NDN News

NDN News NEWS CHANNEL

100 కోట్ల అవినీతి తిమింగలం..అది ఇల్లా.. బంగారపు దుకాణమా..?======================తెలంగాణలో ఓ భారీ అవినీతి తిమింగలం బయటపడి...
09/06/2026

100 కోట్ల అవినీతి తిమింగలం..
అది ఇల్లా.. బంగారపు దుకాణమా..?
======================
తెలంగాణలో ఓ భారీ అవినీతి తిమింగలం బయటపడింది. R&B ఇంజినీర్-ఇన్-చీఫ్ మోహన్ నాయక్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా బంగారం మరియు నగదు గుర్తించారు. 15 బంగారం బిస్కట్లు, కళ్ళు చెదిరిపోయే బంగారు ఆభరణాలు, విదేశీ మద్యం బాటిళ్లు, డబ్బుల కట్టలు, భారీ వెండి సామాగ్రి, ఆస్తి పత్రాలు లభించాయి. హైదరాబాద్ - నిజామాబాద్ ప్రాంతాల్లో లెక్కకు మించి ఆస్తులు బయటపడుతున్నాయి. మొత్తంగా 15 ప్రాంతాల్లో చేసిన దాడుల్లో ఇప్పటివరకూ 100 కోట్ల ఆస్తులకు పైగానే గుర్తించారు.

09/06/2026

మున్సిపాలిటీలు ఆర్ధికంగా బలపడేలా..
పీపీపీ విధానంలో ప్రాజెక్టులు చేస్తాం..
======================
మున్సిపాలిటీలకు కేంద్రం ఇస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వినియోగం, లోన్ల సమీకరణపై APUFIDC ఆధ్వర్యంలో వర్క్ షాప్ జరిగింది. రెండు రోజులపాటు జరిగే వర్క్ షాప్ నకు ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ,హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ఠ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. మున్సిపల్ ఆస్తుల ప్రైవేటీకరణ అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమన్నారు. మున్సిపాలిటీలు ఆర్ధికంగా బలపడేలా పీపీపీ విధానంలో ప్రాజెక్టులు చేపట్టాలని సూచించామని తెలిపారు. టెండర్ విధానంలోనే PPP ప్రాజెక్టులు చేపడుతున్నామని క్లారిటీ ఇచ్చారు. మున్సిపాలిటీల్లో 20,000 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని పేర్కొన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో డిప్యూటీ సీఎం..ప్రమాద ఘటనా స్థలిని పరిశీలించిన పవన్..=======================విశాఖ స్టీల్ ప్లాంట్...
09/06/2026

విశాఖ స్టీల్ ప్లాంట్ లో డిప్యూటీ సీఎం..
ప్రమాద ఘటనా స్థలిని పరిశీలించిన పవన్..
=======================
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనా స్థలిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ప్రమాదానికిగల కారణాలపై అధికారులు, కార్మికులను అడిగి తెలుసుకున్నారు. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణమని కార్మికులు తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యం, నిర్వహణా లోపాలే తమ తోటివారి ఉసురు తీశాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను..పరామర్శించిన మంత్రి నారాలోకేష్..====================విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్...
09/06/2026

స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను..
పరామర్శించిన మంత్రి నారాలోకేష్..
====================
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కార్మికులను, వారి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి సెవెన్ హిల్స్ ఆసుపత్రికి వెళ్లిన ఆయన.. బాధితులకు పరామర్శించి ధైర్యం చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

వైరల్ తాతను కలిసిన..సీఎం చంద్రబాబు..!===============పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెంది...
09/06/2026

వైరల్ తాతను కలిసిన..
సీఎం చంద్రబాబు..!
===============
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ ( వైరల్ తాత ) అనే వృద్ధుడు సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. తమ నియోజకవర్గానికి చంద్రబాబు వస్తున్నారని, దూరం నుంచైనా ఆయన్ను చూడాలని మాట్లాడిన వీడియో వైరల్ అయ్యి సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లిన విషయం తెలిసిందే. సత్యనారాయణ గారూ సిద్ధాంతంలో కలుద్దాం అని సీఎం రిప్లై కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం మీ భూమి – మీ హక్కు కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దాంతం వెళ్లిన సీఎం చంద్రబాబు...కార్యక్రమం అనంతరం తన బస్సులోకి సత్యనారాయణను ప్రత్యేకంగా పిలుపించుకున్నారు. కాసేపు ఆత్మీయంగా మాట్లాడి కుటుంబ వివరాలు, ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతనికి వైద్యసాయం అందించాలని సత్యనారాయణ ముఖ్యమంత్రిని కోరారు. తమ గ్రామానికి డ్రైనేజ్ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. తన అభిమాని కుమారుడికి వైద్యం చేయిస్తానని భరోసా ఇచ్చిన సీఎం సత్యనారాయణకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

09/06/2026

గంగమ్మ తల్లికి..
గ్రామోత్సవం..!
============
సంగం గ్రామంలోని శ్రీ పాలేటి గంగమ్మ తల్లి ఆలయంలో జాతర మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.జాతరలో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అమ్మవారి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని విశేష పూల అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దగా, తప్పెట్లు తాళాల మధ్య గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.యాదవ కులస్తులు తమ ఆచార సంప్రదాయాల ప్రకారం ఉత్సవాల ముందు వీర తాళ్ళను కొట్టుకుని ప్రత్యేకంగా ఆకర్షణ గా నిలిచారు.జాతరలో అమ్మవారి వేషాలు ఆకట్టుకున్నాయి.

09/06/2026

స్పెషల్ హెలికాప్టర్ లో ల్యాండ్ అయిన..
రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్..
==================
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘన స్వాగతం పలికారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ 10, 11 మరియు 12వ స్నాతకోత్సవ (కాన్వొకేషన్) కార్యక్రమంలో పాల్గొనేందుకు నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ హెలీపాడ్ కు ప్రత్యేక హెలికాప్టర్ లో గవర్నర్ చేరుకున్నారు. గవర్నర్ కి ఘన స్వాగతం పలికిన వారిలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఇన్చార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ , ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు నగర మేయర్ సుజాత, విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డా. సునీత, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులు ఉన్నారు.

భర్తను చంపిన భార్యకు జీవితఖైదు..సహకరించిన బిడ్డలకు ఉరిశిక్ష..====================మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్ట్ సంచలన...
09/06/2026

భర్తను చంపిన భార్యకు జీవితఖైదు..
సహకరించిన బిడ్డలకు ఉరిశిక్ష..
====================
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్ట్ సంచలన తీర్పు చెప్పింది. మారుతీ అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగిని చంపిన కేసులో అతడి భార్యా.. బిడ్డలకు కఠిన శిక్ష విధిస్తూ న్యాయమూర్తి బాలబాస్కర్ రావు తీర్పు చెప్పారు. భార్య గంగాబాయికి జీవిత ఖైదు.. కొడుకు కిషన్ (47), కూతురు ప్రఫుల్ల (36)లకు ఉరిశిక్ష విధించారు. మారుతీకి ఆహారంలో విషపదార్ధం ఇస్తూ.. అతడి చావుకు కారణమయ్యారు. అతడు మృతి చెందాక బాడీ పార్ట్స్ అన్నిటినీ ముక్కలు చేసి ఇంట్లో పెట్టుకున్నారు. చుట్టుపక్కల వారికి దుర్వాసన రావడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ దారుణం బయటపడింది.

09/06/2026

మార్కెట్లోకి మామిడికాయలు వచ్చేశాయి..
కేజీ నిమ్మ 200 నుంచి 20 రూపాయలకు పతనం..
==========================
ఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చిందన్న చందంగా తయారైంది నిమ్మ రైతుల పరిస్థితి. ఇటీవల మార్కెట్లోకి పెద్దఎత్తున మామిడికాయలు రావడంతో నిమ్మకాయల డిమాండ్ ఒక్కసారిగా తగ్గి, ధరలు అమాంతం కుప్పకూలాయి. నెల రోజుల క్రితం 80 కేజీల నిమ్మబస్తా 10 వేల నుంచి 16 వేల వరకు ధర పలికింది. ప్రస్తుతం కేవలం 1,500 నుంచి 3,000 రూపాయల మధ్యకే పరిమితమైందని రైతులు చెబుతున్నారు. రోహిణి కార్తె ప్రభావంతో ఎండలు మండిపోతున్న ఈ సమయంలో నిమ్మకాయలకు డిమాండ్ పెరుగుతుందని రైతులు ఆశించారు. అయితే అందుకు విరుద్ధంగా ధరలు పడిపోవడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మామిడికాయల సీజన్ ప్రారంభం కావడంతో వినియోగదారులు పచ్చి మామిడికాయలతో పచ్చళ్లు, ఊరగాయలు తయారు చేసుకోవడంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. గతంలో నిమ్మకాయలతో తయారు చేసే ఊరగాయలకు ఉన్న డిమాండ్ ప్రస్తుతం మామిడికాయల వైపు మళ్లడంతో నిమ్మకాయల కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు లెమన్ మర్చంట్స్ అసోసియేషన్ కార్యదర్శి అట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మండే ఎండలకు నిమ్మకాయల క్వాలిటీ తగ్గిపోయిందని, అలాగే ఇతర ప్రాంతాల నుంచి నిమ్మ ఎగుమతి పెరిగిందన్నారు. ధరల తగ్గుతలకు ఇవి కూడా కారణమని పేర్కొన్నారు. 100 బస్తాల్లో అయిదు శాతం మాత్రమే నాణ్యమైన కాయలు ఉంటున్నాయని చెప్పారు. ప్రస్తుతం కాయ నాణ్యతను బట్టి కేజీ 20 నుంచి 80 రూపాయల దాకా ఉందని తెలిపారు.

అమెరికాలో  హెచ్ వన్ బి వీసా రుసుము లక్ష డాలర్లకు పెంచడం చట్ట విరుద్ధమని అమెరికన్ ఫెడరల్ జడ్జి ఆ నిబంధనను రద్దు వేశారు. అ...
09/06/2026

అమెరికాలో హెచ్ వన్ బి వీసా రుసుము లక్ష డాలర్లకు పెంచడం చట్ట విరుద్ధమని అమెరికన్ ఫెడరల్ జడ్జి ఆ నిబంధనను రద్దు వేశారు. అప్లికేషన్ ఫీజుగా కాకుండా ట్రంప్ సర్కార్ దీన్ని పన్నుగా నిర్ధారిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలు రాజ్యాంగ పరిధిని, పరిమితిని అతిక్రమించడమేనని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇలాంటి పన్నులను అమెరికా అధ్యక్షుడు, కాంగ్రెస్ ఆమోదం లేకుండా విధించజాలరని, ఆయనకు ఆ అధికారం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 2025 సెప్టెంబర్ లో ప్రవేశపెట్టిన ఈ నిబంధన కింద అప్లికేషన్ రుసుము 2వేల నుంచి 5 వేల డాలర్లు ఉండగా ఒక్కసారిగా దానిని లక్ష డాలర్లకు పెంచారు.పైగా దాన్ని ఫీజు కాకుండా ట్యాక్స్ అని పేర్కొన్నారు. ఇలా టాక్స్ విధించే అధికారం అమెరికా అధ్యక్షుడుకు ఉండదు. దానికి కాంగ్రెస్ ఆమోదం పొందాలి. ఈ తీర్పుపై అప్పీలుకు ట్రంప్ సర్కార్ సిద్ధమవుతోంది.

Address

Nellore
524004

Alerts

Be the first to know and let us send you an email when NDN News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to NDN News:

Share