29/07/2025
నెల్లూరు రూరల్ లో అభివృద్ధి పరుగులు
ప్రజలు కూడా ప్రగతి పధంలో భాగస్వాములు కావాలి
==========================///
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్, బ్యాంక్ కాలనీలో 15లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేసారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 23వ డివిజన్ అభివృద్ధికి 4.80 కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు. .23వ డివిజన్ పేద, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసిస్తున్న ప్రాంతమని . డివిజన్ ను అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సి.ఎం. కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సహకారంతో నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎక్కడికక్కడ ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దుద్దుగుంట (ఒరిస్సా) శ్రీనివాసులు రెడ్డి, కో క్లస్టర్ ఇంచార్జ్ రాఘవేంద్ర రావు, 23వ డివిజన్ టిడిపి అధ్యక్షులు మేకల మధు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్చార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, టిడిపి నాయకులు పుల్లారెడ్డి, పామూరు సుధాకర్ రెడ్డి, మస్తాన్ రెడ్డి, చల్లా సుబ్బన్న, మల్లికార్జున్ రెడ్డి, బాబ్జి, శివయ్య, మురళి రెడ్డి, పామూరు శ్రీనివాసలురెడ్డి, చిన్న మల్లికార్జున, అంకయ్య, శివ, వెంకటేశ్వర్లు, మోడేపల్లి శివ, మమతారెడ్డి, మాధవి మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.