23/09/2025
ఐకమత్యం తో వ్యాపారం చేద్దాం
ప్రయోక్త : నెల్లూరు పట్టణంలో
బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్
సంస్థ వారు బి ఎన్ ఐ పేరుతో
నూతన చాప్టర్ ను ప్రారంభించారు. ఈ చాప్టర్ పేరు
అమిగోస్ అని పెట్టారు. ఇది నెల్లూరులో మొట్టమొదటి చాప్టర్
అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 23న జరిగిన ప్రారంభ సమావేశంలో
ఆ సంస్థ బాధ్యులు, మెంబర్ లు,
వారి శ్రేయోభిలాషులు , పట్టణంలోని ప్రముఖ వ్యాపార సంస్థల యజమానులు, బి ఎన్ ఐ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
బి ఎన్ ఐ లో చేరాలంటే ఒక్కొక్క వ్యాపారానికి సంబంధించి ఒక్కొక్కరినే తీసుకోవడం జరుగుతుందని ఇలా ప్రతి చాప్టర్లో
ఉంటుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ ఫీజు తోపాటు, ప్రతి సంవత్సరం ఫీజు ఉంటుందని తెలిపారు. వారంలో ఒకరోజు సంస్థ తరఫున సమావేశం ఉంటుందని తప్పనిసరిగా హాజరు కావలసిన పరిస్థితి ఉంటుందని
పేర్కొన్నారు. ఆ సమావేశాలలో
వ్యాపార అభివృద్ధికి కావలసిన సూచనలు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. ఈ చాప్టర్ అధ్యక్షులుగా వి .శివకృష్ణ, ఉపాధ్యక్షులుగా ఈ .కోటేశ్వర్ రెడ్డి, సెక్రటరీ ట్రెజరర్ గా ఏ.వి. రమేష్ బాబు,లీడ్ విజిటర్ హోస్ట్ గా ఏ .యోగేష్ నాయుడు లు
ఉన్నారని వీరి పదవి కాలం ఆరు నెలలని తదుపరి నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్. జహంగీర్ అహ్మద్ తెలిపారు.
ఆ కార్యక్రమానికి వచ్చిన అందరికీ
ఆ సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.