Public Court News

Public Court News From breaking news and global headlines to in-depth coverage of political, economic, social issues.
(1)

  said YSR Did great work for Metro Rail
28/09/2025

said YSR Did great work for Metro Rail

బిపి మండల్ స్పూర్తితో తెలంగాణ లో సిఎం రేవంత్ రెడ్డి బిసిల అభివృద్ధికి, సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నాడు -ఎమ్మెల్య...
28/09/2025

బిపి మండల్ స్పూర్తితో తెలంగాణ లో సిఎం రేవంత్ రెడ్డి
బిసిల అభివృద్ధికి, సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నాడు -ఎమ్మెల్యే ఎన్నేం శ్రీనివాస్ రెడ్డి

బిందేశ్వరి ప్రసాద్ మండల్ స్పూర్తి ప్రదాత అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో ఏర్పాటు చేసిన బిపి మండల్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెనకబడిన, దళిత వర్గాల కోసం షోషిత్ దళ్ అనే పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు.

సమాజంలో బిసిలు ఎదుర్కొంటున్న వివక్షను ప్రశ్నించి ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం వదులుకున్న వెనుకబడిన వర్గాల పక్షపాతి బిపి మండల్ అని ఆయన చెప్పారు. లోక్ సభ సభ్యుడిగా జనతా ప్రభుత్వంలో 1978లో రెండవ జాతీయ బిసి కమిషన్ సభ్యుడిగా, బిసిల స్థితిగతులపైన విస్తృత అధ్యయనం చేసి, 1980 డిసెంబర్ లో నివేదిక సమర్పించారన్నారు. ఓబిసి రిజర్వేషన్లు 27 శాతం సాధించారని, ఈ రిజర్వేషన్ అమలు వలన బిసి బిడ్డలు విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు అని ఆయన చెప్పారు.

బిపి మండల్ స్పూర్తితో తెలంగాణ లో సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బిసిల అభివృద్ధికి సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నామని, బిసిలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కృతనిశ్చయంతో ఉన్నమని ఆయన స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యతో పాటు బిసిల ఆత్మగౌరవం ఇనుమడింపచేసేలా అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. భవిష్యత్తు లో బిసి వర్గాలు లాభపడాలని రాష్ట్రంలో ప్రకటించిన రిజర్వేషన్ లలో రాజకీయ జోక్యం ఎక్కడా లేదు అని ఆయన చెప్పారు.

ఆయన విగ్రహం పెట్టుకోవడమే కాకుండా వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, టి పిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, జిల్లా గొర్రెల కాపరుల సంఘం చైర్మన్ శాంతన్న యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, డిసిసి కార్యదర్శి టంకర కృష్ణయ్య యాదవ్, గోపాల్ యాదవ్,, ఐఎన్టీయుసి రాములు యాదవ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు అజ్మత్ అలి, నాయకులు మైత్రి యాదయ్య, శ్రీనివాస్ యాదవ్ ,జేసిఆర్ , జాతీయ యాదవ సభ కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, యాదవ సభ ప్రతినిధులు యాదవ్ , బాలు యాదవ్, వెంకట్ నర్సయ్య యాదవ్, రవిచంద్రనాథ్ యాదవ్, శ్యాంసుందర్ యాదవ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Public Court News : Hyderabad నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ఉదయం 11 గంటలకు భారత్ ఫ్యూచర్​ సిటీ ప్రారంభోత్సవం. 🔹...
28/09/2025

Public Court News : Hyderabad

నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్

ఉదయం 11 గంటలకు భారత్ ఫ్యూచర్​ సిటీ ప్రారంభోత్సవం.
🔹రంగారెడ్డి జిల్లా కందుకూర్​ మండలం మీర్​ఖాన్​పేటలో ఫ్యూచర్​ సిటీ డెవెలప్​మెంట్ అథారిటీ భవన నిర్మాణానికి పునాది రాయి వేస్తారు.

రావిర్యాల నుంచి అమనగల్​ వరకు నిర్మించనున్న గ్రీన్​ఫీల్డ్ రేడియల్​ రోడ్–1 నిర్మాణానికి భూమిపూజ చేస్తారు.

సాయంత్రం 5. 30కు::
🔹అంబర్ పేట్ లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభం. సిటీలో కొత్తగా నిర్మించిన 30 STP ల ప్రారంభం.

సాయంత్రం 6 గంటలకు::
🔹ప్రభుత్వం పునరుద్దరించిన బతుకమ్మ కుంట ప్రారంభం & పబ్లిక్ మీటింగ్

  పబ్లిక్ కోర్ట్ న్యూస్ : ఎల్లారెడ్డి నియోజకవర్గం వరల్డ్ బ్యాంక్ నుండి 100 కోట్ల విపత్తు సహాయ నిధులు కోరిన ఎమ్మెల్యే మదన...
25/09/2025


పబ్లిక్ కోర్ట్ న్యూస్ : ఎల్లారెడ్డి నియోజకవర్గం

వరల్డ్ బ్యాంక్ నుండి 100 కోట్ల విపత్తు సహాయ నిధులు కోరిన ఎమ్మెల్యే మదన్ మోహన్.

గత 100 సంవత్సరాలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలు మరియు వరదలు ప్రజల జీవనాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. అనేక గ్రామాలు ముంపుకు గురై పంటలు నాశనం కాగా, వందలాది ఇళ్లు కూలిపోయాయి. రహదారులు ధ్వంసమై గ్రామాల మధ్య రవాణా సౌకర్యం దెబ్బతింది. తాగునీటి వనరులు చెడిపోయి, విద్యాసంస్థలు కూడా నష్టపోయాయి.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు వరల్డ్ బ్యాంక్ గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అండ్ రికవరీ (GFDRR) కు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పునరావాసం, పునర్నిర్మాణం, మరియు భవిష్యత్ విపత్తులకు సన్నద్ధత కోసం కనీసం ₹100 కోట్ల విపత్తు సహాయ నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు.

ఈ నిధులను కింది రంగాల పునరుద్ధరణకు వినియోగించాలనే ప్రతిపాదనను ఎమ్మెల్యే గారు సమర్పించారు:

రైతులు వరదల కారణంగా నష్టపోయిన పంటలకు తక్షణ సహాయం అందించడం. గృహాలు: కూలిపోయిన, ధ్వంసమైన ఇళ్ల పునర్నిర్మాణం, ముఖ్యంగా పేద మరియు బలహీన వర్గాలకు సహాయం. తాగునీటి వనరులు: పబ్లిక్ వాటర్ ట్యాంకులు, పైపులైన్ వ్యవస్థ పునరుద్ధరణ, శుద్ధి చేసిన నీటి అందుబాటు.

విద్యా రంగం: వరదలతో దెబ్బతిన్న పాఠశాలలు మరమ్మత్తు, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పన.

రోడ్లు మరియు మౌలిక వసతులు:దెబ్బతిన్న రహదారుల పునర్నిర్మాణం, గ్రామాల మధ్య రవాణా సౌకర్యం పునరుద్ధరణ.ప్రజల జీవితాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చే క్రమంలో, అలాగే దీర్ఘకాలిక రక్షణ చర్యల కోసం ఈ సహాయం అత్యవసరమని ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు వరల్డ్ బ్యాంక్‌ను కోరుతూ ఎల్లారెడ్డి ప్రజలు ఎదుర్కొంటున్న ఈ తీవ్రమైన విపత్తు పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తక్షణ సహాయం అందించాలి. ఈ నిధుల ద్వారా పునరావాసం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కొనే స్థిరమైన వసతులను నిర్మించే అవకాశం కలుగుతుంది” అని అన్నారు.



22/09/2025

పబ్లిక్ కోర్ట్ న్యూస్ : అమరచింత, వనపర్తి జిల్లా శరన్నవరాత్రులలో మొదటి రోజు జములమ్మ దేవికి ప్రత్యేక అభిషేక  పూజలు నిర్వహి...
22/09/2025

పబ్లిక్ కోర్ట్ న్యూస్ : అమరచింత, వనపర్తి జిల్లా

శరన్నవరాత్రులలో మొదటి రోజు జములమ్మ దేవికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు.

అమరచింత పట్టణంలో శ్రీశ్రీశ్రీ జములమ్మ దేవాలయ
ఆలయంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా జములమ్మ దేవి అమ్మవారికి 11 రోజులు ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భాగంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మంగలి నరసింహులు, ఆలయ పూజారులు తెలుగు వాకిటి కమల రవి దంపతులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా మొదటిరోజు అభిషేకపూజ కార్యక్రమంలో దోమ రవి సరళ దంపతులు,అమ్మవారికి భాజా భజంత్రులతో, పంచామృతాలతో అభిషేక పూజ కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు పూల మాలలతో ఆభరణాలు అలంకరించి అభిషేక పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మంగలి నరసింహులు 22వ తేదీ సోమవారం నుంచి 11 రోజులు దసరా పండుగ వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు అమ్మవారికి అభిషేక పూజా కార్యక్రమాలు జరుగునని భక్తాదులు అంతా ఈ 11 రోజులు అభిషేక పూజ కార్యక్రమాల సమయంలో అమ్మవారిని దర్శించుకుని జములమ్మ దేవి కృపా కటాక్షాలు పొందగలరని తెలిపారు.

ఈ కార్యక్రమంలో క్యామ భాస్కర్, బాలరాజ్ జయరాములు జగనాదం, బాలరాం శీను జ్యోతి నారాయణమ్మ అనూష తదితరులు పాల్గొన్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

పబ్లిక్ కోర్ట్ న్యూస్ : హైదరాబాద్ భైరన్ పల్లి గ్రామాన్ని వీర భైరన్ పల్లి గా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి కి వినతి పత్రం ...
20/09/2025

పబ్లిక్ కోర్ట్ న్యూస్ : హైదరాబాద్

భైరన్ పల్లి గ్రామాన్ని వీర భైరన్ పల్లి గా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి కి వినతి పత్రం ఇచ్చిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలోని దూల్మిట్ట మండలంలోని భైరన్ పల్లి గ్రామాన్ని వీర భైరన్ పల్లిగా మార్చాలని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ. ఇటీవల జరిగిన సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ వియోచన దినోత్సవం సందర్బంగా భైరన్ పల్లి గ్రామంలోని రజాకార్ల దాడిలో విరోచితంగా పోరాడి అమరులైన వారి కి నివాళులర్పించి 10 లక్షలు స్తూపం, బురుజు అభివృద్ధి కోసం ఇవ్వగ *గ్రామ ప్రజల కొరికా మేరకు భైరన్ పల్లి గ్రామాన్ని విర భైరన్ పల్లి* గ్రామంగా పేరు మార్చాలని తమ దృష్టికి తీసుకురాగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గ్రామ ప్రజల కోరిక నెరవేర్చే విధంగా కృషి చేస్తానని గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ పేర్కొన్నారు.

ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డీ వివరిస్తూ.. మనకు 1947 ఆగస్టు 27న సిద్ధిపేట జిల్లా, దూల్మిట్ట మండలం, బైరాన్‌పల్లి గ్రామంలో జరిగిన విషాదకరమైన మరియు చారిత్రాత్మక సంఘటనను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్టు పేర్కొన్నారు. ఇది తెలంగాణ చరిత్రలో చీకటి అధ్యాయాలలో ఒకటిగా మిగిలిపోయిందని తెలిపారు..

నిజాం పాలనలో, రజాకార్లు దారుణాలకు పాల్పడ్డారని, డబ్బు వసూలు చేయడమే కాకుండా అమాయక గ్రామస్తులను వేధించారని గుర్తుచేశారు. ఈ దురాగతాలను ఎదిరించి తమ గ్రామాన్ని రక్షించుకోవడానికి బైరన్‌పల్లి ప్రజలు ఒక రక్షణ బృందాన్ని ఏర్పాటు చేసారని, ప్రతీకారంగా, రజాకార్లు గ్రామాన్ని ఐదుసార్లు చుట్టుముట్టి క్రూరమైన దాడులకు దిగారని చెప్పుకొచ్చారు. చివరి దాడిలో, దాదాపు 1,200 మంది రజాకార్లు గ్రామంపై దాడి చేసి, 126 మంది అమాయక గ్రామస్తులను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోశారని తెలిపారు.ఈ దాడిలో మహిళలు కూడా తీవ్ర దారుణాలకు గురయ్యారన్నారు. ఈ ఊచకోతను ఆ సమయంలో జలియన్ వాలాబాగ్ విషాదం కంటే భయంకరమైనదిగా అభివర్ణించారు.

బైరన్‌పల్లి గ్రామస్తుల ప్రతిఘటన మరియు త్యాగం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ధైర్యానికి చిహ్నంగా నిలుస్తాయి. గ్రామస్తుల అత్యున్నత త్యాగం మరియు పరాక్రమానికి గుర్తింపుగా, అమరవీరుల వీరోచిత వారసత్వాన్ని రాబోయే తరాలకు గుర్తుంచుకునేలా గ్రామం పేరును అధికారికంగా "వీర బైరన్ పల్లి"గా మార్చాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డీ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని అభ్యర్థించగా ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డీ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.


Public Court News : Nizamabadనిజామాబాద్ జిల్లాకు త్వరలోనే వ్యవసాయ కళాశాల జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి...
20/09/2025

Public Court News : Nizamabad

నిజామాబాద్ జిల్లాకు త్వరలోనే వ్యవసాయ కళాశాల

జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి

నిజామాబాద్ జిల్లాకు ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మంజూరు చేశాం

నిజామాబాద్ అర్బన్ లోనూ ఈ పాఠశాల ఏర్పాటుకు తోడ్పడతాను

సమాజంలో గురువుల పాత్ర చాలా గొప్పది

- నిజామాబాద్ జిల్లాలో ట్రస్మా జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్

Public Court News : మహబూబ్ నగర్ అప్పన్నపల్లి 3వ వార్డులో రూ.10 లక్షల జనరల్ ఫండ్ తో సిసి రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చ...
20/09/2025

Public Court News : మహబూబ్ నగర్

అప్పన్నపల్లి 3వ వార్డులో రూ.10 లక్షల జనరల్ ఫండ్ తో సిసి రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది. గత 20 నెలలుగా ఎన్నడూ లేనివిధంగా మహబూబ్ నగర్ లో ప్రతి కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి , మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ , వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ , డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ , మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ఖాజా పాషా , అంజద్,నాయకులు గుమాల్ శ్రీను, రామకృష్ణ, శివ, పురుశోత్తతం, అర్షద్ అలి

మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం మన సంకల్పమే బలమైన శక్తి. 💪

దేశ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగాతెలంగాణలో ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’ నిర్మాణంఏఐ సిటీ, హెల్త్‌ జోన్‌, విద్యాజోన్‌ మొదలైనవిఫ్...
20/09/2025

దేశ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా
తెలంగాణలో ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’ నిర్మాణం

ఏఐ సిటీ, హెల్త్‌ జోన్‌, విద్యాజోన్‌ మొదలైనవి
ఫ్యూచర్‌ సిటీలో ఉంటాయి

2025 డిసెంబరు 9న తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ను వెల్లడిస్తాం

ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల
అమెరికాకే నష్టం

తెలంగాణలో ఒక ట్రంప్ ఉండేవారు..
ప్రజలు ఆయనను పక్కన పెట్టేశారు

- ఢిల్లీలో జరిగిన పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోరమ్‌ సదస్సులో
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Public Court News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Public Court News:

Share