VAMSI NEWS CHANNEL

VAMSI NEWS CHANNEL Media

Never Fly Indigoఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా ముంబయికి, అక్కడి నుంచి డాలస్‌ వెళ్లాల్సిన కొందరు ప్ర...
25/08/2025

Never Fly Indigo

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా ముంబయికి, అక్కడి నుంచి డాలస్‌ వెళ్లాల్సిన కొందరు ప్రయాణికులను ఇక్కడే వదిలేసి విమానం వెళ్లిపోయింది. బాధిత ప్రయాణికులు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి డాలస్‌ వెళ్లాల్సిన 38 మంది టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ వెబ్‌సైట్‌ సూచన మేరకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ టై-అప్‌ టికెట్లను ఆన్‌లైన్‌లో రూ.2 లక్షల చొప్పున చెల్లించి కొనుగోలు చేశారు. వీరు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి శనివారం రాత్రి 11.40 గంటలకు ముంబయి వరకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ 6ఇ-5195 విమానంలో, అక్కడి నుంచి టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో డాలస్‌కు వెళ్లాలి. 38 మంది ప్రయాణికులు శనివారం శంషాబాద్‌ విమానాశ్రయానికి సకాలంలో చేరుకుని ఎయిర్‌లైన్స్‌ కేంద్రంలో సంప్రదించారు. ఓవర్‌ బుకింగ్‌ పేరుతో విమాన ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు సర్వీస్‌ నంబరును 6ఇ-6132గా మార్చారని, అందులో 24 మందినే ఎక్కించుకుని ముంబయికి పంపించారని మిగతా ప్రయాణికులు ఆరోపించారు. దీనిపై ఇండిగో ప్రతినిధులను నిలదీయగా పొంతనలేని సమాధానాలిచ్చారంటూ ఆందోళనకు దిగారు. దాదాపు ఏడు గంటలపాటు విమానాశ్రయంలోనే వేచిఉన్న అనంతరం వారు వెనుదిరిగారు. ఈ విషయంపై జీఎమ్మార్‌ విమానాశ్రయ ప్రతినిధులను ‘న్యూస్‌టుడే’ ఫోన్‌లో సంప్రదించగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని తెలిపారు.

*అమరావతి :*సీఎం రిలీఫ్ ఫండ్‌కి మెగాస్టార్ చిరంజీవి రూ.కోటి విరాళం..సీఎం చంద్రబాబును కలిసి చెక్ అందించిన చిరంజీవి..
24/08/2025

*అమరావతి :*

సీఎం రిలీఫ్ ఫండ్‌కి మెగాస్టార్ చిరంజీవి రూ.కోటి విరాళం..

సీఎం చంద్రబాబును కలిసి చెక్ అందించిన చిరంజీవి..

ఢిల్లీ:* ప్రధాని మోదీ జపాన్, చైనా పర్యటనలు ఖరారు.* ఈనెల 29, 30న జపాన్‌లో పర్యటించనున్న మోదీ.* 15వ భారత్-జపాన్ వార్షిక శి...
23/08/2025

ఢిల్లీ:

* ప్రధాని మోదీ జపాన్, చైనా పర్యటనలు ఖరారు.

* ఈనెల 29, 30న జపాన్‌లో పర్యటించనున్న మోదీ.

* 15వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సుకు హాజరు.

* ఈనెల 31, సెప్టెంబర్ 1న చైనాలో ప్రధాని మోదీ పర్యటన.

* SCO శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్న ప్రధాని మోదీ

స్త్రీ శక్తి' పేరిట రేపటి (ఆగస్టు 15) నుంచి  నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది కూటమి ప్రభుత్వం. పల్లె ...
14/08/2025

స్త్రీ శక్తి' పేరిట రేపటి (ఆగస్టు 15) నుంచి నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది కూటమి ప్రభుత్వం. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో బాలికలు, మహిళలు, ట్రాన్స్‌ జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు.





*స్త్రీ శక్తి పథకం – ఆగస్టు 15, 2025 నుండి అమలు**ప్రయోజనం*:ఆంధ్రప్రదేశ్‌లో నివసించే బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ...
14/08/2025

*స్త్రీ శక్తి పథకం – ఆగస్టు 15, 2025 నుండి అమలు*

*ప్రయోజనం*:
ఆంధ్రప్రదేశ్‌లో నివసించే బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత *APSRTC* బస్ ప్రయాణం.

*వర్తించే బస్సులు*:

*పల్లె వెలుగు*
*🔅అల్ట్రా పల్లె వెలుగు*
*🔅సిటీ ఆర్డినరీ*
*🔅ఎక్స్‌ప్రెస్*
*🔅మెట్రో ఎక్స్‌ప్రెస్*

*అవసరమైన గుర్తింపు పత్రాలు*:
👉 ఆధార్ కార్డు *లేదా*
👉 ఓటరు ఐడి *లేదా*
👉 చెల్లుబాటు అయ్యే ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డు

*గమనిక*:
ఈ పథకం కొన్ని *APSRTC* సర్వీసులకు మాత్రమే వర్తిస్తుంది.

శ్రీశైలం:శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..  7 గేట్లు 10 అడుగులు ఎత్తి నీరు విడుదల.. ఇన్ ఫ్లో 1,17,221 క్యూసెక్కులు,...
14/08/2025

శ్రీశైలం:

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..

7 గేట్లు 10 అడుగులు ఎత్తి నీరు విడుదల..

ఇన్ ఫ్లో 1,17,221 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,52,840 క్యూసెక్కులు..

పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం 882.10 అడుగులు..

కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

*బెంగళూరు EC మార్చ్ ర్యాలీలో Rahul Gandhi మాట్లాడుతూ* .... *Election Commission&BJP ని ఓట్ల దొంగలు అని విమర్శించినందుకు ...
12/08/2025

*బెంగళూరు EC మార్చ్ ర్యాలీలో Rahul Gandhi మాట్లాడుతూ* ....

*Election Commission&BJP ని ఓట్ల దొంగలు అని విమర్శించినందుకు ఎన్నికల* *సంఘం నన్ను అఫిడవిట్ దాఖలు చేసి క్షమాపణ ప్రమాణం చేయమని అడుగుతోంది* !
*300 మంది ఎంపీలు ఎన్నికల సంఘాన్ని కలిసి ఒక పత్రాన్ని సమర్పించాలనుకున్నాం, కానీ మాకు అనుమతి ఇవ్వట్లేదు!!*
EC ఎందుకు భయపడుతున్నారు.
300 మంది ఎంపీలు వస్తె నిజం బయట పడుతుందనా ?? - రాహుల్* !

*MP గా ఎన్నికైన నేను రాజ్యాంగంపై పార్లమెంటులో అంతా నిజమే చెప్తాను, బందుప్రీతి, రాగద్వేషాలు చూపించనని ఆల్రెడీ ప్రమాణం చేశాను, అలాగే నడుచుకుంటున్నాను.తప్పు* *చేయను క్షమాపణ ప్రమాణం చేయను.*

*ఈ దేశం పట్ల, రాజ్యాంగం పట్ల, నన్ను ఎన్నుకున్న ప్రజల పట్ల నేనేప్పుడూ సేవకుడిగానే వుంటాను గాని ప్రాణం పోతున్నా తప్పు చేయను. చేయని తప్పుకు క్షమాపణ ప్రమాణం చేయను.*

- *రాహుల్ గాంధీ*

Andhra Pradesh:* ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రేపు పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస...
11/08/2025

Andhra Pradesh:

* ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రేపు పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

* బుధవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తాంధ్రలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందన్నారు.

* పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు..

Railway Minister Ashvini Vaishnaw150 Vande Bharat train services now!PM  Ji to flag off 3 more Vande Bharat trains today...
10/08/2025

Railway Minister Ashvini Vaishnaw

150 Vande Bharat train services now!

PM Ji to flag off 3 more Vande Bharat trains today
🚄 Bengaluru - Belagavi
🚄 Sri Mata Vaishno Devi Katra - Amritsar
🚄 Nagpur (Ajni) - Pune

J&K..జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భారీ ఎన్కౌంటర్.. మరోసారి ప్రేట్రేగిపోయిన ఉగ్రవాదులు.. ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రా...
09/08/2025

J&K..

జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భారీ ఎన్కౌంటర్..

మరోసారి ప్రేట్రేగిపోయిన ఉగ్రవాదులు..

ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జవాన్లు..

మరో 10 మంది జవాన్లకు గాయాలు..

అఖల్ అటవీ ప్రాంతంలో నక్కిన నలుగురు ఉగ్రవాదులు..

👆 *శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం*•  *విశేషంగా ఆకట్టుకున్న అష్టలక్ష్మీ మండపం**తిరుపతి, 202...
08/08/2025

👆 *శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం*

• *విశేషంగా ఆకట్టుకున్న అష్టలక్ష్మీ మండపం*

*తిరుపతి, 2025 ఆగస్టు 08: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది.*

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన అమ్మవారు బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సాంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు.

ఈ సందర్భంగా అమ్మవారిని 9 గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు.

భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మీ వ్రతం పూజావిధానాన్ని, మహత్యాన్ని తెలియజేశారని ఆలయ అర్చకులు శ్రీ శ్రీనివాస ఆచార్యులు తెలిపారు. పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, ఆచరించవలసిన విధానాన్ని తెలియ చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. త్రేతాయుగంలో కుండలినీ నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మీ నోము ఆచరించి పొందిన ఫల ప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రీతితో తిరుచానూరులో శ్రీ పద్మావతీ అమ్మవారు అవతరించారని, వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగల్యసౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు.

తరువాత 12 రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది.

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ జె.శ్యామల రావు మీడియాతో మాట్లాడుతూ, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్లు చెప్పారు.

ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడికి అమ్మవారి ప్రసాదాలు అందించేలా చర్యలు చేపట్టామన్నారు.

మహిళలు పెద్ద సంఖ్యలో వ్రతంలో పాల్గొన్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూలైన్లు, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, తదితర ఏర్పాట్లు చేశామన్నారు. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు వీక్షించేలా ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అందించామన్నారు.

ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా టిటిడికి చెందిన 52 ఆలయాల్లో 8 లక్షల గాజులు, 1.60 లక్షల కంకణాలు, 1.60 లక్షల పసుపు దారాలు, 1.60 లక్షల కుంకుమ ప్యాకెట్లు, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పుస్తక ప్రసాదాలను అందించామన్నారు.

భక్తులను విశేషంగా అకట్టుకున్న వ్రత మండపం

టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్యర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 40 మంది సిబ్బంది, 3 ట‌న్నుల సంప్రదాయ పుష్పాలు, ఆరు రకాల 30 వేల కట్ ఫ్లవర్స్ తో మూడు రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

ఇందులో బత్తాయి, ఆపిల్ వంటి ఫలాలు, వివిధ సంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా రూపొందించారు. మండపం పైభాగంలో గజ లక్ష్మీ అమ్మవారు, కింది భాగంలో రెండు వైపుల ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆస్థాన మండపాన్ని అష్టలక్ష్మి మూర్తులతో, రోజాలు, తామరపూలు లాంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. చెన్నైకి చెందిన దాత విరాళంతో పుష్పాలంకరణ చేపట్టామని ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు తెలిపారు.

భక్తులందరూ వ్రతాన్ని వీక్షించేందుకు వీలుగా ఆస్థాన మండపంలో, పుష్కరిణి వద్ద, వాహన మండపం వద్ద, ఫ్రైడే గార్డెన్స్, తొలప్ప గార్డెన్ వద్ద కలిపి 5 ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

స్వర్ణరథోత్పవం

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, టిటిడి బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీ జి.భానుప్రకాశ్ రెడ్డి, టిటిడి ఎక్స్ అఫిషియో మెంబర్ శ్రీ దివాకర్ రెడ్డి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ హరీంధ్రనాథ్, హెడిపిపి సెక్రటరీ శ్రీ శ్రీరాం రఘునాథ్, విజివోలు శ్రీ సురేంద్ర, శ్రీ రాంకుమార్ , ఏఈఓ శ్రీ దేవరాజులు, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Andhra Pradesh:రాయలసీమ,ఉత్తర తమిళనాడు మీదుగా  ద్రోణి విస్తరించి ఉంది.దీని ప్రభావంతో శుక్రవారం రాయలసీమలో పిడుగులతో కూడిన ...
08/08/2025

Andhra Pradesh:

రాయలసీమ,ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉంది.

దీని ప్రభావంతో శుక్రవారం రాయలసీమలో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు, మన్యం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి-మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

పిడుగుపాటు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Address

Nellore

Alerts

Be the first to know and let us send you an email when VAMSI NEWS CHANNEL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to VAMSI NEWS CHANNEL:

Share

Category