Samatha Media

Samatha Media ప్రతిక్షణం ప్రజలకోసం

02/05/2023
23/04/2023
*మహనీయుల జయంతి’ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలి**సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్**రామగుండం, ఏప్రిల్ 1: మహ...
01/04/2023

*మహనీయుల జయంతి’ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలి*

*సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్*

*రామగుండం, ఏప్రిల్ 1: మహనీయుల జయంతి ఉత్సవాలను కుల,మత భేద తారతమ్యం లేకుండా పార్టీలకతీతంగా అందరూ భాగస్వాములై ఘనంగా జరుపుకోవాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ పిలుపునిచ్చారు . శనివారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రామగుండం మజీద్ కార్నర్ లో నిర్వహించిన మొదటి రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ నవభారత నిర్మాణం కోసం ఎంతో శ్రమించి ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించారన్నారు .కానీ పాలకులు రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుల త్యాగాల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఏప్రిల్‌ 5న బాబుజగ్జీవన్‌ , ఏప్రిల్‌14న అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల్లో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. అదేవిధంగా ఏప్రిల్ 3న రామగుండం కార్పొరేషన్ 1వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించనున్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతకాని మహర్ సంఘం స్టీరింగ్ కమిటీ చైర్మన్ దుర్గం నరసయ్య సమత సైనిక దళ్ పెద్దపల్లి జిల్లా నాయకులు దూట రాజు, దుర్గం కిరణ్, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం హౌసింగ్ బోర్డ్ కాలనీ అధ్యక్షులు కల్వల శ్రీనివాస్,కమిటీ సభ్యులు ఆరుముళ్ళ దుర్గాప్రసాద్, శ్రీనివాస్, ఆరుముళ్ల బాపు, ఆరుముళ్ల సదానందం,గొట్టే తిరుపతి,కల్వల మహేందర్, ముల్కల రాజయ్య,అరుముళ్ల రాజయ్య,ఈదునూరి పోచం, ఒడ్డెపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు*

*🪷మహాత్మా జోతిరావు ఫూలే భారతీయ సమాజ పరివర్తన కోసం ఉద్యమాన్ని నడిపారు.ఫూలే భార్య సావిత్రి బాయిని మొట్టమొదటి ఉపాధ్యాయినిగా...
07/02/2023

*🪷మహాత్మా జోతిరావు ఫూలే భారతీయ సమాజ పరివర్తన కోసం ఉద్యమాన్ని నడిపారు.ఫూలే భార్య సావిత్రి బాయిని మొట్టమొదటి ఉపాధ్యాయినిగా తీర్చిదిద్ది విద్యకు దూరమైన బహుజనులకు విద్యను అందించారు. ఈ దంపతులు బహుజనుల హితం కోసం, బహుజనుల సుఖం కోసం అహర్నిశలు శ్రమించారు.*

*🌻సామాజిక పరివర్తన కొరకు పాటుపడేవాళ్ళకు కనీస అవసరాలు తీర్చుకొనేందుకు కూడా తోడ్పాటును అందించే వాళ్ళు ఉండరు. అభ్యుదయం ముసుగులో, సంస్కర్తల్లా నటించేవాళ్ళకు,కపట సన్యాసులకు దానాలు ఇచ్చే సమాజం మనది.*

*🍀ఫూలే కుటుంబం ఆనాడు తమ కుటుంబం గడవడానికి చాలా కష్టాలు పడ్డారు.సావిత్రి బాయి ఫూలే చిన్న చిన్న పనులు చేసి తమ కుటుంబానికి డబ్బులు సమకూర్చేది.సావిత్రి బాయి బొంతలు కూడా కుట్టి ఇల్లు గడవడానికి, సామాజిక పరివర్తన కొరకు డబ్బులు సమకూర్చేది.*

*🌷మాతా రమాబాయి అంబేడ్కర్ సహధర్మచారిణి.అంబేడ్కర్-రమాబాయి పుణ్య దంపతులకు 1924 నాటికి ఐదుగురు పిల్లలు కలిగారు.మొట్టమొదటి తనయుడు యశ్వంత్ రావు.అంబేడ్కర్ కు గురువు మహాత్మా జోతిరావు ఫూలే. ఫూలే దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఒక బ్రాహ్మణ వితంతువు తన ఆశ్రమంలో బిడ్డను కని వదిలేసి వెళ్ళిపోతే ఆ బిడ్డకు యశ్వంత్ రావు అని పేరు పెట్టి ఫూలే దంపతులు తమ తనయుడిగా దత్తత తీసుకున్నారు.యశ్వంత్ రావును డాక్టర్ చదివించి యశ్వంత్ రావు చేత సమాజంలో బహుజనులకు వైద్య సేవలు కూడా అందించారు. అంబేడ్కర్ ఈ యశ్వంత్ రావు పేరునే తన గురువును స్ఫూర్తిగా తీసుకుని తన తనయునికి పెట్టుకున్నారు.*

*🪷అంబేడ్కర్ -రమాబాయి దంపతుల రెండో తనయుడు గంగాధర్, మూడో తనయుడు రమేశ్, నాలుగో తనయ ఇందు‌,ఐదో తనయుడు రాజారత్న.అంబేడ్కర్ ను చదివించిన శూద్ర రాజులు శాయాజీ రావు గైక్వాడ్,ఛత్రపతి సాహూ మహరాజ్ పట్ల గల కృతజ్ఞతలతో తన తనయునికి రాజారత్న పేరు పెట్టుకొన్నారు.*

*🌹భాయ్ ఖల్లా చేపల బజారు పరిణయ వేదిక:*

*🌼ముంబాయి నగర సబ్ స్టేషన్ లో గల భాయ్ ఖల్లాలోని చేపల బజారులో ఉన్న ఖాళీ స్థలంలోని కప్పు కింద అంబేడ్కర్-రమాబాయి పరిణయం జరిగింది.రాత్రి ఈ దంపతులకు పరిణయం ఎంతో ఆనందంగా జరిగింది.అర్థరాత్రి చెడు వాసన గల మురికి నీరు ప్రవహిస్తోన్న ఆ బజారులో తెల్లవారితే చేపల వాళ్ళు వచ్చేస్తారు.ఈలోగా ఈ దంపతులకు పరిణయం పూర్తి చేశారు.*

*🍃పిడకలు చేసి జీవనాన్ని సాగించిన అంబేడ్కర్ భార్య:*

*🌺రమాబాయి ఉదయాన్నే త్వరగా మేల్కొని తన తనయుడు యశ్వంత్ రావును తన కూడా తీసుకుని వర్లి గ్రామానికి వెళ్ళి పేడను ఏరి రాత్రి సమయానికి పేడ ఉన్న గంపను తీసుకుని వచ్చేది.తక్కువ ఖర్చుతో ఇంధనంతో అన్నం వండుకోవడానికి రమాబాయి పోథ్ బాబడి నుండి దాదర్ మహీమ్ వరకూ రాత్రి 8నుండి 9 గంటల వరకు పేడను సేకరించి మోసుకొని వచ్చేది.*

*🌸రమాబాయి ఈ విధంగా పేడ తట్టను మోస్తుంటే ఇరుగు పొరుగు స్త్రీలు రమాబాయి ను సూటిపోటి మాటలతో ఎత్తి పొడిచేవారు.'ఒక లాయర్ పెళ్ళాం అయి ఉండి కూడా ఇలా పేడకాళ్ళు మోస్తూ నువ్వు నీ మొగుడి గౌరవాన్ని మట్టిలో కలుపుతున్నావు.ఇది నీకు తగునా అంటూ' చుట్టుప్రక్కల మహిళలు రమాబాయితో అనేవాళ్ళు.అంబేడ్కర్ కూడా రమాబాయి ను తలపై పేడతట్టను మోయవద్దని మందలించేవారు.అయితే రమాబాయి ఇవేమీ పట్టించుకోకుండా ఉండేది. గ్రామాల్లో పేడ చౌకగా దొరకడంతో పేడ కోసం రమాబాయి గ్రామానికి వెళ్ళేది.ఇంటి పనికి మనమెందుకు సిగ్గుపడాలని రమాబాయి అంబేడ్కర్ తో అనేది. రమాబాయి పొదుపును పాటించి సంసార జీవితాన్ని సక్రమంగా సాగేలా చూసుకొన్నారు.*

*✍️ఎ.ఎన్. బోధి*

*🔹జై భీమ్ జై భారత్⛩️*

ఏజెన్సీ దళితుల సమస్యలపై మాట్లాడండిపుట్టిన భూమి హక్కు లేదు, రాజకీయ రిజర్వేషన్ లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు75 సంవత్సరాల స్వత...
03/02/2023

ఏజెన్సీ దళితుల సమస్యలపై మాట్లాడండి

పుట్టిన భూమి హక్కు లేదు, రాజకీయ రిజర్వేషన్ లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు

75 సంవత్సరాల స్వతంత్రంలో ఏజెన్సీ దళితులకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు

ఏజెన్సీ దళితుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయండి

12 లక్షల మంది దళితులకు ప్రత్యామ్నాయం చూపండి

సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్

ములుగు, ఫిబ్రవరి 3: తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలు అసెంబ్లీలో, పార్లమెంట్లో ప్రస్తుతం జరిగే సమావేశాల్లో ఏజెన్సీ దళితుల సమస్యలపై మాట్లాడాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏజెన్సీ దళితులకు వర్తించడం లేదని ఆవేదన చెందారు తాతలతండ్రుల కాలం నుండి ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న దళితులకు , పుట్టిన భూమిపై హక్కులు లేక రాజకీయ రిజర్వేషన్ లేక చదువుకున్న విద్యార్థులకు స్థానిక ఉద్యోగాల్లో అవకాశం లేక ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు . సాగు భూములకు, పోడు భూములకు హక్కు హక్కు పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వాలు ప్రవేశపెట్టే రైతు బీమా రైతుబంధు బ్యాంకు రుణాలు సబ్సిడీ విత్తనాలు మొదలైన సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు, రాజకీయం ఎదగాలన్న కనీసం సర్పంచ్ అయ్యే అవకాశం కూడా లేదన్నారు. విద్యార్థులకు డిగ్రీలు పేజీలు చదివిన జీవో 3 తో స్థానిక ఉద్యోగ నియమాకాల్లో అవకాశాలు లేక నిరుద్యోగులుగా ఉన్నారన్నారు. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఏజెన్సీ దళితులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఏ రంగంలో చూసిన అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన చెందారు..ఏజెన్సీ దళితుల అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కొంత బడ్జెట్ కేటాయించాలని, దళిత వాడలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని.ఏజెన్సీ దళితులను ఏజెన్సీ వాసులకు గుర్తించి ఎస్టీలతోపాటు సమాన హక్కులు కల్పించాలని కోరారు. సుప్రీంకోర్టు జీవో త్రీ రద్దు తీర్పును పకడ్బందీగా అమలు చేస్తూ ఏజెన్సీ ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు.

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలిసమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ జ్యోతి నగర్, జనవరి 7: ఇంటర్ డిగ్రీ ...
07/01/2023

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్

జ్యోతి నగర్, జనవరి 7: ఇంటర్ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థుల సమస్యలతో పాటు ,ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలికాలంలో దుప్పట్లు లేక, నాణ్యమైన ఆహారం లేక శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉంటూ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం కళాశాలల విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ,ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంటర్ ,డిగ్రీ కళాశాలల విద్యార్థులతో స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో నెలకొన్న విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని కోరారు. లేనియెడల సమతా సైనిక దళ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

అనాధలను ఆదరించాలిసమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్
26/11/2022

అనాధలను ఆదరించాలి

సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్

అనాధాలను ఆదరించాలి
26/11/2022

అనాధాలను ఆదరించాలి

25/11/2022

*అనాధలను ఆదరించడం -సామాజిక బాధ్యత*

*సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు ,సమతా ఫౌండేషన్ నిర్వాహకులు దుర్గం ప్రమీల, నగేష్ లు*

*గోదావరిఖని, నవంబర్ 25: అనాధలు, వృద్దులను వికలాంగులను ఆదరించడం సామాజిక బాధ్యత అని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు, సమత ఫౌండేషన్ నిర్వాహకులు మార్షల్ దుర్గం ప్రమీల- నగేష్ లు అన్నారు. శుక్రవారం తన కూతురు జోష్ణ శ్రీ (వెన్నెల) 5 వ జన్మదిన వేడుకలను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విటల్ నగర్ లోని అమ్మ పరివార్ ఆశ్రమ చిన్నారుల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆశ్రమంలోని విద్యార్థులకు స్వీట్లు. పండ్లు పంపిణీ చేశారు. ఆశ్రమ చిన్నారులు జోష్ణ శ్రీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పది కాలాలపాటు చల్లగా వర్ధిల్లుతూ భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం దుర్గం నగేష్ దంపతులు మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని ప్రతి ఒక్కరు తమ శక్తి మేరకు ఆనాధలకు సహాయం చేయాలన్నారు. తాము రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ స్థాపించిన సమతా సైనిక దళ్ సంస్థలో పని చేస్తూ , భారత రాజ్యాంగ రక్షణకు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నామన్నారు . పే బ్యాక్ టు ద సొసైటీ నినాదంతో సమతా ఫౌండేషన్ ద్వారా అనాధలకు పేదలకు విద్యా వైద్యం మొదలైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో నిరుపేదలకు నిత్య అవసర సరుకులు ,రక్తదానం, ప్లాస్మా దానం ఉచిత మందుల పంపిణీ చేసినట్లు తెలిపారు.వారి పిల్లల పుట్టినరోజు వేడుకలు, తమ పెళ్లిరోజు వేడుకలు, ఇలాంటి ఆశ్రమాల్లో జరుపుకొని తమ వంతు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మ పరివార్ ఆశ్రమ నిర్వాహకులు నాగరాజు సేవలు కొనియాడారు. తల్లి తండ్రి లేని పిల్లలను అక్కున చేర్చుకుని, వాళ్లకు అమ్మానాన్న లు లేని లోటు తీరుస్తూ చిన్నారులను ఉన్నత స్థానంలో ఉండేలా కృషి చేస్తున్నందుకు అభినందించారు. అమ్మ పరివార్ ఆశ్రమానికి దాతలు సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వాలు ప్రజలు తమ వంతు బాధ్యత వహించి అనాధలను పేదలను ఆదరించాలని కోరారు. అనంతరం రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లన్న, మాట్లాడుతూ సమాజంలో అందరూ బాధ్యతగా ఉండాలని, సమాజ సేవ కోసం నగేష్ దంపతులు చేస్తున్న సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సమతా ఫౌండేషన్ సభ్యులు పాషా,అమ్మపరివార్ ఆశ్రమ నిర్వాహకులు నాగరాజు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు*

Address

Venkatapuram
Mulugu

Telephone

+19493333899

Website

Alerts

Be the first to know and let us send you an email when Samatha Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Samatha Media:

Share