Public Court News

Public Court News From breaking news and global headlines to in-depth coverage of political, economic, social issues.
(1)

12/05/2026

10/05/2026

బండి సంజయ్ కుమారుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మహిళల ఆందోళన..

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన మహిళలు..!

విజయ్ కి ఒక న్యాయం - BJP మనోహర్ పారికర్ కి ఒక న్యాయం ఎలా..? మొత్తం అసెంబ్లీ స్థానాల్లో విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా...
08/05/2026

విజయ్ కి ఒక న్యాయం - BJP మనోహర్ పారికర్ కి ఒక న్యాయం ఎలా..?

మొత్తం అసెంబ్లీ స్థానాల్లో విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించాలి అని గవర్నర్ ని కోరిన విజయ్

ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది కావాల్సిందే, 118 మంది పేర్లతో లిస్ట్ అడిగిన తమిళనాడు గవర్నర్..

సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ ప్రభుత్వ ఏర్పాటు చేశాక, అసెంబ్లీలో బలపరీక్షలో తాను నెగ్గకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసే అధికారం గవర్నర్ ఉంటుంది కదా ..?

సేమ్ ఇదే పరిస్థితి 2017 లో గోవాలో ఏం జరిగింది అంటే

40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి
2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధికంగా 17 స్థానాలు సాధించి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది.
అయితే BJP నేతృత్వంలో మహారాష్ట్రవాది, గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీల మద్దతు కూడగట్టి, 13 స్థానాలు గెలుచుకున్నది BJP

17 స్థనాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీని కాదని గవర్నర్ మృదులసిన్హా
13 స్థానాలు గెలిచిన బీజేపీ నీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించింది
ఆవిధంగా మెజార్టీ లేని బీజేపీ మనోహర్ పారికర్ చేత ప్రమాణ స్వీకారం చేయించాడు గవర్నర్.
ఇదే సూత్రం విజయ్ కి ఎందుకు వర్తించదు అంటారు...?

కట్ చేస్తే ప్రమాణ స్వీకారం అయిపోయింది బలపరీక్ష సమయానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది MLA లు నియోజకవర్గాల అభివృద్ధి కారణం జూపి BJP లో చేరారు.
ఇలా పార్టీ ఫిరాయించిన 10 మంది MLA లలో ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం లభించడం గమనార్హం.

30/04/2026
Pabluc Court News: Kamareddy ఆదర్శనీయమైన చొరవ.. సుభాష్ రెడ్డి కి ఆర్యవైశ్య సంఘం అభినందనలు! 💐స్మశాన వాటికలు అంటేనే ఒకప్పు...
30/04/2026

Pabluc Court News: Kamareddy

ఆదర్శనీయమైన చొరవ.. సుభాష్ రెడ్డి కి ఆర్యవైశ్య సంఘం అభినందనలు! 💐

స్మశాన వాటికలు అంటేనే ఒకప్పుడు భయం, అపరిశుభ్రతకు నిలయాలు కామారెడ్డిలో స్మశాన వాటిక గురించి సాక్షి పత్రిక కథనం పై స్పందించి మహాప్రస్థానం' తరహాలో ఆధునిక సౌకర్యాలతో వైకుంఠధామాన్ని తీర్చిదిద్దుతానని ముందుకొచ్చిన తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి ని ఈరోజు తన నివాసంలో కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులు కలిసి మనస్ఫూర్తిగా అభినందించారు.

ఈ సందర్బంగా అంత్యక్రియల సమయంలో కుటుంబ సభ్యులకు ఎదురయ్యే ఇబ్బందులను తొలగించి, గౌరవప్రదమైన వీడ్కోలు పలికేలా సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన ఉన్నతమైనదని ప్రశంసించారు..

చివరి మజిలీని కూడా పవిత్రంగా ప్రశాంతంగా మార్చడానికి ముందుకు వచ్చిన సుభాష్ రెడ్డి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని కొనియాడారు.


Sir Hearty congratulations from Public Court News
29/04/2026

Sir Hearty congratulations from Public Court News

Today I joined as Joint Secretary, Department of Land Resources, Ministry of Rural Development, Government of India.

dolr_mord mord_goi jansamparkmp

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని రాష్ట్ర డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్  కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మర్యాదపూర్వకంగా కలిశ...
29/04/2026

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని రాష్ట్ర డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నూతన డీజీపీ అభినందనలు తెలియజేశారు.

The newly appointed State DGP, C.V. Anand, paid a courtesy visit to Hon'ble Chief Minister A. Revanth Reddy at the Integrated Command Control Center. During the meeting, the Chief Minister extended his congratulations to the DGP-designate.

22/04/2026

శ్రీ రామానుజాచార్యుల జయంతి సందర్భంగా, ఆ మహనీయుని జీవిత విశేషాలు మరియు వారు సమాజానికి అందించిన సందేశము:

---

**శ్రీ రామానుజాచార్యులు: సమతా మూర్తి - ధర్మ ప్రదాత**

భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో, ముఖ్యంగా భక్తి ఉద్యమ పరిమళాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయులలో **శ్రీ రామానుజాచార్యులు** అగ్రగణ్యులు. వీరు కేవలం ఒక మత గురువు మాత్రమే కాదు, కులమతాలకు అతీతంగా సమాజాన్ని ఏకం చేసిన గొప్ప సామాజిక విప్లవకారుడు.

**జననం మరియు బాల్యం**
రామానుజులు క్రీ.శ. 1017లో తమిళనాడులోని **శ్రీపెరంబుదూరు**లో కాంతిమతి, ఆసూరి కేశవ సోమయాజి దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే అసాధారణ తెలివితేటలు ప్రదర్శించిన ఆయన, కాంచీపురంలో యాదవ ప్రకాశుల వద్ద విద్యను అభ్యసించారు. అయితే గురువుగారి సిద్ధాంతాలతో విభేదించి, ఉపనిషత్తులకు సరికొత్త అర్థాలను ఇస్తూ తనదైన ముద్ర వేశారు.

**విశిష్టాద్వైత సిద్ధాంతం**
శ్రీమన్నారాయణుడే పరతత్త్వమని, జీవాత్మలు పరమాత్మలో భాగమేనని చెబుతూ **'విశిష్టాద్వైత'** సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. భక్తి మార్గం ద్వారా ఎవరైనా మోక్షాన్ని పొందవచ్చని ఆయన చాటి చెప్పారు.

**ముఖ్య ఘట్టాలు మరియు సామాజిక సంస్కరణలు**
రామానుజుల జీవితంలో కొన్ని మరుపురాని ఘట్టాలు ఉన్నాయి:
* **తిరుమంత్ర ఉపదేశం:** తన గురువు గోష్ఠీపూర్ణుల వద్ద అభ్యసించిన "అష్టాక్షరీ మంత్రాన్ని" (ఓం నమో నారాయణాయ), రహస్యంగా ఉంచాలన్న నియమాన్ని పక్కన పెట్టి, అందరికీ మోక్షం కలగాలనే ఉద్దేశంతో గోపురమెక్కి చాటి చెప్పారు. "నేనొక్కడిని నరకానికి వెళ్లినా పర్వాలేదు, ఈ మంత్రం వల్ల లోకమంతా తరించాలి" అన్న ఆయన ఉదారత అద్భుతం.
* **సమతా భావం:** ఆ కాలంలోనే అంటరానితనాన్ని వ్యతిరేకించారు. దళితులకు **'తిరుకులత్తార్'** (లక్ష్మీదేవి వంశీయులు) అని నామకరణం చేసి, వారిని ఆలయ ప్రవేశానికి ప్రోత్సహించారు.
* **శ్రీభాష్యం:** బ్రహ్మసూత్రాలకు ఆయన రాసిన వ్యాఖ్యానం 'శ్రీభాష్యం' ఎంతో ప్రసిద్ధి చెందింది. దీనివల్లే ఆయనకు 'శ్రీభాష్యకారులు' అనే పేరు వచ్చింది.

**ఆలయ వ్యవస్థ - సంప్రదాయం**
శ్రీరంగం, తిరుమల వంటి పుణ్యక్షేత్రాలలో నేటికీ కొనసాగుతున్న పూజా కైంకర్యాల పద్ధతులను క్రమబద్ధీకరించింది రామానుజులే. ముఖ్యంగా తిరుమల వేంకటేశ్వర స్వామి వారు విష్ణు స్వరూపమేనని నిరూపించి, అక్కడ వైఖానస ఆగమ పద్ధతులను స్థిరపరిచారు.

**ముగింపు**
120 ఏళ్ల సుదీర్ఘ జీవితాన్ని గడిపిన రామానుజులు, భక్తి అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, తోటి జీవుల పట్ల కరుణ చూపడమే నిజమైన భక్తి అని నిరూపించారు. అందుకే వారిని **'యతిరాజులు'** అని, **'ఉడైయవర్'** అని భక్తులు కొలుచుకుంటారు. నేటి సమాజానికి ఆయన చూపిన 'సమత' ఎంతో ఆవశ్యకం.

---
**"నారాయణాయేతి సమర్పయామి"** - లోకమంతా భగవంతుని కుటుంబమే అన్నది రామానుజుల నినాదం.

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Public Court News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Public Court News:

Share