Ap10 news

Ap10 news express people views

ఆంద్రప్రదేశ్ లో జల జీవన్ మిషన్ అమలుపై ప్రశ్నించిన  రాజ్యసభ సభ్యులు  బీద మస్తాన్ రావు కావలి జూలై 25  రాజ్యసభలో  బీద మస్తా...
25/07/2022

ఆంద్రప్రదేశ్ లో జల జీవన్ మిషన్ అమలుపై ప్రశ్నించిన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు

కావలి జూలై 25

రాజ్యసభలో బీద మస్తాన్ రావు ఆంద్రప్రదేశ్ లో జల జీవన్ మిషన్ క్రింద గ్రామీణ ప్రాంతాల్లోని ఎంత శాతం గృహాలకు త్రాగు నీటి సరఫరా అందించబడినదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జల జీవన్ మిషన్ (JJM) కింద ప్రభుత్వం 100 శాతం లక్ష్యాన్ని సాధించగలదా అని, అలా అయితే, దాని వివరాలు మరియు కాకపోతే, దానికి కారణాలు తెలియచేయవలసినదిగా ప్రశ్నించగా కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ వ్రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.2024 నాటికి దేశంలోని అన్ని గ్రామీణ కుటుంబాలకు హర్ ఘర్ జల్ నినాదంతో జల్ జీవన్ మిషన్ (JJM) పథకం క్రింద- రాష్ట్రాల భాగస్వామ్యంతో ప్రతి ఒక్కరికి త్రాగునీటి కుళాయి సరఫరాను అందించేవిధంగా భారత ప్రభుత్వం ఆగస్టు, 2019 నుండి, అమలు చేస్తోందని, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన ప్రకారం మెత్తం 95.69 లక్షల గ్రామీణ కుటుంబాలలో 57.47 లక్షల కుటుంబాలకు (60.06%) కుళాయిల ద్వారా నీటి సరఫరా అందించబడినదని, రాష్ట్రంలో మిగిలిన అన్ని గ్రామీణ కుటుంబాలకు 2024 మార్చినాటికి కుళాయిల ద్వారా నీటి సరఫరా అందించబడేవిధంగా లక్ష్యాన్నిపెట్టుకోబడినదని తెలియ చేసారు.జల్ జీవన్ మిషన్ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి, ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశం మొత్తంలో శిక్షణలు వర్క్‌షాప్‌లు/కాన్ఫరెన్స్‌లు/వెబినార్‌లు ద్వారా సాంకేతిక మద్దతు అందించడానికి అనేక ప్రణాలికలు రూపొందించడం జరిగినదని తెలియచేసారు.
గ్రామ పంచాయతీలలో సురక్షితమైన త్రాగు నీరు అందించడానికి ప్రత్యెక ప్రచారం ద్వారా, పాటశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు మరియు ఆశ్రమాలకు పైపులద్వారా నీటి సరఫరా అందించడానికి ప్రణాలికను సులభతరం చేయడానికి అంద్రప్రదేశ్‌ తో సహా మిగిలిన అన్ని రాష్ట్రాలలో జల్ జీవన్ మిషన్ అమలుకోసం వివరణాత్మక మార్గదర్సకాలు తయారుచేయడంజరిగినదని తెలియచేసారు.జల్ జీవన్ మిషన్ అమలు ఆన్‌లైన్ పర్యవేక్షణ కోసం, JJM-ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ సమాచార వ్యవస్థ (IMIS) మరియు JJM-డ్యాష్‌బోర్డ్ లో ఉంచబడ్డాయి.పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ .(PFMS) ద్వారా పారదర్శక ఆన్‌లైన్ ఆర్థిక నిర్వహణ కోసం రూపొందించబడిందని, 2021-22లో 3,182.88 కోట్ల నుండి 2022-23లో JJM కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ. 3,458.20 కోట్ల కేంద్ర నిధులను పెంచుతూ కేటాయించడంజరిగినదని అన్నారు.

ఆర్టీసి డోర్ డెలివరీ మాసోత్సవాల ప్రారంభం కావలి జూలై 25ఏపియస్ ఆర్టీసి సరకు రవాణా సేవలను విస్తృత పరుస్తున్నట్లు కావలి డిపో...
25/07/2022

ఆర్టీసి డోర్ డెలివరీ మాసోత్సవాల ప్రారంభం

కావలి జూలై 25

ఏపియస్ ఆర్టీసి సరకు రవాణా సేవలను విస్తృత పరుస్తున్నట్లు కావలి డిపో మేనేజర్ రాపూరు శ్రీనివాసులు తెలిపారు. సోమవారం కావలి కార్గో కేంద్రంలో డిపో మేనేజర్ డోర్ డెలివరీ మాసోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్గో సేవలను ఆదరిస్తున్న వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు. వినియోగదారులకు మరింత చేరువ అవ్వడమే లక్ష్యంగా డోర్ డెలివరీ మాసోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా యాజమాన్యం నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఈ మాసోత్సవాలలో కావలి డిపో సిబ్బందితో పాటు అవుట్ సోర్సింగ్ సిబ్బంది, హమాలీలు, బస్టాండ్ లోని వ్యాపారులు పాల్గొని , నూతన వినియోగదారులను పరిచయం చేసి , కార్గో వ్యాపారాభివృద్ధికి తోడ్పడతారని అన్నారు. వినియోగదారుల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా కావలి డిపో అధికారులు డెలివరీ సిబ్బంది నిర్వహించారు. డిపో మేనేజర్ స్వయంగా కావలి ఏయంసి ఛైర్మెన్ మన్నెమేల సుకుమార్ రెడ్డి , ప్రముఖ వైద్యులు డాక్టర్ మంచికంటి రామస్వామి తదితర ప్రముఖుల ఇండ్లకు వెళ్లి పార్సిళ్లను డెలివరీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ( ట్రాఫిక్ ) కెవిఆర్ బాబు , మార్కెటింగ్ ఎక్జిక్యూటివ్ డి.రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

24/07/2022

👉 సిద్దు ఆధ్వర్యంలో 27వ రోజు పవన్ అన్న అన్నం బండి ద్వారా భోజనం పంపిణీ

24/07/2022

https://youtu.be/7IRF7qWQwzY

👉 కావలి లో భారీగా గుట్కా కైని ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న సెబ్ అధికారులు

https://youtu.be/-4PpyeynRUw
13/07/2022

https://youtu.be/-4PpyeynRUw

బ్రేకింగ్ న్యూస్ ఆవు తలకాయల లోడుతో హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న లారీని సమాచారం అందుకున్న బీజేవైఎం రాష్ట్.....

https://youtu.be/UAuWWJqETzEHeadlinesవిజయవాడ లో జరిగే ప్లీనరీ సమావేశం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ఏఎంసీ చైర్...
06/07/2022

https://youtu.be/UAuWWJqETzE
Headlines

విజయవాడ లో జరిగే ప్లీనరీ సమావేశం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి

బాబు జగత్ జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ఏఎంసి చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి

ఉదయగిరి బ్రిడ్జి పై గుంతలను పొడిచిన బిజెపి నాయకులు

జిల్లా సంయుక్త కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రోణంకి కుర్మనాద్

అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలుపై సమావేశం నిర్వహించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

విజయవాడ లో జరిగే ప్లీనరీ సమావేశం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ.....

https://youtu.be/_0rqaii-lUU
23/04/2022

https://youtu.be/_0rqaii-lUU

ప్రాణాలు హరించే సారా తయారీ వద్దు, జీవితమే ముద్దు జిల్లా ఎస్పీ విజయరావు అన్నారు. ప్రాణాంతకమైన సారా తయారీ వృత్తి.....

Address

Kavali Janathapet North
Nellore

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+918978785521

Website

Alerts

Be the first to know and let us send you an email when Ap10 news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ap10 news:

Share