Ravuri ramesh babu

Ravuri ramesh babu Right to information act

24/12/2025

తమ హక్కులపై వినియోగదారులకు అవగాహన అవసరం....

కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తప్పనిసరిగా పొందాలి

ప్రశ్నించడంతోనే అధిక ధరలు, కల్తీ ఆహారాలు, తూకాల్లో మోసాలకు చెక్

సేవల్లో లోపం జరిగితే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలి

జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు

ప్రయోక్త : జిల్లా పౌర సరఫరాలశాఖ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ వినియోగదారుల అవగాహన సదస్సు జరిగింది.
నేటి ఆధునిక, సాంకేతిక యుగంలో వినియోగదారులకు తమ హక్కుల గురించి అవగాహన ఎంతో ముఖ్యమని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు.

డిసెంబర్ 24 న జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా పౌర సరఫరాలశాఖ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జాతీయ వినియోగదారుల దినోత్సవానికి "డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం" అనే ఇతివృత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రోజు రోజుకి పెరుగుతున్న డిజిటల్ కొనుగోళ్ల లో వినియోగదారులు మోసపోకుండా ఉండటమే కాకుండా తమ హక్కుల గురించి గుర్తెరగాలన్నారు. అధిక ధరలు, నాణ్యత, కల్తీలు, వస్తు సేవల్లో లోపం మొదలైన అంశాలను వినియోగదారులందరూ ప్రశ్నిస్తేనే ఇలాంటివి తిరిగి జరగకుండే ఉండే అవకాశం ఉంటుందన్నారు. వినియోగదారులకు సేవాలోపం జరిగితే వినియోగదారుల ఫోరంలో కేసు వేయవచ్చుననే అవగాహన ముఖ్యమన్నారు. ఒక్క రూపాయి నుంచి ఎంత పెద్దమొత్తంలో కొనుగోలుచేసినా బిల్లులు తప్పనిసరిగా పొందాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నప్పటికీ, సమాజంలో సరైన అవగాహన తోనే మెరుగైన ఫలితాలు సాధించవచ్చునన్నారు. డిజిటల్ విధానంలో ఈ-జాగృతి పోర్టల్లో వినియోగదారులు తమకు జరిగిన సేవాలోపాన్ని నమోదుచేసి న్యాయసహాయం సులభంగా పొందవచ్చన్నారు.

ఈ సందర్భంగా వినియోగదారుల హక్కుల గురించి నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జాయింట్ కలెక్టర్, అధికారులు జ్ఞాపికలు, నగదు బహుమతులు అందజేశారు.

అనంతరం వినియోగదారుల చట్టంపై అవగాహన కల్పించే పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో డిఎస్ఒ లీలారాణి, జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యులు ప్రశాంతి, ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్ వెంకటేశ్వరరావు, తునికలు కొలతలు శాఖ డిప్యూటీ కొంట్రోలర్ ఐజాక్, ఆర్టివో బషీర్, డిఎంఅండ్సెచ్వి సుజాత, ఎఎసివోలు సి. లక్ష్మీ నారాయణరెడ్డి, ఐ.పుల్లయ్య, డికె జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం రమణారెడ్డి, పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

23/12/2025

రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు
ప్రయోక్త : రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు 2024 సంవత్సరంలో ప్రారంభించబడ్డాయి మొదటి అవార్డు కార్యక్రమం ఆగస్టు 22 2024న గణతంత్ర మండపంలో రాష్ట్రపతి భవనంలో జరిగింది.
ఈ పురస్కారం భారత ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇది శాస్త్ర సంకేతిక రంగాలలో ప్రతిష్టాత్మక కృషి పని గుర్తించడానికి మరియు ప్రోత్సహించడానికి రూపొందించబడింది.
డిసెంబర్ 23 ,2025న భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము గణతంత్ర మండపంలో రాష్ట్రపతి భవన్లో రెండవ సంవత్సరం రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలను అందజేశారు.
రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార ములకు సంబంధించి
నాలుగు వర్గాలలో
విజ్ఞాన రత్న ,
విజ్ఞాన శ్రీ,
విజ్ఞాన యువ,
మరియు విజ్ఞాన టీం,
ద్వారా 24 ప్రతిష్టాత్మక శాస్త్రవేత్తలకు అవార్డులను నాలుగు కేటగిరీలలో అందజేయబడ్డాయి.
ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో చేసిన విశిష్టమైన ప్రభావంతమైన కృషిని గుర్తించడం మరియు శాస్త్రవేత్తలు మరియు ఆవిష్కర్తలకు ప్రోత్సాహం కల్పించడం సాంకేతికత ఆదారిత ఆవిష్కరణ లను ప్రోత్సహించడం యువ శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులకు ప్రేరణ గా నిలబడం అనేది ప్రధాన ఉద్దేశం.

23/12/2025
09/11/2025
19/10/2025

జాగ్రత్త
పెన్నా నది లోకి
సోమశిల నీళ్లు భారీగా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం....

19/10/2025

🌹🙏 *దశావతారాలు*(ఇవి శ్రీమన్నారాయణుని అవతారాలు)
🌷*1. మత్స్యావతారం - చేప*
నీటిలో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏ విధంగా ఈదుతుందో, అదేవిధంగా జీవితంలో 'ప్రతికూల పరిస్థితుల్లో'నూ సంసారాన్ని ఈదాలి.

🌷*2. కూర్మావతారం - తాబేలు*
అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటుందో, అదేవిధంగా మనం పనులు లేనప్పుడు ఇంద్రియాలను కట్టివేసి 'ధ్యానం' చేయాలి.

🌷*3. వరాహావతారం - వరాహం*(పంది)
ప్రపంచ భారాన్ని ఏ విధంగా మోస్తుందో, అలాగే 'ఇంటి బాధ్యత'లను మొయ్యాలి.

🌷*4. నరసింహావతారం -*
మనలోని అజ్ఞానాన్ని చీల్చి చెండాడాలి.

🌷*5. వామనావతారం -*
మొదటి అడుగు భౌతికంగానూ,
రెండవ అడుగు ఆధ్యాత్మికంగాను జీవిస్తూ;
మరి మూడవ అడుగును మనలోని 'అహంకారాన్ని' గుర్తించి 'బలి' ఇవ్వాలి.

🌷*6. పరశురామావతారం -*
'లక్ష్యం' కోసం పట్టుదలతో ముందుకెళ్లాలి.

🌷*7. రామావతారం -*
'ధర్మ'యుతంగా జీవించాలి.

🌷*8. కృష్ణావతారం -* ఎన్ని కష్టాలు ఎదురైనా 'ఆనందం'గా ఉండాలి.

🌷*9. బుద్ధావతారం -*
'జ్ఞానాన్ని' పంచాలి.

🌷*10. కల్కి అవతారం -*
సకల మానవాళి 'అజ్ఞానాన్ని తీసివేయాలి'...🌷

23/09/2025

ఐకమత్యం తో వ్యాపారం చేద్దాం
ప్రయోక్త : నెల్లూరు పట్టణంలో
బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్
సంస్థ వారు బి ఎన్ ఐ పేరుతో
నూతన చాప్టర్ ను ప్రారంభించారు. ఈ చాప్టర్ పేరు
అమిగోస్ అని పెట్టారు. ఇది నెల్లూరులో మొట్టమొదటి చాప్టర్
అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 23న జరిగిన ప్రారంభ సమావేశంలో
ఆ సంస్థ బాధ్యులు, మెంబర్ లు,
వారి శ్రేయోభిలాషులు , పట్టణంలోని ప్రముఖ వ్యాపార సంస్థల యజమానులు, బి ఎన్ ఐ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
బి ఎన్ ఐ లో చేరాలంటే ఒక్కొక్క వ్యాపారానికి సంబంధించి ఒక్కొక్కరినే తీసుకోవడం జరుగుతుందని ఇలా ప్రతి చాప్టర్లో
ఉంటుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ ఫీజు తోపాటు, ప్రతి సంవత్సరం ఫీజు ఉంటుందని తెలిపారు. వారంలో ఒకరోజు సంస్థ తరఫున సమావేశం ఉంటుందని తప్పనిసరిగా హాజరు కావలసిన పరిస్థితి ఉంటుందని
పేర్కొన్నారు. ఆ సమావేశాలలో
వ్యాపార అభివృద్ధికి కావలసిన సూచనలు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. ఈ చాప్టర్ అధ్యక్షులుగా వి .శివకృష్ణ, ఉపాధ్యక్షులుగా ఈ .కోటేశ్వర్ రెడ్డి, సెక్రటరీ ట్రెజరర్ గా ఏ.వి. రమేష్ బాబు,లీడ్ విజిటర్ హోస్ట్ గా ఏ .యోగేష్ నాయుడు లు
ఉన్నారని వీరి పదవి కాలం ఆరు నెలలని తదుపరి నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్. జహంగీర్ అహ్మద్ తెలిపారు.
ఆ కార్యక్రమానికి వచ్చిన అందరికీ
ఆ సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

29/07/2025

మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో గత 14 రోజులుగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెను పట్టణ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ హామీ మేరకు విరమించినట్లు కమిషనర్ వై.ఓ నందన్ ప్రకటించారు.

కార్పొరేషన్ కార్యాలయంలో రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కమిషనర్ నందన్ ల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులతో మంగళవారం చర్చలు జరిపారు.

ముఖ్యంగా కార్మికుల డిమాండ్లలో ప్రధాన అంశంగా ఉన్న తొమ్మిదవ డివిజన్లో కాంట్రాక్టు విధానం అమలుపై మంత్రి నారాయణ స్పష్టత ఇవ్వడంతో కార్మికులు సమ్మెను నిరవధికంగా విరమించినట్లు కమిషనర్ వెల్లడించారు. పైలెట్ ప్రాజెక్టు నిర్వహణ కోసం చేపట్టిన కాంట్రాక్టు విధానాన్ని పూర్తిస్థాయిలో రద్దుచేసి నూతన విధి విధానాలపై పునరాలోచించేందుకు త్వరలో మంత్రి నారాయణతో కార్మిక సంఘాల నాయకులు భేటీ కానున్నారని తెలిపారు.

రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం, వారి ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. మున్సిపల్ కార్మికుల ఉద్యోగ విరమణ అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించే అంశాన్ని మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లి, కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రతను కలిగిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుధ్య నిర్వహణ పనుల కోసం కార్మికులంతా వెంటనే తిరిగి విధుల్లో పాల్గొనాలని కమిషనర్, ఎమ్మెల్యేలు కోరారు.

ఈ చర్చలలో మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు మూలం రమేష్, మాదాల వెంకటేశ్వర్లు, కత్తి శ్రీనివాసులు, పెంచల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.

Address

PRAYOKTHA MONTHLY NEWS PAPER , Tipparaju Vari Street, Nellore
Nellore
524001

Telephone

+919866103591

Website

Alerts

Be the first to know and let us send you an email when Ravuri ramesh babu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ravuri ramesh babu:

Share

Category