08/09/2026
*వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకుందాం..!*
*గణేష్ మండపాలకు ఆన్లైన్ అనుమతులు తప్పనిసరి..*
*జలదంకి ఎస్సై గద్దె వీరేంద్రబాబు..*
*జలదంకి మండలంలోని 17 పంచాయతీల లోని ఆయా గ్రామాల ప్రజలు వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, సాంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని జలదంకి ఎస్సై గద్దె వీరేంద్రబాబు కోరారు..*
*వినాయక మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ganeshutsav.net పోర్టల్ ద్వారా ఆన్లైన్లో సింగిల్ విండో అనుమతులు పొందాలని సూచించారు. దరఖాస్తులో ఐదుగురు నిర్వాహకుల ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్లు నమోదు చేయాలని, మండపం వద్ద జరిగే సంఘటనలకు వారే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. డిజేలకు ఎలాంటి అనుమతి లేదని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సౌండ్ సిస్టమ్స్ పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు కాకుండా సరైన వైరింగ్ చేసుకోవాలని, రాత్రి వేళల్లో కనీసం ముగ్గురు వాలంటీర్లు నిద్రించాలని కోరారు. మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడటం నిషేధమని హెచ్చరించారు..*