NDN News

NDN News NEWS CHANNEL

21/09/2025

అన్యాయాన్ని ఎదిరించే దళితులపై కేసులా?
మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే, అంతుచూస్తాం.
=============================
కోవూరు నియోజకవర్గ వైసిపి నేత డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిని జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, మేరుగ మురళి పరామర్శించారు .ఒక కేసు కు సంబంధించి నెల్లూరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఉన్న వీరి చలపతిని ఈ ముగ్గురు నేతలు పరామర్శించి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. దళితుడుగా ప్రభుత్వ దుర్మార్గాలను ,అన్యాయాలను ఎదిరించి ప్రశ్నిస్తున్నాడన్న ఏకైక కారణంతో రెండున్నర ఏళ్ల నాటి కేసును తిరగపెట్టీ మళ్లీ ఇప్పుడు అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కూటమి ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. పోలీసులు కూడా అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ వారు చేసే అక్రమాలు అన్యాయాలలో భాగస్వాములు అవుతున్నారని అన్నారు . రాబోయేది తమ ప్రభుత్వమేనని వై నాట్ 175 అనేది ఈ దఫా జరగబోతుందని అన్నారు . తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకి ఇంత అక్రమాలు చేసిన వాళ్ళు అనుభవిస్తారని హెచ్చరించారు.

21/09/2025

అమావాస్య రోజున బూడిద గుమ్మడికాయ
దిష్టితీసి కొడితే నరదిష్టి తొలగిపోతుందా..?
=====================///
హిందూ సాంప్రదాయం ప్రకారం గృహప్రవేశాలు, దుకాణాల ప్రారంభాల సమయంలో.. అమావాస్య రోజున దిష్టి తగలకుండా బూడిద గుమ్మడికాయలను కొట్టడం, గుమ్మంలో ముందు భాగాన కట్టడం చేస్తుంటారు. ఇలా కొట్టడం వల్ల, వేలాడదీయడం వల్ల నర దిష్టి, ఇతర సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. గుమ్మడికాయని ఒక సాంస్కృతిక, జానపద ఆచారంగా భావిస్తారు.ఇది ప్రధానంగా మానసిక విశ్వాసం పై ఆధారపడి ఉంటుంది. చాలామందికి ఇది ఒక రకమైన మానసిక భద్రతను, ప్రశాంతతను ఇస్తుంది. గుమ్మడికాయను అమావాస్య రోజున దిష్టి తీసి ఎక్కువగా కొడుతూ ఉంటారు. అమావాస్య రోజున అమ్మవారు విపరీతమైన శక్తి స్వరూపంగా మారుతుంది. మామూలు రోజుల కంటే ఆరోజు శక్తి కోటి రెట్లు పెరుగుతుందని అంటారు. అందువల్లే అమావాస్య రోజు గుమ్మడికాయను ఇళ్ళు, దుకాణాల ముందు కట్టడం, కొట్టడం చేయాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.గుమ్మడికాయలో అత్యధిక ప్రాణ శక్తి ఉంటుంది. అందుచేత దాని గాలి సోకితే ఇంట్లో ఉన్నవారికి ప్రాణశక్తి వస్తుందని చెబుతారు. అందుకే బూడిద గుమ్మడి కాయకు పసుపు పూసి, కుంకుమ అద్ది గుమ్మాల ముందు కడతారు. కూరగాయలలో సంవత్సరం మొత్తం పాడవకుండా నిల్వ ఉండేది గుమ్మడికాయ ఒక్కటే. అందువల్లే అంత శక్తి గలిగిన గుమ్మడికాయని దృష్టి దోష నివారణల కు ఉపయోగిస్తారు.

21/09/2025

ముగిసిన ఏఎస్ పేట గంధ మహోత్సవం..
దేశం నలుమూలనుంచి భక్తులతో కిటకిట..
==========================///
ఏఎస్ పేటలో వెలసి ఉన్న శ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ 252వ గంధ మహోత్సవం ఈ రోజుతో ముగిసింది. మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ గందోత్సవం తహలేల్ ఫాతిహా తో ముగిసింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గా ప్రాంగణంలో సబ్జాద నషీన్ షా గులాం నక్షాబంద్ హఫీజ్ పాషా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వేలాది భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో ఈ ఘట్టాన్ని తిలకించారు. ఈ సందర్భంగా పలువురు భక్తి గీతాలు ఆలపించారు. ఫకీర్లు డప్పు వాయిద్యాలతో గీతాలు ఆలపించారు. అనంతరం స్వామివారి సమాధికి హఫీజ్ పాషా తో పాటు దర్గా ఈవో మొహమ్మద్ హుస్సేన్ గంధం లేపనం చేశారు. ముగింపు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం గంధం భక్తులకు పంచిపెట్టారు.

21/09/2025

డాక్టరూ తాగి ఏసీ రూమ్ లో పడుకున్నావు
కాన్పు చేయకుండా మా బిడ్డను చంపేశావ్..
=========================
మహిళ పురిటి నొప్పులు పడుతుంటే .. డాక్టర్ తాగిన మైకంలో ఉన్నాడు..ఎంత బ్రతిమాలినా రాలేదు.. దీంతో మా బిడ్డ చనిపోయింది. ఒరే డాక్టరూ నిన్ను వదిలిపెట్టం అంటూ ఉదయగిరి హాస్పిటల్ ఎదుట మహిళలు ధారణ చేసారు. గత రాత్రి డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ప్రసవించిన బిడ్డ చనిపోయింది. దీంతో మహిళలు శాపనార్థాలు పెడుతూ బైఠాయించారు. పోలీసులు రంగప్రవేశం చేసారు.

21/09/2025

నిర్లక్ష్యానికి మారుపేరు ఉదయగిరి ఆసుపత్రి
వైద్యుల అసమర్ధతకు మరో పసికందు బలి..
===========================///
ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్లక్ష్యం తాండవిస్తోంది. డాక్టర్లు పనిచేయడంలేదు. పట్టించుకొవడంలేడు. ఉదయగిరి పోస్టింగ్ అంటేనే పనిష్మెంట్ అన్న ప్రచారం ఉండటంతో జిల్లాలో ఎక్కడా పనికిరాని వారిని ఇక్కడకు పంపుతారన్న ప్రచారం ఉంది. తాజాగా ఓ మహిళకు సరైన సమయంలో కంపు చేయకపోవడం, తరువాత క్యాంపులో నిర్లక్ష్యంతో పాప మృతిచెందడంతో ఉద్రిక్తత నెలకొనింది. సీతారామపురం మండలం బసినేనిపల్లి గ్రామానికి చెందిన జి ప్రసాద్ నెలలు నిండి నొప్పులతో ఉన్న తన అక్కను తీసుకొని కాన్పు కొరకు ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి రాత్రి 9 గంటలకుడు . రాత్రి 12 గంటల వరకు వైద్యులు ఎవరు పట్టించుకోకపోవడంతో కాన్పు సమయంలో జరిగిన అలసత్వం వల్ల తన బిడ్డ చనిపోయాడని ఆసుపత్రి సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బంది నిర్లక్ష్యంతోనే తన బిడ్డ చనిపోయినట్టు ఆరోపిస్తున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

21/09/2025

మహాలయ అమావాస్య తర్పణాలు
సముద్రంలో వదిలితే మంచిదా..?
====================///
సాంప్రదాయాలను ఆచారాలను పాటించే వారికి ఈరోజు ఓ పవిత్రమైన దినం. గతించిన పెద్దలకు తర్పణాలు వదులుకునే మహాలయ అమావాస్య రోజు ఇది. ఆదివారం , అమావాస్య,, మహాలయ పర్వదినం.. ఈ మూడు కలిసిన రోజున సాగరం ఎలా ఊరుముతుందో, ఉరకలు వేస్తుందో చూడండి. సముద్ర తీరంలో రామలింగేశ్వర ఆలయం వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో సముద్రం తెల్లవారి నుంచి మహోగ్రరూపంలో ఉంది. భక్తులు తెల్లవారి నుంచి సముద్రానికి వచ్చి పెద్దలకు తర్పణాలు వదిలేందుకు సిద్ధమవుతున్నారు. సెలవు దినాలు కూడా కావడంతో సముద్ర తీరం వద్దకు భక్తులు పర్యాటకులు రావడం మొదలు పెడుతున్నారు. పోలీసులు కూడా భద్రత ఏర్పాట్లు చేశారు. తీరంలో ఈరోజు అంతా పూజాదిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మహాలయ అమావాస్య రోజున అన్ని నదులు కలిసే సముద్ర తీర ప్రాంతంలో గతించిన పెద్దలకు తర్పణాలు వదలడం అనేది అనాదికాలంగా వస్తున్న ఆచారం. సముద్రం లేని ప్రాంతంలో నదులు, నదులు లేని ప్రాంతంలో బావులు, బావుల్లేని ప్రాంతంలో ఇళ్ల వద్దనే పెద్దలకు తర్పణాలు వదులుకోవడం అనేది ఆచారం . మహాలయ పర్వదినాలు ఆదివారం అమావాస్య రోజునే ప్రారంభం కావడంతో విశిష్టమైన రోజుగా భావిస్తున్నారు. దానికి తోడు సముద్రం వద్ద పెట్టే తర్పణాలు, సాగరం తనలోకి తీసుకుంటే పరలోకాల్లో ఉన్న పెద్దల ఆత్మలు మనం వదిలే తర్పణాలు స్వీకరించినట్టేనని భావిస్తారు. ఈ సందర్భంగా పేద బ్రాహ్మణులకు దక్షిణ , వస్త్రాలు పెట్టి , భోజనం పెట్టి పంపిస్తారు.

21/09/2025

కిరాణాషాపులో కస్టమర్ల మాదిరి నటించి
మహిళ మెడలో బంగారు చైన్ తో బైక్ పై పరార్.
======================///
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నరసింహ కండ్రిగ గ్రామంలో ఇద్దరు దొంగలు ఓ మహిళ మెడలోని నాలుగు సవర్ల బంగారు గొలుసును లాక్కెళ్లారు. మోటార్ బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు దుకాణంలో సరుకులు కొనుగోలు చేస్తున్నట్లుగా నటిస్తూ షాపు నిర్వాహకురాలు వెంగమ్మ మెడలోని నాలుగు సవర్ల బంగారు సరుడును అపహరించుకు వెళ్లారు. పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

20/09/2025

అక్రమ మైనింగ్ కేసులో శ్రీకాంత్ రెడ్డికి బెయిల్
63 రోజుల తరువాత జైలు నుంచి విడుదల
========================///
అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ చేసి క్వార్ట్జ్ ఖనిజం అక్రమంగా రవాణాచేసిన కేసులో గత 63 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న వైసిపి ఛోటా నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి , ఎట్టకేలకు బెయిల్ పై విడుదలయ్యారు .మైనింగ్ చట్టాల ఉల్లంఘన, మోసం, చోరీ , అకర్మరావణ తదితరనేరాలపై ఆయనపై కేసు నమోదు అయింది. గత రెండు నెలలకు పైగా బెయిల్ రాక పోవడంతో ఆయన నెల్లూరు జైల్లోనే ఉన్నారు. ఎట్టకేలకు హైకోర్టు బెయిల్ తో విడుదలయ్యారు.

20/09/2025

బంగాళాఖాతంలో అల్పపీడనం..
నెల్లూరు జిల్లాకు ఎల్లో అలర్ట్..!
======================
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. మరోవైపు దక్షిణకోస్తా మీదుగా ద్రోణి కొనసాగుతోంది. శ్రీకాకుళం, విజయవాడ, అల్లూరి, ఏలూరు, కోనసీమ, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఏపీకి ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేశారు.

20/09/2025

99 రూపాయలకే గుడ్ థింగ్స్..
మంచి ఆఫర్.. మిస్ అవ్వకండి..!
===================
నెల్లూరు గుడ్ థింగ్స్ లో స్పెషల్ ఆఫర్స్ అందుబాటులోకి వచ్చాయి. కొన్ని ప్రత్యేకమైన వస్తువులపై స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నామని షోరూం నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశం రెండు రోజులు మాత్రమే ఉంటుందని.. నెల్లూరు నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ బదిలీ..నూతన JC గా మొగిలి వెంకటేశ్వర్లు..
20/09/2025

నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ బదిలీ..
నూతన JC గా మొగిలి వెంకటేశ్వర్లు..

20/09/2025

నా శక్తికి మించి కృషి చేస్తా..!
భక్తులకు ఇబ్బందులు రానీయకండి..
======================
నెల్లూరు గ్రామదేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. కమిటీ సభ్యులను అభినందించారు. ఆలయానికివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఆలయ అభివృద్ధికి శక్తికి మించి కృషి చేస్తానని పేర్కొన్నారు.

Address

Nellore
524004

Alerts

Be the first to know and let us send you an email when NDN News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to NDN News:

Share