Mee Journalist

Mee Journalist My Name s Srinivas Mirthipati. MEE JOURNALIST
2. UR JOURNALIST/ UR MSR
3. YUVA BHARATH MSR
4. SITRALU MSR

I have 25 Years of Experience in Telugu News Media in EENADUDAILY AND ABN ANDHRAJYOTHI.and I have 4 youtube channels.., The names are
1.

09/06/2025

నాణానికి ఒకవైపు జర్నలిజం
మరోవైపు చంద్రబాబు

మరి నేడు?

జర్నలిజాన్ని ఎలా వాడుకోవాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తెలిసినంతగా ఎవరికీ తెలీదనే అందరూ అంటారు. అదే జర్నలిజం పునాదుల నుంచి పైకి లేచిన రాజకీయ నాయకుడు ఆయన. ఆయన వెనుక రాజగురు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నాటి నుంచి నేటి వరకు చంద్రబాబునాయుడు...ఏనాడు జర్నలిస్టులను విమర్శించలేదు. వారెన్ని వార్తలు రాసినా మౌనంగానే ఉండిపోయేవారు.

ఒకవేళ పాలనలో లోపాలను ప్రశ్నిస్తే, సరిచేసుకునేవారు, ఆచరించి చూపించేవారు. లేదంటే అక్కడ సమస్యుంటే వెంటనే పరిష్కరించేవారు. ఆరోజుల్లో నాయకులతో పదేపదే జర్నలిస్టులతో జాగ్రత్త అని చెప్పేవారు. అంటే జర్నలిస్టులను అంతగా ఇష్టపడేవారు. అంతగా నమ్మేవారు. మొన్న జగన్ పాలనలో ఆయన్ని జైలులో పెట్టినప్పుడు మీడియానే నమ్ముకున్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మైత్రీ బంధాన్ని కాంక్షించినప్పుడు మీడియానే నమ్ముకున్నారు.

స్టిల్ ఈరోజుకి మీడియాపైనే విశ్వాసం చూపిస్తారు. అది ఆయన నమ్మిన సిద్ధాంతం. ఈరోజున సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేశారు. ఆయన అమరావతిపై చేసిన కామెంట్లను సమర్థించిన తీరు, డిబేటును నడిపించిన తీరు ఆక్షేపణీయమే. కానీ ఇదే కొమ్మినేని శ్రీనివాసరావు, ఏబీఎన్ రాధాక్రష్ణ ఇద్దరూ చంద్రబాబునాయుడికి చేసిన మేలును ఎవరూ మరువలేరు. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు. జగమెరిగిన సత్యం. నాడు ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి కాలంలో జరిగిన ఘటన ఎవరూ మరిచిపోలేరు.

అలాంటి కొమ్మినేని...చాలాకాలం క్రితం చంద్రబాబుతో విభేదించారు. ఆయన రాజ్యసభ అడిగారని, అది చంద్రబాబు ఇవ్వలేదనే కోపంతో జగన్ పంచన చేరారనే ప్రచారమైతే జోరుగా నడిచింది. నిజంగా కొమ్మినేని కరెక్టుగా చంద్రబాబు పక్కనే ఉండుంటే, తను కూడా ఒక టీవీ ఛానల్ లేదా పత్రికాధిపతి అయ్యేవారు. ఆ స్థాయి వ్యక్తి ఆయన. ఇప్పుడాయన జైలు పాలయ్యారు.

జర్నలిస్టుల మీద ఈగ కూడా వాలనివ్వని చంద్రబాబు ఆయన్ని జైలులో పెట్టడం ఏమిటి? అని జర్నలిస్టు వర్గాల్లో ఒక చర్చ నడుస్తోంది. అయితే ఇందులో చంద్రబాబు పాత్ర లేదు. అంతా చినబాబు పాత్రే అని కొందరంటున్నారు. బాబు...బాగా దూకుడుగా ఉండటం, అతన్ని కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడంతో తండ్రి నమ్మిన సిద్ధాంతాలను వదిలి పరిగెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

జర్నలిజం నుంచి ఎదిగిన నేత ఎవరంటే చంద్రబాబునాయుడు అనే అంటారు. అలాంటిది నేడు ఆ సిద్ధాంతాలకు పాతరేసి, కొత్త పోకడలకు తెర తీస్తున్న వైనం...ఎటువైపునకు దారి తీస్తుందని మేధావులు ఆలోచనలు చేస్తున్నారు. తప్పులు ఎవరు చేయరు. జర్నలిజంలో రోజూ కొన్ని వందల తప్పులు జరుగుతుంటాయి. నాడు అన్నగారు నటించిన నేరం నాది కాదు ఆకలిది...అనే సినిమాలో ఒక పాట ఉంటుంది.

మీలో నేరం చేయని వాడు...ఆ రాయి విసరాలి...అని దానర్థం. కొమ్మినేని అరెస్టును నేను సమర్థించడం లేదు. ఒక జర్నలిస్టుని అరెస్టు చేస్తున్నారు. జర్నలిస్టులు దేవుళ్లా? వారిని అరెస్టు చేయకూడదా? అని అంటున్నారు. అదికాదు నేను చెప్పేది...జర్నలిజం పునాదులపై పుట్టిన చంద్రబాబు..అదే పునాదులను కూల్చేసుకుంటున్నారేమో ఆలోచించమంటున్నాను.

నువ్వు జర్నలిస్టుని అరెస్టు చేయు, వాడబ్బని అరెస్టు చేయు...ఇక్కడ సమస్య అది కాదు. జర్నలిజమనేది లేకపోతే, ఈనాడు లేకపోతే చంద్రబాబు ఎక్కడ? ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లేకపోతే, టీవీ5 లేకపోతే, 2024 ఎన్నికలు ఏమయ్యేవి? ఇది అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం.

నిజానికి ఒక జర్నలిస్టుని ఇలా తీసుకెళితే...అంతర్గతంగా జర్నలిస్టులు మండిపడుతూనే ఉంటారు. ఈనాడు, జ్యోతి, టీవీ5 ఎవరైనా ఇందులో మినహాయింపు లేదు. మా అవసరం తీరిపోయాక, రేపు మనమైనా అంతేకదా...అని వారు కూడా అనుకుంటారు. సమయం వచ్చినప్పుడు కరెక్టుగా స్పందిస్తారు. అదును చూసి దెబ్బ వేస్తారు.

అందుకే అడుగు వేసేటప్పుడు రాజకీయనాయకుడు ఆలోచించి వేయాలి. ఇదొక రాజకీయ చదరంగం. అధికారం చేతిలో ఉన్నంతకాలం ...మనం ఏ ఎత్తులు వేసినా చెల్లిపోతుంది. అధికారం లేనప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి ఢిల్లీ కథలు గుర్తు చేసుకోవాలి. ఢిల్లీ రోడ్ల మీద ఒంటరిగా తిరిగిన రోజులు మరిచిపోకూడదు.

ఆ రోజు ఎవరు రాశారు వార్తలు...? ప్రజల్లో సానుభూతి ఎవరు తీసుకొచ్చారు? రేపు ఇలాంటి సంఘటన ఎదురైతే...ఎవరు రాస్తారు?
ఈనాడు, జ్యోతి రాస్తారు..మాకెవడి తోడు అవసరం లేదని అనుకోవచ్చు. కానీ ఆ వార్తలో జీవం ఉండదు. ఏదో మొక్కుబడికి రాసి పారేస్తారు.
ఇప్పుడు కొత్త బాబు ఎవరిని పట్టుకోవాలి..ఎవరిని వదలాలి? అనేది చూసుకోవాలి. జర్నలిస్టులు తాచుపాముల్లెక్క. బూర ఊదుతూనే ఉండాలి.

ఇదొక్కటే కాదు... బాబు...మరోవైపు తమ సామాజికవర్గంపైనే కొరడా ఝులిపిస్తున్నారు. ఇది కూడా సామాజిక వర్గంలో అసంత్రప్తికి కారణమవుతుంది. కొత్త దుమారాన్ని రేపుతోంది. రేపు మనమైనా అంతేకదా.. ఎదురుతిరిగితే లోపలేసి కుళ్ల బొడేసేస్తారనే చర్చ ఒకటి బహిరంగంగానే నడుస్తోంది.

ఇది కరెక్టు కాదేమో ఒకసారి కొత్త బాబు ఆలోచించాలి. గతంలో చంద్రబాబుకి ఇలా సలహాలు చెబితే స్వీకరించేవారు. మార్చుకునేవారు, సరిదిద్దుకునేవారు. బహిరంగంగా చెప్పేవారు. వారిని మెచ్చుకునేవారు. కానీ ఇప్పుడలా లేదని అంతా అనుకుంటున్నారు. బాబు ఎవరిమాట వినడం లేదని, సై అంటే సై అంటున్నారని, అట్టు వేస్తే, తిరగేయాల్సిందే అంటున్నారని టాక్... మరిది ఏ టర్న్ తీసుకుంటుందో, రేపు బాబు తట్టుకోగలడో లేదో ఆలోచించాలి.

09/06/2025

తెలుగు జర్నలిజం పునాదులపై నడిచే చంద్రబాబునాయుడు...మరి నేడు కొమ్మినేనిని అరెస్టు చేసిన తీరు...ఏ మార్పులకి దారి తీస్తుంది?

15/05/2025
మిత్రులందరికీ శుభాభినందనలుమన ఫిల్మ్ మేకర్స్ గ్రూప్ అనేది ఔత్సాహిక రచయితలకు ఎంత గొప్పగా, ఎంత మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని...
15/05/2025

మిత్రులందరికీ శుభాభినందనలు

మన ఫిల్మ్ మేకర్స్ గ్రూప్ అనేది ఔత్సాహిక రచయితలకు ఎంత గొప్పగా, ఎంత మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (ఏఏఏ) షార్ట్ ఫిల్మ్ కాంపిటేషన్ పై ప్రకటనని మనవాళ్లు మన గ్రూప్ లో పెట్టారు. అది చూసి నేనూ ఒక ప్రయత్నం చేశాను. అయితే దానికి కన్సోలేషన్ ప్రైజ్ వచ్చింది. ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలని భావించి ఇది రాస్తున్నాను.

షార్ట్ ఫిల్మ్ పేరు. ‘మన జన్మభూమి’..
విన్నర్స్ లిస్టులో 45 సీరియల్ నెంబర్ లో టైటిల్, నా పేరు ఉంటుంది.

ఎక్కడో మారుమూల ఉన్న నాకు ఫిల్మ్ మేకింగ్ లో ఓనమాలు నేర్పిన గురువులు గౌరవనీయులు శ్రీ మామిడి హరికృష్ణ గారు, డాక్టర్ ఖాజా మన్సూర్ గారు, నటరాజ గోపాలమూర్తిగారు, డీఎస్ కన్నణ్ గారు, ఆర్ శామల గారు, చందు తులసి గారు అందరికీ పేరుపేరున నమస్సుమాంజలులు.

ధన్యవాదాలతో
మీ
మిర్తిపాటి శ్రీనివాస్
8885459557

13/05/2025

ఇండియా-పాక్ వార్ జరిగింది. కానీ అంతకన్నా ఎక్కువగా ఫేక్ మీడియా వార్ జరిగింది. దాని గురించి అంతా భయపడ్డారు. ఇదెలా సాధ్యం? అసలు జర్నలిజం అంటే ఏమిటి? ద గ్రేట్ మీడియా కింగ్ స్వర్గీయ రామోజీరావు గారు ఏం చెప్పారు? తెలుసుకోవాలని అనుకుంటున్నారా?

13/05/2025

అసలు మీడియా అంటే ఏమిటి?
రామోజీరావుగారు ఏం చెప్పారు?

ఈనాడులో రామోజీరావుగారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. నువ్వు రాసే వార్తని...ఎవరైనా విమర్శించినా, వేలెత్తి చూపించినా, ఆ వార్తలో లోపం ఉన్నట్టే లెక్క.

మనందరం అద్దాలమేడలో ఉంటున్నాం. ఎవడో ఒకడు రాయి విసరాలనే చూస్తుంటాడు. అందుకే ఒకటికి పదిసార్లు జాగ్రత్తగా ఆలోచించి పత్రికను బయటకు వదలండి...అనేవారు.

ఈరోజుల్లో పత్రికలే కాదు.. అందరి జీవితాలు అద్దాలమేడల్లాంటివే. ప్రతి ఒక్కడూ రాయి విసరాలనే చూస్తుంటాడు. ఎందుకంటే టీవీ మీడియా వచ్చిన తర్వాత వ్యవస్థలో లోపాలకన్నా వ్యక్తిగత జీవితాలు బయట పెట్టడం ఎక్కువైంది.
ఇక సోషల్ మీడియా వచ్చింతర్వాత వాళ్లు చిన్న కట్ డ్రాయర్ కూడా వేసుకోనివ్వడం లేదు.

భారత్-పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఫేక్ మీడియా ప్రచారం చేసిన నష్టమే ఎక్కువైందని, దాన్ని ఎదుర్కోవడం కష్టమైందని అందరూ అంటున్నారు.

ఇది చదివిన తర్వాత...

నా జర్నలిజం కెరీర్ లో ఎదురైన ఒక ఘటన చెబుతాను. ఒకరోజు అమెరికాలో ఒకమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ కారణంగా చనిపోయిందని వార్త సారాంశం. ఆ అమ్మాయిది విజయవాడ. అమ్మానాన్న ఒక ఏక్సిడెంటులో చనిపోయారు. అమ్మమ్మ, తాతయ్య ఒక్కరే ఉన్నారు.

చిన్న సింగిల్ కాలమ్ వార్త... అమెరికాలో తెలుగమ్మాయి మృతి అని బ్రీఫింగ్ ఇచ్చి వదిలేశారు. రాత్రి ఎడిషన్ అయిపోయింది. పొద్దున్న లేచేసరికి ప్రింట్ మీడియా సంయమనం పాటించినా... టీవీ మీడియా అంతా హోరెత్తిపోతోంది. డైరక్టుగా విజయవాడలోని ఆ వృద్ధ దంపతుల ఇంటి ముందు టీవీ చానళ్ల క్యూ...రేటింగ్స్ కోసం హంగామా, హడావుడి...

కొన్ని ఛానల్స్ సెన్సేషన్ కోసం ఏం చేశాయంటే..ఒకడుగు ముందుకేసి ఆ అమ్మాయి నెల తప్పింది. అందుకే చనిపోయిందని మొదలెట్టారు. ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది? ప్రియుడెక్కడ? ఇద్దరూ కల్సి పార్క్ కి వెళ్లారా? ఒక ఆడపిల్ల అలా వెళ్లడం కరెక్టేనా? ఇవీ డిబేట్లు...

చివరికి సాయంత్రం వేళ ఆ వృద్ధ దంపతులు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇంటిముందు పడిగాపులు కాస్తున్న టీవీ ఛానళ్ల వాళ్లకి చేతులు జోడిస్తూ ప్రార్థించారు. ఇప్పటికే మా అబ్బాయి, కోడలు చనిపోయారు. ఇప్పుడా మనవరాలు చనిపోయింది. కొండంత దుఖంలో ఉన్నాం.

కానీ మా మనవరాలు చనిపోయినా కూడా ఆమె అస్థిత్వం మీద, గౌరవం మీద, అభిమానం మీద అభాండాలు వేస్తూ వార్తలు రాస్తున్నారు. ఇది మీకు తగునా? అదే మీ ఇంట్లో జరిగితే ఇలాగే వార్తలు రాస్తారా? మేం ఇప్పటికే చచ్చి ఉన్నాం. ఇంకా మమ్మల్ని చంపకండి...అని ప్రాథేయపడ్డారు.

అంటే మీడియా అనేది ఎంత దుర్మార్గంగా మారిందో తెలియజేసే ఒక చిన్న సంఘటన ఇది...

మారోజుల్లో జర్నలిజం ఎలా ఉండాలంటే.. ప్రజలకి-ప్రభుత్వానికి మధ్య వారధి లాంటిది అని చెప్పేవారు.

ప్రజల సొమ్ములు అడ్డంగా తినేస్తున్నా,
అక్రమంగా రోడ్డు, ప్రాజెక్టుల నిర్మాణాలు చేస్తున్నా,
అవినీతి నాయకులు, అధికారులు చేసే అన్యాయాలు, అరాచకాలు చేస్తున్నా...
వీళ్ల గురించి రాసేవాళ్లం.
లేదంటే ఫలానా చోట ప్రమాదం జరిగింది, ఇంతమంది చనిపోయారు..
లేదంటే అక్కడెక్కడో భూకంపం వచ్చింది..
లేదంటే, రాజకీయ పార్టీలు వ్యూహాలు, అధికార మార్పిడ్లు, నాయకుల ప్రెస్ మీట్లు...
ఇలాంటి సమాచారం ప్రజలకు అందించేవాళ్లం. అంతవరకే మా పరిధి.

మనుషుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లే అధికారం...మనకెవరికీ లేదని రామోజీరావుగారు స్వయంగా చెప్పేవారు. చాలా కఠినంగా ఉండేవారు. దేశంలో ఎవరెవరి ఇళ్లల్లో ఏం జరుగుతుందో, వాళ్లెలా గొడవలు పడతారో, మనకి అనవసరం.

ప్రజలతో ముడిపడి ఉన్న ఎవరైనా సరే, మనం వార్త రాయాల్సిందే అనేవారు.

అంటే ప్రజలు పన్నులు కడతారు. వాటితో జీతాలు తీసుకునే ప్రతి ఒక్క ప్రభుత్వాధికారి, ప్రజాప్రతినిధి జవాబుదారీయే.

ప్రజల పన్నులతో రోడ్లు, కాంట్రాక్టు పనులు చేసే ప్రతి ఒక్కరూ జవాబుదారీయే.

ప్రజలు పన్నులు కట్టే ప్రతి ఒక్క రూపాయిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగించే ప్రతి ఒక్కరూ జవాబుదారీయే.

ప్రజలు సినిమా టిక్కెట్లు కొంటే, హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు అందరూ జవాబుదారీయే.
ప్రజల సొమ్ము ప్రత్యక్షంగా, పరోక్షంగా తిన్న ప్రతి ఒక్కడు జవాబుదారీయే. ఇదే పత్రిక సిద్ధాంతం.

కానీ ఇప్పుడు మీడియా జనం మధ్యలోకి వచ్చేసింది. మీ ఇంట్లో ఏం జరుగుతుందో, పక్కనోడి ఇంట్లో జరుగుతుందో ...ప్రతీది వార్తే...

అంటే జర్నలిజం రంగులు మారిపోయింది. మీడియాలో వ్యక్తిగత హననం ఎక్కువైంది. ఇదే ఇండియా-పాక్ మధ్య యుద్ధం జరుగుతుండగా ఫేక్ మీడియా ప్రచారం ఎక్కువ కావడానికి కారణం.

రామోజీరావుగారు చెప్పినట్టు పత్రికమీద రాళ్లు విసిరేవాళ్లు మాత్రమే ఆరోజు ఉండేవారు. కానీ నేడు పబ్లిక్ మీద రాళ్లు విసిరేవాళ్లే ఎక్కువ. అందుకని నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని అనడానికి లేదు.
చేస్తే పదిమంది కాదు...ఊరంతా అనుకుంటారు.

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాక కూడా.. ఒకవేళ మనం రాసిన వార్త వల్ల నష్టం జరిగితే ఎవరెన్ని విమర్శించినా దానిని పాజిటివ్ గా తీసుకోవాలి. సరిచేసుకోవాలి. తర్వాత అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని రామోజీరావు చెప్పేవారు.

అంతేగానీ ఎవడ్రా నువ్వు? చెప్పడానికి? నీ పని నువ్వు చూసుకో.. అని మాత్రం అనకూడదని చెప్పేవారు.
ఇదే సూత్రంపై ఈనాడు ఇన్నేళ్లు ఆధారపడి నడుస్తోంది.

ఇప్పుడు సోషల్ మీడియాపై కూడా అంతే జాగ్రత్తగా ..ఈడెవడు రాయడానికి? నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, నాకు నచ్చినట్టు తిరుగుతాను, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను.
ఇలా అన్నారనుకోండి..

అప్పడాలు...వడియాలైపోతాయి... అదీ సంగతి...

థ్యాంక్యూ
మీ
శ్రీనివాస్ మిర్తిపాటి
సీనియర్ జర్నలిస్టు

Address

KAKINADA, EAST GODAVARI
Kakinada
533005

Website

Alerts

Be the first to know and let us send you an email when Mee Journalist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share