02/07/2026
అమర్నాథ్ యాత్ర ప్రారంభం
అమర్నాథ్ యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జూలై 2న జమ్మూలోని యాత్రి నివాస్ నుంచి మొదటి భక్తుల బృందాన్ని జెండా ఊపి పంపించారు. ఈ వార్షిక యాత్ర జూలై 3 ఉదయం నుంచి పహల్గామ, బాల్తాల్ బెస్ క్యాంపుల ద్వారా ప్రారంభమై.. ఆగస్టు 28 వరకు మొత్తం 57 రోజుల పాటు కొనసాగనుంది. యాత్ర సమయంలో భక్తుల భద్రత కోసం ప్రభుత్వం పలు ఏర్పాటు చేసింది.