Hyper News

Hyper News Entertainment and news

29/12/2025

గ్రాండ్ ఓపెనింగ్ TODAY

29/12/2025
29/12/2025

కూటమీ ప్రభుత్వం పేదలకు ఇస్తామన్న కానుకలను విస్మరించింది.గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీను నాయక్.

చిలకలూరిపేట/కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం పాత సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామని చెప్పి నేటికీ అమలు చేయడం లేదని గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీను నాయక్ అన్నారు. ఆదివారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా లాంటివి అందజేస్తామని తెలిపారు. నేటికి దానిమీద మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. దానిలో ఏ ఒక్కటి అమలు చేయలేదని, ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటుతున్న ఏ ఒక్క కానుక ఇవ్వలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని చెప్పే మాటలు నీటి మీద రాతలు లాంటివే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.పాస్టర్ లకు గౌరవ వేతనం ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. జనవరి -2026 సంక్రాంతికి కానుక ఇస్తారో లేదో ఆందోళనలో ప్రజలు ఉన్నారన్నారు. తమ పాలన సంతృప్తిగా లేదని ఇటీవల కాలంలో ప్రజలకు వచ్చిన ఫోన్ కాల్స్ ప్రత్యేక నిదర్శనమన్నామని దుయ్యబట్టారు.ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా,నిరసన లాంటి కార్యక్రమాలు చేస్తామని కూటమి నేతలను హెచ్చరించారు.

నూతన సంవత్సరం దృష్ట్యా హార్సిలీహిల్స్ లో పోలీసుల ఆంక్షలు> తేదీ 31.12.2025 ఉదయం నుండి తేదీ 01.01.2026 రాత్రి వరకు 2 వీలర్...
28/12/2025

నూతన సంవత్సరం దృష్ట్యా హార్సిలీహిల్స్ లో పోలీసుల ఆంక్షలు

> తేదీ 31.12.2025 ఉదయం నుండి తేదీ 01.01.2026 రాత్రి వరకు 2 వీలర్స్ మరియు 3 వీలర్స్ కొండ పైకి వెళ్ళడానికి అనుమతి లేదు.

- కార్లు మరియు RTC బస్సులకు మాత్రమే అనుమతి వుంటుంది.

వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపరాదు.

హార్సిలీహిల్స్ లో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదు. పర్యాటకులను ఇబ్బందికి గురి చేయకూడదు.

కొత్త సంవత్సర సంభరాలను రాత్రి 12 గంటలకు ముగించవలెను.

హోటల్ యాజమాన్యం వారి వారి గదులలో మరియు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకుండా చూసుకోవాలి.

తేదీ 31.12.2025 ఉదయం నుండి తేదీ 01.01.2026 రాత్రి వరకు హార్సిలీహిల్స్ లో డ్రోన్ మరియు CCTV కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం అయినది.

పర్యాటకులు అందరూ పోలీస్ వారికి సహకరించి నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని తెలియజేయడం అయినది.

S. Mahende

SUB-DIVL. POLICE OFFICER

MADANAPALLE.

28/12/2025

నేనోస్తున్నాను మీరు రండి అందరూ కలిసి షాపింగ్ చేద్దాం నేడే గొప్ప ప్రారంభం ఉదయం 11 గంటలకు.

ఏకాది సిల్వర్ జువెలరీ షోరూమ్
స్టేషన్ నరసరావుపేట.

28/12/2025

దీనికి మీ సమాధానం ఏంటి నాగబాబు గారు

మండలంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు పర్యటనరొంపిచర్ల (25.08.2024) మండలంలో ఆరేపల్లి, రొంపిచర్ల ...
25/08/2024

మండలంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు పర్యటన
రొంపిచర్ల (25.08.2024)
మండలంలో ఆరేపల్లి, రొంపిచర్ల గ్రామాలలో ఆదివారం నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు పర్యటించారు. ఆయా గ్రామాలకు విచ్చేసిన ఎంపి శ్రీ కృష్ణ దేవరాయలకు టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఆరేపల్లి గ్రామంలో ఒక వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. రొంపిచర్లలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన టిడిపి సీనియర్ నాయకులు మందలపు మధుసూదనరావు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టిడిపి పార్టీ విస్తరణకు, అభివృద్ధికి చేసిన సేవలు గురించి వివరించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ చార్జ్ జిలానీ, మానవహక్కుల కమీషన్ మాజీ ఛైర్మన్ కాకుమాను పెదపేరిరెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము, తెలుగు యువత రాష్ట్ర నాయకులు వడ్లమూడి వెంకట కిషోర్, టిడిపి మండల నాయకులు మందలపు వెంకటరత్నం, మందలపు కోటేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

25/08/2024

గంజాయి అమ్ముతున్న ముద్దాయిలు అరెస్టు చేసిన నరసరావుపేట2 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డిఎస్పీకే నాగేశ్వరావు

నరసరావుపేట  డీఎస్పీ ని కలిసిన పురపాలక సంఘం మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా అండ్ సన్స్.ఇటీవల నరసరావుపేట సబ్ డివిజనల్...
25/08/2024

నరసరావుపేట డీఎస్పీ ని కలిసిన పురపాలక సంఘం మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా అండ్ సన్స్.

ఇటీవల నరసరావుపేట సబ్ డివిజనల్ పోలీస్ అధికారి(DSP) గా బాధ్యతలు చేపట్టిన కె నాగేశ్వరరావును నరసరావుపేట పురపాలక సంఘం మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్త తన కుమారులైన రూపేష్ గుప్తా రాందేవ్ గుప్తాలతో మర్యాదపూర్వకంగా ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూల బొకే ఇచ్చి దృశ్యాలువాతో చిరు సత్కారం చేశారు. గతంలో నాగసరపు సుబ్బరాయ గుప్త నరసరావుపేట పురపాలక సంఘం చైర్మన్ గా పదవిలో ఉండగా కె.నాగేశ్వరరావు డిఎస్పీ గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై రాజకీయ అంశాలపై ఆసక్తికరంగా చర్చించుకున్నారు. నరసరావుపేట డిఎస్పీగా ఉన్న సమయంలో సెల్లార్ పార్కింగ్ కల్తీ పాలు కల్తీ మద్యం కల్తీ ఎరువులు పురుగు మందులు వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపారని గుప్తా గుర్తు చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా నరసరావుపేట ను ట్రాఫిక్ నియంత్రణ గంజాయి అమ్మకాలు అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపాలని గుప్తా కోరారు.

రిషీస్ సిల్వర్ స్టూడియో వారి మెగా బిగ్గెస్ట్ సిల్వర్ ఎగ్జిబిషన్ సేల్ @నరసరావుపేట.వేదిక: రాధా సుందర కళ్యాణ మండపం రామిరెడ్...
27/07/2024

రిషీస్ సిల్వర్ స్టూడియో వారి మెగా బిగ్గెస్ట్ సిల్వర్ ఎగ్జిబిషన్ సేల్ @నరసరావుపేట.

వేదిక: రాధా సుందర కళ్యాణ మండపం
రామిరెడ్డి పేట, పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర

28/07/24 ఒక్కరోజు మాత్రమే....
ఇప్పటివరకు చూడనటువంటి సిల్వర్ దగదగల కోసం విచ్చేయండి, కనులారా వీక్షించండి.ఎంట్రీ పూర్తి గా ఉచితం!

24/04/2024

పెత్తందారులు అందరూ ఒక్కటవ్వటమే కాదూ.. కోటానుకోట్ల ఉన్న ఐశ్వర్యవంతులు ప్రత్యక్షంగా పరోక్షంగా వాలిపోయారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక్క ఆంధ్రనే కాదు దేశంలో మరే రాష్ట్రంలో కూడా చూడని విధంగా డబ్బుల కట్టల మీద నాలుగు రోజులు ప్రజల్ని నడిపించి... తర్వాత..

ఇంగ్లీష్ చదువుల వ్యాపారం చేసుకోవటానికి...
రోగాలతో ఆరోగ్య వ్యాపారం చేసుకోవటానికి....
24 గంటలు లిక్కర్ వ్యాపారం చేసుకోవటానికి...
హైప్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటానికి....
బ్లాక్ లో సినిమా టిక్కెట్లు అమ్ముకోవడానికి...

ప్రజల్ని అయిదు రూపాయల అన్నం కోసం లైన్లలో నిలబెట్టడానికి.. సంవత్సరానికి ఒకసారి పండక్కి పరమాన్నం వండుకోమని కానుకలు ఇవ్వటానికి..
మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఫ్లోరైడ్ వ్యాధిని పెంచటానికి..
ఇచ్చిన సెంటు భూమి కూడా పేదలకు దూరం చేయటానికి...
ఆర్థికంగా, ఆరోగ్యం పరంగా, చైతన్య పరులు కాకుండా పేద మధ్య తరగతి ప్రజలను మరో కొన్ని తరాల పాటు బానిసలుగా చేసుకొని తమ ఆధిపత్యం ప్రదర్శించటానికి...

ఇందిరాగాంధీ గరీబీ హటావో అని పేదలకు భూమి, ఇళ్ళు ఇచ్చింది. ఇందిరాగాంధీ ఆ మాట అని 50 ఏళ్ళు గడిచాయి. పేదరికం తగ్గిందా, ఉన్నవారికి, పేదలకు మధ్య అంతరం పెరిగిందా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు తగ్గలేదు? ఆవిడకు వ్యతిరేకంగా మరోసారి అవిడ గెలిస్తే మనం అడుక్కు తినాల్సిందే అంటూ అప్పుడు కూడా పెత్తందార్లు ఏకమయ్యారు. అది ఒక కారణం అయితే మరో కారణం అవిడ వారి అవసరాలు తీర్చి "అమ్మ" అయింది కానీ, వారి జీవితాలను శాశ్వతంగా మార్చేది చదువు మాత్రమే, అప్పో సొప్పో చేసి వారిని పెద్దల పిల్లలకు సమానంగా చదివించే "నాన్న" కాలేకపోయింది. ఇన్నేళ్ళ స్వాతంత్రంలో మొదటిసారి మీ పిల్లలను కూడా పెద్ద చదువులు చదివించండి, చదువే అభివృద్ది, నేను ఉన్నాను అంటున్న ప్రభుత్వం వచ్చింది. ఆఖరుకు ప్రపంచంలోనే అత్యున్నత కోర్స్ అయిన IB ను కూడా మన పిల్లలకు ఇవ్వటానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.

ఇవేమీ నచ్చని వర్గాలు ఏకమవుతున్నాయి. చావో రేవో అంటూ ఎక్కడెక్కడో నుంచి డబ్బు తెస్తున్నారు. ఈ ప్రజల్ని కొంటాం అంటున్నారు. కానీ, చావో రేవో వారికి కాదు..పేద మధ్య తరగతి వర్గాలకు... బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు. మన వేలు వేలకు అమ్ముడుబోతుందా లేక మన పిల్లల్ని పట్టుకుని నడిపించి అభ్యున్నతికి దారి చూపిస్తుందా! చైతన్యవంతులు అవ్వండి..మరో నలుగురిలో చైతన్యం తీసుకురండి. ప్రతి పేద మధ్య తరగతి వర్గాల ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి...ఈసారి ఓటు మీకోసం కాదు..మీ భవిష్యత్తు తరాల కోసం అని. దేశంలో మిగతా ప్రభుత్వాలు కూడా విద్య వైద్యం అందుబాటులోకి తేవాలని తెలుసుకోవటానికి, ఒక కొత్త ఇండియా ముందుకు రావటానికి మీ వేలును వాడండి. పది మందికీ ఈ మెసేజ్ ను చెరవేయండి.

నరసరావుపేట మండలం పెట్రువారిపాలెం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన 30 కుటుంబాలు టీడీపీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర...
19/04/2024

నరసరావుపేట మండలం పెట్రువారిపాలెం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన 30 కుటుంబాలు టీడీపీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు పార్టీ కండవా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలను మెచ్చి, పార్టీలకు అతీతంగా చేసిన మంచి పనులకు ఆకర్షితులై వారు పార్టీలో చేరడం జరిగింది.

Address

Guntur
Narasaraopet
522601

Alerts

Be the first to know and let us send you an email when Hyper News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share