Prasadu Darapaneni

Prasadu Darapaneni TDP Volunteers forum to promote and establish Telugu Desam Party.

11/12/2025

IT’S AKHANDA TRANCE 🔥🔥
సినీ పరిశ్రమలోనే కాకుండా బయట ఎవరికైనా సమస్య ఉంటే అండగా నిలబడే మనిషి… అలాంటి మహానుభావుడికి మనం ఎప్పటికీ తోడుగా ఉంటాం 🙏🔥

అలాంటి మనిషి సినిమా కొన్ని ఇబ్బందుల వల్ల ఆలస్యంగా విడుదల అవుతున్న రోజైనా…
ఆ రోజు రిలీజ్‌కు 16 సినిమాలు కాదు… 160 సినిమాలు ఉన్నా సరే —
మనం అందరం అడ్డు తప్పుకోక తప్పదు! 🔥🔥

Jai Balayya 💥🔥

🌎 LN – US Tour Day - 5📰 Press Release – 6ఎపీలో పెట్టుబడిదారులకు అత్యుత్తమ ప్రోత్సాహకాలు – మంత్రి నారా లోకేష్CIBC ప్రెసిడ...
11/12/2025

🌎 LN – US Tour Day - 5
📰 Press Release – 6

ఎపీలో పెట్టుబడిదారులకు అత్యుత్తమ ప్రోత్సాహకాలు – మంత్రి నారా లోకేష్

CIBC ప్రెసిడెంట్ విక్టర్ థామస్‌తో భేటీ

టొరంటో (కెనడా):
కెనడా–ఇండియా బిజినెస్ కౌన్సిల్ (CIBC) ప్రెసిడెంట్ విక్టర్ థామస్‌తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…
ఆంధ్రప్రదేశ్ AI, Quantum Computing వంటి భవిష్యత్ సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉందని, తూర్పు తీరంలో భారీ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు.

ఇటీవలే Google విశాఖపట్నంలో AI Hub & Data Center కోసం $15 బిలియన్ పెట్టుబడి ప్రకటించిన విషయం ప్రస్తావిస్తూ—
➡️ ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద FDI అని గుర్తుచేశారు.

సెమీకండక్టర్స్, ఐటి, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లను స్థాపించాలనుకునే సంస్థలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ప్రోత్సాహకాలు అందిస్తోందని చెప్పారు.

అమరావతి రాజధానిలో ₹65,000 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని,
విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్స్, రోడ్ నెట్‌వర్క్ వంటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులకు కెనడా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కోరారు.



CIBC ప్రెసిడెంట్ విక్టర్ థామస్ స్పందన

విక్టర్ థామస్ మాట్లాడుతూ…
C-IBC రెండు దేశాల మధ్య వాణిజ్యం & పెట్టుబడులను పెంపొందించేందుకు వారధిగా పనిచేస్తుందని పేర్కొన్నారు.

సంస్థ ప్రధాన ఫోకస్:
• ఆర్థిక, టెక్నాలజీ, ఎనర్జీ, వ్యవసాయం రంగాల్లో మార్కెట్ లీడర్లతో నెట్‌వర్కింగ్
• ప్రభుత్వాలకు వ్యూహాత్మక సలహాలు ఇవ్వడం
• రెండు దేశాల మధ్య ఆర్థిక కారిడార్ బలోపేతం
• ఉన్నత స్థాయి ఫోరమ్‌లు, బిజినెస్ మిషన్‌లు నిర్వహించడం
• SMEలకు భారతీయ మార్కెట్ అవకాశాలను సూచించడం

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని విక్టర్ థామస్ హామీ ఇచ్చారు.



🌎 LN – US Tour Day - 5📰 Press Release – 4ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి – మంత్రి నారా లోకేష్ఓపెన...
11/12/2025

🌎 LN – US Tour Day - 5
📰 Press Release – 4

ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి – మంత్రి నారా లోకేష్

ఓపెన్‌టెక్స్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ రాడ్కోతో భేటీ

టొరంటో (కెనడా):
ఎంటర్‌ప్రైజ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ (EIM), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ముందంజలో ఉన్న OpenText సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ రాడ్కోతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, Quantum Computing వంటి భవిష్యత్ సాంకేతికతలలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు.

రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను అందించేందుకు:
• Skill Development Programs
• Internship Initiatives
ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఇవి పరిశ్రమల అవసరాలకు సరిపోయే అత్యాధునిక నైపుణ్యాలను పెంపొందించడంలో కీలకమవుతాయని చెప్పారు.



OpenText వైస్ ప్రెసిడెంట్ జాన్ రాడ్కో స్పందన

జాన్ రాడ్కో మాట్లాడుతూ…
OpenText సంస్థ:
• డేటా & కంటెంట్ మేనేజ్‌మెంట్
• బిజినెస్ ప్రాసెస్ ఆప్టిమైజేషన్
• డిజిటల్ ఎక్స్‌పీరియెన్స్ ప్లాట్‌ఫార్మ్స్

వంటి రంగాల్లో క్లౌడ్ మరియు AI ఆధారిత సొల్యూషన్స్ అందిస్తున్నట్లు తెలిపారు.

భారతదేశంలో తమకు బలమైన ఉనికి ఉందని,
“AI-First Strategy” ఆధారంగా ఉత్తమ సాంకేతిక నిపుణులను నియమించుకోవడం మరియు పెద్ద ఎంటర్‌ప్రైజ్‌లకు సేవలందించడమే ముఖ్య లక్ష్యమని చెప్పారు.

OpenText భారత్‌లో తన AI, Cloud సాంకేతికతలను ఉపయోగించి:
• సురక్షితమైన
• ఆటోమేటెడ్
• సమర్థవంతమైన

సమాచార నిర్వహణ పరిష్కారాలను అందించడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

Tier-2 నగరాలకు కార్యకలాపాల విస్తరణ చేయాలని తమ సంస్థ భావిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని భరోసా ఇచ్చారు.

🌎 LN – US Tour Day - 5📰 Press Release – 3ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టండి – మంత్రి నారా లోకేష్సీప...
11/12/2025

🌎 LN – US Tour Day - 5
📰 Press Release – 3

ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టండి – మంత్రి నారా లోకేష్

సీపీపీఐబీ గ్లోబల్ ఎఫైర్స్ టీమ్ సభ్యుడు టిమ్ డౌనింగ్‌తో భేటీ

టొరంటో (కెనడా):
కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు (CPPIB) గ్లోబల్ పబ్లిక్ ఎఫైర్స్ టీమ్ సభ్యుడు టిమ్ డౌనింగ్‌తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…
ఆంధ్రప్రదేశ్‌లో విస్తారమైన సోలార్, విండ్ ఎనర్జీ అవకాశాలు ఉన్నాయని, రాష్ట్రాన్ని Renewable Energy Hub గా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.

సీపీపీఐబీ ద్వారా రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రానికి ఉన్న 1053 కిమీ తీరం, ప్రధాన పోర్టులు, సమగ్ర లాజిస్టిక్స్ వ్యవస్థ ఆర్థిక వృద్ధికి అత్యంత కీలకం అని లోకేష్ గారు వివరించారు.
పోర్టులు, లాజిస్టిక్స్ రంగాల్లో సీపీపీఐబీకి ఉన్న విశాల అనుభవాన్ని గుర్తుచేస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను అన్వేషించాలని కోరారు.

అంతర్జాతీయంగా Maersk వంటి సంస్థలు ఇప్పటికే ఏపీలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని, లాజిస్టిక్స్ రంగంలో పెద్ద అవకాశాలు ఉన్నాయని తెలిపారు.



రహదారులు – టోల్ ప్రాజెక్టులు – అమరావతి మౌలిక సదుపాయాలపై ఆహ్వానం

ఏపీలో రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు భారీ మూలధనం అవసరమని,
• టోల్ రోడ్లు
• రవాణా మౌలిక వసతులు
రంగాల్లో సీపీపీఐబీ పెట్టుబడులను కోరారు.

సీపీపీఐబీ ప్రపంచవ్యాప్తంగా Mixed-Use Projects, ప్రధాన నగర మౌలిక వసతుల్లో పెట్టుబడులు పెట్టిన అనుభవం ఉన్నందున, అమరావతిలో పెట్టుబడులను అన్వేషించాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించేందుకు Master Funds ఏర్పాటు చేసిందని,
CPPIB ఈ ఫండ్‌లో Anchor Investorగా మారాలనీ లేదా ప్రత్యేక ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించాలని లోకేష్ గారు కోరారు.



టిమ్ డౌనింగ్ స్పందన

సీపీపీఐబీ ప్రతినిధి టిమ్ డౌనింగ్ మాట్లాడుతూ…
ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థ నిర్వహణలో $700 బిలియన్ ఆస్తులు ఉన్నాయని తెలిపారు.

టొరంటో కేంద్రంగా పనిచేసే సంస్థకు:
• హాంకాంగ్
• లండన్
• లక్సెంబర్గ్
• ముంబై
• న్యూయార్క్
• శాన్ ఫ్రాన్సిస్కో
• సావ్ పాలో
• సిడ్నీ
• టోక్యో

వంటి గ్లోబల్ నగరాలలో కార్యాలయాలు ఉన్నాయని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా 65 దేశాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని టిమ్ డౌనింగ్ తెలిపారు.

🌎 LN – US Tour Day - 5📰 Press Release – 2నల్లమలలో పనామా సిటీ తరహా స్టెర్లింగ్ రిసార్ట్స్ ఏర్పాటుచేయండి – మంత్రి నారా లోక...
11/12/2025

🌎 LN – US Tour Day - 5
📰 Press Release – 2

నల్లమలలో పనామా సిటీ తరహా స్టెర్లింగ్ రిసార్ట్స్ ఏర్పాటుచేయండి – మంత్రి నారా లోకేష్

ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ సీఈవో ప్రేమ్ వాత్సాతో మంత్రి లోకేష్ భేటీ

టొరంటో (కెనడా):
ఫెయిర్ ఫాక్స్ (Fairfax) ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ సీఈవో ప్రేమ్ వాత్సాతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…
కుప్పం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని వేగంగా పూర్తిచేయడంలో ఫెయిర్ ఫాక్స్ సహకారం అందించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం & హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనీ, ముఖ్యంగా ఫెయిర్ ఫాక్స్ అనుబంధ సంస్థ Sterling Resorts ద్వారా రాష్ట్రంలోని హోటల్, టూరిజం అభివృద్ధికి చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే —
ఫ్లోరిడాలోని Panama City తరహాలో, నల్లమల అడవుల్లో Sterling Resorts ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలి అని సూచించారు.

ఇది రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి కీలకంగా మారుతుందని లోకేష్ గారు వివరించారు.



ప్రేమ్ వాత్సా స్పందన

ఫెయిర్ ఫాక్స్ సీఈవో ప్రేమ్ వాత్సా మాట్లాడుతూ…
తమ సంస్థ టొరంటో కేంద్రంగా పనిచేస్తూ,
• నార్త్ అమెరికా
• లాటిన్ అమెరికా
• యూరప్
• ఆసియా
• ఆఫ్రికా

లాంటి అనేక ఖండాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

భారతదేశంలో Bengaluru International Airport, National Stock Exchange, Sanmar Chemicals వంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ప్రేమ్ వాత్సా అన్నారు.

(ఫెయిర్ ఫాక్స్ సంస్థ సుమారు $30 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉంది.)



🌎 LN – US Tour Day - 5📰 Press Release – 1ఆంధ్రప్రదేశ్‌లో కెనడియన్ పెట్టుబడులకు సహకారం అందించండి – మంత్రి నారా లోకేష్బిజి...
11/12/2025

🌎 LN – US Tour Day - 5
📰 Press Release – 1

ఆంధ్రప్రదేశ్‌లో కెనడియన్ పెట్టుబడులకు సహకారం అందించండి – మంత్రి నారా లోకేష్

బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గోల్డీ హైదర్‌తో మంత్రి లోకేష్ భేటీ

టొరంటో (కెనడా):
స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులకు సహకారం అందించాల్సిందిగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.

బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా (Business Council of Canada – BCC) అధ్యక్షుడు గోల్డీ హైదర్‌తో టొరంటోలో మంత్రి లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

లోకేష్ గారు మాట్లాడుతూ…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ పాలనా అనుభవం, సైబరాబాద్ వంటి నగరాల నిర్మాణంలో చూపిన దూరదృష్టి, మంచి పాలన వల్ల గత 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌కు ₹20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు.

రాష్ట్ర పెట్టుబడి వాతావరణాన్ని వివరించిన లోకేష్ గారు ముఖ్యాంశాలు:
• 1053 కిమీ విస్తీర్ణ తీరరేఖ, సమగ్ర లాజిస్టిక్స్ నెట్‌వర్క్
• విశాలమైన రోడ్లు, రైల్వే కనెక్టివిటీ
• 6 ఆపరేషనల్ పోర్టులు + 6 ఎయిర్‌పోర్టులు
• త్వరలో ప్రారంభం కాబోయే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, కొత్తగా పూర్తవుతున్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు
• VCIC – Visakhapatnam–Chennai Industrial Corridor లో పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధమైన భూమి & మౌలిక సదుపాయాలు

గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, రిలయన్స్ వంటి గ్లోబల్ సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయని,
టీసీఎస్, కాగ్నిజంట్ వంటి ఐటి సంస్థలు, డేటా సెంటర్లు రావడంతో విశాఖపట్నం విశ్వనగరం స్థాయికి ఎదుగుతోందని తెలిపారు.

“ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం” అని పేర్కొంటూ, కెనడియన్ కంపెనీలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలన్నారు.



గోల్డీ హైదర్ స్పందన

గోల్డీ హైదర్ మాట్లాడుతూ…

తమ సంస్థ కెనడాలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థల సీఈవోలు, వ్యాపారవేత్తలతో కలిసి దేశ ఆర్థిక వ్యవస్థ, పోటీతత్వం, గ్లోబల్ ప్రతిష్ట బలోపేతానికి కృషి చేస్తోందని తెలిపారు.

150కు పైగా సంస్థలు BCCలో భాగస్వాములుగా ఉన్నాయని, ఇవి కలిపి 1.7 మిలియన్ కెనడియన్లకు ఉపాధి కల్పిస్తూ, దేశ GDPలో గణనీయమైన వాటా కలిగి ఉన్నాయని వివరించారు.

BCC ప్రధాన ఫోకస్ రంగాలు:
• పన్ను సంస్కరణలు
• ఆర్థిక క్రమశిక్షణ
• పెట్టుబడుల ఆకర్షణ
• వాణిజ్యం & అంతర్జాతీయ సంబంధాలు
• USMCA, CPTPP వంటి వాణిజ్య ఒప్పందాల పురోగతి
• సరఫరా దారుల బలోపేతం
• AI వినియోగం, సైబర్ సెక్యూరిటీ, టెక్ ఆధారిత ఉత్పాదకత
• క్లీన్ టెక్నాలజీ, కార్బన్ ప్రైసింగ్ ఫ్రేమ్‌వర్క్
• నిలకడైన వనరుల అభివృద్ధి

అలాగే G7, B20, World Economic Forum వంటి వేదికల్లో కెనడియన్ వ్యాపార ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో కెనడియన్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు తమవంతు సహకారం అందిస్తామని గోల్డీ హైదర్ భరోసా ఇచ్చారు.

• ప్రజల మంచి కోసమే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం సానుకూలంగా అమలవాలి — మంత్రులు, హెచ్‌ఓడీలు, కార్యదర్శుల సదస్సులో సీఎం...
11/12/2025

• ప్రజల మంచి కోసమే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం సానుకూలంగా అమలవాలి — మంత్రులు, హెచ్‌ఓడీలు, కార్యదర్శుల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం.

• ప్రతి కుటుంబంలో ఒక AI ప్రొఫెషనల్ ఉండాలనేది సీఎం చంద్రబాబు గారి విజన్ — శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ గారు.

• పదోన్నతులతో ఎంత సంబరపడ్డారో… మీరు అందించే సేవల ద్వారా ప్రజలు కూడా అంతే సంతోషపడాలి — పంచాయతీరాజ్ ఉద్యోగులతో భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు.

• అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్‌కు రైతులు స్వచ్ఛందంగా భూమి పత్రాలను అందిస్తున్నారు — పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు.

• ఆర్థిక నేరస్తుడైన జగన్‌ను ఆర్థికవేత్తగా చూపించే ప్రయత్నం వైసీపీ నేతలది… ప్రజలు వీరి మాటలు విని నవ్వుకుంటున్నారు — రాష్ట్ర గనులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు.

తిరుమల సమాచారం — 11-12-2025• తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ• ఉచిత దర్శనం: 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నారు• ...
11/12/2025

తిరుమల సమాచారం — 11-12-2025
• తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
• ఉచిత దర్శనం: 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నారు
• సర్వదర్శనం భక్తులకు: 12 గంటలు ⏳
• ₹300 శీఘ్ర దర్శనం: 3–4 గంటలు ⏳
• సర్వదర్శనం టోకెన్ ఉన్న భక్తులకు: 4–6 గంటలు ⏳

నిన్నటి గణాంకాలు (10-12-2025):
• స్వామివారిని దర్శించిన భక్తులు: 68,165
• తలనీలాలు సమర్పించిన భక్తులు: 25,087
• హుండీ ఆదాయం: ₹3.81 కోట్లు 💰

ఓం నమో వేంకటేశాయ 🙏

11/12/2025

*🙏 శుభోదయం 🙏*

*ముఖ్యమంత్రి కార్యాలయం, ఆంధ్రప్రదేశ్*

*నేటి వార్తాపత్రికల్లోని ప్రధాన వార్తలు/తేది.11.12.2025*

*ఈనాడు*
1. సాకులు చెబితే సహించను - దస్త్రాల పరిష్కారంలో మంత్రుల జాప్యం పై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి - ఏడు రోజుల్లో గా పూర్తి కాకుంటే వివరణ ఇవ్వాలన్న సీఎం - సగటున 15 రోజులపైగా సమయం తీసుకొని అట్టడుగున్న నిలిచిన రాంప్రసాద్ రెడ్డి - రెండు రోజుల్లోనే పరిష్కరించి టాప్ లో డోలా - ఆరో స్థానంలో చంద్రబాబు - అత్యధికంగా 6,650 పరిష్కరించిన సీఎం - 9వ స్థానంలో లోకేష్ - 11వ స్థానంలో పవన్

2. వివేకా హత్య కేసులో పాక్షికంగా తదుపరి దర్యాప్తునకు అనుమతి - కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి ల సంబంధం తేల్చాలి - అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేయాలి - సునీత పిటిషన్ పై సిబిఐ కోర్టు తీర్పు

3. డ్రోన్ల తయారీ రంగంలో సహకరించండి - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ నీ కోరిన మంత్రి లోకేష్ - అమెరికాలో అడోబ్, ఇంటెల్, జూమ్ సంస్థల ప్రతినిధులతో భేటీలు

4. హెచ్ 1బి ఇంటర్వ్యూల వాయిదా పిడుగు - వేల మంది భారతీయులపై వెట్టింగ్ దెబ్బ - ఆకస్మిక నిర్ణయం తీసుకున్న అమెరికా - ఇప్పటికే భారత్ కు వచ్చినవారు ఇక్కడే చిక్కుకుపోయే పరిస్థితి - మిగిలిన కేటగిరిలపైన ప్రభావం

5. శ్రీవారి సేవలో పట్టు దగా - పట్టుకు బదులు పాలిస్టర్ శాలువాలు - బయట పెట్టిన విజిలెన్స్ నివేదిక

6. పరకామణిలో చోరీ కేసు సమాచారాన్ని ఈడి, ఐటి విభాగాలతో పంచుకోండి - సిఐడి, ఏసీబీ డీజీలను ఆదేశించిన హైకోర్టు

7. కల్తీ నెయ్యి పై నిర్ణయం సుబ్బారెడ్డిదే - మాజీ జిఎం సుబ్రహ్మణ్యం వెల్లడి

8. దీపావళికి యునెస్కో గుర్తింపు - సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు

9. ప్రయాణికులకు ఇండిగో చైర్మన్ క్షమాపణ - కొనసాగుతున్న విమాన సర్వీసుల రద్దు - పూర్తి వివరాలతో రావాలని ఇండిగో సీఈవోకు డిజిసిఏ ఆదేశం

10. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించండి - ఎన్డీఏ ప్రజా ప్రతినిధులకు సీఎం సూచన - ఉల్లి బకాయిలు విడుదల చేయండి - శుభాబుల్ కు ధర కల్పించండి - పంట ఉత్పత్తుల కొనుగోళ్లపై సమీక్ష సందర్భంగా ఆదేశం- సిసిఐ పత్తి కొనుగోళ్లపై అసహనం - కేంద్రానికి లేఖ రాయాలని సూచన

11. ఆయనో అవినీతి అనకొండ - విశ్రాంత ఈఎన్ సీ శ్రీనివాస్ అక్రమాస్తులపై కేసు నమోదు - ఏకకాలంలో ఏడు చోట్ల సోదాలు - కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

12. 12న శాఖలో ఏడు ఐటి సంస్థలకు భూమి పూజ - హాజరుకానున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్

13. నూటికి నూరు శాతం జగనన్నే నా వెనుక ఉన్నారు - . ఆయనే నాకు బెయిల్ ఇప్పించారు - వెల్లడించిన రౌడీ షీటర్ అనిల్ కుమార్

14. నేడు మాచర్లలో లొంగిపోనున్న పిన్నెల్లి సోదరులు

15. బిజినెస్ రూల్స్ లో సవరణలు చేస్తాం - దీనికి మంత్రులు నిపుణులతో కమిటీ - దస్త్రాల టెంపరింగ్ కు అవకాశం లేకుండా బ్లాక్ చైన్ విధానం - జనవరి 15 నాటికి అన్ని సేవలు ఆన్లైన్ లోకి తీసుకు రావాల్సిందే

16. పింఛన్ల పంపిణీ పై 88.5% సంతృప్తి - అన్న క్యాంటీన్లో భేష్ - బస్టాండ్లో సౌకర్యాలు అధమం - అభిప్రాయ సేకరణలో ప్రజల మనోగతం

17. ప్రజలకు నచ్చేలా పాలన లేకుంటే బంగారం ఇచ్చిన ఉపయోగం లేదు - ఎవరు తప్పు చేసిన ఆ ప్రభావం ప్రభుత్వం పై ఉంటుంది - రుణాల రీ షెడ్యూల్ వలన 7000 కోట్ల ఆదా - కేంద్ర పథకాల నిధులు ఎందుకు ఖర్చు చేయరు? - మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు చురకలు

18. మామిడి రైతుకు లాభాల కవర్ - టన్నుకు రు 9000 ఖర్చు - రాబడి రూ 30000 వరకు - ఫ్రూట్ కేర్ గ్రోకవర్ణ తో అరటి దానిమ్మలోనూ నాణ్యమైన పంట - హెచ్వోడీల సమావేశంలో ఉద్యాన శాఖ ప్రజెంటేషన్

19. ప్రకృతి వైపరీత్యాలతో ఏపీలో ఈ ఏడాది 530 మంది మృతి

20. పోరాటాలతోనే చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు - బిసి హక్కుల సెమినార్ లో పలువురు ఎంపీల పిలుపు

*ఆంధ్రజ్యోతి*

21. పల్లెల్లో పట్టణ స్థాయి సేవలు - సంస్కరణలకు అత్యంత ప్రాధాన్యం - ప్రధాని, సీఎం నేతృత్వంలో మార్పు - ప్రజల సంతోషమే ముఖ్యం - ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చాము - ఆ మేరకు ఫలితాలు రావాలి - వైసిపి హయాంలో పదోన్నతులు బదిలీలకు బేరం పెట్టారు - ఆర్థికం గాడిన పడితేనే అన్నీ చేస్తాం - ఉద్యోగినులను వేధించొద్దు - పంచాయతీరాజ్ మాటామంతిలో డిప్యూటీ సీఎం పవన్

22. ప్రాయోజిత సంక్షోభం? - ఇండిగో విమానాల రద్దు ఉద్దేశపూర్వకమే కావచ్చు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

23. మత్తు అడ్డాలుగా విద్యాలయాలు - 11 ఏళ్లకే పిల్లల్లో డ్రగ్స్ వినియోగం - గోప్యంగా సర్వే జరిపిన మెడికల్ బృందాలు - ప్రతి ఏడు స్కూళ్లలో ఒక చోట డ్రగ్స్ భూతం

24. స్క్రబ్ టైఫస్ కు డ్రగ్ రెసిస్టెన్స్ గండం - చికిత్సలో బలహీనంగా మారుతున్న డాక్సిసైక్లిన్ - అందుకే మరణాలు సంభవిస్తున్నాయని ఆందోళన - జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల పైనే వైద్యుల ఆశలు - ఎయిమ్స్, పూణె, వెల్లూరుకు రక్త నమూనాలు

25. ఆ 12 మంది పై ప్రాసిక్యూషన్ - టిటిడి ఈవో అనుమతి కోరుతూ సిట్ లేఖ - కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు చివరి దశకు - నిందితులుగా తొమ్మిది మంది టీటీడీ సిబ్బంది - నలుగురు పదవీ విరమణ - ఐదుగురు సర్వీస్ లో - మిగిలిన ఏడుగురు ఎవరనే చర్చ

26. అంతా కలిసే చేశారు - తక్కువ ఖర్చుతో ఎక్కువ సంపాదించాలనే మొలకలచెరువులో నకిలీ మద్యం తయారీ - జనార్ధన రావు పథకానికి జయ చంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డి సరేనన్నారు - జయచంద్రారెడ్డి చెప్పారని ఫోన్లు ధ్వంసం - ఎక్సైజ్ పోలీసులకు పిఏ రాజేష్ వాంగ్మూలం

27. మీ మతంలో జరిగితే ఇలానే స్పందించేవారా? - పరకామణి కేసులో జగన్ వ్యాఖ్యలపై పవన్ ఫైర్ - హిందువులు మెజారిటీ అనే భావన మిథ్యే : పవన్

*సాక్షి*

28. కోటి గళాల గర్జన - ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాలతో ర్యాలీలు

29. కొత్త సంవత్సరంలో కానుక - మళ్లీ రూ 15,651.93 కోట్ల కరెంటు చార్జీల వడ్డన - వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి కొత్త చార్జీలు - ఇప్పటికే ప్రజలపై రూ 17,349 కోట్ల మీద చార్జీల భారం

30. 18న గవర్నర్ తో వైయస్ జగన్ భేటీ

31. అమరావతి బిల్లు వెనక్కి తిప్పి పంపిన కేంద్రం

32. ఎవరిది విజన్? ఎవరిది విధ్వంసం? - సీఎం చంద్రబాబును నిలదీసిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

33. చొరబాటుదారుల ఓట్ల కోసమే - అందుకే ప్రతిపక్షాలు ఎస్ ఐ ఆర్ ను వ్యతిరేకిస్తున్నాయి - అక్రమంగా వలస వచ్చిన వారికి ఓటు హక్కు ఇవ్వాలా? - విపక్షాలపై కేంద్ర హోంశాఖ అమిత్ షా ఆగ్రహం - ఎన్నికల సంస్కరణలపై లోక్ సభలో ప్రత్యేక చర్చ

34. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను అడ్డుకోండి - కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు వై సి పి ఎంపీల విజ్ఞప్తి

*ఆంధ్రప్రభ*

35. భారత్ లో amazon పెట్టుబడి - మూడు లక్షల కోట్లు 2030 నాటికి ప్రణాళికలు - మైక్రోసాఫ్ట్ కంటే రెండు రెట్లు ఎక్కువ - తద్వారా 10 లక్షల ఉద్యోగాల సృష్టి - భారత్ లో ప్రణాళికలపై అమెజాన్ కీలక ప్రకటన

36. ఏఐలో ఏపీ టాప్ - ప్రతి కుటుంబంలో ఒక ఏఐ ప్రొఫెషనల్ - అనుభవం, దర్శినికత, సమర్థ నాయకత్వం ఏపీ సొంతం - మార్చిలో గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన - శాన్ ఫ్రాన్సిస్కో బె ఏరియా కౌన్సిల్ సమావేశంలో మంత్రి లోకేష్

37. నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం - అవకాశాల విస్తరణకు పెద్ద ఎత్తున నిర్ణయాలు

38. నేడు బిజెపి బస్సుయాత్ర - వాజ్పేయి శతజయంతోత్సవాల ప్రత్యేకం - అటల్ మోడీ సుపరిపాలన యాత్రకు సర్వం సిద్ధం - 19 చోట్ల విగ్రహాల ఆవిష్కరణలు - అన్ని చోట్ల బహిరంగ సభలు - 25 అమరావతిలో ముగింపు సభ - పాల్గొననున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

*ప్రజాశక్తి*

39. రీ సర్వే తో తగ్గిన భూ విస్తీర్ణం - ఆందోళనలో రైతాంగం - తగ్గిన విస్తీర్ణాన్ని సరిచేయాలంటూ లక్షకు పైగా ఫిర్యాదులు - ఆరు నెలల్లో 7,513 గ్రామాల్లో మళ్ళీ సర్వేకు యాక్షన్ ప్లాన్

40. ఇంటికో పారిశ్రామికవేత్త సరే.. ఉన్నవారిని ఆదుకోండి - ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ వెంటనే ఇవ్వాలి - ఏపీ జేఏసీ దీక్షలకు వి శ్రీనివాసరావు మద్దతు

41. సమయాన్నిబట్టి బాదుడు - చిరు వ్యాపారులు, పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీల పెంపు - ఏపీ ఈ ఆర్ సి కి డిస్కంల ప్రతిపాదన - జనవరి 20, 27 మధ్య పబ్లిక్ హియరింగ్

*విశాలాంధ్ర*

42. రైతుల సమస్యలు పట్టవా? - పంటలకు గిట్టుబాటు ధరలేవి? - మొంథా తుఫాను నష్టపరిహారం ఇచ్చేది ఎన్నడు? - ప్రభుత్వ నిర్లక్ష్యం పై అన్నదాతల ఆగ్రహం - సిపిఐ, రైతు సంఘాల రాష్ట్రవ్యాప్త ఆందోళనలు - సమస్యలు పరిష్కారం పరిష్కరించకుంటే పోరు ఉదృతం

43. అంగన్వాడీలతో చర్చలు జరపండి - వర్కర్లు, హెల్పర్లపై పని ఒత్తిడి - వేతనాల పెంపు, పదోన్నతులు ఇవ్వాలి - గుజరాత్ హైకోర్టు తీర్పును అమలు చేయాలి - చంద్రబాబుకు సిపిఐ నేత ఈశ్వరయ్య లేఖ

10/12/2025

🇺🇸✨ పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ గారితో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గారి భేటీ!
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కీలక చర్చలు… 🥰🥰😍😍

🚀 ఆంధ్రప్రదేశ్ తాజా అప్‌డేట్స్ – అభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతికత వైపు దూసుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం!• 🌅 పూర్వోదయ పథక...
10/12/2025

🚀 ఆంధ్రప్రదేశ్ తాజా అప్‌డేట్స్ – అభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతికత వైపు దూసుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం!

• 🌅 పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి వచ్చే నిధులతో మూడు ప్రాంతాల అభివృద్ధికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

• 🌐 పెట్టుబడుల ఆకర్షణ దిశగా – సాన్ ఫ్రాన్సిస్కోలో ప్రముఖ కంపెనీల సీఈఓలు & ప్రతినిధులతో వరుస భేటీలు చేసిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్.
రాష్ట్రానికి కొత్త అవకాశాలు, ఇన్నోవేషన్ కేంద్రాలు తీసుకురావడంపై కీలక చర్చలు.

• 🩺 ప్రభుత్వ చర్యలతో 48% తగ్గిన అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులను పూర్తిగా నిర్మూలించేందుకు వైద్య & ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు.

• 🏛️ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో సంపూర్ణ ఆటోమేషన్ — రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ప్రాసెస్ ఆటోమేటిక్‌గా జరిగే విధంగా వ్యవస్థను మార్చాలని రెవెన్యూ శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు.

• 🤖 ఏపీలో ఏఐ విశ్వవిద్యాలయం స్థాపనకు సహకరించాలని ఓపెన్‌ఏఐ సీటీఓ శ్రీనివాస నారాయణన్‌తో భేటీలో మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి.
రాష్ట్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌గా మార్చే దిశగా మరో అడుగు.

🌎 LN – US Tour Day - 4📰 Press Release – 5ఏపీలో డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి – మంత్రి నారా లోకేష్జూమ్ ప్రెసిడెంట్ శ...
10/12/2025

🌎 LN – US Tour Day - 4
📰 Press Release – 5

ఏపీలో డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి – మంత్రి నారా లోకేష్

జూమ్ ప్రెసిడెంట్ శంకరలింగంతో మంత్రి లోకేష్ భేటీ

శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్ఏ):
జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ ప్రొడక్ట్ & ఇంజనీరింగ్ విభాగం ప్రెసిడెంట్ వెల్చామి శంకరలింగం, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అపర్ణ బావాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…
అమరావతి లేదా విశాఖపట్నంలో Zoom R&D / Engineering Development Center‌ను ఏర్పాటు చేయాలని కోరారు. విశాఖపట్నంలో ప్రత్యేకంగా ఒక GCC (Global Capability Center) స్థాపన అంశాన్ని కూడా పరిశీలించాల్సిందిగా సూచించారు.

విద్యారంగంలో రిమోట్ లెర్నింగ్ విప్లవాత్మక మార్పులను చూపుతుందని ప్రస్తావిస్తూ —
పట్టణాల్లో ఉన్న నిపుణ ఉపాధ్యాయులను వేలాది గ్రామీణ విద్యార్థులతో అనుసంధానం చేయడానికి, నాణ్యమైన విద్య అందించడానికి వర్చువల్ క్లాస్‌రూమ్ నెట్‌వర్క్ ఏర్పాటులో జూమ్ సహకారం అందించాలని కోరారు.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా:
• టెలీమెడిసిన్ సేవలను విస్తరించడం,
• గ్రామీణ క్లినిక్స్‌లోని రోగులు జిల్లా ఆసుపత్రుల నిపుణ వైద్యులతో వీడియో కన్సల్టేషన్ ద్వారా సంప్రదించేలా ఒక సమగ్ర టెలీమెడిసిన్ నెట్‌వర్క్ ఏర్పాటుకు జూమ్ సాంకేతిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

జూమ్ ప్రెసిడెంట్ శంకరలింగం స్పందిస్తూ…
తమ సంస్థ బెంగుళూరు, చెన్నైలో ఉన్న టెక్నాలజీ సెంటర్ల ద్వారా భారత్ గ్లోబల్ R&D, ప్రొడక్ట్ ఇంజనీరింగ్‌లో కీలకపాత్ర పోషిస్తోందని, ఇన్నోవేషన్, సపోర్ట్ హబ్‌గా ఎదుగుతోందని తెలిపారు.

భారత ఐటి సంస్థలు, హెల్త్‌కేర్ రంగం, విద్యాసంస్థలు జూమ్ ప్లాట్‌ఫారమ్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు.

Address

Mangalagiri
522503

Alerts

Be the first to know and let us send you an email when Prasadu Darapaneni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share