01/10/2025
*చట్ట వ్యతిరేక “అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదు – జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్*”
గుంటూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వకుల్ జిందాల్ ఆకస్మిక తనిఖీలతో తన పర్యటనను ప్రారంభించారు. బుధవారం ఆయన మంగళగిరి పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లను పరిశీలించి, స్థానిక పోలీసు సిబ్బందితో సమావేశమయ్యారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.మంగళగిరి పరిధిలో గంజాయి సమస్య, ట్రాఫిక్ సమస్యలను ప్రధానంగా గుర్తించామని, వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు... బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేస్తూ ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో అలాంటి చర్యలు ఇతరులకు అసౌకర్యం కలిగిస్తే కఠినంగా వ్యవహరించడం తప్పదని ఆయన పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని, శాంతి భద్రతల భంగానికి కారణమయ్యే వ్యక్తుల సమాచారం పోలీసులకు ఇవ్వాలని ఎస్పీ కోరారు...రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలపై సమీక్షించి, సంబంధిత అధికారులతో చర్చించినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేలా అన్ని స్థాయిల్లో చర్యలు తీసుకోవాలని సూచనలు చేసినట్లు తెలిపారు.... సిబ్బంది కొరతను రాబోయే నియామకాలలో సిబ్బంది కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు. “పోలీసులు ప్రజలకు దగ్గరగా ఉండాలి, స్నేహభావంతో మెలగాలి. ప్రజలకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవడమే మా ప్రధాన కర్తవ్యం” అని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు.