18/11/2025
వైసీపీ తప్పుడు ప్రచారం, అరాచక పాలనపై రాష్ట్రప్రజలు గూబ గుయ్యిమనే తీర్పు ఇచ్చినా వారు తీరు మార్చుకోలేదు. కుక్కతోక వంకర మాదిరిగా వైసీపీ సైకోల ఫేక్ ప్రచారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజా రాజధాని అమరావతిపై ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో ఒక హ్యాండిల్ నుంచి గతంలో వచ్చిన వీడియోను తాజాదిగా సృష్టించి ఒక ఫేక్ వీడియోను కొందరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉత్తరాఖండ్ లో జన్మించి ఢిల్లీలో నివసిస్తున్న ప్రముఖ యువ జర్నలిస్టు కావ్యా కర్నాటక్ KK Create అనే యూట్యూబ్ ఛానెల్ లో అమరావతిని అప్పటి సీఎం జగన్ ఎలా ధ్వంసం చేశాడో వివరిస్తూ 2024 మే నెల 25వ తేదీన ఒక వీడియోను అప్ లోడ్ చేశారు. ఆ వీడియోను కట్ అండ్ పేస్టుతో తప్పుడు అర్ధం వచ్చేలా ఒక ఫేక్ వీడియోను సృష్టించారు. అమరావతి తాజా పరిస్థితి ఇలా ఉంది అంటూ పాత వీడియోను అప్ లోడ్ చేసి, అది ఒక కుంభకోణం అనే రీతిలో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తున్నది. ప్రముఖ యూట్యూబర్ పేరును, వీడియోను అనధికారికంగా వాడుకోవడం కూడా తీవ్రమైన నేరం. ఇలాంటి ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటుంది.