16/09/2025
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిరాధార ఆరోపణలు చేశాడని బండి సంజయ్ పై 10 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్
సిటీ సివిల్ కోర్టులో 10 కోట్ల దావా పిటిషన్ వేసిన కేటీఆర్
2025 ఆగస్టు 11న లీగల్ నోటీసు పంపినప్పటికీ, బేషరతుగా క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన బండి సంజయ్.. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేటీఆర్
బండి సంజయ్ నుండి బేషరతుగా, బహిరంగ క్షమాపణ చెప్పాలని.. తదుపరి పరువు నష్టం కలిగించే కంటెంట్ను ప్రచురించకుండా లేదా ప్రసారం చేయకుండా నిందితులను నిరోధించే ఉత్తర్వులు ఇవ్వాలని విజ్జప్తి
ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు, మీడియా పోర్టల్ల నుండి పరువు నష్టం కలిగించే కథనాలు, వీడియోలు, పోస్టులను తక్షణమే తొలగించాలని డిమాండ్