Mana tv telugu

Mana tv telugu శ్రీ సద్గురు సాయి నాథ్ మహరాజ్ కీ జై

ఆశ్చర్యం.!✈️ విమాన ప్రమాదంపై 6 నెలల ముందే ట్వీట్.. నెట్టింట వైరల్.. ✈️ అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి 242 మందితో లండన్లోని...
12/06/2025

ఆశ్చర్యం.!

✈️ విమాన ప్రమాదంపై 6 నెలల ముందే ట్వీట్.. నెట్టింట వైరల్..

✈️ అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి 242 మందితో లండన్లోని గాట్విక్ ఎయిర్పోర్ట్కు బయలుదేరింది ఎయిరిండియా విమానం.

మధ్యాహ్నం 1.17 నిమిషాలకు టేకాఫ్ తీసుకుని 2 నిమిషాల్లోనే మేఘానిలోని గుజ్సెల్ విమానాశ్రయ సమీపంలో కుప్పకూలింది. భారీ పేలుడు కారణంగా దట్టమైన పొగలు వ్యాపించాయి. గురువారం మధ్యాహ్నం సంభవించిన ఈ ఘోర విమాన దృశ్యాలు అందరి హృదయాలను కలచివేస్తున్నాయి. అయితే ఈ విమాన ప్రమాదంపై ఓ మహిళ ఆరు నెలల ముందే ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఆ ట్వీట్ వైరల్ అవుతోంది.

ఈ ప్రమాదాన్ని ‘ఆస్ట్రో షర్మిష్టా' అనే మహిళ డిసెంబర్ 29, 2024లోనే ట్వీట్ చేసింది. '2025లో ఏవియేషన్ వృద్ధి అద్భుతంగా ఉంటుంది. కాకపోతే సేఫ్టీ, సెక్యురిటీ పరంగా ఇబ్బందులు ఉంటాయి. అలాగే, విమానం కూలింది అనే బ్రేకింగ్ వార్తలు మనల్ని కలిచి వేస్తాయి'. అని ఆ మహిళ 6 నెలలకు ముందే అంచనా వేసి చెప్పింది. అలాగే జూన్ 5, 2025న కూడా ఇదే ట్వీట్ను రీ-ట్వీట్ చేస్తూ.. 'ఓ విమాన ప్రమాదం జరుగుతుందని.. అది విమానయాన సంస్థను 2025లో నాశనం చేస్తుందని గట్టిగా అంచనా వేస్తున్నట్టు మళ్లీ చెప్పుకొచ్చింది'. ప్రస్తుతం ఆ మహిళ ట్వీట్లు వైరలవుతున్నాయి.

ఇందులో మీ పోయిన బండి ఏమైనా ఉందా చూసుకోండి..పత్రిక ప్రకటన :- తాండూర్  పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ జిల్లాల మోటార్ సైకల్ ద...
12/06/2025

ఇందులో మీ పోయిన బండి ఏమైనా ఉందా చూసుకోండి..

పత్రిక ప్రకటన :-
తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ జిల్లాల మోటార్ సైకల్ దొంగ అరెస్టు జిల్లా ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి,IPS.
తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో15 మోటార్ సైకిల్ లను దొంగతనం చేసిన అంతర్ జిల్లా మోటార్ సైకల్ దొంగనుఈ రోజు తాండూర్ పోలీస్ అధికారులు అరెస్టు చేయడం జరిగింది. అని జిల్లా ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి,IPS గారు తెలియజేయడం జరిగింది. ఇట్టి కేసుకు సంబందించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

నేరం సంఖ్యా 131/2025 , U/s 303(2) of BNS తాండూర్ టౌన్ పోలిసే స్టేషన్
నేరస్తుని వివరాలు :-
బోయిని శ్రీకాంత్ తండ్రి మురళి, వయస్సు : 24 సం’’, కులం : ముదిరాజ్, వృత్తి : ఆటొ డ్రైవరు, నివాసం : కమల్ పూర్ గ్రామము , యాలాల్ మండలం , వికారాబాద్ జిల్లా
నేరం వివరాలు:-
జిల్లా ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి, IPS గారి ఆదేశాల మేరకు ఈ రోజు తేదీ :12.06.2025 నాడు అందజ సమయం ఉదయం 0900 గంటలకు తాండూర్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు ఎం‌డి. సాజీద్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు మరియు క్రైమ్ సిబ్బంది (Amjad HC 3067, Shiva Kumar HC 3623, Sayappa PC 632, Shabeel Ahmed PC 5616 ) నమ్మదగిన సమాచారం మేరకు విలియం మూన్ చౌరస్టా వద్ద వెహికిల్ చెకింగ్ చేస్తుండగా హైదరాబాద్ రోడ్ నుండి వస్తున్న ఒక వ్యక్తి బైక్ ని ఆపి , తన బైక్ యొక్క డాక్యుమెంట్స్ మరియు అతని వివరములు అడిగే క్రమంలో అతను అట్టి బైక్ ని వదిలి పారిపోతుండగా అతనిని పట్టుకొని తాండూర్ పోలీసు స్టేషన్ కి తీసుకొని వచ్చి విచారించగా, అతని పేరు బోయిని శ్రీకాంత్ తండ్రి మురళి , వయస్సు : 24 సం’’, కులం : ముదిరాజ్ , వృత్తి : ఆటొ డ్రైవరు , నివాసం : కమల్ పూర్ గ్రామము , యాలాల్ మండలం , వికారాబాద్ జిల్లా , అతను హైదరాబాద్ నగరం లోని వివిద ప్రాంతాలలో మొత్తం 15- మోటార్ సైకిల్ లని దొంగతనం చేసి,10-మోటార్ సైకల్ లని తాండూర్ మండలం లోని బిజ్వార్ గ్రామస్తులకు అమ్మినాడు, 4-మోటార్ సైకల్ లని తర్వాత అమ్ముకోవడానికి తన ఇంటివద్ద దాచి వుంచాడు మిగిలిన 1-మోటార్ సైకల్ తాను నడుపుతూ పట్టు పడటం జరిగింది. దొంగిలించిన మోటార్ సైకిల్ లలో 5 మోటార్ సైకిల్ సంబందించి తాండూర్ పోలీస్ స్టేషన్ నందు ఒక కేసు, సైబరాబాద్ పోలీసు కమిషనరేటు పరిదిలోని అల్లాపుర్, చందానగర్ పోలీసు స్టేషన్ లనందు 4 కేసులు నమోదు అయ్యాయి. గతంలో కూడా ఇట్టి నేరస్తుడు యాలాల, కూకట్పల్లి , మియాపూర్, సనత్ నగర్, బంజారాహిల్ల్స్, బాచుపల్లి, చందానగర్ మరియు మాదాపూర్

పోలిసే స్టేషన్ లలో నమోదు అయిన సుమారు 20 కేసులలో జైలుకు వెళ్ళిరావడం జరిగింది. ఇట్టి నేరస్తుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది.
VEHICLE DETAILS
SL No Vehicle No Vehicle type
1. TS05EL3688 CB SHINE (BLACK)
2. KA32ET4351 CB125 SHINE SP
3. AP02BT5302 SPLENDOR+
4. AP09CH8861 SPLENDOR+
5. AP13AF3937 SPLENDOR+
6. KA32HF4767 SPLENDOR+
7. TS07JZ5197 SPLENDOR+
8. TS07GT1376 SPLENDOR+
9. TN05BA6019 SPLENDOR PRO
10. HA11EYMMG79656, MBLHAW12XMHG91518 SPLENDOR+
11. AP11AN2449 PULSAR 150
12. AP28DS8106 HONDA ACTIVA
13. TS34A8799 HF DELUXE
14. AP29BH8277 CB UNICORN
15. UP24AL7293 SPLENDOR+ (Grey Black)

చాక చక్యంగా వ్యవహరించి నేరస్థున్ని పట్టుకొని అతని వద్ద నుండి 15- మోటార్ సైకళ్లను స్వాదీనం చేసుకొన్న( విలువ అందజ రూ . 7,50,000/-) దొంగతనం కేసులని ఛేదించిన పట్టణ ఇన్స్పెక్టర్ జి . సంతోష్ కుమార్ గారు , సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ అబ్దుల్ సజీద్ గారు మరియు క్రైమ్ సిబ్బంది అయిన హెడ్ కానిస్టేబుళ్లు అంజాద్ ,శివకుమార్ మరియు కానిస్టేబుళ్లు సాయప్ప , షబీల్ అహ్మెద్ లను గౌరవ జిల్లా ఎస్‌పి శ్రీ నారాయణ రెడ్డి, IPS గారు అభినందించారు.

🙏తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐
02/06/2025

🙏తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐

29/05/2025
మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాకిస్తాన్‌.. సాంబ, కథువా సెక్టార్లలో డ్రోన్‌ దాడులు..
12/05/2025

మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాకిస్తాన్‌.. సాంబ, కథువా సెక్టార్లలో డ్రోన్‌ దాడులు..

INS విక్రాంత్ ఎక్కడుందో చెప్పండి.. PMO ఉద్యోగినంటూ కాల్!PM ఆఫీస్ అధికారినని, తనకు INS విక్రాంత్ గురించి సమాచారాన్ని అంది...
12/05/2025

INS విక్రాంత్ ఎక్కడుందో చెప్పండి.. PMO ఉద్యోగినంటూ కాల్!

PM ఆఫీస్ అధికారినని, తనకు INS విక్రాంత్ గురించి సమాచారాన్ని అందించాలని నావల్ కమాండ్ కార్యాలయానికి కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని కోజికోడ్కు చెందిన ముజీబ్ రెహమాన్ PMO ఆఫీసర్ అంటూ నేవీ అధికారులకు కాల్ చేసి INS విక్రాంత్ ఎక్కడుందో తెలపాలని కోరాడు. అధికారులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెహమాన్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

12/05/2025

12/05/2025

POKను అప్పగించాల్సిందే: మోదీఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పాక్ కాల్పులు జరిపితే భారత్ కూడ...
11/05/2025

POKను అప్పగించాల్సిందే: మోదీ

ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పాక్ కాల్పులు జరిపితే భారత్ కూడా ప్రతి దాడి చేస్తుందని తేల్చి చెప్పారు. ఈ మేరకు త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 'కశ్మీర్ విషయంలో మా విధానం ఎప్పటికీ మారదు. పాకిస్థాన్ POKను, టెర్రరిస్టులను భారత్కు అప్పగించాలి. ఇది తప్ప ఆ దేశంతో మాట్లాడటానికి ఏమీ లేదు. ఈ విషయంలో మరే దేశ జోక్యం అవసరం లేదు' అని పేర్కొన్నారు.

10/05/2025

పాక్తో యుద్ధంపై భారత్ కీలక ప్రకటన

భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధంపై విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. 2 దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిందని, ఈరోజు సా.5 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చిందన్నారు. ఇవాళ మ.3.35 గంటలకు PAK DGMO ఫోన్ చేసి, IND ఆర్మీతో మాట్లాడినట్లు చెప్పారు. ఇరుదేశాల మధ్య అన్ని రకాల (గగన, సముద్ర, భూభాగం) మిలిటరీ ఆపరేషన్స్ నిలిపివేశామన్నారు. అటు ఈ నెల 12న PAKతో శాంతి చర్చలు జరుపుతామని తెలిపారు.

పాకిస్థాన్ దాడిలో భారత అధికారి మృతి 😢పాకిస్థాన్ దాడుల్లో భారత అధికారి మరణించారు.J&Kలోని రాజౌరి పట్టణంపై పాక్ షెల్లింగ్లత...
10/05/2025

పాకిస్థాన్ దాడిలో భారత అధికారి మృతి 😢

పాకిస్థాన్ దాడుల్లో భారత అధికారి మరణించారు.

J&Kలోని రాజౌరి పట్టణంపై పాక్ షెల్లింగ్లతో విరుచుకుపడింది. ఇందులో రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తాప తీవ్రంగా గాయపడి ప్రాణాలు వదిలారు. రాజ్ కుమార్ మృతి పట్ల జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతాపం వ్యక్తం చేశారు.

09/05/2025

భారత్ మా ఎయిర్బస్లపై దాడి చేసింది: పాక్

పాకిస్థాన్లోని మూడు ఎయిర్బస్లపై భారత్ దాడి చేసిందని ఆ దేశ మిలిటరీ వర్గాలు చెప్పినట్లు 'Reuters' తెలిపింది. రావల్పిండిలోని నూరాఖాన్ ఎయిర్ బేస్తోపాటు మురిద్, షార్కోట్ వైమానిక స్థావరాలపై ఇండియా బాంబులతో విరుచుకుపడినట్లు పేర్కొంది. ఇటు భారత్లోని పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని పలు నగరాలపై పాకిస్థాన్ మిస్సైల్తో దాడులు చేస్తోంది భారత్ వాటిని అడ్డుకొని సరైన సమాధానం చెప్పుతుంది.

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana tv telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share