Greater Mangalagiri

Greater Mangalagiri Local Activities About Mangalagiri

పట్టాభిరామునికి ప్రియవందనంపాప విదూరునికి జయవందనంఅయోధ్య రామునికి అభివందనంఅందాల దేవునికి మదే మందిరంశ్రీరామచంద్రమూర్తి కరుణ...
10/04/2022

పట్టాభిరామునికి ప్రియవందనం
పాప విదూరునికి జయవందనం
అయోధ్య రామునికి అభివందనం
అందాల దేవునికి మదే మందిరం

శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ...

అందరికీ #శ్రీరామనవమి శుభాకాంక్షలు!

జై లక్ష్మీనారసింహా.....!
12/03/2022

జై లక్ష్మీనారసింహా.....!

 #రేపటి_నుంచి_నృసింహుని_బ్రహ్మోత్సవాలు* 16న పొన్నవాహనోత్సవం.* 17న స్వామివార్ల కల్యాణోత్సవం* 18న దివ్య రథోత్సవం.మంగళాద్రి...
08/03/2022

#రేపటి_నుంచి_నృసింహుని_బ్రహ్మోత్సవాలు

* 16న పొన్నవాహనోత్సవం.

* 17న స్వామివార్ల కల్యాణోత్సవం

* 18న దివ్య రథోత్సవం.

మంగళాద్రి క్షేత్రంలో కొలువైన శ్రీ పానకాల లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచింది. దేశంలో అష్టవైష్ణవ క్షేత్రాలలో మహాపుణ్యక్షేత్రంగా పేరొందింది. ఎగువ సన్నిధిలో స్వామివారు పానకాన్ని సేవిస్తూ ఉండడం వల్ల పానకాల స్వామిగా పిలుస్తారు.

భక్తులు సమర్పించే పానకంలో సగం మాత్రమే స్వీకరిస్తారు. పానకం వొలికినా ఒక్క ఈగ కూడా ఉండకపోవడం క్షేత్రమహిత్యంగా చెప్పుకుంటారు. ఇక దిగువసన్నిధి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ద్వాపరయుగంలో పాండవుల అరణ్యవాస సమయంలో ధర్మరాజు ప్రతిష్ఠించారు. శ్రీకృష్ణదేవరాయలు మంటప నిర్మాణం గావించగా, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అతి ఎత్తయిన రాజగోపురాన్ని నిర్మించారు.

యుగయుగాల దేవుడు శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతియేటా ఫాల్గుణ శుద్ధ షష్ఠి నుంచి బహుళ విదియ వరకు 12 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. లోక కల్యాణార్థం దిగువ సన్నిధిలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది మార్చి 9వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే), ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ల నేతృత్వంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి కోటిరెడ్డి పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం పెళ్లి కుమారుడి ఉత్సవంతో ప్రారంభమయ్యే ఈ బ్రహ్మోత్సవాల్లో పొన్న వాహనోత్సవం, స్వామి వార్ల కల్యాణం, దివ్య రథోత్సవం అత్యంత ముఖ్య ఘట్టాలు. ఉత్సవాల్లో వరుసగా హనుమంత, రాజాధిరాజ, యాలి, సింహ, హంస, గజ, కల్పవృక్ష, పొన్న, అశ్వ వాహనాలపై స్వామి వారు తిరువీధులకు వేంచేస్తారు.

ొన్నవాహన_సేవ

మనలను మనం రక్షించుకొను ప్రయత్నం చేయునంతకాలం స్వామి మనను రక్షించడు. అన్యధా శరణం నాస్తి, త్వమేవశరణుమమ… అని రెండు చేతులు ఎత్తి ఎలుగెత్తి పిలవాలి. మన రక్షణ భారాన్ని స్వామియందే ఉంచాలి. అలా శరణుజొచ్చిన భాగవతోత్తములే గోపికలు. గోపికలను ఎలా రక్షించాడో అలాగే పొన్నవాహనోత్సవాన్ని దర్శించిన మనందరినీ శ్రీస్వామివారు రక్షిస్తారు.

్యాణ_మహోత్సవం.

స్వామి కల్యాణానికి ముందు చెంచులు తమ ఆడపడుచు చెంచులక్ష్మిని నరసింహస్వామి వివాహం చేసుకున్న గుర్తుగా ఆలయ ఆవరణలో ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీవారు శేషవాహనంపై గ్రామోత్సవంలో పాల్గొని ఎదుర్కోల ఉత్సవం జరుపుకొని అర్ధరాత్రి కల్యాణ వేదికను అలంకరిస్తారు. పట్టణ పద్మశాలీయ బహూత్తమ సంఘం వారు తమ ఆచారం ప్రకారం మధుపర్కాలు, మంగళ ద్రవ్యాలు సమర్పిస్తారు. వైకుంఠ నగరంలో శోభాయమానంగా ప్రకాశించే ఈ వేదికపై స్వామి వారి కల్యాణాన్ని తిలకించిన వారందరికీ శుభాలు కలుగుతాయి.

్రీవారి_దివ్యరథోత్సవం

‘రథస్థం కేశవ దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే’ రథారూఢుడైన స్వామిని దర్శిస్తే పునర్జన్మ ఉండదు. భక్తజనులు, ముక్కోటి దేవతలు ఈ దివ్య రథోత్సవాన్ని దర్శించి పులకించిపోతారు. పెద్ద రథం ఆరు చక్రాలతో అత్యంత సుందరంగా, గంభీరంగా ఉంటుంది. ఎంతో ఎత్తుతోపాటు అధిక బరువు కలిగి, పరిమళ పుష్పాలమాలతో గంభీరమైన ఈ మహారథం కదిలితే చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఈ క్రమంలో రథారూఢుడైన కల్యాణ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివార్లను దర్శించుకుని రథచక్రాలకు భక్తి పారవశ్యంతో టెంకాయలు కొట్టి ముక్తిని పొందాలని ప్రతి ఒక్క భక్తుడు అనుకుంటాడు. రథోత్సవంలో రథాన్ని లాగేందుకు వేలాది మంది పోటీపడతారు. రథ గమన వేగాన్ని నిర్దేశించేలా రథచక్రాలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్ల చప్పాల బృందం చప్పాలను వేస్తుంటుంది. ఈ మహోత్సవంలో ఒక కీలక పాత్ర వహించే అవకాశం రావడాన్ని చప్పాల బృందం మహత్ భాగ్యంగా భావిస్తుంది. మంగళగిరి తిరునాళ్ళుగా ప్రసిద్ధి గాంచిన రథోత్సవం నాడు భక్త జనం సంద్రాన్ని తలపించనుంది.





Mangalagiri Media
మంగళగిరి వైభవం
Mangalagiri Politics
మంగళగిరి వైభవం
మంగళగిరి
మంగళగిరి పద్మశాలి

నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు...
23/01/2022

నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు...

మీకు, మీ కుటుంబ సభ్యులకు #భోగి_పండుగ శుభాకాంక్షలు...
14/01/2022

మీకు, మీ కుటుంబ సభ్యులకు

#భోగి_పండుగ శుభాకాంక్షలు...

నమో... నారసింహ!ఉత్తరద్వారంలో నృసింహుని దివ్యదర్శనంతరించిన భక్తకోటి
13/01/2022

నమో... నారసింహ!

ఉత్తరద్వారంలో నృసింహుని దివ్యదర్శనం

తరించిన భక్తకోటి

సంక్రాంతి నేపథ్యంలో కోడి పందేలు నిర్వహించే వారిపై కఠిన చర్యలుపేకాట కేసుల్లో తరచూ పట్టు బడితే రౌడీ షీట్ తెరుస్తాంమంగళగిరి...
06/01/2022

సంక్రాంతి నేపథ్యంలో కోడి పందేలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు

పేకాట కేసుల్లో తరచూ పట్టు బడితే రౌడీ షీట్ తెరుస్తాం

మంగళగిరి అర్బన్ సిఐ అంకమ్మరావు హెచ్చరిక

సంక్రాంతి పండగ నేపథ్యంలో ఎవరైనా కోడి పందేలు నిర్వహిజ్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంగళగిరి అర్బన్ సిఐ బొప్పన అంకమ్మరావు హెచ్చరించారు.ఈ సందర్భంగా ఆయన గురువారం మాట్లాడుతూ,కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు అనుమానం వున్న వారిపై ఇప్పటికే బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.గతంలో కోడి పందేలు నిర్వహించిన ప్రదేశాలు,వ్యక్తులపై నిఘా పెట్టినట్లు స్వష్టం చేశారు.పేకాట ఆడుతూ ఎవరైనా పట్టు బడితే కేసులు నమోదు చేస్తామని రెండు కన్నా ఎక్కువ కేసులు నమోదైతే అటువంటి వారిపై రౌడీ షీట్ తెరుస్తామని హెచ్చరించారు.జూదానికి బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని సిఐ హితవు పలికారు.ప్రశాంత వాతావరణంలో కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పండగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 #కలియుగ_దైవంపై_కనక_వర్షంకలియుగదైవమైన మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిపై భక్తులు కానక వర్షం కురిపించారు. ఎగువ, ది...
06/01/2022

#కలియుగ_దైవంపై_కనక_వర్షం

కలియుగదైవమైన మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిపై భక్తులు కానక వర్షం కురిపించారు. ఎగువ, దిగువ సన్నిధులతోపాటు ఉపాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులచే సమర్పించిన కానుకల హుండీలను గురువారం లెక్కించారు. కానుకల హుండీల ద్వారా ఈ మరు రికార్డు స్థాయి ఆదాయం లభించింది. ఆ వివరాలిలా ఉన్నాయి...

ఎగువ సన్నిధి : రూ. 20,24,573
దిగువ సన్నిధి : రూ. 16,18,753
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం : రూ. 89,502
అన్నదానం : రూ. 50,896
----------------------------------------------------
మొత్తం : రూ. 37,83,724
----------------------------------------------------

గత ఏడాది ఇదే పీరియడ్లో రూ. 22,70,439 లు ఆదాయంగా రాగా ఈ మారు రూ. 37,83,724 లు వచ్చింది. ఇది గతంలో కంటే రూ. 15,13,285 లు అదనం అన్న మాట.

Mangalagiri

నూతన సంవత్సరం లోప్రతి ఒక్కరి జీవితంలోఆనందాలు వెల్లివిరియాలనిప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ..మీకు, మీ కుటుంబ స...
01/01/2022

నూతన సంవత్సరం లో
ప్రతి ఒక్కరి జీవితంలో
ఆనందాలు వెల్లివిరియాలని
ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు
నూతన సంవత్సర శుభాకాంక్షలు...

ప్రెగడ ఆదిసుదర్శన సుందరరావు కన్నుమూతమంగళగిరి నగర ప్రముఖులు  శ్రీ ప్రెగడ ఆది సుదర్శన సుందరరావు కొద్దిసేపటి కిత్రం మరణించా...
28/12/2021

ప్రెగడ ఆదిసుదర్శన సుందరరావు కన్నుమూత

మంగళగిరి నగర ప్రముఖులు శ్రీ ప్రెగడ ఆది సుదర్శన సుందరరావు కొద్దిసేపటి కిత్రం మరణించారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రఖ్యాత విద్యాసంస్థ అయిన సీకే విద్యాసంస్థలకు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గా అమూల్యమైన సేవలు అందించిన ఆదిసుదర్శన సుందరరావు విద్యారంగ వ్యాప్తికి పాటుపడ్డారు. ఆయన చేనేత అనుబంధ రంగ వ్యాపారంలో విశేష గుర్తింపు పొందారు.

మంగళగిరిలో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ ప్రెగడ అంజయ్య, నరసమ్మ దంపతుల తృతీయ కుమారుడు అయిన ఆది సుదర్శన సుందరరావు 1941 ఏప్రిల్ 1న జన్మించారు. సీకే హైస్కూల్, గుంటూరు హిందూ కళాశాలలో విద్యనభ్యసించారు. అనంతరం తన తండ్రి నెలకొల్పిన ‘ప్రెగడ అంజయ్య అండ్ బ్రదర్స్ రంగునూలు వ్యాపారం’లోకి 1960వ సంవత్సరంలో అడుగుపెట్టారు. క్రమేణా వ్యాపార రంగంలో మెలకువలు నేర్చుకున్న వీరు 1978లో ‘శ్రీ హైమావతి యార్న్ అండ్ కలర్ కంపెనీ’ని స్థాపించి దిగ్విజయంగా నిర్వర్తిస్తూ వచ్చారు. ఆ తర్వాత 1983లో ‘శ్రీ రోహిణి డైస్ అండ్ కెమికల్స్’ను ప్రారంభించి తన వ్యాపార రంగాన్ని విస్తరించారు. మంగళగిరి నగరంలో ప్రముఖ వ్యాపార వేత్తగా గుర్తింపుపొందారు.

అటు వ్యాపారరంగంలో కొనసాగుతూనే సామాజిక పరమైన కార్యకలాపాల్లోనూ ప్రెగడ ఆది సుదర్శన సుందరరావు చురుకైన పాత్ర పోషించారు. మూడున్నర దశాబ్దాలకు పైగా సుదీర్ఘ చరిత్ర గల శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ కోశాధికారిగా అత్యుత్తమ సేవలందించారు. శ్రీ మార్కండేయ పద్మశాలీ కల్యాణమంటపం వర్కింగ్ కమిటీ సభ్యులుగాను, మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహూత్తమ సంఘం గౌరవ సలహా సభ్యులుగాను, పద్మశాలీయ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులుగాను తమ సామాజిక వర్గానికి విశేష సేవలందించారు.

ప్రెగడ ఆదిసుదర్శన సుందరరావు సతీమణి సామ్రాజ్యం. కుమారుడు ప్రెగడ అజయ్ కుమార్. కుమార్తె ఆషారాణి ఉన్నారు. అజయ్, అరుణ దంపతులు పాతమంగళగిరి హుస్సేన్ కట్ట సెంటర్ వద్ద అరుణోదయ హెచ్ పీ గ్యాస్ ఏజెన్సీని నిర్వహిస్తున్నారు.

గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ మంగళవారం మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.ఈ సందర్భంగా తొలుత స్టేషన్ ఆవరణలో...
28/12/2021

గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ మంగళవారం మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.ఈ సందర్భంగా తొలుత స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి పోలీస్ సిబ్బంది సౌకర్యార్థం నిర్మించిన విశ్రాంతి గదిని ప్రారంభించారు.

Address

Mangalagiri
522503

Website

Alerts

Be the first to know and let us send you an email when Greater Mangalagiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share