Prasadu Darapaneni

Prasadu Darapaneni TDP Volunteers forum to promote and establish Telugu Desam Party.

*సంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుంది**నాడు పెట్టుబడులు అడిగాను... నేడు పేదలకు సాయం చేయాలని కోరుతున్నాను**నాటి జన్మభూ...
08/08/2025

*సంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుంది*

*నాడు పెట్టుబడులు అడిగాను... నేడు పేదలకు సాయం చేయాలని కోరుతున్నాను*

*నాటి జన్మభూమి సమాజం కోసం... నేటి పీ4 పేదరిక నిర్మూలన కోసం*

*పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు*

*పేదల కుటుంబాలను దత్తత తీసుకునేందుకు సమావేశంలో ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు*

*అమరావతి, ఆగస్టు 7:* సంపాదనతో కలగని సంతృప్తి సాయం చేస్తే కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టాల్సిందిగా గతంలో కోరేవాడినని.. ఇప్పుడు పెట్టుబడులు పెట్టడంతో పాటు.. పేదలకు సాయం చేయాలని కూడా అడుగుతున్నానని చెప్పారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో గురువారం పీ4 జరిగిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శులుగా ఉండాలని చంద్రబాబు పారిశ్రామిక వేత్తలను కోరారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..”పీ4 కార్యక్రమం గురించి తలుచుకున్న ప్రతిసారి కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రజల భాగస్వామ్యంతోనే ఏ కార్యక్రమాన్నైనా విజయవంతం చేయగలం. నాది సుదీర్ఘ రాజకీయ జీవితం. జాతీయ స్థాయి రాజకీయాలపై ప్రభావం చూపించాం. ఉమ్మడి రాష్ట్రంలో, విభజన ఆంధ్రప్రదేశ్ లో, జాతీయ స్థాయి రాజకీయాల్లో చాలా క్రియాశీలంగా పని చేశాం. ఎన్నో సంస్కరణలు తెచ్చాను. కానీ ఎప్పుడూ కలగని తృప్తి.. పీ4 కార్యక్రమం ద్వారా కలుగుతోంది. సంస్కరణల వల్ల సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు వందల కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడితే చాలు అవి అతి పెద్ద ప్రాజెక్టులుగా ఉండేవి.. కానీ ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు వస్తున్నాయి. ఆర్థిక సంస్కరణల వల్లే ఇది సాధ్యమైంది. 1995లో టెక్నాలజీలో వచ్చిన సంస్కరణల ద్వారా ఫలాలను అందిపుచ్చుకున్నాం. ఆర్థిక సంస్కరణలను కొందరు అందిపుచ్చుకున్నారు. కొందరు వెనుకబడ్డారు. సంస్కరణలను అందిపుచ్చుకున్న వారు ఉన్నత స్థానానికి చేరారు. అంబేద్కర్, ఎన్టీఆర్, అబ్దుల్ కలాం, మోదీ వంటి వారు సామాన్య కుటుంబాల్లోనే పుట్టారు. నాతో సహా ఈ సమావేశంలో ఉన్న చాలా మంది సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచే వచ్చారు. నాడు సమాజం నుంచి ఎంతో సహకారాన్ని అందుకున్నాం.. ఉన్నతస్థితికి చేరాం. ఇప్పుడు అసమానతలు లేని సమాజం కోసం భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఉన్నత స్థానంలో ఉన్నవారు చేసేది చిన్న సాయమే కావచ్చు.. పేదరికంలో ఉన్నవారికి ఆ సాయమే అతి పెద్ద ఆలంబనగా ఉంటుంది.” అని చంద్రబాబు చెప్పారు.

*ప్రభుత్వానిది సంక్షేమం.. పారిశ్రామిక వేత్తలది సాయం..*

“మాటలు చెప్పడం కాదు.. చేతల్లో చేసి చూపించాలనే ఉద్దేశంతో నేను కూడా 250 కుటుంబాలను దత్తత తీసుకున్నాను. మార్గదర్శిగా నిలిచాను. బంగారు కుటుంబాలను అభివృద్ధి చేసేందుకు నా సహచర మార్గదర్శకులతో పోటీ పడతా. ఇప్పటి వరకు 10,81,281 మంది కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారు. అనేక సంస్కరణలు వచ్చినా.. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా.. ఇంకా పేదరికం ఉంటూనే ఉంది. పేదరిక నిర్మూలన చేపట్టాలనే ఆలోచన నుంచే పీ4 పుట్టింది. ఎంత సంపాదించినా ఇక్కడే వదిలి పెట్టి వెళ్లాలి.. అందుకే గివ్ బ్యాక్ పాలసీని అమలు చేయగలిగితే...సమాజానికి మరింత మంచి చేసిన వాళ్లు అవుతారు. పేదరికంలో ఉన్నవాళ్లకి చేయూతనివ్వాలి.. వాళ్లకు కెరీర్ గైడెన్స్ ఇవ్వాలి. సరైన సమయంలో గైడ్ చేయగలిగితే.. పేదరికంలో ఉన్న వాళ్లు కూడా మంచి స్థాయికి వెళ్లడానికి అవకాశం కల్పించినవారవుతారు. ప్రాధాన్యత క్రమంలో బంగారు కుటుంబాలకున్న అవసరాలపై సర్వే చేయించాం. ప్రభుత్వం వైపు నుంచి చాలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. పించన్ ఇస్తున్నాం, తల్లికి వందనం ఇచ్చాం, దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఆర్థిక సాయం చేస్తున్నాం. అలాగే ఆగస్టు 15వ తేదీ నుంచి స్త్రీ శక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందివ్వనున్నాం. ప్రభుత్వ పరంగా మేం చేయాల్సిదంతా చేస్తున్నాం.. ఉన్నత స్థితిలో ఉన్నవారు కూడా బాధ్యత తీసుకుంటే దత్తత కుటుంబాల్లో స్కిల్స్ పెంపొందించడం ద్వారా వారి ఆదాయాన్ని రెట్టింపు చేయవచ్చు. బంగారు కుటుంబాలను కూడా మీ కుటుంబాలుగా భావించి సాయం చేయండి.” అని చంద్రబాబు కోరారు.

*పీ4లో కో-స్పాన్సర్ విధానాన్ని తెస్తున్నాం...*

“సమాజంలో మనతో ఉన్నవాళ్లు.. పేదరికంతో ఇబ్బందులు పడుతూ ఉండడం మంచిది కాదు. అవనిగడ్డలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు కూడా మార్గదర్శిగా ఉండేందుకు ముందుకు వచ్చి.. ఓ పేద వృద్ధురాలిని ఆదుకునేందుకు సిద్దమైంది. నేను ఎవర్ని బలవంతం పెట్టడం లేదు. బాధ్యతగా చూడాలనే చెబుతున్నాను. సాయం చేయడంలో రకరకాలు ఉంటాయి.. ఇటీవల కాలంలో కొందరు టీచర్లు ముందుకు వచ్చారు. చదువు చెప్పడం ద్వారా పేదల ఎదుగుదలకు తోడ్పడతామని చెబుతున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని కో-స్పాన్సర్స్ విధానాన్ని తెస్తున్నాం. ఆర్థిక సాయం చేసే వారు చేస్తారు.. అలాగే విజ్ఞానాన్ని అందించే వారు కూడా ఆ దిశగా కృషి చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు విజన్ 2020 రూపకల్పన చేశాను. నన్ను విమర్శించారు. కానీ ఇప్పుడు ఆ విజన్ నిజమైంది. లక్ష్యంతో పని చేస్తే ఏదైనా సాధ్యం. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా తెలుగువారిని ప్రపంచంలో అగ్రభాగాన నిలబెట్టే ఆలోచనలు చేస్తున్నాం. దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు తీసుకెళ్తున్నారు. త్వరలోనే భారత్ ప్రపచంలో మూడో పెద్ద ఎకానమీగా ఎదగబోతోంది. భవిష్యత్తులో భారత దేశం ఎకానమీలో నెంబర్-1 స్థానంలో ఉంటుంది. అభివృద్ధి ఫలాలు అందరికి అందాలనే ఉద్దేశంతో సంస్కరణలు అమలు చేస్తున్నాం.” అని చంద్రబాబు వివరించారు.

*పెద్ద ఎత్తున స్పందించిన పారిశ్రామిక వేత్తలు...*

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పారిశ్రామికవేత్తలు.. అలాగే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చంద్రబాబు పిలుపుతో పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి ముందుకు వచ్చారు. అలాగే ఆన్ లైన్ సమావేశంలో పాల్గొన్న ఇంకొందరు ఎన్నారైలు కూడా మార్గదర్శకరులుగా ఉంటామని సీఎంకు హామీనిచ్చారు. ప్రకాశం జిల్లాకు చెందిన మోహన్ రెడ్డి అనే పారిశ్రామిక వేత్త ఓ మండలంలో 729 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు వచ్చారు. సౌదీ నుంచి వచ్చిన రాధాకృష్ణ, మహ్మాద్ అరిఫ్, సుచరిత వంటి వారు 10 కుటుంబాలను దత్తత తీసుకుంటామని చెప్పారు. అలాగే వరప్రసాద్ అనే పారిశ్రామిక వేత్త కూడా తనతో పాటు.. ఇంకొందరు గ్రూపుగా ఏర్పడి.. బొమ్మనహాళ్ మండలాన్ని దత్తత తీసుకున్నామని.. దీనికి సంబంధించిన ఓ రిపోర్ట్ తయారు చేసి ఇస్తామని చెప్పారు. కూరపాటి అనే ఎన్నారై 160 స్కూళ్లను దత్తత తీసుకుంటామని.. గొర్రెపాటి చందు అనే వ్యక్తి 10 కుటుంబాలు తీసుకోవడంతో పాటు.. తమ మిత్రులతో కలిసి.. మరో 100 కుటుంబాలను దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంగళూరి భాను అనే ఎన్నారై 20 కుటుంబాల్లోని పిల్లలకు చదవు చెప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. యూఎస్ కు చెందిన విశ్వప్రసాద్10 కుటుంబాలు.. సింగపూర్ కు చెందిన రాంబాబు అనే వ్యక్తి 2 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు సంసిద్దత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్ విజయానంద్, పీ4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ కుటుంబరావు, ఎన్నార్టీ ఛైర్మన్ వేమూరి రవి, ప్రణాళిక శాఖకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు.

సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేటినెట్ భేటీ.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ర...
06/08/2025

సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేటినెట్ భేటీ.

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 27 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు శ్రీ కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు…*

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో మరో హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసి ప్రభుత్వం తన విశ్వసనీయతను చాటుకుంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఎన్.టి.ఆర్. భరోసా క్రింద రూ.34 వేల కోట్లు, తల్లికి వందనం క్రింద రూ.10,091 కోట్ల మేర ఆర్థిక సహాయాన్ని అందజేయడమే కాకుండా రైతుభరోసా, దీపం-2, అన్న క్యాంటీన్లను అమలు చేసుకుంటూ వచ్చాం. అదే విధంగా ఈ నెల 15 వ తేదీ నుండి మహిళలకు "ఉచిత బస్ ప్రయాణం" పథకాన్ని అమలు చేయడం జరుగుచున్నది. ఇదే తరహాలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నింటినీ తప్పక అమలు చేస్తుంది.

*1. రవాణా, రోడ్లు & భవనాల శాఖ:*
మహిళలకు "ఉచిత బస్ ప్రయాణం" పథకాన్ని AP SRTC బస్సులలో 15వ ఆగస్టు 2025 నుండి అమలు చేయడానికి రవాణా, రోడ్లు & భవనాల శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
కూటమి ప్రభుత్వం "సూపర్ సిక్స్" హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన “స్త్రీ శక్తి” - ఉచిత బస్సు ప్రయాణం హామీని ఈ నెల 15 న తేదీ నుండి రాష్ట్రంలో అమలుకు శ్రీకారం చుట్టనుంది. ఈ పధకాన్ని రాష్ట్రంలో సమర్థ వంతంగా అమలు పర్చేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగరిదన్నారు. రాష్ట్రంలో 5.25కోట్ల జనాభా ఉండగా అందులో 2.62 కోట్ల మంది మహిళలు ఉన్నారు.ఈ పథకం క్రింద రాష్ట్రానికి చెందిన మహిళలు, బాలికలు ట్రాన్స్‌జెండర్లు ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకశాన్ని కల్పించడం జరిగిందన్నారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రయాణించేందుకు అవకాశం కల్పించడం జరిగింది. ఈ సౌకర్యం వినియోగించకునేందుకు వీరు ఆధార్, ఓటర్, రేషన్ కార్డులను ఐ.డి. ప్రూఫులుగా చూపించాల్సి ఉంటుంది.
ఈ పధకం నాన్ స్టాప్ అంతర్ రాష్ట్రీయ బస్ సర్వీస్లు లేదా ఎ ఇతర కేటగిరీలకు వర్తించదు. అలాగే కాంట్రాక్టు క్యారేజ్ సర్వీస్లు, చార్టెడ్ సర్వీస్లకు మరియు ప్యాకేజ్ టూర్లకు వర్తించదు.
రాష్ట్రంలో ఉన్న బస్సుల్లో 74 శాతం బస్సులు అంటే 6,700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు అవకాశం కల్పించడం జరగనుంది. ఈ పధకం అములుకు నెలకు 162 కోట్లు అనగా ఏడాదికి దాదాపు రూ.1,942 కోట్ల వ్యయంతో రాష్రంలోని రోజుకు దాదాపు 26.95 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. ఈ ఏడాది అదనంగా 3 వేల విద్యుత్ బస్సుల కొనుగోలుకు చర్యలు చేపట్టడం జరిగింది, వచ్చే రెండెళ్లలో మరో 1,400 ఎలక్ట్రిక్ బస్సులో కొనుగోలు చేయడం జరుగనుంది. డిమాండుకు తగ్గట్టుగా డ్రైవర్లు, మెకానిక్ ల నియామకాలను కూడా చేపడతామన్నారు.
ఈ పధకం అమలులో మహిళా కండక్టర్లకు బాడీ కెమేరాలు మరియు బస్సులలో సీసీ కెమెరాలు అమర్చడం ద్వారా మహిళల, బాలికల భద్రతకు ఈ ప్రభుత్వం పెద్ద పీట వేయనుంది. అలాగే బస్ స్టేషన్లలో మౌలిక వసతులైన ఫ్యాన్లు, మంచి నీటి సౌకర్యం కూడా కల్పించనున్నారు.

ఈ పధకం అమలు ద్వారా ఇప్పటికే రవాణా సర్వీస్లను వినియోగించుకుంటున్న 16.11లక్షలకు అదనంగా 10.84 లక్షల మంది వినియోగించుకునే అవకాశం ఉన్నట్టు అంచనా. తద్వారా సంవత్సరానికి 142 లక్షల మంది మహిళలు ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోనున్నారు.

*2. సమాచార, సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ:*
AP లాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ (LIFT) పాలసీ (4.0) 2024-2029కు ఆమోదానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ కోల్పోవడంతో కొత్త ఆర్థిక కేంద్రాల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్‌లోని మౌలిక సదుపాయాలు, ప్రతిభను సద్వినియోగం చేసుకునేందుకు ఈ విధానం రూపొందించబడింది. బెంగళూరు, హైదరాబాద్, గుర్గావ్ వంటి టైర్-1 నగరాల్లో పెరుగుతున్నరద్దీ మరియు వ్యయాలను దృష్టిలో ఉంచుకుని, భూమిని అభివృద్ధి చోదకంగా ఎంచుకుని పునరావాస వ్యయాలను తద్వారా వచ్చే ప్రమాదాలను తొలగించే రీతిలో ప్రజలకు ఉపయుక్తంగా ఉండే విధంగా అలాగే ప్రముఖ కంపెనీలను ఆకర్షించేందుకు ఈ వ్యయ-ఆధారిత ఆకర్షణ వ్యూహం రూపొందించబడింది.
పాలసీలో ఆర్ధిక పెట్టుబడి సంస్థలకు ఈ క్రింది నియమాలను సూచించారు:
IT/ITeS సంస్థలకు: Fortune/Forbes రాంకింగ్లలో గత 3 సంవత్సరాలలో లిస్టింగ్ లేదా కనీసం $1 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా వార్షిక ఆదాయం కలిగి ఉండాలి. 3 సంవత్సరాలలో కనీసం 3,000 ఉద్యోగాలు మరియు ప్రతి ఎకరానికి 500 ఉద్యోగాలు సృష్టించాలి.
గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (GCCలకు): 3 సంవత్సరాలలో కనీసం 2,000 ఉద్యోగాలు మరియు ప్రతి ఎకరానికి 500 ఉద్యోగాలు సృష్టించాలి.
IT పార్క్ డెవలపర్లకు: ఇప్పటికే కనీసం 10,00,000 చ.అ. వాణిజ్య కార్యాలయ స్థలాన్ని అభివృద్ధి చేసి ఉండాలి, ప్రతి ఎకరానికి కనీసం 1,00,000 చ.అ. నిర్మాణం చేయాలి మరియు మొత్తం 10,00,000 చ.అ. నిర్మాణ స్థలం కలిగి ఉండాలి.
GCC డెవలపర్లకు: యాంకర్ టెనెంట్ ఒప్పందం (20% బిల్ట్-అప్ స్పేస్), కనీసం 50% IT ఆఫీస్ స్పేస్ అర్హులైన సంస్థలకు విక్రయించాలి.
భూమి ధర: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ప్రతి ఎకరానికి INR 0.99 (తొంభై తొమ్మిది పైసలు మాత్రమే).
నిర్మాణ కాలం: విక్రయ ఒప్పందం నుండి 6 నెలల్లో చట్టబద్ధ లైసెన్సులు మరియు నిర్మాణ ప్రారంభం తప్పనిసరి.

*3. యువజనాభివృద్ధి, పర్యాటక & సాంస్కృతిక కార్యక్రమాల శాఖ:*
6 క్లస్టర్లకు చెందిన 22 హోటళ్ళు మరియు రిసార్ట్ల నిర్వహణ మరియు నిర్వహణ కార్యకలాపాలకు VC & MD, APTDC అధికారం ఇవ్వడానికి ఏజెన్సీ/ఏజెన్సీలను ఎంపిక చేయడానికి RFP ప్రకటనకు అనుమతి ఇవ్వడానికి యువజనాభివృద్ధి, పర్యాటక & సాంస్కృతిక కార్యక్రమాల శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
సేవా నాణ్యత, కార్యాచరణ సామర్థ్యం మరియు ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి, APTDC భౌగోళిక సామీప్యం, పరిపాలనా సౌకర్యం మరియు లాభదాయక మరియు లాభదాయకం కాని ఆస్తుల సమతుల్య మిశ్రమం ఆధారంగా 22 ఆస్తులను వ్యూహాత్మకంగా ఆరు (6) క్లస్టర్లుగా విభజించి ప్రైవేట్ O&M ఆపరేటర్లను నియమించాలని ప్రతిపాదించింది. ఈ విధానం ఆస్తుల నిర్వహణను మెరుగుపరచడం, పర్యాటకుల రాకను పెంచడం మరియు APTDC కు ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.
అర్హత ప్రమాణాలు:
•కార్యాచరణ అనుభవం: బిడ్డర్ ప్రస్తుతం భారతదేశంలో క్లస్టర్‌లో ప్రతిపాదించిన విధంగా కనీసం అదే సంఖ్యలో కార్యాచరణ AC గదులు/కాటేజీలతో రిసార్ట్/హోటల్‌ను నిర్వహించాలి మరియు కనీసం మూడు భారతీయ నగరాల్లో ఆస్తులను కూడా నిర్వహించాలి.
•కనీస కార్యాచరణ కాలం: బిడ్ డ్యూ డేట్ (BDD) కు ముందు గత ఏడు (7) ఆర్థిక సంవత్సరాలలో కనీసం మూడు (3) సంవత్సరాల నిరంతర కాలం పాటు అవసరమైన సంఖ్యలో ఆస్తులను నిర్వహించి ఉండాలి.
•ఆర్థిక సామర్థ్యం - టర్నోవర్: బిడ్డర్ గత 7 ఆర్థిక సంవత్సరాలలో ఏదైనా 5 సంవత్సరాలలో, ఆడిట్ చేసిన ఆర్థిక పత్రాల ప్రకారం, హాస్పిటాలిటీ కార్యకలాపాల నుండి మాత్రమే క్లస్టర్‌లోని మొత్తం కీలకు సమానమైన (RFP ఫార్ములా ప్రకారం) సగటు వార్షిక టర్నోవర్ కలిగి ఉండాలి.
•ఆర్థిక సామర్థ్యం - నెట్‌వర్త్: బిడ్డర్ సానుకూల నెట్ వర్త్ కలిగి ఉండాలి మరియు పర్యాటకం సంబంధిత మరియు/లేదా హాస్పిటాలిటీ కార్యకలాపాల సేవలు నుండి గత మూడు సంవత్సరాలలో పెరుగుతున్న నెట్ వర్త్‌ను ప్రదర్శించాలి.
•స్టార్ రేటింగ్ అనుభవం: 3 స్టార్ మరియు అంతకంటే ఎక్కువ కేటగిరీ అనుభవం కలిగిన ఆపరేటర్‌కు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ఉద్యోగుల వ్యవస్థ: మొత్తం 418 ఉద్యోగులు - 46 శాశ్వత, 111 కాంట్రాక్టు, 144 APCOS మరియు 117 దినసరి వేతన సిబ్బంది. ఈ కేటాయింపులో భాగంగా 46 మంది శాశ్వత ఉద్యోగులు APTDC వద్ద ఉంచబడతారు మరియు మిగిలినవారు O&M ఆపరేటర్‌కు బదిలీ చేయబడతారు.
పునరుద్ధరణ మరియు అప్‌గ్రేడేషన్: గుర్తింపబడిన ఆపరేటర్లు మౌలిక వసతుల ఉన్నతి లేదా పునరుద్ధరణ చేయవలసి ఉంది.

*4. యువజనాభివృద్ధి, పర్యాటక & సాంస్కృతిక కార్యక్రమాల శాఖ:*
తిరుపతి గ్రామీణ మండలం APTA భూమిని TTD భూమితో బదలాయింపు/ మార్పిడి చేసుకోవడానికి మరియు తిరుపతి RS గ్రామంలో 25.00 ఎకరాల TTD భూమితో ఎక్స్చేంజ్ డీడ్‌ను అమలు చేయడానికి M/s. ఓబెరాయ్ గ్రూప్‌కు భూమి కేటాయింపును రద్దు చేయడానికి యువజనాభివృద్ధి, పర్యాటక & సాంస్కృతిక కార్యక్రమాల శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

వైష్ణవి ఇన్‌ఫ్రా వెంచర్స్ & రిసార్ట్స్ లిమిటెడ్‌కు తిరుపతిలో “ది టెంపుల్స్ ఆఫ్ ఇండియా” థీమ్ పార్క్ ప్రాజెక్ట్ కోసం 2012లో పెరూరు గ్రామంలో 38 ఎకరాల భూమి కేటాయించబడింది. ఈ భూమిలో నుండి 30.32 ఎకరాలు కంపెనీకి అప్పగించిన తరువాత, 2021లో ఆ భూమిలో 20 ఎకరాలను ఓబెరాయ్ గ్రూప్‌కు రిసార్ట్ నిర్మాణానికి కేటాయించారు.

అయితే తిరుమల పవిత్రత మరియు స్థానిక ప్రజల ఆందోళనల కారణంగా, TTD బోర్డు 2024లో ఓబెరాయ్ గ్రూప్‌కు భూమి కేటాయింపును రద్దు చేయాలని రాష్ట్र ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. స్థానిక ప్రజలు మరియు ధార్మిక సంస్థలు కూడా ముఖ్యమంత్రిని ఇదే విషయంలో కోరినందున దీనిపై ప్రభుత్వం 2025 ఏప్రిల్‌లో 35 ఎకరాల TTD ప్రత్యామ్నాయ భూమితో APTA భూమిని మార్చుకోవడానికి అంగీకారం తెలిపింది.

*5. రెవెన్యూ శాఖ:*
2024-26 లైసెన్స్ కాలం కోసం తిరుపతి దగ్గర ఉన్న పర్మిట్ రూమ్స్ కు లైసెన్స్ కాలాన్ని పొడిగించడానికి AP ఎక్సైజ్ (గ్రాంట్ ఆఫ్ లైసెన్సెస్) నిబంధనలు మరియు లైసెన్స్ రూల్స్ షరతులను సవరించడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ప్రభుత్వం 2024లో కొత్త ఎక్సైజ్ పాలసీ జారీ చేసిన తరువాత రాష్ట్రంలో 3,736 A4 మద్యం దుకాణాలకు పర్మిట్ రూమ్స్ అనుమతి లేకుండా పోయింది. దీని వల్ల కస్టమర్లు ఫుట్ పాత్ , పార్కులు, రోడ్లపై బహిరంగంగా మద్యం సేవించడంతో ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. గత సంవత్సరంలో 2.77 లక్షల పబ్లిక్ డ్రింకింగ్ కేసులు నమోదయ్యాయి, కేవలం 2025 జనవరిలోనే 1.40 లక్షల కేసులు నమోదైనవి.

మునుపు 2019 వరకు అన్ని A4 దుకాణాలకు పర్మిట్ రూమ్స్ తప్పనిసరిగా ఉండేవి మరియు వార్షిక లైసెన్స్ ఫీజుగా 5 లక్షలు వసూలు చేసేవారు. ఇవి నియంత్రిత వాతావరణంలో మద్యం సేవించడం జరిగేది. ఇప్పుడు కేబినెట్ సబ్-కమిటీ అన్ని A4 దుకాణాలకు తిరిగి పర్మిట్ రూమ్స్ అనుమతించాలని సిఫార్సు చేసింది. వార్షిక రిటైల్ ఎక్సైజ్ టాక్స్ (RET) ఆధారంగా 5-7.5 లక్షల లైసెన్స్ ఫీజు వసూలు చేయాలని, గరిష్టంగా 1000 చదరపు అడుగుల విస్తీర్ణంతో కిచెన్ లేకుండా రెడీ టు ఈట్ స్నాక్స్‌కు మాత్రమే అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇది సంవత్సరానికి దాదాపు 256 కోట్లు అదనపు ఆదాయం తెచ్చి, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానాన్ని నియంత్రించగలదు.

*6. ఇంధన శాఖ:*
APDCL యొక్క క్లిష్టమైన ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, SBI & UBI బ్యాంకులు చట్టబద్ధ అధికారులకు, CIBIL, CRISIL మొదలైన వాటికి ప్రతికూల రిపోర్టింగ్‌ను నివారించడానికి రూ.900.00 కోట్లకు ప్రభుత్వ గ్యారెంటీ అందించేందుకు నిర్దిష్ట షరతులకు లోబడి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఈ సమస్య యొక్క ముఖ్య కారణం AP డిస్కాంలు APPDCL కు చెల్లింపులు ఆలస్యం చేయడం వల్ల రిసీవబుల్స్ అయిపోవడం. ప్రస్తుతం రిసీవబుల్స్ సున్నాకు చేరడంతో ఇప్పటికే ఉన్న క్యాష్ క్రెడిట్ లిమిట్లకు డ్రాయింగ్ పవర్ లేకుండా పోయింది. APPDCL వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు రూ.900 కోట్ల క్యాష్ క్రెడిట్ లిమిట్లను (SBI నుండి రూ.500 కోట్లు + UBI నుండి రూ.400 కోట్లు) వినియోగించుకుంది. బ్యాంకులు ఖాతాను అనియమితంగా గుర్తించి RBI, CIBIL, CRISIL మొదలైన వాటికి రిపోర్ట్ చేస్తామని హెచ్చరించాయి. APPDCL ఆర్థిక స్థితి దిగజారడంతో క్రెడిట్ సౌకర్యం కొనసాగించడానికి ప్రభుత్వ గ్యారెంటీ కోరారు. మద్దతు లేనట్లయితే విద్యుత్ ఉత్పాదనలో కార్యకలాపాలకు అంతరాయం మరియు క్రెడిట్ డౌన్‌గ్రేడ్ జరిగే ప్రమాదం ఉంది.

గ్యారెంటీకి కట్టుబడి ఉండాల్సిన ముఖ్య షరతుల్లో APPDCL వడ్డీ రేటును కనీసం MCLR రేట్లకు సమానంగా తీసుకురావాలి, ఫోర్‌క్లోజర్ ఛార్జీలు లేకుండా ఉండాలి, ప్రిన్సిపల్ మరియు వడ్డీలకు గ్యారెంటీ విస్తరించాలి, APPDCL చెల్లింపు విఫలమైనప్పుడు మాత్రమే ప్రభుత్వ గ్యారెంటీ అమలులోకి రావాలి, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అధికారి సంతకం తప్పనిసరి, APPDCL తన స్వంత వనరుల నుండి రుణ సేవలను చేయాలి మరియు గ్యారెంటీ మొత్తంపై 2 శాతం కమీషన్ చెల్లించాలి.

*7. ఇంధన శాఖ:*
బలహీన వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. వారి సంక్షేమం కోసం రూ.47,500 కోట్లును కూటమి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా నాయీ బ్రాహ్మణుల అభ్యర్ధాన మేరకు హెయీర్ కటింగ్ సెలూన్లకు ఇచ్చే ఉచిత 150 యూనిట్ల విద్యుత్తుకు బదులు 200 యూనిట్లకు పెంచి వారి సామాజిక, ఆర్ధిక అభ్యున్నతికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఇంధన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ప్రభుత్వం 2019లో జారీ చేసిన G.O.Rt.No.15 ద్వారా హైర్ కటింగ్ సెలూన్లు మరియు షాపులకు నెలకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాను ఆమోదించింది. ఈ నిర్ణయం బార్బర్ కమ్యూనిటీ నాయకుల నుండి వచ్చిన అభ్యర్థనలకు ప్రతిస్పందనగా తీసుకోబడింది. గౌరవనీయ ముఖ్యమంత్రి విజయవాడలో జరిగిన బహిరంగ సభలో నాయీ బ్రాహ్మిణ కమ్యూనిటీకి వారి జీవనోపాధికి మద్దతుగా మరియు సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి నెలకు 150 యూనిట్ల నుండి 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ పెంపును అధికారికంగా అంగీకరించారు. ప్రభుత్వం ప్రజా గళం మేనిఫెస్టో నిబద్ధత ప్రకారం నమోదైన మొత్తం 40,808 సెలూన్లకు పూర్తి కవరేజీని నిర్ధారించడానికి B.E. 2025-26లో రూ.50.00 కోట్లను కేటాయించి, అదనంగా రూ.50.00 కోట్లు అవసరమని తెలిపింది.

నెలకు 200 యూనిట్ల వరకు కనెక్షన్‌కు దాదాపు రూ.2,045.15 రేటు ప్రకారం, కేటగిరీ-II సర్వీస్ కనెక్షన్లతో 40,808 నమోదైన సెలూన్లకు అవసరమైన నెలకు రూ.8.35 కోట్లు ఆర్థిక అవసరం,సంవత్సరానికి రూ.100.20 కోట్లు (దాదాపు రూ.100 కోట్లు) అని అంచనా వేయబడింది. ప్రభుత్వం B.E. 2025-26లో హెడ్ ఆఫ్ అకౌంట్ (HOA): 2225-03-102-11-22-330-331 కింద పవర్ కాస్ట్ సబ్సిడీ టు సెలూన్స్ కోసం రూ.50.00 కోట్లను కేటాయించి, అదనంగా రూ.50.00 కోట్లు అవసరమని తెలిపింది.

*8. ఇంధన శాఖ:*
APSPDCL & APCPDCLలలో 2% గ్యారెంటీ కమిషన్‌తో పునరుద్ధరించబడిన పంపిణీ రంగ పథకం (RDSS)ను సకాలంలో మరియు విజయవంతంగా అమలు చేయడానికి M/s PFC లిమిటెడ్ ఇప్పటికే మంజూరు చేసిన కౌంటర్ పార్ట్ & మధ్యంతర నిధుల రుణాలకు బదులుగా APSPDCLకి రూ. 3544.57 కోట్ల మొత్తాన్ని మరియు APCPDCLకి రూ. 1029.37 కోట్ల మొత్తాన్ని మిగిలిన దానికి ప్రభుత్వ హామీని అందించడానికి ఇందన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
భారత ప్రభుత్వం వినియోగదారులకు ఆర్థికంగా స్థిరమైన మరియు కార్యాచరణలో సమర్థవంతమైన డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ ద్వారా విద్యుత్ సరఫరా యొక్క నాణ్యత, విశ్వసనీయత మరియు సరసమైన ధరలను మెరుగుపరచడం లక్ష్యంగా సంస్కరణ ఆధారిత మరియు ఫలితాల-అనుసంధాన పథకంగా రేవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ (RDSS) ను ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా భారత ప్రభుత్వం మొత్తం అనుమతించిన డిస్ట్రిబ్యూషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనుల వ్యయంలో 60% గ్రాంట్ అందిస్తోంది. APSPDCL మరియు APCPDCL స్మార్ట్ మీటరింగ్ మరియు లాస్ రిడక్షన్ కోసం గ్రాంట్లు మరియు రుణాలతో సహా ప్రాజెక్ట్ ప్రతిపాదనలను సమర్పించాయి, వీటిని PFC ఆమోదించింది.

రాష్ట్ర ప్రభుత్వం GO Rt No. 23 (Dt. 20.02.2024) ద్వారా మొదట APSPDCL కు రూ.1100 కోట్లు మరియు APCPDCL కు రూ.700 కోట్లకు ప్రభుత్వ గ్యారెంటీలను ఆమోదించింది, ఇది FY 2023-24లో ప్రాథమిక రుణ విడుదలలను సాధ్యం చేసింది. ప్రాజెక్ట్ అమలు ముందుకు సాగడంతో, C&MDs, APSPDCL & APCPDCL మిగిలిన అనుమతించిన రుణ మొత్తాలకు నిధుల కొనసాగింపు కోసం అవసరమైన బ్యాలెన్స్ గ్యారెంటీలకు ప్రతిపాదనను సమర్పించారు. ఈ గ్యారెంటీల అందింపులో జాప్యం PFC నుండి నిధుల ప్రవాహాన్ని నేరుగా అడ్డుకుంటుంది, ప్రాజెక్ట్ అమలుని నిలిచిపోయేలా చేసి సమయం మరియు వ్యయ పెరుగుదలకు దారితీస్తుంది. పెద్ద ఎత్తున ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు స్మార్ట్ మీటరింగ్ పనులు జరుగుతున్న పరిస్థితిలో, నిర్దిష్ట సమయ పాలనతో కొనసాగించడానికి నిరంతర ఆర్థిక మద్దతు కీలకం. RDSS ప్రజా ప్రయోజనార్థం అమలవుతోంది, తగ్గిన నష్టాలు, మెరుగైన విశ్వసనీయత మరియు మెరుగైన సేవా నాణ్యత ద్వారా విద్యుత్ వినియోగదారులకు ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూరడం వల్ల ప్రభుత్వ గ్యారెంటీ రిడెంప్షన్ ఫీజు నుండి ప్రతిపాదిత మినహాయింపు సమర్థనీయమని, ఇది విద్యుత్ రంగ సంస్కరణలపై GoI విధాన దిశానిర్దేశాలకు అనుగుణంగా ఉంది.

*9. మానవ వనరుల శాఖ (పాఠశాల విద్య):*
G.O Ms No.19, 20, 21, dt.13.05.2025 & G.O Ms No.33, SE (Prog.I) Department, dt:31.07.2025 ద్వారా జారీ చేసిన ఆదేశాలను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.Ms. No.84 (24.12.2021) మరియు G.O.Ms No.117 (10.06.2022) ద్వారా ప్రభుత్వ పాఠశాలల పునర్నిర్మాణాన్ని ప్రారంభించింది. దీనిలో 4,731 ప్రాథమిక పాఠశాలల నుండి 3వ నుండి 5వ తరగతుల వరకు 1 కిలోమీటర్ దూరం లోపు 3,348 ఉన్నత ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలలో విలీనం చేయడం జరిగింది, దీని వల్ల 2,43,540 విద్యార్థులు ప్రభావితమయ్యారు. అయితే, పునర్నిర్మాణం వల్ల ప్రతికూల పర్యవసానాలు ఎదురయ్యాయి, వీటిలో విద్యార్థుల వలసలు గణనీయంగా ప్రైవేట్ పాఠశాలల వైపు పెరగగా డ్రాప్ అవుట్ రేట్లు పెరగడం మరియు ఉపాధ్యాయుల పై పనిభారం పెరిగింది.

వాటాదారుల సంప్రదింపుల తరువాత, ప్రభుత్వం నమోదును పెంచడం, మధ్యలోనే విడిచిపెట్టడాన్ని తగ్గించడం, పనిభారాన్ని తేలిక చేయడం మరియు అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పాఠశాల నిర్మాణాన్ని సవరించడానికి G.O.Ms.No.19, 20, మరియు 21 (13.05.2025) జారీ చేసింది. G.O.Ms No.21 ను అనుసరించి, ఉపాధ్యాయ సంఘాలు అదనపు విభాగాలు మరియు పదవుల కోసం తక్కువ నమోదు థ్రెషోల్డ్‌లను కోరాయి. ఈ ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వం G.O.Ms No.33 (31.07.2025) జారీ చేసి, HoD పూల్ నుండి మిగులు పదవులను ఉపయోగించి నిబంధనలను సవరించింది మరియు అదనపు ఆర్థిక భారం లేకుండా సవరించిన నిబంధనలను అమలు చేసింది. దీనిప్రకారం బదిలీలు మరియు పదోన్నతులు నిర్వహించబడ్డాయి.

జారీ చేసిన ఆదేశాలలో G.O.Ms.No.19 (13.05.2025) ద్వారా AY 2025–26 నుండి ప్రభుత్వ, ZP, MP, మరియు మునిసిపల్ పాఠశాలలను పునర్నిర్మించి, తొమ్మిది కొత్త పాఠశాల నమూనాలను ప్రవేశపెట్టింది: శాటిలైట్ ఫౌండేషనల్, ఫౌండేషనల్, బేసిక్ ప్రైమరీ, మోడల్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ (1-10, 6-10), మరియు హై స్కూల్ ప్లస్ (1-12, 6-12). G.O.Ms.No.20 (13.05.2025) ద్వారా కొత్త పాఠశాల నిర్మాణం మరియు విద్యాసంబంధ సంస్కరణలకు అనుసంధానం చేయడానికి AP RTE రూల్స్, 2010ను సవరించింది. G.O.Ms.No.21 (13.05.2025) ద్వారా మిగులు పదవులను మార్చడం ద్వారా సిబ్బంది పునఃపంపకం నిబంధనలను జారీ చేసింది, 3,228 కొత్త పదవులను సృష్టించింది, 779 అప్పర్ ప్రైమరీ పాఠశాలలను హై స్కూల్‌లుగా అప్‌గ్రేడ్ చేసింది మరియు భవిష్యత్తు మోహరింపు కోసం 1,902 మిగులు పదవులను అలాగే ఉంచింది. G.O.Ms.No.33 (31.07.2025) ద్వారా అదనపు విభాగాలు మరియు SGT పదవుల కోసం థ్రెషోల్డ్‌లను తగ్గించడం ద్వారా సిబ్బంది నిబంధనలను సవరించింది, 1,901 కొత్త పదవులను సృష్టించింది, 1,995 మిగులు పదవులను అలాగే ఉంచింది మరియు 4,951 ప్రైమరీ HMలను మోడల్ ప్రైమరీ స్కూల్ హెడ్‌మాస్టర్‌లు/స్కూల్ అసిస్టెంట్‌లుగా పునఃనిర్దేశం చేసింది.

*10. సాధారణ పరిపాలన శాఖ:*
ప్రస్తుత AP మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు, 2023లో G.O Ms No.38, G. A. (I&PR) Dept., dt.30.03.2023ను రద్దుపరచి, దాని స్థానంలో కొత్తగా రూపొందింఛిన "కాంప్రహెన్సివ్ A.P మీడియా అక్రిడిటేషన్ రూల్స్, 2025" ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
కొత్త సమగ్ర మరియు సమీకృత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ రూల్స్, 2025కు కేబినెట్ ఆమోదం కోరుతూ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. తద్వారా, రాష్ట్ర హెడ్ క్వార్టర్స్, పబ్లిషింగ్ సెంటర్లు మరియు ఆంధ్రప్రదేశ్ జిల్లాలలో మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ మంజూరు చేయడం కోసం ఉన్న ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడిటేషన్ రూల్స్, 2023, G.O. Ms. No. 38, GA (I&PR) శాఖ, dt.30.03.2023ను జారీ చేసిన ఉత్తర్వుల స్థానంలో క్రొత్తగా రూపొందించిన ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడిటేషన్ రూల్స్, 2025 అమలులోకి రానుంది.
దీనిలో ముఖ్యంగా, రాష్ట్రంలోని వివిధ జర్నలిస్టు సంఘాలు అభ్యర్ధించిన మేరకు నూతనంగా రూపొందించిన మీడియా నిబంధనలలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ల ప్రతినిధులకు అర్హత మేరకు రాష్ట్ర మరియు జిల్లా అక్రిడిటేషన్ కమిటీలలో స్థానం లభించనుంది.
చిన్న వార్తాపత్రికల కేటగిరీకి చెందిన జర్నలిస్టులకు సహేతుక సంఖ్యలో అక్రిడిటేషన్లను మంజూరు చేసే సౌకర్యం కల్పించేందుకు ఎంపానెల్డ్ మరియు నాన్-ఎంపానెల్డ్ కేటగిరీలుగా చిన్న వార్తాపత్రికల వర్గీకరణ చేయడం జరిగింది. ప్రభుత్వ పథకాలు మరియు కార్యక్రమాలపై సమాచారాన్ని పొంది దానిని ప్రజలకు వ్యాప్తి చేయడానికి మీడియాకు అక్రిడిటేషన్ సౌకర్యం అందించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇది ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు విస్తరించబడుతుంది మరియు ఆంధ్రప్రదేశ్ అధికార పరిధిలో ఉంటుంది.
ఎంతో కాలంగా జర్నలిస్టులు, వారి సంఘ ప్రతినిధులలో నెలకొన్న పలు మీమాంసలు ఈ క్రొత్త మీడియా రూల్స్ వలన తొలగనున్నాయి. క్రొత్త మీడియా అక్రిడిటేషన్ నిభందనల ప్రకారం అతిత్వరలో అక్రిడిటేషన్ మంజూరు ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే, రాష్ట్ర , జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీల నియామకం జరగనుంది. సోషల్ మీడియాకి సంబందించి కూడా ఒక పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు.

*11. సాధారణ పరిపాలన శాఖ:*
(ఎ) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) & దాని ఫ్రంట్ సంస్థలు, (1) రాడికల్ యూత్ లీగ్ (RYL); (ii) రైతు కూలీ సంఘం (RCS) / గ్రామీన పేదల సంఘం (పేరు మార్చబడింది); (iii) రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU); (iv) సింగరెణి కార్మిక సమాఖ్య (SIKASA); (v) విప్లవ కార్మిక సమాఖ్య (VIKASA); (vi) ఆల్ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (AIRSF); మరియు (బి) రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ (RDF) ను A.Ρ. పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్, 1992, (చట్టం నం. 21 ఆఫ్ 1992) సెక్షన్ 3 మరియు దాని ఉప-క్లాజుల ప్రకారం 'చట్టవిరుద్ధ సంఘాలు'గా ప్రకటించడంపై నిషేధాన్ని మరో సంవత్సరం పాటు వరుసగా 17.08.2025 & 09.08.2025 నుండి పొడిగించేందుకు సాధారణ పరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

నిషేధం అమలులో ఉన్నప్పటికీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ఆంధ్రప్రదేశ్‌లో తమకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) పోలీస్ ఇన్ఫార్మర్లు అని పేరుతో పౌరులను లక్ష్యంగా చేసుకోవడం, ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లాలలో ప్రభుత్వ ఆస్తులను దెబ్బతీయడంతో పాటు తెలంగాణ, ఒడిశా మరియు ఛత్తీస్‌గఢ్ పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన వారి కేడర్‌లతో కలిసి వినాశకార కార్యకలాపాలను కొనసాగిస్తోంది. 2024 ఆగస్టు నుండి ఇప్పటి వరకు నిషేధ కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) 9 నేరాలు చేసింది.

*12. హోం శాఖ:*
పుట్టపర్తి, మొవ్వ, గన్నవరం, గాజువాక మరియు తిరుపతి తదితర ఐదు (5) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన మంజూరు చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

1.జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, పుట్టపర్తి 2. జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, మొవ్వ 3. అదనపు జూనియర్ సివిల్ జడ్జ్, గన్నవరం 4. VIII అదనపు చీఫ్ మొట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు, గాజువాక 5. తిరుపతిలోని రెడ్ సాండర్ స్మగ్లింగ్‌కు సంబంధించిన కేసుల విచారణ కోసం తిరుపతిలో జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కేడర్‌లో ప్రత్యేక కోర్టు.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (Cr.P.C.) లోని సెక్షన్ 25 మరియు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS), 2023 లోని సెక్షన్ 20 ప్రకారం, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులలో ప్రాసిక్యూషన్‌ను అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిర్వహించాలి. ప్రతి క్రిమినల్ కోర్టులో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించడానికి మరియు ప్రాసిక్యూషన్లు నిర్వహించడానికి ఒక ప్రాసిక్యూటింగ్ అధికారి ఉండాలి.
19-03-2025 తేదీతో WP (PIL) No.308 of 2018, WP No.5026 of 2020, మరియు WP (PIL) No.119 of 2024 లలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, కొత్తగా స్థాపించబడిన క్రిమినల్ కోర్టులకు ఐదు (5) అదనపు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల అనుమతి అవసరం. తద్వారా, కేడర్ బలం 204 నుండి 209కి పెరుగుతుంది.
దీని ప్రకారం, G.O.Ms. No. 133, ఫైనాన్స్ (HR.I-Plg & పాలసీ) డిపార్ట్‌మెంట్, తేదీ: 17-08-2018 ద్వారా జారీ చేయబడిన ఆదేశాల ప్రకారం, ఐదు కోర్టులకు క్రమం తప్పకుండా RPS, 2022లో ఐదు (5) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

*13. ఎక్సైజ్ శాఖ:*
క్యాబినెట్ సబ్‌కమిటీ సిఫార్సుల ఆధారంగా 2025-28 బార్ పాలసీని ఆమోదించేందుకు ఎక్సైజ్ శాఖ చేసి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
సమగ్ర ఎక్సైజ్ పాలసీ ముసాయిదాను సిఫార్సు చేయడానికి G.O Rt. No. 582 ద్వారా ఏర్పాటు చేయబడిన క్యాబినెట్ సబ్-కమిటీ, రెవెన్యూ (ఎక్సైజ్) విభాగం, తేదీ 29-08-2024, తేదీ 01-08-2025, 02-08-2025 & 03-08-2025 తేదీలలో సమావేశమై, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలు మరియు వాటాదారుల ప్రాతినిధ్యాలకు సంబంధించి ప్రస్తుత బార్ విధానాన్ని అద్యయనం చేయడం జరిగింది.
గత విధానం ప్రకారం 3 సంవత్సరాల లైసెన్స్ వ్యవధి (2022-25) ఉన్న ప్రస్తుత బార్ విధానం వేలం పద్ధతిపై ఆధారపడి ఉంది మరియు 840 బార్‌లు వేలం వేయబడ్డాయి. ఆ పాలసీ గడువు 31-08-2025న ముగుస్తుంది. ఈ పాలసీ ప్రకారం బార్లు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన పరిస్థితుల్లో నూతన బార్ పాలసీని తీసుకురావాలన ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రక్కరాష్ట్రాల్లోని బార్ పాలసీని పరిశీలించి ఈ నూతన పాలసీని రూపొందించడం జరిగింది. లాటరీ ద్వారా బార్ లను కేటాయించడం, కనీసం నాలుగు ధరఖాస్తులు వస్తేనే ఈ విదానాన్ని అనుసరించడం జరుగుంది. బిజినెస్ అవర్స్ ను కూడా ఉదయం 10.00 గంటల నుండి రాత్రి 11.00 గంటల వరకు అనుమతించడం జరిగింది. మొత్తం 840 బార్లలో 10 శాతం బార్ లను కల్లుగీత కార్మికుల సంక్షేమార్థం 50 శాతం ఫీజుతో రిజర్వు చేయడం జరిగింది. ఈ లైసెన్సు తే.1.9.2025 నుండి తే.31.8.2028 వరకు అమల్లో ఉంటుంది. బార్ల బిజినెస్ అవర్సు ఉదయం 10.00 నుండి రాత్రి 11.00 వరకూ అనుమతించడం జరిగింది.

*14. పరిశ్రమలు & వాణిజ్య శాఖ:*
APIIC ద్వారా ₹7500 కోట్ల రుణం సమీకరించి పరిశ్రమల అభివృద్ధికి వినియోగించేందుకు పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
రాష్ట్రవ్యాప్తంగా గుర్తించబడిన ప్రధాన పారిశ్రామిక క్లస్టర్లు మరియు పారిశ్రామిక పార్కుల భూసేకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు అప్‌గ్రేడేషన్ కోసం రాబోయే 9-12 నెలల కాలంలో రూ. 7,500 కోట్ల రుణాన్ని సేకరించే APIIC ప్రతిపాదనకు ఆమోదం, SBICAPS మరియు ఇలాంటి ఏజెన్సీలను లావాదేవీ సలహాదారులుగా చేర్చుకోవడం మరియు అవసరమైన అనుబంధ చర్యలు తీసుకోవడం:
ఎ) మంగళగిరిలోని APIIC టవర్స్, IT పార్క్, 10వ అంతస్తులో రిజిస్టర్డ్ కార్యాలయంతో SPVని సృష్టించడం, దీనికి రూ. 1,00,00,000/- (రూపాయలు ఒక కోటి మాత్రమే) అధీకృత షేర్ క్యాపిటల్ మరియు రూ. 1,00,000/- (రూపాయలు ఒక లక్ష మాత్రమే) పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌తో ఏర్పాటు చేయడం, SPV బోర్డు అవసరాల ఆధారంగా ఎప్పటికప్పుడు అధీకృత పెయిడ్-అప్ క్యాపిటల్ మరియు షేర్ క్యాపిటల్‌ను పెంచవచ్చు అనే నిబంధనతో. SPV కోసం డైరెక్టర్ల బోర్డును విభాగం ప్రతిపాదిస్తుంది.
బి) బ్యాంకులు/ఆర్థిక సంస్థల నుండి రూ.7,500 కోట్ల రుణాన్ని సేకరించడానికి APIICకి అధికారం ఇవ్వడం మరియు SPV యొక్క ఉత్తమ ప్రయోజనాల దృష్ట్యా టర్మ్ షీట్‌ను ఆమోదించడానికి డైరెక్టర్ల బోర్డుకు అధికారాన్ని అప్పగించడం.
సి) క్యాబినెట్ మెమోరాండం యొక్క పేరాలు-2.5 నుండి 2.9 వరకు సూచించిన విధంగా, ఈ గుర్తించబడిన పారిశ్రామిక క్లస్టర్లు మరియు పారిశ్రామిక పార్కులలోని భూములను SPVకి బదిలీ చేయడానికి APIICకి ఆమోదం, అభివృద్ధి చెందని భూమికి ప్రాతిపదికగా ప్రస్తుత SRO రేట్ల ప్రకారం & అభివృద్ధి చెందిన/సెమీ అభివృద్ధి చెందిన భూములకు మార్కెట్ రేటు/SRO ప్రాతిపదికన, SPVలోకి ఈక్విటీ ఇన్ఫ్యూషన్‌గా ఇప్పటివరకు జరిగిన ఇన్‌ఫ్రా ఖర్చుల విలువను బదిలీ మరియు బదిలీ తేదీ నాటికి, దానిపై వర్తించే స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజులను సక్రమంగా మినహాయించడం.
డి) ఈ గుర్తించబడిన పారిశ్రామిక క్లస్టర్లు మరియు పారిశ్రామిక పార్కులలోని భూముల కేటాయింపులు ప్రస్తుత APIIC కేటాయింపు నిబంధనల ప్రకారం చేయబడతాయి మరియు గతంలో లేదా ప్రక్రియలో ఉన్న అటువంటి భూములపై APIIC చేసిన ఏవైనా కేటాయింపుల కోసం, APIICకి జమ చేయబడిన లేదా జమ చేయబడిన అటువంటి లావాదేవీల నుండి వచ్చే ఆర్థిక ఆదాయాలు ఇకపై SPVకి అనుకూలంగా బదిలీ చేయబడతాయి.
ఇ) రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, రుణదాతలకు భద్రత, భూముల తనఖా మొదలైన అంశాలపై బ్యాంకులు/ఆర్థిక సంస్థలతో APIIC చర్చలు జరపడం, ఆర్థిక శాఖ నుండి తగిన సందేశాలను తీసుకోవడం.

*15. రెవెన్యూ శాఖ:*
ASR జిల్లాలోని Y రామవరం మండలాన్ని ఎగువ Y రామవరం మరియు దిగువ రామవరంగా రెండు మండలాలుగా విభజించడానికి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయడానికి రెవిన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

*16. రెవెన్యూ శాఖ:*
చిత్తూరు జిల్లా, శాంతిపురం మండలం, తమ్మిగానిపల్లె గ్రామంలోని ఎల్‌పిఎం నంబర్లు 646 మొదలైన వాటిలో 81.227 సెంట్ల ప్రభుత్వ భూమిని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం చిత్తూరులోని ఎపిఐఐసి జోనల్ మేనేజర్‌కు ఉచితంగా బదిలీ చేయడానికి రెవిన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

*17. స్టేటస్ నోట్: చేనేత మరియు జౌళి శాఖ:*
రేపు జరుగనున్న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత కార్మికులకు ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించడం జరిగింది. చేనేత మరియు జౌళి రంగాన్ని పటిష్ట పర్చి తద్వారా చేతి మగ్గాలకు నెలకు రెండు వందలు మరియు పవర్ లూంకు ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు, gst పై ఐదు శాతం రాయితీ మరియు చేనేత సహకార పరపతి సంఘాలకు త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటుకై చేనేత మరియు జౌళి శాఖ చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

వ్యవసాయ రంగం తదుపరి చేనేత రంగం రెండవ అతిపెద్ద ఉపాధి ప్రదాతగా రాష్ట్రంలో దాదాపు 93,000 చేనేత నేత కుటుంబాలు మరియు 11,488 పవర్‌లూమ్ యూనిట్లు ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 986 ప్రాథమిక చేనేత నేతల సహకార సంఘాలు ఉన్నాయి, వాటిలో 428 చుర

Address

Mangalagiri
522503

Alerts

Be the first to know and let us send you an email when Prasadu Darapaneni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share