21/09/2025
*ఓటు చోర్ గద్దీ చోడ్ మహా ఉద్యమం మరియు పెద్ద ఎత్తున సంతకాల సేకరణ*
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా అవకతవకలను నిర్మూలించేందుకు మరియు భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఓటు చోర్ గద్దీ చోడ్ మహా ఉద్యమం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున సంతకాల సేకరణ జరిగిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ సయ్యద్ గౌస్ పీర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న *ఓట్ చోర్ గద్ది చోడ్ - సంతకాల సేకరణ* అనే ఉద్యమంలో భాగంగా ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షులు వైయస్ షర్మిలమ్మ మరియు డీసీసీ అధ్యక్షులు ఎన్ డి విజయ జ్యోతి ఆదేశాల మేరకు ఈరోజు కడప అల్మాస్ పేట కూడలిలో డివిజన్ ఇంచార్జ్ లతో మరియు కార్యకర్తలతో కలిసి కడప సిటీ పరిధిలో సంతకాల సేకరణకు ప్రారంభోత్సవం చేశారు. 'ఓటు చోర్ గద్దీ చోర్' అనేది కేవలం ఒక నినాదం కాదు అది దేశ ప్రజల మనోభావం అంతేగాక దేశమంతా ప్రతిధ్వనిస్తున్న నిజం. చిన్న పల్లె నుండి పెద్ద నగరం వరకు ఈ దేశంలోని ప్రతి మూలలోనూ వినిపిస్తున్న నినాదం అని అన్నారు. తమ ప్రాథమిక హక్కును హరించారని భావిస్తున్న ప్రజల ఆక్రోశం ఇది.
ఏళ్ళ తరబడి మనం ఒక వ్యవస్థను నమ్మాలని మనకు చెప్పారు. కానీ, ఆ వ్యవస్థ మనల్ని మోసం చేయడానికే రూపొందించబడిందని ఇప్పుడు మనకు తెలిసింది. మనం 'గుజరాత్ మోడల్' అని పిలవబడే దానిని నమ్మాలని మనకు చెప్పారు. కానీ ఆ మోడల్లో ఉన్న నిజాన్ని ఇప్పుడు మనం కనుగొన్నాం. గుజరాత్ మోడల్ అనేది ఆర్థిక వృద్ధికి సంబంధించిన మోడల్ కాదు, అభివృద్ధికి సంబంధించిన మోడల్ కాదు, అది ఓట్ల దొంగతనానికి సంబంధించిన మోడల్. 'ఓట్లను తొలగించి, నకిలీ ఓటర్లను చేర్చడానికి నిర్మించబడిన మోడల్ ఇది, అని అన్నారు. 'ఎన్నికల పునర్విమర్శ' పేరుతో 'సైలెంట్ ఇన్విజిబుల్ రిగ్గింగ్' చేసే మోడల్ ఇది.
మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఈ అవకతవకలకు సంబంధించిన ఆధారాలు మనం చూపించినప్పుడు , కోటికి పైగా నకిలీ ఓట్లను ఉద్దేశపూర్వకంగా చేర్చడాన్ని మనం వెల్లడించినప్పుడు , ఏమైంది? మన ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన ఎన్నికల సంఘం విచారణకు నిరాకరించింది. మన హక్కులకు సంరక్షకుడిగా కాకుండా, అది నిందితులకు రక్షకుడిగా వ్యవహరించింది. మనం ప్రజాస్వామ్యంలో కాకుండా, కోర్టు గదిలో ఉన్నట్లుగా అఫిడవిట్ మీద సంతకం చేయమని వారు మనల్ని అడిగారు. వారు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి మాటలను మర్చిపోయారు.
అందుకు దీటుగా ఈ సంతకాల సేకరణే మన సమాధానం. ఇది అభ్యర్థన కాదు,ఇది ప్రజల డిమాండ్! ఇది ప్రజల సామూహిక గర్జన! చాలా కాలం పాటు, మన కర్తవ్యం ఓటు వేయడం మాత్రమే అని మనకు చెప్పారు. కానీ మహాత్మా గాంధీ గారు 'బాధ్యతలను నిర్వర్తించడం ద్వారానే హక్కులు లభిస్తాయి' అని మనకు నేర్పారు. ఇప్పుడు మన కర్తవ్యం ఆ ఓటును రక్షించుకోవడమే కాకుండా మన ప్రజాస్వామ్యాన్ని రక్షించడం.
ఏఐసిసి ఆదేశాల మేరకు మనం ఒక గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం అది ఏమంటే ఐదు కోట్ల సంతకాలను సేకరించాలి. మరియు కడప జిల్లాలో ఒక లక్ష సంతకాలను సేకరించాలని మా జిల్లా అధ్యక్షులు ఎండి విజయ జ్యోతి గారు తెలిపారు.
మన ఓటు మన హక్కు. దాన్ని మనం తిరిగి సాధించుకుంటాం
కాబట్టి, నేను మీ అందరినీ కోరుతున్నాను,మన పిల్లల భవిష్యత్తు కోసం
బయటకు వెళ్లి మీ గొంతుకను వినిపించండి. బయటకు వెళ్లి మీ ఓటును తిరిగి సాధించుకోండి!
ధన్యవాదాలు అని ఘంటాపదంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో సయ్యద్ హమీద్, దాసరి శ్రీనివాసులు, సలీం, ఫజలుల్లా, గంగయ్య, రఫిక్ ఖాన్, అబ్దుల్ రౌఫ్, మొయిన్, ముబారక్, సిద్ధిక్, షామీర్ హుస్సేన్, యూసఫ్, సర్దారి, తదితర నాయకులు, డివిజన్ ఇన్చార్జులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Rahul GandhinPriyanka Gandhi VadraaK.C. VenugopalaYS Sharmila ReddyCCongresspIndian National CongressiIndian National Congress - Andhra Pradeshonal Congress - Andhra Pradesh