
19/05/2025
ఛలో చెన్నయ్ !
---------------------
- చెన్నైలోని గ్రీన్ ట్రిబ్యునల్ కు చేరిన తాళ్లపాక చెరువు కబ్జా
- అన్నమాచార్య డీమ్డ్ యూనివర్సిటీ కబ్జాలను తొలగించాలని కోరిన జర్నలిస్టు
-------------------------------------------------------
తాళ్లపాక చెరువులో అన్నమాచార్య డీమ్డ్ యూనివర్సిటీ కబ్జాలను తొలగించాలని గ్రీన్ ట్రిబ్యునల్ సెక్షన్ కింద అన్నమాచార్య డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్సలరుకు, కలెక్టరుకు, పర్యావరణం, రెవెన్యూ విభాగాల ప్రిన్సిపల్ సెక్రటరీలకు నోటీసులు పంపిన సీనియర్ జర్నలిస్టు ఆకేపాటి శివశంకర్ రెడ్డి గడువుదాటి పోవడంతో ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ తలుపు తట్టేశారు. కబ్జాలను తొలగించి తాళ్లపాక చెరువును సుందరీకరించాలని, అందుకయ్యే ఖర్చు ప్రతివాదుల నుంచి రాబట్టాలని, అలాగే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆన్లైన్లో కేసు అప్ లోడ్ చేసేశారుగానీ ఇంకా నెంబర్ కాలేదు. ఏ స్థాయిలోనూ తాళ్లపాక చెరువుకు న్యాయం జరగలేదు. గ్రీన్ ట్రిబ్యునల్లోనైనా జరుగుతుందని ఆశిద్దాం.