08/06/2026
వెయ్యికాళ్ళ మండపం, తిరుమల లో వెంకటేశ్వర స్వామి గుడి ఎదురు గా ఉండేది ఒకపుడు ...
చారిత్రక ఆధారాల ప్రకారం, తిరుమలలోని ఈ వెయ్యి కాళ్ళ మండపాన్ని సాళువ మల్లయ్య దేవ మహారాయ నిర్మించారు. ఈయన విజయనగర సామ్రాజ్యానికి చెందిన సాళువ వంశపు రాజులలో ఒకరు. క్రీ.శ. 1464 (సుమారు 561 ఏళ్ల క్రితం).
ఆనాటి శాసనాల ప్రకారం, భక్తుల సౌకర్యార్థం మరియు ఆలయ ఉత్సవాల నిర్వహణ కోసం దీనిని అద్భుతమైన శిల్పకళతో నిర్మించారు.
ఈ మండపంలో వెయ్యి స్తంభాలు ఉండటం వల్ల దీనికి "వెయ్యి కాళ్ళ మండపం" అనే పేరు వచ్చింది. ఈ స్తంభాలపై హిందూ పురాణ గాథలు, దేవతామూర్తుల విగ్రహాలు ఎంతో సుందరంగా చెక్కబడి ఉండేవి.
ప్రాచీన కాలంలో స్వామివారి ఊంజల్ సేవ, ఇతర ధార్మిక కార్యక్రమాలు ఇక్కడే జరిగేవి. భక్తులు సేదతీరడానికి కూడా ఇది ప్రధాన ఆశ్రయంగా ఉండేది. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, ఘంటసాల వంటి మహనీయులు ఇక్కడ తమ సంగీత కచేరీలు నిర్వహించేవారు. స్వామివారి ప్రసాదాలు కూడా ఇక్కడే ఇచ్చేవారు.
2003లో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) 'మాస్టర్ ప్లాన్'లో భాగంగా భక్తుల రద్దీని నియంత్రించడానికి, మరియు బ్రహ్మోత్సవాల సమయంలో వాహనాలు మాడవీధులలో సులభంగా తిరిగదానికి,భద్రతా కారణాల దృష్ట్యా ఈ చారిత్రక మండపాన్ని తొలగించింది.
ఎంతమంది భక్తులు ఈ మండపం చూశారు..దయచేసి మీ ఆనందాన్ని ఇప్పటివారితో పంచుకోండి