slidenews.in

slidenews.in slidenews.in

సుజాతనగర్‌ : భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్థానిక మంచికంటి భవన...
07/03/2025

సుజాతనగర్‌ : భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్థానిక మంచికంటి భవన్‌లో సమావేశమయ్యి మాట్లాడుతూ సుజాతనగర్‌ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను మంజూరు చేయడం హర్షనీయం అన్నారు. సుజాతనగర్‌, చుట్టు ప్రక్కల ఉన్న గ్రామపంచాయితీలలో చదువుకునే విద్యార్థులు పదవ తరగతి ముగిసిన తరువాత ఇంటర్‌ చదవాలంటే మండలంలో ఇంటర్‌ కాలేజి లేక కొత్తగూడెం వరకు రావాల్సి ఉంటుంది. సుజాతనగర్‌ నుండి కొత్తగూడెం వరకు రావాలంటే సరైన బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. సుజాతనగర్‌ మండలంలో జూనియర్‌ కాలేజి ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ ఎన్నో దశలవారి పోరాటాలు నిర్వహించిందన్నారు....

సుజాతనగర్‌ : భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్థానిక మం...

రూ 53 వేల ఆర్థిక సహాయం కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలోని చిన్నారి పాసి కృతిక వైద్య చికిత్స కోసం ఫ్రెండ్...
07/03/2025

రూ 53 వేల ఆర్థిక సహాయం కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలోని చిన్నారి పాసి కృతిక వైద్య చికిత్స కోసం ఫ్రెండ్స్‌ ఫౌండేషన్‌ కొత్తగూడెం ఆధ్వర్యంలో రూ భారీగా అర్థిక సహాయాన్ని అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన పాసి కళ్యాణ్‌, సబీయానాజ్‌ దంపతుల నాలుగు ఏళ్ళ కూతురు పాసి కృతిక. ప్రమాదవశాత్తు చిన్నారి ఒంటిపై వేడినీళ్లు పడటంతో త్రీవంగా గాయపడిరది. చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా వైద్యులు పాప శరీరం 30శాతం కాలిపోయిందని తెలిపారు. పేద కుటుంబం కావడంతో వైద్యం చేయించేందుకు అర్థిక స్తోమత లేకపోడంతో దాతల కోసం ఎదురు చూస్తున్నారు....

రూ 53 వేల ఆర్థిక సహాయం కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలోని చిన్నారి పాసి కృతిక వైద్య చికిత్స కోసం...

సుజాతనగర్‌ : భద్రాద్రి జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యులు రఘు వీరారెడ్డి టీపీసీసీ సభ్యులు నాగా సీతా...
07/03/2025

సుజాతనగర్‌ : భద్రాద్రి జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యులు రఘు వీరారెడ్డి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. ముందుగా భద్రాచలం రామయ్య ను దర్శించుకుని పూజలు చేసిన రఘు వీరారెడ్డి సుజాతనగర్‌ లోని నాగా సీతారాములు ఇంట్లో అతిద్యం స్వీకరించి భోజనం చేశారు. ఇంటికి వచ్చిన రఘు వీరారెడ్డికు నాగా సీతారాములు కుటుంబ సమేతంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీతారాములు కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న రఘు వీరారెడ్డి పార్టీ అభ్యున్నతి కోసం, కార్యకర్తల కోసం కష్టపడే వారికి పార్టీలో సుస్థిర స్థానం ఉంటుందన్నారు. ఆయన వచ్చిన విషయం తెలుసుకుని సీతారాములు ఇంటికి చేరుకున్న కార్యకర్తలతో కాసేపు ముచ్చటించారు.

సుజాతనగర్‌ : భద్రాద్రి జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యులు రఘు వీరారెడ్డి టీపీసీసీ సభ్యులు...

బిసి బాయస్‌ హాస్టల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్‌ భద్రాచలం : హాస్టల్‌ విద్యార్థులకు మెరుగైన మౌళికవసతులు కల్పించాలని జిల్లా కల...
06/03/2025

బిసి బాయస్‌ హాస్టల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్‌ భద్రాచలం : హాస్టల్‌ విద్యార్థులకు మెరుగైన మౌళికవసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులను ఆదేశించారు. బీసీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వసతి గృహంలోని గదులు, మరుగుదొడ్లు, బట్టలు ఎండబెట్టుకునే స్థలాన్ని, వంటగదిని, పరిశీలించారు. రోజువారీగా భోజనాన్ని ఎవరెవరు రుచి చూస్తున్నారని అడిగారు.వసతి గృహంలో గదుల డోర్లు, కిటికీలు, మరుగుదొడ్ల డోర్లు, ప్రధాన గేటు సరిగా లేకపోవటాన్ని గమనించిన కలెక్టర్‌ తక్షణమే మరమ్మత్తులు చేయించాలని అధికారులను ఆదేశించారు....

బిసి బాయస్‌ హాస్టల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్‌ భద్రాచలం : హాస్టల్‌ విద్యార్థులకు మెరుగైన మౌళికవసతులు కల్పించాల.....

రూ 26వేలు చెల్లించాలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజె రమేష్‌ డిమాండ్‌ కొత్తగూడెం : వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస...
06/03/2025

రూ 26వేలు చెల్లించాలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజె రమేష్‌ డిమాండ్‌ కొత్తగూడెం : వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం రూ 26 వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజె రమేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో రమేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న వారికి కనీస వేతనం అమలు చేయాలని అన్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులు, అద్దె బస్సు కార్మికులు, పెట్రోల్‌ బంకు కార్మికులు ,షాపింగ్‌ మాల్స్‌ ,ప్యాకింగ్‌ వర్కర్స్‌, నర్సరీ కార్మికులు, ప్రైవేటు నర్సింగ్‌ హోమ్‌ , బిల్డింగ్‌ వర్కర్స్‌, గుమాస్తాలు, ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు, ట్రాన్స్పోర్ట్‌ కార్మికులు, వివిధ పని ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతన జీవోను అమలు చేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు....

రూ 26వేలు చెల్లించాలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజె రమేష్‌ డిమాండ్‌ కొత్తగూడెం : వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్ల...

నిలాళి అర్పిద్ధాం దేశభక్తిని చాటుదాం కొత్తగూడెం : ఛత్రపతి సంభాజీ మహారాజ్‌ 336వ వర్థంతి సందర్భంగా వీర శివాజీ మహారాజ్‌ సేన...
06/03/2025

నిలాళి అర్పిద్ధాం దేశభక్తిని చాటుదాం కొత్తగూడెం : ఛత్రపతి సంభాజీ మహారాజ్‌ 336వ వర్థంతి సందర్భంగా వీర శివాజీ మహారాజ్‌ సేన కొత్తగూడెం ఆధ్వర్యంలో ఈనెల 11న కొత్తగూడెం పట్టణంలోని రైల్వే స్టేషన్‌ సమీపంలో వర్థింతి వేడుకలను నిర్వహిస్తున్నామని అధ్యక్షుడు జోగు ప్రదీప్‌ తెలిపారు. వివేకానంద యువజన సేవాభారతి కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రదీప్‌ మాట్లాడుతూ ధర్మ రక్షణకు తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన గొప్ప యోధుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్‌ అని గుర్తు చేశారు.రాజ్య కాంక్షతో తండ్రిని నిర్భందించి, సోదరుల తలలు తెగనరి ఢల్లీి సింహాసనం అధిష్టించిన ఔరంగాజేబ్‌ హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన కృారుడని అన్నారు....

నిలాళి అర్పిద్ధాం దేశభక్తిని చాటుదాం కొత్తగూడెం : ఛత్రపతి సంభాజీ మహారాజ్‌ 336వ వర్థంతి సందర్భంగా వీర శివాజీ మహార...

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంస ఢల్లీ : రాష్ట్రపతి భవన్‌లోని అమృత్‌ ఉద్యాన్‌లో ఏర్పాటు చేసిన వివిధతా కా అమృత్‌ ఉత్సవ్‌ ...
05/03/2025

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంస ఢల్లీ : రాష్ట్రపతి భవన్‌లోని అమృత్‌ ఉద్యాన్‌లో ఏర్పాటు చేసిన వివిధతా కా అమృత్‌ ఉత్సవ్‌ ప్రారంభం కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, డెఫ్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ముందు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాల్‌లో చేనేత కళాకారుల పనితనాన్ని, చేతివృత్తుల ప్రాముఖ్యతను రాష్ట్రపతి వీక్షించారు. అగ్గి పెట్టెలో పట్టేలా చేతితో చీర నేసిన సిరిసిల్ల నేతకారుల పనితీరును రాష్ట్రపతి ప్రముఖంగా నేసే విధానాన్ని అడిగి తెలుసుకుని ప్రశంసించారు....

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంస ఢల్లీ : రాష్ట్రపతి భవన్‌లోని అమృత్‌ ఉద్యాన్‌లో ఏర్పాటు చేసిన వివిధతా కా అమృత్...

టిపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు హరిలాల్‌ నాయక్‌ టేకులపల్లి : ఉపాద్యాయుడిగా అనేక పేద విద్యార్థులకు ఉత్తమ విద్యాబుద్దులు నేర్...
05/03/2025

టిపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు హరిలాల్‌ నాయక్‌ టేకులపల్లి : ఉపాద్యాయుడిగా అనేక పేద విద్యార్థులకు ఉత్తమ విద్యాబుద్దులు నేర్పిన పొదెం వెంకటేశ్వర్లు సేవలు మరువలేనివి అని తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టిపిటిఎఫ్‌) జిల్లా అధ్యక్షులు గుగులోత్‌ హరిలాల్‌ నాయక్‌ అన్నారు. టేకులపల్లి మండలం బోడు గ్రామంలోని పోదెం వెంకటేశ్వర్లు స్వగృహంలో సంఘం ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ పోదెం వెంకటేశ్వర్లు అకాల మరణం కుటుంబానికి, మండల విద్యాశాఖకు, టిపిటిఎఫ్‌కు తీరని లోటు అన్నారు. టేకులపల్లి మండలంలోని కుంటల్ల, అందుగులగూడెం, మంగలి తండా, ఎర్రాయిగూడెం పాఠశాలలలో సుమారు 30 ఏళ్ళకు పైగా అనేకమంది విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్యనందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు....

టిపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు హరిలాల్‌ నాయక్‌ టేకులపల్లి : ఉపాద్యాయుడిగా అనేక పేద విద్యార్థులకు ఉత్తమ విద్యాబ.....

సెక్యూరిటీ గార్డ్‌కు మెరుగైన వైద్యం అందించాలి సిఐటియు డిమాండ్‌ సింగరేణి : సింగరేణి మణుగూరు ఏరియాలో డ్యూటీకి సంబంధం లేని ...
28/02/2025

సెక్యూరిటీ గార్డ్‌కు మెరుగైన వైద్యం అందించాలి సిఐటియు డిమాండ్‌ సింగరేణి : సింగరేణి మణుగూరు ఏరియాలో డ్యూటీకి సంబంధం లేని ఇతర సివిల్‌ పనులు చేపించడం వల్ల అస్వస్థతకు గురై కొత్తగూడెం సింగరేణి మెయిన్‌ హాస్పిటల్‌ చికిత్స పొందుతున్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్‌ పి వీరబాబు శుక్రవారం సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు నాయకులు నాయకులు పరామర్శించారు. సంఘటనకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు సూరం ఐలయ్య, భూక్య రమేష్‌ ,గుగులోత్‌ సక్రం లు మాట్లాడుతూ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉండి ప్రస్తుతం పిట్‌ ఉండి మణుగూరు ఏరియాలో ప్రవేట్‌ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న పి వీరబాబును మరి కొంతమంది సెక్యూరిటీ గాడ్స్‌ పై మణుగూరు ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్‌ కే శ్రీనివాసరావు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని, గురువారం మణుగూరు ఓసి 2 దగ్గర అటవీ ప్రాంతంలో సింగరేణి సివిల్‌ డిపార్ట్మెంట్‌ వారు చేయవలసిన పనులను ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్‌లతో చేపించారని దీని ఫలితంగా పి వీరబాబుకి గతంలో సర్జరీ అయిన ప్రదేశంలో ఒత్తిడి పెరిగి తీవ్ర అస్వస్థకు గురి కావడంతో మణుగూరు ఏరియా హాస్పిటల్‌ నుండి కొత్తగూడెం మెయిన్‌ హాస్పిటల్‌కు రిఫర్‌ చేసి వైద్యం చేస్తున్నట్లుగా సీఐటీయూ తెలిపారు....

సెక్యూరిటీ గార్డ్‌కు మెరుగైన వైద్యం అందించాలి సిఐటియు డిమాండ్‌ సింగరేణి : సింగరేణి మణుగూరు ఏరియాలో డ్యూటీకి స....

బదిలీ వర్కర్‌, జనరల్‌ మజ్దూర్‌లకు గుడ్‌ న్యూస్‌ డిజిగ్నేషన్‌ మార్పుకు ఆదేశాలు సింగరేణి : బదిలీ వర్కర్‌ జనరల్‌ మజ్దూర్‌ డ...
28/02/2025

బదిలీ వర్కర్‌, జనరల్‌ మజ్దూర్‌లకు గుడ్‌ న్యూస్‌ డిజిగ్నేషన్‌ మార్పుకు ఆదేశాలు సింగరేణి : బదిలీ వర్కర్‌ జనరల్‌ మజ్దూర్‌ డెసిగ్నేషన్‌ వెంటనే రద్దు చేస్తూ పరిశ్రమలలో గౌరవప్రదమైన తోటి కార్మికులతో సమానత్వంగా ఉండేలా జనరల్‌ అసిస్టెంట్‌గా మార్చుతూ తీసుకున్న నిర్ణయం పట్ల సింగరేణి కోల్‌ మైన్స్‌ కార్మిక సంఫ్‌ు బిఎంఎస్‌ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గని కార్మికులతో కలిసి మాట్లాడుతు సింగరేణి పరిశ్రమలో బదిలీ వర్కర్‌ జనరల్‌ మజ్దూర్‌ అనే డిజిగ్నేషన్‌ సింగరేణి పరిశ్రమ చరిత్రలో ఏళ్ల తరబడి సామాజిక అసమానతలకు గురవుతు సామాజికంగా సమాజంలో సింగరేణి కార్మికులను యాజమాన్య ప్రతినిధులు ఏళ్ళ తరబడి సమాజంలో ఇబ్బంది పెడుతూ కార్మిక బస్తీలలో కూడా తోటి కార్మికులతో అనేక అవస్థలు పడుతూ పిల్లలు చదువుకునే కార్పొరేట్‌ కాలేజీలలో సోషల్‌ స్టేటస్‌ పేరుతో తోటి కార్మికుని పిల్లలను అవమానపరుస్తు జరుగుతున్న అసమానతలను సింగరేణి పర్యటనలో కొత్త కాపు లక్ష్మారెడ్డి గుర్తించారు....

బదిలీ వర్కర్‌, జనరల్‌ మజ్దూర్‌లకు గుడ్‌ న్యూస్‌ డిజిగ్నేషన్‌ మార్పుకు ఆదేశాలు సింగరేణి : బదిలీ వర్కర్‌ జనరల్‌ .....

రూ 20 వేలు లంచం డిమాండ్‌ కొత్తగూడెం : కొత్తగూడెం కూలిలైన్‌ హై స్కూల్‌ హెడ్‌ మాస్టర్‌ టి రవీందర్‌ లంచం తీసుకుంటూ ఎసిబికి...
28/02/2025

రూ 20 వేలు లంచం డిమాండ్‌ కొత్తగూడెం : కొత్తగూడెం కూలిలైన్‌ హై స్కూల్‌ హెడ్‌ మాస్టర్‌ టి రవీందర్‌ లంచం తీసుకుంటూ ఎసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. పాఠశాల విద్యార్థులను శారిరక, మానసిక, ధృడత్వానికి, ఆత్మరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్లలో కరాటే శిక్షణ తరగతులు నిర్వహించేందుకు శిక్షకుడికి రూ 30 వేలు కేటాయించింది. ఈ మొత్తం పాఠశాల ప్రథానోపాధ్యాయుడి ఖాతాలో జమ చేస్తుంది కేద్రం. అయితే ప్రభుత్వం ఇచ్చిన రూ 30వేలను కూలిలైన్‌ ఉన్నత పాఠశాల హెడ్‌ మాస్టర్‌ కరాటే శిక్షకుడి ఖాతాలోకి జమచేసి అందులో నుండి తనకు రూ 20 వేలు తిరిగి తనకు ఇచ్చేయాలని లేని పక్షంలో మరలా నిర్వహించే శిక్షణ తరగతులకు ఇన్‌స్ట్రక్టర్‌గా ఎంపిక చేయను అంటూ వేదింపులకు పాల్పడినట్లు తెలిపారు....

రూ 20 వేలు లంచం డిమాండ్‌ కొత్తగూడెం : కొత్తగూడెం కూలిలైన్‌ హై స్కూల్‌ హెడ్‌ మాస్టర్‌ టి రవీందర్‌ లంచం తీసుకుంటూ ....

Address

Kothagudem

Alerts

Be the first to know and let us send you an email when slidenews.in posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to slidenews.in:

Share