23/10/2025
బాపట్లజిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం జాతీయ రహదారి సమీపంలోని భారత్ పేట్రోల్ బంక్లో ఘర్షణ జరిగింది. 50 రూపాయలు అప్పుగా పెట్రోల్ పోయలేదన్న కోపంతో బంక్ సిబ్బందిపై ఓ ఏఆర్ కానిస్టేబుల్ దౌర్జన్యానికి దిగాడు. అప్పు ఎందుకు పోయవంటూ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఓ యువకుడిని బాదిపారేశాడు. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల 12 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. ఓ ఏఆర్ కానిస్టేబుల్ తన మిత్రులతో కలసి పెట్రోల్ బంకులో చేసిన బీభత్సం సీసీకెమెరాలో రికార్డయింది.