Devalaya Darshanam

Devalaya Darshanam Latest Updates, Headlines, Stories and News Articles which happen around Andhra pradesh

26/01/2025

శ్రీ దత్త ప్రసాదం - 36 - మీది మోయలేనంత భారం కాదేమో కదా....?!

2004 వ సంవత్సరం లో ఒక ఆదివారం ఉదయం ఒక పెద్దావిడ మందిరానికి వచ్చింది..

"ఇక్కడ మా ప్రభావతి కొడుకు ఉన్నాడని చెప్పారు..వాడిపేరు ప్రసాద్ అని కూడా చెప్పారు..ఎక్కడుంటాడు..?" అని నన్నే అడిగింది..నేను నవ్వి.."అమ్మా.. నేనే ఆ ప్రసాదు ను..మీరెక్కడినుంచి వచ్చారు..? " అని అడిగాను..

"నేనూ మీ అమ్మ ప్రభావతీ చిన్నప్పుడు కావలి లో చదువుకున్నాము..నా పేరు వర్ధనమ్మ..ఇప్పుడు నెల్లూరులో మా పెద్దవాడి దగ్గర ఉంటున్నాను..మావారు కాలం చేసి నాలుగేళ్ళయింది..ఇదిగో ఇప్పుడు ఈ స్వామివారి మందిరం చూద్దామని వచ్చాను..బాబూ..నేను ఇక్కడ ఒక వారం ఉంటాను..నాకు ఉండటానికి ఏర్పాటఏమన్నా చేస్తావా?..పెద్దదాన్ని..మీ ఇంట్లో ఉండాలంటే మీ అమ్మను ఇబ్బంది పెట్టాలి..పైగా మీ నాన్నగారు కూడా మంచం లో వున్నారు.."అని గబ గబా చెప్పారు..

పూజారి గారు వుండే ఇల్లు కాకుండా ఒక రేకుల షెడ్ ఉన్నది..ఆ ప్రక్కనే చిన్న గది ఉన్నది..ఆ గదిలో సర్దుకోగలరా..అని అడిగాను..అయిష్టంగానే ఒప్పుకుంది..ఆవిడకు భోజనం మా ఇంటి నుంచి వచ్చే ఏర్పాటు చేసాను..

వర్ధనమ్మ గారు ఆ వారం స్వామివారి మంటపం లోనే ఎక్కువ కాలం గడిపారు..అక్కడకు వస్తున్న భక్తులను దగ్గరగా చూస్తుండేవారు..మందిరం వద్ద మండలం పాటు ఉంటే తమకు పట్టిన గ్రహబాధలు తొలగిపోతాయని భావించి అక్కడే ఉన్నవాళ్ల తో మాట్లాడేవారు..వాళ్ళ ఇబ్బందులను వినేవారు..ఆవిడ స్వామివారి సమాధి ని ఉదయం సాయంత్రం దర్శించుకొనే వారు..ఆవిడ తనలో తాను ఏదో మథన పడుతున్నట్లుగా నాకు తోచింది..మళ్లీ ఆదివారం సాయంత్రం నేను, మా సిబ్బందీ మందిరం తాలూకు లెక్కలు చూసుకునే సమయం లో వచ్చి.."నాయనా ప్రసాదూ..మరో వారం ఇక్కడ వుంటానురా..నీకు శ్రమ ఇస్తున్నాను..ఏమీ అనుకోకు.." అన్నారు..సరే అన్నాను..ఆరోజు రాత్రికి నేనే ఆవిడ వద్దకు వెళ్లి.."అమ్మా..మీకొచ్చిన కష్టం ఏమిటో నాకు చెపుతారా?..మీరేదో లోలోపల బాధ పడుతున్నట్లుగా ఉంది..నేను మీ బిడ్డలాంటి వాడిని అనుకోండి.." అన్నాను..

అలా నేను ఆడిగానో లేదో..మరుక్షణమే వర్ధనమ్మ గారు కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు.."బాబూ..నాకిద్దరు కుమారులు..ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు..మావారు ఉన్నప్పుడే ఇద్దరికీ పెళ్లిళ్లు చేసాము..వాళ్ళూ లక్షణంగా వున్నారు..ఆయన కాలం చేసిన తరువాత నేను కొన్నాళ్ళు ఇంట్లో ఒక్కర్తినీ వున్నాను..అలా ఉండలేక..చిన్నవాడి ఇంటికి వెళ్ళాను..వాడు ఉద్యోగానికి పోతాడు..కోడలూ నేనూ వుండేవాళ్ళము..ఆ అమ్మాయి ఇంటిపని చేసుకుంటూ..నాతో సరిగా మాట్లాడేది కాదు..నాకు కావాల్సినవి అన్నీ క్షణాల్లో అమార్చేది..ముక్తసరిగా ఉండేది..నాకెందుకో ఆ పద్ధతి నచ్చలేదు..అక్కడనుండి పెద్దవాడి ఇంటికి వచ్చాను..వీడికిద్దరు చిన్న పిల్లలు..ఆ పిల్లలను చూసుకోవడమే పెద్దకోడలుకు పెద్ద పని..నా అవసరాలు నేనే చూసుకోవాలి..ఇక్కడా ఇమడలేకపోయాను..కొన్నాళ్లపాటు దూరంగా ఉండాలని ఇలా వచ్చాను.." అన్నారు..

"కానీ..ఇక్కడికొచ్చిన తర్వాత అర్ధం అయింది..ఎంతోమంది ఎన్నో రకాల కష్టాల్లో వున్నారు..వాళ్ళతో పోల్చుకుంటే నావి పెద్ద కష్టాలు కాదు..నాకు గ్రహబాధల్లేవు..శారీరిక అవకరం లేదు..ఉద్యోగాలు చేసుకుంటున్న కొడుకులు..కోడళ్లు..మనుమరాలు, మనుమడు..అందరూ వున్నారు..నేను కొద్దిగా సర్దుకుంటే అన్నీ చక్కబడతాయి..ఈ పాఠం నేర్పడానికే స్వామివారి నన్ను ఇక్కడ ఉంచారేమో..కోడళ్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు గానీ..నన్నెప్పుడూ ఒక్కమాట అనలేదు..ముందుగా నా మనోస్తితి మారాలి అని స్వామివారు నాకు అనుభవపూర్వకంగా చూపారు..ఈ వారం ఇక్కడ వుండి..నేను వచ్చేవారం పెద్దవాడి దగ్గరకు వెళతాను.." అన్నారు..

వర్ధనమ్మ గారిలో వచ్చిన మార్పు మంచిదే అనిపించింది..మా అమ్మను అడిగి వాళ్ళబ్బాయి నెంబర్ తీసుకొని ఫోన్ చేసాను..రెండోరోజే అతను నేరుగా మందిరానికి వచ్చాడు..కుమారుడిని చూడగానే వర్ధనమ్మ గారు పెద్దగా ఏడ్చేశారు..కొద్దిసేపటికి తేరుకొని కళ్ళు తుడుచుకుని..గబ గబా తన సామాను సర్దేసుకున్నారు..కుమారుడితోపాటు వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారు..ఆ అబ్బాయి నాదగ్గరకు వచ్చాడు.."మాదగ్గర ఎటువంటి ఇబ్బందీ లేదండీ..కాకుంటే నాన్నగారు ఉన్నరోజుల్లో తన పెత్తనం సాగినట్లుగా..ఇప్పుడు జరగడం లేదనే బాధ మా అమ్మగారు పడుతున్నారు..తరాల మార్పు వల్ల వచ్చిన ఇబ్బంది ఇది..ఇటువంటి ధోరణి ని స్వామివారే మార్చాలి.." అన్నాడు..

"స్వామివారు మీ అమ్మగారిలో మార్పు తెచ్చారు..ఆ మాటే స్వయంగా నాతో చెప్పారు..త్వరలో మీరే చూస్తారుగా.." అన్నాను..వర్ధనమ్మ గారు ఊరికి వెళ్లేముందు కుమారుడితో సహా స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని వెళ్లారు..
మరో మూడునెలల తరువాత వర్ధనమ్మ గారు తన ఇద్దరు కొడుకులతో కలిసి స్వామివారి మందిరానికి వచ్చారు.."అమ్మ చాలా మారింది ప్రసాద్ గారూ..మాతో బాగా కలిసిపోయింది..స్వామివారు తెచ్చిన మార్పు ఫలితం ఇది.." అని వాళ్ళ పెద్దబ్బాయి సంతోషంగా చెప్పాడు..

"నేను స్వామివారి దగ్గర ఉన్న పదిరోజుల్లో చాలా తెలుసుకున్నానురా..ఇప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంది..అంతా స్వామివారి మహిమ.." అన్నారు వర్ధనమ్మ గారు..నిజమే..స్వామివారు ఆవిడకు తన శేష జీవితాన్ని ఎలా గడపాలో నేర్పారు..

సర్వం..
శ్రీ దత్తకృప!
రచన : శ్రీ పవని నాగేంద్రప్రసాద్

(మందిర వివరముల కొరకు :
పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)

----
మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును :

https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=nq8cskE8m3f3ZrNZ
-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 :

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632

----

25/05/2024

సాలగ్రామం....

25/05/2024

హైదరాబాదులోని మియాపూర్ లో పాలు తాగుతున్న అమ్మవారు....

12/08/2023
09/08/2023

డబ్బు ఎలా సంపాదించాలి ?

08/08/2023

🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*08-ఆగస్టు-2023*
*మంగళవారం*

🕉️ *తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ*

🕉️ నిన్న *07-08-2023* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *69,733* మంది...

🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *28.614* మంది...

🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *4.37* కోట్లు ...


🕉️ టికెట్ లేని సర్వదర్శనానికి *అన్ని* కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు...

🕉️ టికెట్ లేని సర్వదర్శనానికి *18* గంటల సమయం...

🕉️ టైమ్ స్లాట్ (టోకన్ SSD) దర్శనానికి, నడకదారి దివ్యదర్శనానికి *04* గంటల సమయం....

🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి *3* గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

08/08/2023

*కోరిన కోర్కెలు ఈడేర్చే కన్యకాంబ*

*శతాబ్ద చారిత్రక శ్రీకన్యక పరమేశ్వరి దేవస్థానం*

నగర నడిబొడ్లో అమ్మవారిశాల వీధిలో వెలసిన శతాబ్ద చారిత్రక శ్రీకన్యక పరమేశ్వరి దేవస్థానం.120 ఏళ్ళుగా భక్తులు కోరిన కోర్కెలు ఈడేర్చే వాసవాంబగా పూజలందుకుంటున్న శ్రీకన్యకా పరమేశ్వరి దేవి మహిమాన్విత శక్తి స్వరూపిణి. భక్త జనులు 108 ప్రదక్షణలు చేసి కోర్కెలు కొరగానే తీర్చే తల్లిగా ప్రసిద్ధి పొందిన దేవత వాసవాంబ.

తొలుత శివాలయంగా ఉన్న ఈ స్థలంలో 1900 సంవత్సరములో శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవి ప్రతిష్ఠింప బడినట్టు పూర్వీకులు చెబుతుంటారు.

1919 లో శ్రీకన్యకాపరమేశ్వరి దేవస్థాన సభగా ఏర్పడి చాటకొండు వేంకట సుబ్బయ్య శ్రేష్టి అధ్యక్షుడుగా, కృష్ణం రామలింగయ్య శ్రేష్టి ప్రధాన కార్యదర్శిగా 27 మంది సభ్యులతో కూడిన దేవస్థాన సభగా సేవలు అందించింది కాలక్రమమున 1956లో ఆర్యవైశ్య సంఘంగా ఏర్పడి పుల్లగూర శేషయ్య శ్రేష్టి అధ్యక్షుడుగా,యలవలి వెంకట సుబ్బయ్య శ్రేష్టి ప్రధాన కార్యదర్శిగా ఇతర సభ్యులతో కమిటీ సేవలు అందిస్తూవస్తున్నారు.

1958 లో ఆంజనేయ సీతాలక్ష్మణ శ్రీరామచంద్ర మూర్తి నెలకొల్పారు.
గుడిక్రీంద్రం మధ్యలో శ్రీకన్యక పరమేశ్వరి దేవి,కుడివైపు శివాలయం,దేవి ఎడమవైపు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తి అలయాలతో ఏడాది పొడుగునా ప్రతి పండుగ పర్వదినాల్లో విశేష పూజలు జరపబడతాయి.

2023 మునగా శ్రీనివాస్ కుమార్ అధ్యక్షుడుగా,యాదాళ్ల వేంకట రమణయ్య ప్రధాన కార్యదర్శిగా ఇతర సభ్యులతో కూడిన సంఘం ఆధ్వర్యంలో దేవస్థానం నిర్వహించబడుతుంది

*సేవలు*
కడప కన్యకా పరమేశ్వరి దేవస్థాన సభ ఆర్యవైశ్య సంఘంగా ఏర్పడి శాఖోపశాఖలుగా విస్తరించబడి వాసవి విద్యార్థి వసతి గృహం,వాసవి హిందీ విశ్వ విద్యాలయ,వాసవి వృద్దాశ్రమం,వాసవి గ్రంధాలయం తదితరాలుగా సేవలందిస్తుంది.
అమ్మవారి కృపతో మహిమలు పొందిన భక్తజనులు ఎందరో ఉన్నారు

*శరన్నవరాత్రోత్సవాలు ప్రత్యేకం*

శ్రీకన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానం ప్రతి ఏడాది శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పది రోజుల పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు,విజయదశమి నగరోత్సవం నభూతో నభవిష్యత్గా జరుగుతాయి.

*2023 ఏడాది గాను 70 లక్షల ఖర్చుతో దేదీప్యమానంగా శరన్నవరాత్రోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు*

నవరాత్రోత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు దీక్షతో మహిమాన్విత శక్తి స్వరూపిణి శ్రీకన్యకా పరమేశ్వరి దేవిని పూజించి సేవిస్తే సర్వ శుభాలు ఒసంగ బడతాయి.

** రమణ లీల* *శక్తి లీలా ఖండము* *షష్ట ప్రకరణము** *సన్నిధి* దినదినమును తిరిగి, తిరిగి, దిక్కులేక శరణు జొచ్చి । తనువు, ధనము...
08/08/2023

** రమణ లీల*
*శక్తి లీలా ఖండము*
*షష్ట ప్రకరణము**

*సన్నిధి*

దినదినమును తిరిగి, తిరిగి, దిక్కులేక శరణు జొచ్చి । తనువు, ధనము నీదె అంటి త్యాగరాజనుత బ్రోవ „

వేకువజాము. చీకటి క్రమంగా తగ్గుతున్నది. రైలు ఎక్కింది మొదలు "అరుణాచలం ఏది? ఎక్కడ?" అని సంభ్రమంతో ఎదురుచూస్తున్నాడు. అది దగ్గరవుతున్న కొద్దీ ఉత్కంఠ ఎక్కువైంది.

మొదట లీలగా, ఆ తర్వాత కొంచెం స్పష్టంగా, దగ్గరవుతున్న కొద్దీ స్పష్టత పెరుగుతూ అరుణగిరి శిఖరం, మధ్యభాగం, పాదం, పాదాలనంటి దేవాలయ గోపుర శిఖరాలు కనిపించాయి. వేంకటరామన్ హృదయం ఆనందంతో నిండిపోయింది. శరీరం కంపించింది. నేత్రాలనుండి కారుతున్న నీరు, తనకు ఇష్టమైన అరుణగిరి శిఖరాన్ని చూడటానికి అడ్డు వస్తోంది. ఇది ఆరు వారాలపాటు రేయింబగళ్ళు ప్రార్ధన చేసిన పిమ్మట ఫలించిన పితృసన్నిధి. ప్రాప్తి. ఎవరికీ చెప్పకుండా తన హృదయంలోనే రహస్యంగా పెంచిన ప్రియలతా కుసుమ వికాసం అది. మూడు జన్మల క్రితం పోయిన పెన్నిధి మరల ఇప్పుడు దొరికింది కదా! వేంకటరామన్ ఆనందానికి అవధి లేదు. క్రొత్తగా ఒక వస్తువు లభించినదానికంటే పోయిన వస్తువు దొరకటం ఎన్నో రెట్లు ఎక్కువ ఆనందదాయకం కదా!

రైలు స్టేషను చేరగానే, వేంకటరామన్ లేడివంటి పరుగుతో దేవాలయంలోకి పరిగెత్తాడు. ఉషఃకాలంలో ఎవరి అనుమతి కోరకుండా, ఎదురు చూడకుండా భగవంతుని సేవించుకొనే వాయుదేవుడు (గాలి) తప్ప ఇంక ఇతరులెవ్వరూ లేరు. ఆ వాయుదేవుని గుసగుసలు కూడా ఆగిపోయాయి. వేంకటరామనక్కు ఇంకేమీ వినబడలేదు. అపుడు దేవాలయంలో జీర్ణోద్ధరణ జరుగుతోంది. ఎనిమిది గంటలదాకా ఎవరూ తలుపులు తీయరు, ఎవరూ ఉండరు. కానీ, ఆ రోజు చిత్రంగా తలుపులు బారులుగా తీసి వున్నాయి. జనకుడు రహస్యంగా తనయునికి చేస్తున్న ఉపదేశమేమో? పవిత్ర భావోన్మాదుడైన ఈ తనయునితో ఏకాంతంగా కలుసుకోవాలని వున్నదేమో? "ఈ ప్రపంచంలో కాదు, ఈ గర్భగృహంలో ఎలా నన్ను వెతికావో, అలాగే నీ హృదయకుహర మధ్యలో వెతికితే నన్ను కనుగొంటావు" అని ఉపదేశించడానికోఏమో
వేంకటరామన్ నేరుగా గర్భగృహంలోకి ప్రవేశించి, "అప్పా! నీ ఆజ్ఞ మేరకు వచ్చి నన్ను అర్పించుకొన్నాను" అని విన్నవించుకున్నాడు.

హృదయంలో వున్న భావోద్వేగం మాయమైంది. భావ సంఘర్షణ. తగ్గింది. శాంతి వర్షించింది. ఆ అనుభవం సుఖదుఃఖాలకు అతీతం. అయినా సుఖమనే చెప్పాలి. కన్నీటి వర్షం ఆగింది. రసమయం ఆనందమయంలో లీనమైంది. శరీరమంతటా వున్న ఆ యాతన, మంట ఆ లింగమును దర్శించగానే మాయమైంది. త్రివిధ (ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక) తాపములు అదృశ్యమైనవి. అనిర్వచనీయమైన ఆనందం ప్రసరించి ముంచి వేసింది.

ఇంతవరకు ఈ ప్రపంచంలో వివిధ వేషములతో నాట్యమాడుచున్న కుమారుడు, ఇక పితృ సన్నిధిని వీడడు. ప్రపంచానికి, తనకు గల సంబంధం తెగిపోయింది. లోకానికి జనకుడే శుభాన్నిచ్చు గాక! తనకు అరుణాచలుడే ఆశ్రయం. అతని సన్నిధిని తాను వీడడు.

"యం లబ్వాచాపరం లాభం మన్యతే నాధికం తతః"

ఈ ప్రపంచ కల్లోలమునకు వీడ్కోలు, పరమశాంతికి స్వాగతం. ఇట్లు "కాయేన వాచా మనసేంద్రి యైర్వా, బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్" తనను. ఆయనకు అర్పించినందున, ఇక ఏమి జరిగినా సర్వమూ జనకుని భారం. ఇలా తన సర్వస్వాన్ని సమర్పించడం, ఆత్మార్పణం చేసింది ఎవరికి? తన జనకుడైన ఈశ్వరునికే కదా! ఆ ఈశ్వరుడు ఎవరు? ఎదురుగా చూస్తున్న ఆ లింగమా? అరుణాచలం అనే ఆ గిరియా? ఆ లింగమూ కాదు, ఆ గిరీ కాదు. “నీవు గిరి అనగానే శిరస్సు వాలిపోయినది" అని కదా భగవాన్ అన్నారు.

తాను శరీరంకన్నా భిన్నమైన సద్వస్తువు. దేహం తనను కప్పిన ఆవరణం మరియు కోశం. ఈ లింగం, కొండ రెండూ తన జనకుని కప్పివేయు ఆవరణం మరియు కోశం. లేకపోతే సాటిలేని, సర్వవ్యాపి అయిన ఈశ్వరుడు ఈ చిన్న వస్తువులో మాత్రమే పరిమితుడై వుంటాడా? ఇవన్నీ 'పరిమితి లేని, ఈ ప్రపంచానికి మూలాధారమైన, ఈ ప్రపంచానికి భిన్నమైన, లో-వెలుపల వ్యాపించిన, ఈ ప్రపంచానికి అతీతమైన, సకల కార్యములకు మూలకారణమైన, సమస్తమునకు నియామకమైన, స్వతహాగా బంధరహితమైన తత్త్వానికి చిహ్నాలు.

ఆ తత్వానికి తన బరువునంతా అప్పగించాడు. ఈ జనకుని తత్త్వమేమిటి? తన అహానికి; ఈ జగత్తును సృష్టించి, పరిపాలించి, చివరకు లయం చేసుకునే ఆ పరతత్వానికి గల సంబంధాన్ని ఎలా కనుగొనాలి? ఆ సద్వస్తువును ఎవరైనా తమకు తామే కనుగొనాలి.

వరుణుడు “తపసా విజిజ్ఞాసస్వ" (తపస్సు చేసి కనుగొనుము) అని భృగువుకు చెప్పాడు కదా!( సమాప్తం )

08/08/2023

🪔🪔అంతర్యామి🪔🪔

🏵️🏵️ధాన పుష్పం🏵️🏵️

🍁ప్రకృతిలో భాగమైన పూల మొక్కలు ఎల్లప్పుడూ
ధ్యానంలో ఉంటాయి. అలా ఉండటం వాటి సహజ
స్వభావం. పుష్పించడం వాటి అంతిమ లక్ష్యం.

🍁అదే రీతిన మనిషిగా జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరి జీవితలక్ష్యం- ప్రాకృతికంగా ధ్యాన పుష్పానికి అంతర్లీనంగాపరితపించడం.

🍁కాని,
ప్రకృతి మొత్తం ధ్యానోత్సవం జరుపుకొంటూంటే,
ఒక్క మనిషి మాత్రం అందుకుభిన్నంగా బతుకీడ్వటం విచారకరం.

🍁తల్లిగర్భంలో ధ్యానక్రియతో సంపూర్ణ ఆకృతి దాల్చిన మనిషి బాహ్య ప్రపంచంలోకి అడిగిడగానే (పుట్టగానే) ధ్యానం తాలూకు ఎరుకను క్రమంగా మరచిపోవడం మొదలుపెడతాడు.

🍁అందువల్లే మనిషి బాల్యమంతా నిండు ఆరోగ్యంతో, ఆనందంగా గడిపి- వయసు పెరిగి వృద్ధాప్యాన్ని సమీపిస్తుంటే అనారోగ్యానికో, అశాంతికో చేరువవుతుంటాడు. కోల్పోయిన ఆనందం తిరిగి పొందడానికి, జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ధ్యానం ఉపకరిస్తుంది.

🍁 సుదీర్ణానుభవంతో పొందిన బుద్ధిబలాన్ని మనిషి కేవలం ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడంకోసం | ప్రాపంచిక సౌఖ్యాలనిచ్చే వ్యామోహాల ఆకలి తీర్చడం కోసం వినియోగిస్తున్నాడే తప్ప- అసలైన అంతర్ జ్ఞాన విధివైపు దృష్టి సారించడానికి ఇష్టపడటంలేదు.

🍁ఎంతో సాఫీగా సాగే సహజాతి సహజ జీవన గమ నాన్ని ఉరుకులు, పరుగులతో అత లాకుతలం చేసుకుంటున్నాడు. ప్రధా నంగా ఆయుఃప్రమాణం
గరిష్ఠంగా నిలవడానికి ఉపకరించే నిద్రా దేవతనూ
విస్మరిస్తున్నాడు. నిద్ర- మనిషికి ప్రకృతి ప్రసాదించిన
అత్యంత విలువైన వరం.

🍁అది మనిషి జీవితకాలంలో సగ భాగం.
🍁కాలం నిండుకున్నాక నీకు జన్మ ఇచ్చినవాళ్లు మృత్యువు ఒడిలోకి చేరిపోతారు.
🍁నువ్వు జన్మ ఇచ్చినవాళ్లు బతుకుతెరువుకోసం దూరతీరాలకు వలసపోతారు.
🍁నీ తోబుట్టువులూ ఎవరిదారి వారు చూసుకుంటారు. ముందో వెనకాలో ఆయుష్షు తీరగానే జీవిత ||భాగస్వామి కాలం చేయక తప్పదు.
🍁కానీ, నిద్రమాత్రం జీవితాంతం నీ వెన్నంటే ఉంటుంది.

🍁ఉషోదయం, సాయం సంధ్యావేళల్లో ధ్యానం మంచిదని జీవితాన్ని పండించుకున్నవాళ్లు చెబుతారు.
🍁మానసికంగా, శారీరకంగా శ్రమించి అలసిసొలసిన మనిషిని ప్రకృతే నిద్రలోకి జారుస్తుంది.
🍁 ఎందుకంటే, నిద్ర కూడా ధ్యానం లాంటిది.
🍁దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం, ఆకలి అనిపించినప్పుడు ఆహారం సేవించడం, నిద్ర వచ్చినప్పుడు ఉపక్రమించడం...

🍁 ఇవన్నీ ప్రాకృతిక ప్రామాణిక ధార్మిక జీవనం కిందకే వస్తాయి.
🍁ధ్యానం- ఎరుకతో కూడిన నిద్ర
🍁 నిద్ర- ఎరుకలేని ధ్యానం. ఈ రెండూ మనిషికి ప్రాథమికంగా ఆరోగ్యం సమకూర్చేవి.

🍁 బురదమయమైన ఒక నీటి కొలను | నిలకడ స్థితికి వచ్చినప్పుడు మళ్ళీ స్వచ్ఛమైన తేట నీళ్లతో కళకళలాడుతుంది. అదేరీతిన అనేకానేక ఆలోచనలతో సతమతమయ్యే మనసూ ఏ ఆలోచనా లేకుండా నిశ్చల స్థితికి చేరుకున్నప్పుడు- అది నిర్మలం అవుతుంది. ఫలితంగా దాని ప్రభావం శరీరంపైనా పడుతుంది.

🍁 కలతలే లేని కమ్మని నిద్రలో మనశరీరాలు పూర్తి విశ్రాంతిలో ఉంటాయి.
🍁అప్పుడు ప్రకృతి అంతటా నిండిన విశ్వశక్తిని అవి తిరిగి పొందుతాయి.
🍁అందువల్లే, ఉదయం నిద్ర లేవగానే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. చుట్టూ పరచుకున్న జీవితం కొత్త అనుభూతి కలిగిస్తుంది.🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

08/08/2023
08/08/2023

జీవితం లో చూడలేని *గజేంద్ర మోక్షం* చూసి ధన్యులు కండి 🙏🙏🙏

05/08/2023

పిలిస్తే పలికే దైవం మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామి....

Address

Kadapa
516002

Alerts

Be the first to know and let us send you an email when Devalaya Darshanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share