
04/09/2025
🚨 ఉండవల్లి నుంచి కీలక నిర్ణయాలు! 🚨
గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘం హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో:
✅ గంజాయి & డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ ఆర్థిక మూలాలను ఛేదించి ఉక్కుపాదం మోపాలి.
✅ శాటిలైట్ + డ్రోన్ చిత్రాలను AI విశ్లేషణ ద్వారా సాగును గుర్తించాలి.
✅ విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు – ప్రతి నెలలో ఒక శనివారం “Eagle Clubs” ద్వారా.
✅ డి-అడిక్షన్ సెంటర్లకు ప్రత్యేక కార్యాచరణ.
✅ సరిహద్దు రాష్ట్రాలతో సమన్వయం చేసి రవాణా అరికట్టాలి.
✅ RTGS ద్వారా డ్యాష్బోర్డు రూపకల్పన – కేసుల పురోగతి & హాట్స్పాట్ల ట్రాకింగ్.
👥 పాల్గొన్న వారు: హోంమంత్రి వంగలపూడి అనిత, నారా లోకేష్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, గుమ్మడి సంధ్యారాణి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఈగల్ టీం అధికారులు.