VAMSI NEWS CHANNEL

VAMSI NEWS CHANNEL Media

లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే, సీఎం చంద్రబాబు గారు చూపిన చొరవ, కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం... రెండూ సఫలీకృతమై ఏప...
21/10/2025

లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే, సీఎం చంద్రబాబు గారు చూపిన చొరవ, కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం... రెండూ సఫలీకృతమై ఏపీ ఆక్వా రైతుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పొట్టు తీయని ఏపీ రొయ్య దిగుమతిపై ఇంత వరకు ఉన్న ఆంక్షలను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎత్తేసింది. రొయ్యల దిగుమతిపై అమెరికా భారీగా సుంకాలు విధించగా, మరో దేశంతో మాట్లాడమని కేంద్రానికి చంద్రబాబు గారు గతంలో సూచించారు.



ఏపీకి నాలుగు రోజుల పాటు వర్ష సూచన.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం...
20/10/2025

ఏపీకి నాలుగు రోజుల పాటు వర్ష సూచన..

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..

48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం..

పశ్చిమ-వాయువ్యదిశగా కదులుతూ బలపడనున్న అప్పపీడనం..

రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం..

నేడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు-వాతావరణ శాఖ

*🌟 ప్రత్యేక ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ క్యాంపులు 🌟*📢 మీ ఆధార్‌ను ఇప్పుడే అప్డేట్ చేయండి!📅 తేదీలు: అక్టోబర్ 23 - 30, 2025📍...
16/10/2025

*🌟 ప్రత్యేక ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ క్యాంపులు 🌟*

📢 మీ ఆధార్‌ను ఇప్పుడే అప్డేట్ చేయండి!

📅 తేదీలు: అక్టోబర్ 23 - 30, 2025
📍 స్థలం: రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు
🏛 నిర్వహణ: గ్రామ & వార్డు సచివాలయాలు

🔥 ఎవరు పాల్గొనాలి?
👉 5-15 సంవత్సరాల వయసు గల 8,88,923 మంది
👉 15 ఏళ్ల పైబడిన 7.6 లక్షల మంది
✨ తప్పనిసరి: ఆధార్ బయోమెట్రిక్ వివరాల అప్డేట్

🚀 అవకాశం మళ్లీ రాదు!
మీ ఆధార్ వివరాలను సరిచేయడానికి ఈ ప్రత్యేక క్యాంపును సద్వినియోగం చేసుకోండి!
⏰ సమయం వృథా చేయవద్దు - ఇప్పుడే చర్య తీసుకోండి!
📲 సోషల్ మీడియాలో షేర్ చేయండి!
మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఈ సమాచారం చేరవేయండి!
#ఆధార్అప్డేట్2025 #పాఠశాలక్యాంపులు
#మీఆధార్ మీ భవిష్యత్తు...

అక్టోబర్ 16వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీగారు కర్నూలుకు వస్తున్నారు. శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంత...
15/10/2025

అక్టోబర్ 16వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీగారు కర్నూలుకు వస్తున్నారు.
శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం కర్నూలు జిల్లా, నన్నూరు వద్ద
రాగ మయూరి గ్రీన్‌ హిల్స్‌ వెంచర్‌ నుండి ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన
రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేయనున్నారు.



భారత ప్రధాని రేపు ఆంధ్రప్రదేశ్ లో రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేయను...
15/10/2025

భారత ప్రధాని రేపు ఆంధ్రప్రదేశ్ లో రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేయనున్నారు. వాటిలో కర్నూలు జిల్లాకు రూ.2,886 కోట్ల విద్యుత్ ప్రాజెక్టులతో పాటు... ఓర్వకల్లులో రూ.2,786 కోట్ల పారిశ్రామిక కేంద్రం కూడా ఉంది. అలాగే కడప జిల్లా కొప్పర్తిలో రూ.2,136 కోట్ల పారిశ్రామిక కేంద్రానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు.


*దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్.. మన ఏపీలో..!*(ఆంద్రప్రదేశ్ లో....)అమరావతి : భారత రైల్వే చరిత్రలో ఒక నూతన అధ్యాయం లిఖించ...
15/10/2025

*దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్.. మన ఏపీలో..!*
(ఆంద్రప్రదేశ్ లో....)

అమరావతి :
భారత రైల్వే చరిత్రలో ఒక నూతన అధ్యాయం లిఖించబడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రాజధాని అమరావతి సమీపంలో దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ప్రపంచ స్థాయి నగర నిర్మాణ దృష్టికి అనుగుణంగా ఈ ప్రతిష్ఠాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఏపీకి సరికొత్త గుర్తింపు తేనుంది.

* ప్రపంచ స్థాయి డిజైన్, విశాలమైన విస్తీర్ణం

ఈ రైల్వే స్టేషన్ డిజైన్ న్యూయార్క్‌లోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్, లండన్‌లోని సెయింట్ పాంక్రాస్ స్టేషన్ వంటి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడుతోంది. ఒక ఆధునిక ఎయిర్‌పోర్ట్‌ తరహాలో ప్లాన్ చేసిన ఈ స్టేషన్.. 1,500 ఎకరాల విస్తీర్ణంలో ఉండనుంది. 24 ప్లాట్‌ఫామ్స్ , 4 టెర్మినల్స్‌ను కలిగి ఉంటుంది.రోజుకు 3,00,000 మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

* భారీ పెట్టుబడి, కీలక కనెక్టివిటీ

ఈ మహా ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ. 2,245 కోట్లు పెట్టుబడి చేయనుంది.

The world is talking about Andhra Pradesh — Google’s next big destination!
14/10/2025

The world is talking about Andhra Pradesh — Google’s next big destination!








విశాఖలో 15 బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.1,33,000 కోట్లు)తో గూగుల్ 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌ ఏర...
14/10/2025

విశాఖలో 15 బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.1,33,000 కోట్లు)తో గూగుల్ 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌ ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గారు, మరియు కేంద్రమంత్రుల సమక్షంలో ఒప్పందం కుదిరింది. దేశంలోనే 15 బిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐను సాధించడం ఇదే తొలిసారి.







Big Day for Andhra Pradesh..
14/10/2025

Big Day for Andhra Pradesh..





* ఉత్తరాఖండ్* కేదార్‌నాథ్ ఆలయం యొక్క మంత్రముగ్ధులను చేసే దృశ్యం.* దాని నిర్మలమైన అందం మరియు ఆధ్యాత్మిక ఆకర్షణను చూపుతుంద...
14/10/2025

* ఉత్తరాఖండ్

* కేదార్‌నాథ్ ఆలయం యొక్క మంత్రముగ్ధులను చేసే దృశ్యం.

* దాని నిర్మలమైన అందం మరియు ఆధ్యాత్మిక ఆకర్షణను చూపుతుంది.

* (చిత్రాలు: kedarnathofficial.in)

ఒడిశా గోపాల్‌పూర్ దగ్గర తీరం దాటిన తీవ్ర వాయుగుండం.కోస్తా జిల్లాలపై వాయుగుండం ప్రభావం.శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లా...
03/10/2025

ఒడిశా గోపాల్‌పూర్ దగ్గర తీరం దాటిన తీవ్ర వాయుగుండం.

కోస్తా జిల్లాలపై వాయుగుండం ప్రభావం.

శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్‌ అలర్ట్.

శ్రీకాకుళం, మన్యం, విజయనగరంలో ఫ్లాష్‌ ఫ్లడ్స్‌.

విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు.

కాకినాడ, కోనసీమ, తూ.గో, ఏలూరులో భారీ వర్షాలు.

ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక.

తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్.

తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.

గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం

Address

Nellore

Alerts

Be the first to know and let us send you an email when VAMSI NEWS CHANNEL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to VAMSI NEWS CHANNEL:

Share

Category