VEDA KALAM news

VEDA KALAM news VEDA KALAM NEWS
Fighting Against corruption
and Public Rights. Exposing injustice. Protecting citizens. Promoting clean governance and constitutional values.

APTEL/2010/36791
Editor : Pamula Ashok Mudiraj Rni Aptel 2010/36791

లక్ష్యం మీది.. శిక్షణ మాది! 🎯మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు మైత్రి అకాడమీ (MCC9) అందిస్తోంది అత్యుత్తమ శిక్షణ. నవోదయ, సైని...
05/04/2026

లక్ష్యం మీది.. శిక్షణ మాది! 🎯
మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు మైత్రి అకాడమీ (MCC9) అందిస్తోంది అత్యుత్తమ శిక్షణ. నవోదయ, సైనిక్, మిలిటరీ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షల్లో టాప్ ర్యాంకులే మా లక్ష్యం!
✨ మా ప్రత్యేకతలు:
✅ ఏప్రిల్ 14 నుండి కొత్త బ్యాచ్‌లు ప్రారంభం.
✅ 26 ఏళ్ల అనుభవం ఉన్న డైరెక్టర్ పర్యవేక్షణ.
✅ స్టడీ మెటీరియల్స్ & ప్రాక్టీస్ సెషన్స్.
✅ సుదూర ప్రాంతాల విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు.
📍 లొకేషన్: హైదరాబాద్ రోడ్, కాకతీయ నగర్, రోడ్ నెం. 4, ఓల్డ్ VT కాలనీ, నల్లగొండ.
📞 సంప్రదించండి: 9393 9494 97, 90 6368 6368
🌐 వెబ్‌సైట్: www.mcc9.in

03/04/2026
07/03/2026

ప్రజా చైతన్యమే ప్రాణం… సేవే ఆయన ధ్యేయం

విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగులు నింపుతున్న చెల్లం పాండురంగారావు

మునుగోడు నియోజకవర్గంలో విద్యా చైతన్యాన్ని పెంపొందిస్తూ, పేద విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలుస్తున్న వ్యక్తిగా చెల్లం పాండురంగారావు గారు గుర్తింపు పొందుతున్నారు. మర్రిగూడ మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన ఆయన, సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ సమాజ సేవ పట్ల ఉన్న అంకితభావంతో నేడు ప్రజల మధ్య ఒక స్ఫూర్తిదాయక వ్యక్తిత్వంగా నిలిచారు.

చెల్లం పాండురంగారావు గారి ప్రయాణం కళా రంగంలో ప్రారంభమైంది. ప్రజల్లో సామాజిక చైతన్యం కలిగించాలనే లక్ష్యంతో ఆయన ప్రజానాట్యమండలి వేదికగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ, కళను ఒక సామాజిక ఉద్యమంగా మలిచారు. సమాజంలో ఉన్న సమస్యలను కళ ద్వారా ప్రజలకు చేరవేయడం, చైతన్యం కలిగించడం ఆయన లక్ష్యంగా కొనసాగింది.

సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన బలం అని విశ్వసించిన ఆయన, ఆ దిశగా ఒక గొప్ప సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీఆర్ఆర్ (PRR) ఫౌండేషన్ ద్వారా మునుగోడు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు మరియు కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు. చదువుకోవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల వెనుకబడే విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతోంది.

పాండురంగారావు గారి లక్ష్యం స్పష్టంగా ఉంది — నియోజకవర్గంలోని ప్రతి పేద విద్యార్థి కూడా ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలి. విద్య ద్వారా యువత భవిష్యత్తు మారితేనే సమాజంలో సానుకూల మార్పులు వస్తాయని ఆయన నమ్మకం.

నిస్వార్థ సేవా తపన, సమాజంపై బాధ్యత, విద్యపై అంకితభావం — ఈ మూడు లక్షణాలు చెల్లం పాండురంగారావు గారిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు నేటి యువతకు ఒక స్ఫూర్తి కాగా, సమాజానికి ఒక మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

ప్రజా చైతన్యం కోసం కళను ఆయుధంగా, విద్య కోసం సేవను ధ్యేయంగా చేసుకున్న చెల్లం పాండురంగారావు గారి ప్రస్థానం నిజంగా అభినందనీయం. ఇలాంటి వ్యక్తులు సమాజ అభివృద్ధికి బలమైన ఆధారంగా నిలుస్తారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
... పాముల అశోక్ ముదిరాజ్

18/02/2026

నమ్మిన సిద్ధాంతమే కొంపముంచిందా?

నల్గొండ బీజేపీలో నిబద్ధతపై ఒక ఆత్మపరిశీలన

రాజకీయాలు నేడు ఒక శక్తి ప్రదర్శనగా మారుతున్న కాలంలో, సిద్ధాంతం కోసం జీవించే ఒక కార్యకర్తకు దక్కే గౌరవం ఏమిటి? నల్గొండ 31వ డివిజన్ బీజేపీ అభ్యర్థి గుండెబోయిన కొండల్ ప్రయాణం ఈ ప్రశ్నను మన ముందుకు తెస్తోంది. ఇది కేవలం ఒక వార్డు ఎన్నికల ఓటమి కథ కాదు; విలువలు, నిబద్ధత, త్యాగం రాజకీయ చదరంగంలో ఎక్కడ నిలుస్తున్నాయో చెప్పే ఒక జీవ కథ.

2019లో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ప్రచారం కోసం, కార్యకర్తల అవసరాల కోసం తనకున్న రెండు ట్రావెల్స్ కార్లను అమ్ముకున్న వ్యక్తి కొండల్. ఆ రోజు ఆయన చూసింది తన వ్యక్తిగత లాభం కాదు; పార్టీ జెండా ఎగరాలని మాత్రమే. రాజకీయాల్లో పదవులు, లాభాలు, అవకాశాలు చూసే వారిలో ఆయన ఒకరు కాదు. పార్టీ సిద్ధాంతమే ఆయనకు దిక్సూచి.

నేడు అదే వ్యక్తి ఒక చిన్న పంచర్ దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నా, 31వ డివిజన్‌లో 900 కుటుంబాలకు అండగా నిలిచారు. అధికారంలో లేకపోయినా, పదవి లేకపోయినా, ప్రజల సమస్యలపై నిరంతర పోరాటం చేశారు. ఒక అధికార పార్టీ కౌన్సిలర్ చేయలేని పనులను సాధించడానికి కృషి చేశారు.

ఈ ఎన్నికల్లో ఆయనకు వచ్చినవి కేవలం 169 ఓట్లు మాత్రమే కావచ్చు. కానీ ఆ 169 ఓట్లు ఒక నిబద్ధతకు వచ్చిన గౌరవం. ఎలాంటి డబ్బు, మద్యం, ప్రలోభాలకు దూరంగా ఉండి కేవలం తన సేవాభావాన్ని నమ్ముకుని పోటీ చేసిన ఓ అభ్యర్థికి ఇవి నైతిక విజయ చిహ్నాలు.

అయితే ఈ సందర్భంలో కొన్ని ప్రశ్నలు స్వయంగా లేవనెత్తుకోవాలి. ఆర్థికంగా బలహీనమైన కార్యకర్తలకు పార్టీ లోపల తగిన మద్దతు అందుతోందా? క్షేత్రస్థాయిలో సంవత్సరాల పాటు కష్టపడిన వారికి ఎన్నికల సమయంలో సరైన సహకారం లభిస్తోందా? నిబద్ధతతో పని చేసే సామాన్య కార్యకర్తలే పార్టీకి బలమైతే, వారిని మరింత బలోపేతం చేయడం అవసరం కాదా?

ఈ ప్రశ్నలు విభేదాల కోసం కాదు; పార్టీ మరింత బలపడాలని కోరుకునే ఒక కార్యకర్త మనసులోని స్వరాలు మాత్రమే. బీజేపీ అంటే సిద్ధాంతం, క్రమశిక్షణ, క్షేత్రస్థాయి కార్యకర్తల శ్రమ అని నమ్మే వారు ఈ అంశంపై ఆత్మపరిశీలన చేయాల్సిన సమయం ఇది.

గుండెబోయిన కొండల్ ఓడిపోలేదు. ఆయన ప్రయాణం ఓటమితో ఆగిపోదు. 169 ఓట్లు సంఖ్య మాత్రమే కావచ్చు; కానీ అవి ఒక నైతిక స్థైర్యానికి ప్రతీక.

నాయకత్వ పదవులు తాత్కాలికం. సిద్ధాంతం కోసం జీవించే కార్యకర్తలే శాశ్వతం. రాజకీయాల్లో ధనం, ప్రభావం కంటే నిబద్ధత, నిజాయితీకి విలువ పెరగాలంటే ఇలాంటి కథలను మనం గమనించాలి.

సామాన్య కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు. వారిని నిలబెట్టుకోవడం, గౌరవించడం, భరోసా ఇవ్వడం — అదే నిజమైన సంస్థ బలం.

18/02/2026

నల్గొండ బీజేపీలో ‘నిబద్ధత’కు జరుగుతున్న అన్యాయంపై అంతర్మథనం!
నల్గొండ (వేద కలం న్యూస్): సంఘం నేర్పిన సంస్కారం, పార్టీ అప్పగించిన బాధ్యత.. ఇవే పరమావధిగా బతికే ఒక సామాన్య కార్యకర్తకు రాజకీయ చదరంగంలో గుర్తింపు ఏది? నల్గొండ 31వ డివిజన్ అభ్యర్థి గుండెబోయిన కొండల్ కథ వింటే, సిద్ధాంతం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఒక యోధుడికి వ్యవస్థ చేసిన అన్యాయం స్పష్టమవుతోంది. ఇది కేవలం ఒక వార్డు ఎన్నికల ఓటమి కాదు.. విలువలకు, నిబద్ధతకు జరుగుతున్న అవమానం.
త్యాగానికి నిలువుటద్దం: కార్లు అమ్మి.. పంచర్లు వేస్తూ!
2019లో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ప్రచారం కోసం, కార్యకర్తల అవసరాల కోసం తనకున్న రెండు ట్రావెల్స్ కార్లను అమ్ముకున్న వ్యక్తి కొండల్. ఆ రోజు ఆయన చూసింది తన లాభం కాదు, పార్టీ జెండా ఎగరడం. నేడు అదే వ్యక్తి ఒక సైకిల్ పంచర్ దుకాణం నడుపుకుంటూ, రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో ఉండి కూడా.. 31వ డివిజన్ లోని 900 కుటుంబాలకు అండగా నిలిచారు. ఒక కార్పొరేటర్ చేయలేని పనులను తన పలుకుబడితో, పోరాటంతో సాధించి పెట్టిన ఆయనది సామాన్యమైన ప్రయాణం కాదు.
అధినాయకత్వానికి ‘వేద కలం’ సూటి ప్రశ్నలు:
నల్గొండ బీజేపీలో జరుగుతున్న అంతర్గత వివక్షను జిల్లా మరియు రాష్ట్ర నాయకత్వం గమనించాల్సిన సమయం ఆసన్నమైంది:
* ధనబలమే ప్రాతిపదికనా?: పార్టీ నిధుల పంపిణీలో పలుకు బడి, పార్టీ గాడ్ ఫాదర్ లు వున్నావారికి , ధనవంతులకు లక్షల రూపాయలు కేటాయించి, నిజాయితీగా పని చేసే కొండల్ లాంటి వ్యక్తికి పార్టీ నిధులు అతి తక్కువ అది కూడా ఎన్నికలకు 48 గంటల ముందు విదిల్చడం ఏ సంస్కారం? పేద వాడికి దక్కిన గౌరవా ఇది?
* నైతిక గెలుపు ఎవరిది?: భారీగా నిధులు పొందిన అభ్యర్థుల కంటే, కేవలం తన సేవాభావంతో కొండల్ 169 ఓట్లు సాధించడం.. ఆయన వ్యక్తిత్వానికి ప్రజలు ఇచ్చిన నీరాజనం కాదా?
* వరుస అవకాశాల వెనుక నిబద్ధత: ఒక సామాన్య కార్యకర్తకు జాతీయ పార్టీ రెండుసార్లు అవకాశం ఇచ్చిందంటే, ఆయన క్షేత్రస్థాయిలో ఎంతటి గట్టి పునాది వేశారో అర్థం కావడం లేదా? మరి అలాంటి నాయకుడిని ఎన్నికల కురుక్షేత్రంలో నిధులు ఇవ్వకుండా నిరాయుధుడిని చేయడం వెనుక కుట్ర ఎవరిది?
పార్టీ హృదయాలకు ఒక విన్నపం..
మనం నేర్చుకున్న సనాతన ధర్మం, దేశ ధర్మం ఏం చెబుతున్నాయి? నిస్వార్థంగా పని చేసే కార్యకర్తను ఆదుకోవాలని కాదా? తన కుటుంబాన్ని, ఆస్తులను పార్టీ కోసం త్యాగం చేసి, నేడు సైకిల్ పంచర్లు వేసుకుంటూ బతుకుతున్న ఒక కార్యకర్తను.. రాజకీయ అవసరాల కోసం వాడుకుని వదిలేయడం ధర్మమేనా? అంగబలం, అర్ధబలం ఉన్నవారికే అండగా నిలిస్తే.. రేపు క్షేత్రస్థాయిలో జెండా మోసే కార్యకర్త మిగులుతాడా?
ముగింపు:
గుండెబోయిన కొండల్ ఓడిపోలేదు.. తన నిబద్ధతతో వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపారు. నల్గొండ జిల్లా బీజేపీలో జరుగుతున్న ఈ వివక్షా పూరిత ధోరణిని రాష్ట్ర అధిష్టానం వెంటనే సమీక్షించాలి. సామాన్య కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని నమ్మే బీజేపీ, కొండల్ లాంటి ‘నిజమైన సైనికులకు’ అండగా నిలవాలి.
నాయకత్వం మారవచ్చు.. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం బతికే కార్యకర్తను చంపుకోకండి!

09/02/2026

🗳️ నల్లగొండలో మార్మోగిన నినాదం: "ఓటు వేద్దాం - ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం!" 📢
నల్లగొండ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఓటరు చైతన్య ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది.
📍 ర్యాలీ విశేషాలు:
* ప్రారంభం: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నుండి పెద్ద గడియారం వరకు.
* ముఖ్య అతిథులు: జాతీయ ఛైర్మన్ డా. బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజు, జలసాధన సమితి అధ్యక్షులు దుష్యర్ల సత్యనారాయణ.
* పాల్గొన్నవారు: భారీ సంఖ్యలో విద్యార్థినులు, మహిళలు మరియు సామాజిక కార్యకర్తలు.
🌟 ముఖ్యమైన సందేశం:
> "బుల్లెట్ కన్నా బ్యాలెట్ మిన్న.. మన ఓటే మన దేశ భవిష్యత్తు!"
>
డా. కేశవులు ముదిరాజ్ గారు మాట్లాడుతూ, ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
* అభివృద్ధి చూసి ఓటెయ్యండి: రోడ్లు, డ్రైనేజీ, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించే వారికే ప్రాధాన్యత ఇవ్వండి.
* నోటా (NOTA) అవకాశం: అభ్యర్థులు నచ్చకపోతే నోటాకు ఓటు వేయండి, కానీ ఓటును మాత్రం వృధా చేయకండి.
* ఓటరు గెలుపు: విద్యావంతులు, యువత 100% ఓటింగ్ లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి.
🤝 ప్రతిజ్ఞ:
ర్యాలీ సందర్భంగా మహిళలు మరియు విద్యార్థులతో **"ఓటు హక్కు వినియోగం"**పై ప్రతిజ్ఞ చేయించారు.
మన ఓటు - మన బాధ్యత! 🗳️🇮🇳
పోలింగ్ తేదీ: 11-02-2026

09/02/2026

🚩 41వ డివిజన్ ప్రగతి ప్రణాళిక – మనందరి భవిష్యత్తు! 🚩

ప్రియమైన ఓటర్లారా 🙏
మార్పు మాటల్లో కాదు… మన డివిజన్ నుంచే ప్రారంభం కావాలి.
కేవలం ఓటు కాదు – అభివృద్ధికి సరైన దిశానిర్దేశం అవసరం.
బిజెపి అభ్యర్థి యానాల కరుణాకర్ రెడ్డి గారిని గెలిపించి
41వ డివిజన్‌ను ఒక ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుకుందాం.

📚 విద్య & యువత
డిజిటల్ స్టడీ హాల్స్, ఉచిత హై-స్పీడ్ Wi-Fi, స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్స్, కెరీర్ గైడెన్స్ & ఉద్యోగ మార్గదర్శకం.

👩‍🦰 మహిళా సాధికారత
కుట్టు మిషన్లు, హ్యాండీక్రాఫ్ట్స్, స్వయం ఉపాధికి శిక్షణ – ఆర్థిక స్వావలంబనకు బలమైన పునాది.

👴 వృద్ధులు & పెన్షనర్లు
డివిజన్ పరిధిలోనే సమస్యల పరిష్కారం, వైద్య శిబిరాలు, గౌరవప్రదమైన సేవలు.

🛕 రైల్వే క్వార్టర్
కాలనీ సమస్యలకు తక్షణ పరిష్కారం, రామాలయానికి ధూప–దీప–నైవేద్యాలు సకాలంలో, రామాలయ అభివృద్ధి; రైల్వే పార్క్ & వాకింగ్ ట్రాక్‌ను కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి.

🌳 పద్మావతి కాలనీ
పార్క్‌ను మోడల్ పార్కుగా అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్, మహిళల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ & శిక్షణ కేంద్రం.

🕉️ సంస్కృతి & ధర్మం
భజన–కోలాటం శిక్షణ, సాయంత్రం ధార్మిక కార్యక్రమాలు, పిల్లలు–యువతకు సాంస్కృతిక అవగాహన.

🩺 ఆరోగ్యం & ఉపాధి
ప్రకృతి వైద్య శిబిరాలు, ఆరోగ్య సదస్సులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళాలు.

📹 భద్రత
రైల్వే స్టేషన్ సమీప కాలనీల్లో CCTV కెమెరాలు, ప్రతి రోడ్డుకు ఒక కెమెరా, పోలీస్ సమన్వయంతో నిరంతర పర్యవేక్షణ. (ఇది నా హామీ)

🏠 శ్రీనివాస కాలనీ
ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇళ్ల మంజూరు, స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా ఉపాధి కల్పన.

💥 బలమైన నాయకత్వం + కేంద్ర ప్రభుత్వ నిధులు = వేగవంతమైన అభివృద్ధి
🔥 అభివృద్ధి హామీ కాదు… బాధ్యత.
🔥 ప్రజలతో ఎప్పుడూ అందుబాటులో ఉండే సేవా నాయకత్వం.

🗳️ పోలింగ్: 11-02-2026 (బుధవారం) | ⏰ ఉదయం 7:00 – సాయంత్రం 5:00
📍 విశ్వదీప్ విద్యాపీఠ్ హై స్కూల్, పద్మావతి కాలనీ, నల్గొండ
🪷 గుర్తు: కమలం పువ్వు | 🔢 క్రమ సంఖ్య: 5

🙏 ఈసారి ఓటు వృథా చేయకండి…
🙏 మోదీ గారి అభివృద్ధి బాటను 41వ డివిజన్‌కు తీసుకురండి.
🙏 మీ ఓటుతో 41వ డివిజన్‌ను భద్రత–భక్తి–అభివృద్ధి మార్గంలో ముందుకు నడిపిద్దాం!

🚩 భారత్ మాతా కీ జై! 🚩

— లోకనబోయిన రమణ ముదిరాజ్
బీజేపీ రాష్ట్ర ఫిషరీస్ సెల్ కో - కన్వినర్

🚩 ఇది మన 31వ డివిజన్ ఆత్మగౌరవ పోరాటం – మన విజయం పార్వతి కొండల్ గారి గెలుపు! 🚩ప్రియమైన 31వ డివిజన్ ఓటర్లారా 🙏ఓటు అనేది కే...
09/02/2026

🚩 ఇది మన 31వ డివిజన్ ఆత్మగౌరవ పోరాటం – మన విజయం పార్వతి కొండల్ గారి గెలుపు! 🚩

ప్రియమైన 31వ డివిజన్ ఓటర్లారా 🙏
ఓటు అనేది కేవలం కాగితం మీద ముద్ర కాదు…
👉 అది మన పిల్లల భవిష్యత్తు,
👉 అది మన గల్లీల గౌరవం,
👉 అది రాబోయే ఐదేళ్ల మన జీవితం!

ఈసారి ఎవరో వస్తారు… ఏదో చేస్తారని ఎదురు చూడటం కాదు.
మన గల్లీలో పుట్టి, మన కష్టసుఖాల్లో భాగమై,
మన ఇంటి ఆడబిడ్డగా, కుటుంబ సభ్యురాలిగా నిలిచిన
శ్రీమతి గుండెబోయిన పార్వతి కొండల్ గారిని
మన 31వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నుకుందాం.

🌟 అభివృద్ధికి పట్టం – ప్రతి ఇంటికి అండ!

👩 మహిళా సాధికారత
• మహిళల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు
• స్వయం ఉపాధి అవకాశాలు (కుట్టు, హ్యాండీక్రాఫ్ట్స్, చిన్న వ్యాపారాలు)
• మహిళా భద్రతకు మొదటి ప్రాధాన్యం
• స్వయం సహాయక సంఘాల బలోపేతం

👦 యువతకు ఉజ్వల భవిష్యత్తు
• విద్యార్థుల కోసం ఆధునిక స్టడీ సెంటర్లు
• ఉచిత Wi-Fi జోన్లు
• స్కిల్ డెవలప్‌మెంట్ & ఉపాధి శిక్షణ శిబిరాలు
• ఉద్యోగ మార్గదర్శకత & ఉద్యోగ మేళాలు

👴 వృద్ధులు & కార్మికులకు గౌరవం
• పెన్షన్లు సకాలంలో అందేలా చర్యలు
• ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటికే చేరే విధానం
• నిత్యం అందుబాటులో ఉండే సమస్యల పరిష్కారం

🚰 మౌలిక సదుపాయాల అభివృద్ధి
• మురుగు కాలువలు & డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం
• తాగునీటి సరఫరా మెరుగుదల
• రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

🧹 స్వచ్ఛమైన & సురక్షిత డివిజన్
• రోజువారీ చెత్త సేకరణ
• దోమల నివారణ చర్యలు
• CCTV కెమెరాలతో భద్రత

🗳️ ఎందుకు పార్వతి కొండల్ గారే మన ఛాయిస్?

నాయకత్వం అంటే అధికార గర్వం కాదు…
👉 అమ్మలాంటి ఆదరణ,
👉 చెల్లెమ్మలాంటి భరోసా!

మన గల్లీల్లో తిరుగుతూ, మనతో కలిసి ఉంటూ,
ప్రతి సమస్యను తన సమస్యగా భావించి
తక్షణమే స్పందించే గుణం ఉన్న నాయకురాలు –
శ్రీమతి గుండెబోయిన పార్వతి కొండల్ గారు.

> “మార్పు మన ఇంటి నుండే మొదలవ్వాలి…
మన 31వ డివిజన్ ప్రగతి కమలం గుర్తుతోనే సాధ్యం!”

📋 పోలింగ్ వివరాలు – తప్పక గుర్తుంచుకోండి:
📅 పోలింగ్ తేదీ: 11-02-2026 (బుధవారం)
⏰ సమయం: ఉదయం 7:00 – సాయంత్రం 5:00 వరకు
📍 పోలింగ్ కేంద్రం: N.G. కాలేజ్ – కొత్త బిల్డింగ్, నల్గొండ
🪷 గుర్తు: కమలం పువ్వు (BJP)
🔢 క్రమ సంఖ్య: 2

🙏 మన ఓటు – మన అభివృద్ధి కోసం!
🙏 మన మద్దతు – పార్వతి కొండల్ గారి కోసం!
🙏 31వ డివిజన్ భవిష్యత్తు కోసం కమలం గుర్తుపై ఓటు వేయండి!

🚩 భారత్ మాతా కీ జై! 🚩

Address

Hyd Road, Kakathiya Nagar, Road 4,Nalgonda Cell :93 93 94 94 97
Nalgonda
508001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when VEDA KALAM news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share