23/06/2026
కందుకూరు పట్టణాన్ని గంజాయి రహిత పట్టణముగా తీర్చిదిద్దుటకు పట్టణ ప్రజలు సహకరించాలి - సి.ఐ కందుకూరు
కందుకూరు పట్టణం జనార్ధన కాలనీ పుట్ట వద్ద స్థానిక ప్రజలు మరియు యువతతో కందుకూరు సి.ఐ షేక్ అన్వర్ భాషా గారు ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా సిఐ గారు మాట్లాడుతూ గంజాయి తాగటం వలన తాము శారీరకంగానూ మానసికంగానూ నష్టపోవడమే కాకుండా తమ కుటుంబం కూడా నష్టపోయే అవకాశం ఉందని, గంజాయి మత్తులో ఏమి చేస్తున్నామో అర్థం కాని పరిస్థితుల్లో నేరాలు చేసే ప్రమాదం ఉందని వాటిని నివారించే క్రమంలో కందుకూరు పట్టణాన్ని గంజాయి రహిత పట్టణముగా తీర్చిదిద్దుటకు పోలీసు శాఖ తరపున తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని అందుకు పట్టణ ప్రజలు కూడా సహకరించాలని, ఎవరైనా గంజాయి అమ్ముతున్నా, రవాణా చేస్తున్నా, త్రాగుతున్నా తమ దృష్టికి తీసుకురావాలని, సమాచారం చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.ఎవరైనా గంజాయి రవాణా చేసినా, అమ్మినా లేదా త్రాగినా వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కందుకూరు సి.ఐ 9121102202, కందుకూరు టౌన్ యస్.ఐ 9121102203, కందుకూరు రూరల్ యస్.ఐ 9121102204 లేదా 112 లేదా ఈగల్ టీమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1972 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో కందుకూరు పట్టణ ఎస్సై పులి శివ నాగరాజు గారు కందుకూర్ రూరల్ ఎస్సై బాలకృష్ణ గారు పాల్గొన్నారు.