిగాయి, జరుగుతున్నాయి
అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు మరియు అనుబంధ సంఘాల అధ్యక్షులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

28/12/2024

*NEW DELHI*

*The Mortal Remains of Former Prime Minister Dr. Manmohan Singh are Being Taken From his Residence to the Congress Headquarters.*

*At the Congress Headquarters, Workers and the Public will Pay Tribute to Dr. Manmohan Singh*

*గంజాయి తాగుతూ విక్రయిస్తున్న ఇద్దరి నిందితులను అరెస్టు చేసిన మర్కుక్ పోలీసులు* *ఇద్దరు నిందితుల నుండి 76 గ్రాముల గంజాయి...
26/12/2024

*గంజాయి తాగుతూ విక్రయిస్తున్న ఇద్దరి నిందితులను అరెస్టు చేసిన మర్కుక్ పోలీసులు*

*ఇద్దరు నిందితుల నుండి 76 గ్రాముల గంజాయి స్వాధీనం*

1 గీర్మిల్ల సాయిమధు తండ్రి లేట్ ఆగమయ్య , వయస్సు: 19 సంవత్సరాలు, నివాసం కర్కపట్ల, మండలం వరకు జిల్లా సిద్దిపేట.
2 సారా మహేష్ తండ్రి మల్లేష్, వయస్సు 19 సంవత్సరాలు, నివాసం కర్కపట్ల, మండలం మర్కుక్, సిద్దిపేట్ జిల్లా.

సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు సిబ్బంది మర్కుక్ ఎస్ఐ దామోదర్ మరియు సిబ్బంది కలసి కర్కపట్ల గ్రామ శివారులో పై ఇద్దరు నిందితులు కలసి గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్నారని నమ్మదగిన సమాచారంపై నిన్న సాయంత్రం వెళ్లి రైడ్ పై ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 76 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగింది.

పై ఇద్దరు నిందితులను మర్కుక్ ఎస్ఐ దామోదర్ గురువారం అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారు

గ్రామాలలో ఇతర ప్రదేశాలలో ఎవరైనా అక్రమంగా గంజాయి కలిగి ఉన్న విక్రయించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

*బౌన్సర్లు పబ్లిక్‌ను ఎక్కడైనా తోసివేస్తే తాటతీస్తాం**బౌన్సర్ల తీరుకు సెలబ్రిటీలదే బాధ్యత**బౌన్సర్లకు సీపీ సీవీ ఆనంద్ సీ...
22/12/2024

*బౌన్సర్లు పబ్లిక్‌ను ఎక్కడైనా తోసివేస్తే తాటతీస్తాం*

*బౌన్సర్ల తీరుకు సెలబ్రిటీలదే బాధ్యత*

*బౌన్సర్లకు సీపీ సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్*

21/12/2024

బీరంగూడ మధురనగర్ లో గణిత దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు...వైష్ణవి ఒలంపియాడ్ స్కూల్లో ఘనంగా గణిత దినోత్స...

21/12/2024

బీరంగూడ మధురనగర్ లో గణిత దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు...

వైష్ణవి ఒలంపియాడ్ స్కూల్లో ఘనంగా గణిత దినోత్సవం

ప్రముఖ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా బీరంగూడ మధుర నగర్ లో ఉన్న వైష్ణవి ఒలంపియాడ్ స్కూల్లో గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

స్థానిక కౌన్సిలర్ ఎడ్ల రమేష్, ఇష్ట స్కూల్ ప్రిన్సిపల్ ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.

గణితం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ వివిధ రకాల ప్రదర్శనలను విద్యార్థులు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ అని అతి చిన్న వయసులోనే యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థి గణితం పట్ల మక్కువ పెంచుకొని ఎన్నో విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు,

ఈ కార్యక్రమంలో వైష్ణవి స్కూల్ చైర్మన్ సుశీల్ కుమార్ వర్మ,ప్రిన్సిపల్ హరిప్రియ, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

21/12/2024

సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు...

పార్లమెంట్ లో భారతరత్న బాబాసాహెబ్ డా: BR అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని TPCCవర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు..

స్థానిక ఐబీ నుండి పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో TGIICచైర్మన్ నిర్మలజగ్గారెడ్డి తో పాటు TPCCకార్యదర్శి తోపాజి అనంతకిషన్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్, CDCచైర్మన్ రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మార్కెట్ చైర్మన్ రాంచందర్ నాయక్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Address

Hyderabad
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Manjeera News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Manjeera News:

Share