Pawandheer TV

Pawandheer TV PAWANDHEER TV
Educate. Empower. Evolve. A Digital Media Channel.

*విద్యార్థులకు పండగే పండుగ.. దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం*తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా అతి పెద్ద పండగ. ఈ పండుగ ఎప్...
16/09/2025

*విద్యార్థులకు పండగే పండుగ.. దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం*

తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా అతి పెద్ద పండగ. ఈ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా? ఎప్పుడెప్పుడు సెలవులు ఇస్తారా అని స్కూల్ విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. వారే కాదు ఉద్యోగులు సైతం చాలా వెయిట్ చేస్తుంటారు.

ఈ క్రమంలో వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాఠశాలలకు దసరా సెలవులపై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వచ్చే నెల అక్టోబర్ 2 వరకు దసరా సెలవులను ప్రకటించింది. మొత్తం 9 రోజుల పాటు స్కూల్ విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చారు.

ఇటు తెలంగాణలోనూ ఈ నెల 21 నుంచి అక్టోబరు 3 వరకు దసరా సెలవులు ప్రకటించారు. అధికారికంగా మొత్తం 13 రోజులపాటు పండగ సెలవులిచ్చారు. వచ్చే నెల 4న స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి. పెద్ద మొత్తంలో సెలవులు ఉండటంతో హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులు తమ సొంతూళ్లకు వెళ్లి హ్యాపీగా పండుగను ఎంజాయ్ చేస్తారు....

📍ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు..నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రకటనరూ.2 వేల కోట్ల ...
15/09/2025

📍ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌

ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు..

నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రకటన

రూ.2 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్

వారంలోగా సమస్య పరిష్కరించాలని ఆశా ప్రతినిధుల లేఖ

జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బదిలీ.. ఏపీ ఫైబర్ నెట్ ఎండిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
15/09/2025

జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బదిలీ.. ఏపీ ఫైబర్ నెట్ ఎండిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

కృష్ణాజిల్లా మచిలీపట్నం టోక్యో జపాన్ లో కరాటి లో ప్రతిభ కనబరిచిన భారతీయుడు అడ్వకేట్ అరవింద్ WAKF(వరల్డ్ ఆల్ కరాటే ఫెడరేష...
15/09/2025

కృష్ణాజిల్లా మచిలీపట్నం

టోక్యో జపాన్ లో కరాటి లో ప్రతిభ కనబరిచిన భారతీయుడు
అడ్వకేట్ అరవింద్ WAKF(వరల్డ్ ఆల్ కరాటే ఫెడరేషన్) అద్వర్యం లో ఈ నెల 14 వ తారీఖున జపాన్ దేశ రాజధాని తొక్యో నగరం లో జరిగిన అంతర్జాతీయ కరాటే టోర్నమెంట్ లో న్యాయవాది అరవింద్ కుమార్ రజిత పథకం సాధించారు, అత్యంత ప్రతిష్టత్మకమైన ఈ టోర్నమెంట్ లో ప్రపంచవ్యాప్తం గా USA, UK, Srilanka, Japan మరియు India కి చెందిన మొత్తం 80 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది.

కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్ నాయుడు
15/09/2025

కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్ నాయుడు

13/09/2025
కృష్ణాజిల్లా ఎస్పీగా విద్యాసాగర్ రాష్ట్రవ్యాప్తంగా ఎస్పీల బదిలీలో భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు స్థానంలో నూతన ఎస...
13/09/2025

కృష్ణాజిల్లా ఎస్పీగా విద్యాసాగర్

రాష్ట్రవ్యాప్తంగా ఎస్పీల బదిలీలో భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు స్థానంలో నూతన ఎస్పీగా అన్నమయ్య జిల్లా నుండి వాసన విద్యాసాగర్ ను నియమించారు.

ఎస్పీ విద్యాసాగర్ భీమవరంలో జన్మించారు.

ఆయన హైదరాబాదులో విద్యాభ్యాసం పూర్తి చేశారు.

తండ్రి రైల్వే ఇన్స్పెక్టర్ కాగా తల్లి గృహిణి విద్యాసాగర్ సివిల్స్ లో 101 ర్యాంకు సాధించారు.

తల్లి కోరిక మేరకు కోచింగ్ లేకుండానే 24 సంవత్సరాలకే ఐపీఎస్ సాధించారు

ఆయన కృష్ణా జిల్లా ఎస్పీగా త్వరలో బాధ్యతలు చేపట్టనుండడంతో ప్రజా సమస్యల పరిష్కారం అవుతాయని ఆశ భావంతో కృష్ణా జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.

*ఈరోజు అన్ని తొమ్మిది అంకెలే.. లక్కీ డే!* ఏ పని అయినా తొమ్మిదితో మొదలు పెడితే మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. జ్యో...
12/09/2025

*ఈరోజు అన్ని తొమ్మిది అంకెలే.. లక్కీ డే!*

ఏ పని అయినా తొమ్మిదితో మొదలు పెడితే మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం 9 అనేది ఎంతో శక్తివంతమైందని అంటారు. అయితే నేడు తొమ్మిదో తేదీ.. తొమ్మిదో నెల..(2025)సంవత్సరం కలిపితే తొమ్మిది. ఇక 9+9+9 మొత్తం 27... ఈ 27 సంఖ్యను కలిపినా మళ్లీ 9 వస్తుంది. మొత్తం తొమ్మిది అంకెతో ముడిపడిన రోజు అంటూ సోషల్ మీడియాలో పెద్దయెత్తున వైరల్గా మారింది.

మచిలీపట్నం రూరల్ సబ్ డివిజన్ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో దాడులు సుమారు Rs 10,57,500 లక్షల రూపాయల జరిమానా. విజిలెన్స్ EE శ్రీ...
10/09/2025

మచిలీపట్నం రూరల్ సబ్ డివిజన్ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో దాడులు సుమారు Rs 10,57,500 లక్షల రూపాయల జరిమానా.
విజిలెన్స్ EE శ్రీ Ch వాసు గారు మరియు EE/ ఆపరేషన్/ మచిలీపట్నం శ్రీ G. గోవిందరావు గారి ఆధ్వర్యంలో అధికారులు 34 బృందములుగా ఏర్పడి 2794 గృహ సర్వీసులు 131 వాణిజ్య సర్వీసులు మరియు 228 ఆక్వా సర్వీసులు తనిఖీ చేశారు వాటిలో 310 సర్వీసులకు 440 KW కి Rs 10,67,000 లక్షల రూపాయలు అపరాధ రుసుము విధించడం జరిగినది విద్యుత్ చౌర్యం జరిగినట్లయితే ఈ క్రింది నెంబర్లకు 94408 12091 మరియు 9440812362 మరియు 9440812363 నెంబర్లకు సమాచారం ఇవ్వవలసినదిగా కోరుచున్నాను ఈ విద్యుత్ విజిలెన్స్ తనిఖీలలో మచిలీపట్నం డివిజన్ ఏఈలు మరియు సిబ్బంది అలాగే రూరల్ సబ్ డివిజన్ ADE శ్రీ K. రామ కృష్ణ మరియు రూరల్ AE శ్రీ P.ఏడుకొండలు గారు పాల్గొన్నారు

05/09/2025

మరో విప్లవాత్మక, సంచలన పధకంతో ముందుకొచ్చిన కూటమి ప్రభుత్వం.. మ్యానిఫెస్టోలో చెప్పిన మరో హామీ అమలు..

రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స అందించేలా యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.

* ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్సలు అందేలా ఈ కొత్త విధానం పని చేస్తుంది.
* 2,493 నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు అందుతాయి
* 3,257 చికిత్సలను ఉచితంగా అందిస్తారు
* ఆదాయంతో పని లేకుండా రాష్ట్రంలో ఉన్న పౌరులు అందరూ దీనికి అర్హులే..

Address

Machilipatnam
521002

Website

Alerts

Be the first to know and let us send you an email when Pawandheer TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share