NDN News

NDN News NEWS CHANNEL

హైదరాబాదులో బేగం బజార్ వినాయకుడి 48 కిలోల విగ్రహం నిజంగా అంతా బంగారమేనా..? అది అంతా బంగారం కాదు. దానికి అలా పేరు వచ్చింద...
14/09/2026

హైదరాబాదులో బేగం బజార్ వినాయకుడి 48 కిలోల విగ్రహం నిజంగా అంతా బంగారమేనా..? అది అంతా బంగారం కాదు. దానికి అలా పేరు వచ్చింది . పంచలోహ మిశ్రమమైన ఈ విగ్రహానికి 24 క్యారెట్ల బంగారంతో పూత పూశారు. దాంట్లో 3 లక్షల 83 వేల అమెరికన్ డైమండ్స్ పొదిగారు. దీనికి లిచి కా రాజా అని పేరు పెట్టారు. ఇది హైదరాబాద్ వినాయక విగ్రహాలలో ప్రశస్తమైంది. ఈ గణేశుని చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తారు. కళ్ళు చెదిరే ఈ వినాయక విగ్రహం హైదరాబాద్ కే కాదు దేశంలోనే ఒక ప్రత్యేకమైనది. అందుకే లీచికే రాజా సూపర్ వినాయకుడు..

14/09/2026

కళ్లముందే మట్టి వినాయకుడు..
అడిగిన సైజులో అప్పటికప్పుడే తయారీ...
వినాయక చవితి సందర్భంగా నెల్లూరు జిల్లా పొదలకూరులో సోమవారం ఉదయం రామ మందిరం వీధిలో సౌత్ మోపూరు, పొదలకూరు ల కు చెందిన మూడు కుటుంబాలు కళ్లముందే మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసి విక్రయించారు. వినియోగదారులు కోరుకున్న ఆకృతి, సైజుకు అనుగుణంగా అక్కడికక్కడే మట్టి బొమ్మలను రూపొందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.రెడీమేడ్ విగ్రహాలకు భిన్నంగా.. తమ కళ్లముందే తయారైన మట్టి గణనాథుడిని కొనుగోలు చేసేందుకు పలువురు ఆసక్తి చూపారు.మట్టి వినాయకుల తయారీతో మన సంప్రదాయ కళకు ఊపిరి పోస్తూనే.. ఈ కుటుంబాలు స్వయం ఉపాధికి బాటలు వేసుకుంటున్నాయి.

14/09/2026

విడవలూరు మండల కేంద్రంలో దశావతారాల గణేషుడిని వైభవంగా ప్రతిష్టించి పూజలు చేశారు.. గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

14/09/2026

నెల్లూరు ఉమ్మారెడ్డి గుంటలో వినాయక విగ్రహ ప్రతిష్ట సందర్భంగా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు జరిగాయి. వందల సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజలు చేశారు.

అయ్యో.. ఎంత దుర్మార్గం.. ఈ పోలీసుల పని ఎంత నీచం?  పేదవాడైన ఓ వృద్ధుడు వాటర్ బాటిల్స్ తెచ్చుకుని బాటిల్ మీద రెండు రూపాయలు...
14/09/2026

అయ్యో.. ఎంత దుర్మార్గం.. ఈ పోలీసుల పని ఎంత నీచం? పేదవాడైన ఓ వృద్ధుడు వాటర్ బాటిల్స్ తెచ్చుకుని బాటిల్ మీద రెండు రూపాయలు ఎక్కువ ధర పెంచుకుని ప్లాట్ ఫామ్ మీద పెట్టుకొని అమ్ముకుంటున్నాడు. ఇద్దరు కానిస్టేబుల్స్ ఐదు వాటర్ బాటిల్స్ తీసుకొని ప్లాస్టిక్ కవర్లో వేసుకుని డబ్బులు ఇవ్వకుండా చక్కా వెళ్లి పోయారు. అమాయక పేద వృద్ధుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా భయంతో పోలీసుల వైపే చూస్తున్నాడు.. చూడండి .. ఎంత ఘోరమో?? ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

14/09/2026

నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 1వ డివిజన్ నవలాకులతోటలో రూ.63 లక్షల రూపాయల వ్యయంతో ముస్లిం షాదీమంజిల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముస్లిం మతపెద్దలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. షాదీమంజిల్ భవనం నిర్మాణం పూర్తయితే పేద, మధ్యతరగతి ముస్లిం కుటుంబాలకు వివాహాది శుభకార్యాలను నిర్వహించుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని. గిరిధర్ రెడ్డి అన్నారు..

14/09/2026

వైఎస్ఆర్సీపీ నెల్లూరు నేతల ఆరోపణల్లో పస లేదని, అర్దపర్దం లేని ఆరోపణలకు సమాధానం అవసరం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.. స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఎన్ని కుట్రలు చేసినా,కుయుక్తులు పన్నినా ప్రయోజనం ఉండదన్నారు. నెల్లూరులో అభివృద్ధి ఆగదు , కార్పొరేషన్ ఎన్నికల్లో అన్నీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులదే విజయం అన్నారు .

లండన్ నగరంలోని థేమ్స్ నది ఒడ్డున గంగ హారతి ఇచ్చారంటే నమ్మగలరా ?? నిజం. మొట్టమొదటిసారిగా లండన్ లోని థేమ్స్ నది ఒడ్డున ఓల్...
14/09/2026

లండన్ నగరంలోని థేమ్స్ నది ఒడ్డున గంగ హారతి ఇచ్చారంటే నమ్మగలరా ?? నిజం. మొట్టమొదటిసారిగా లండన్ లోని థేమ్స్ నది ఒడ్డున ఓల్డ్ రాయల్ నేవల్ కాలేజ్ ముంగిట గంగా హారతిని ఘనంగా ఇచ్చారు. బ్రిటన్ లోని చిన్మయా మిషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చిన్మయ మిషన్ 75 వ వార్షికోత్సవం సందర్భంగా, వేదమంత్రాలు మధ్య వారణాసిలో గంగా హారతిని పోలిన విధంగా ఇక్కడ కూడా గంగా హారతి ఇచ్చారు. థేమ్స్ నది కాలుష్య నిబంధనలను పాటిస్తూ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదైన ఆ నది ఒడ్డున ఈ గంగా హారతి కార్యక్రమం ఘనంగా జరిగింది . ఇది భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక ఘట్టం.

14/09/2026

నెల్లూరు సీఎంఆర్ షాపింగ్ మాల్ లో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. షాపు ముందు పెట్టి ఈ వినాయక విగ్రహం ప్రజలకు కమిషనర్ నందన్ పంపిణీ చేశారు. సిఎంఆర్ మాల్ యజమాని వాసు, పెంచలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఏడాది వినాయక చవితి ముందు రోజు భారీ ఎత్తున ఇలా వినాయక విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేస్తుంటారు.

నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం గౌరవరం నేషనల్ హైవే పై ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి ఒంగోలు పోతున్న ఓ కారు ట్రక్కు క...
14/09/2026

నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం గౌరవరం నేషనల్ హైవే పై ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి ఒంగోలు పోతున్న ఓ కారు ట్రక్కు కిందకు దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో శశి అనే వ్యక్తి మృతి చెందగా, ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది..

Address

Nellore
524004

Alerts

Be the first to know and let us send you an email when NDN News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to NDN News:

Shortcuts

Share