Ndnnews Online

Ndnnews Online news news, news videos, articles, news reviews, and journalistic related..

ఓ భార్య, భర్తను చంపేసి అతడు శవం పక్కనే ఎనిమిది గంటలు గడిపి ఆ తర్వాత నేరుగా ఆంజనేయస్వామి గుడికి l వెళ్ళి , పది నిమిషాలు అ...
06/06/2026

ఓ భార్య, భర్తను చంపేసి అతడు శవం పక్కనే ఎనిమిది గంటలు గడిపి ఆ తర్వాత నేరుగా ఆంజనేయస్వామి గుడికి l వెళ్ళి , పది నిమిషాలు అక్కడ స్వామివారి సేవలో గడిపి అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. తన భర్తను చంపేశానని చెప్పి పోలీసుల్ని తీసుకొచ్చి చూపించింది. ఆమె పేరు నీలం . దీనదయాల్ అనే వ్యక్తితో పదేళ్ల క్రితం వివాహం అయింది. కొంతకాలం నుంచి ఇద్దరు దూరంగా ఉంటున్నారు. ఏడేళ్ల ఏళ్ల బిడ్డ ఉంది. తన భర్త తాగుబోతు అని అందుకే దూరంగా ఉంటున్నానని చెప్పింది. తాగి వచ్చి తనను దారుణంగా కొడతాడని తెలిపింది. నిన్న కూడా అలాగే వచ్చి భరించలేనంతగా కొట్టాడని ఆ తర్వాత కోపం వచ్చి ఇంట్లో ఉన్న కర్ర తీసుకొని కొడితే, చనిపోయాడని చెప్పింది. పోలీసులు ఈ కేసులో మరో కోణం ఏదైనా ఉందా అని విచారణ చేస్తున్నారు.

వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏమైనా చెప్తాడు. ఇటీవల ఢిల్లీ, బెంగళూరు ఆకాష్ ఎయిర్ లైన్ లో పిచ్చిపిచ్చిగా మాట్లాడి రచ్చ చేసి ఆ ...
06/06/2026

వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏమైనా చెప్తాడు. ఇటీవల ఢిల్లీ, బెంగళూరు ఆకాష్ ఎయిర్ లైన్ లో పిచ్చిపిచ్చిగా మాట్లాడి రచ్చ చేసి ఆ తర్వాత పోలీసు విచారణ ఎదుర్కున్న ఓ యువకుడు ఇప్పుడు తాను కల్కి అవతారమని చెప్తున్నాడు. విమానంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూర్చుని ఆ డోర్ తీసేందుకు ప్రయత్నం చేసి పిచ్చోడు మాదిరి కేకలు పెట్టి రచ్చ చేసి గిందరగోళం సృష్టించి అందర్నీ భయభ్రాంతులకు గురి చేసిన యువకుడు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తేశాడు. తాను కల్కి అవతారమని ఈ మాట ఫ్లైట్ క్యాప్టెన్ స్వయంగా చెప్పాడని అన్నారు. తనను విమానం నుంచి దించేసి, ఎయిర్పోర్ట్ పోలీసుల వద్దకు తీసుకుపోతున్నప్పుడు తాను వాళ్ళ విషయాలన్నీ చెప్పేశానని వాళ్ళ గతాన్ని వాళ్ళ కుటుంబ విషయాలను కూడా చెప్పానని అందువల్ల తనను కల్కి అవతారంగా భావించి, అప్పటిదాకా తనకి కూడా తెలియని విషయాన్ని చెప్పారని అంటున్నాడు . తనను కల్కి భగవాన్ గా భావించామని చెప్పారని అన్నారు. అందువల్లే తను కల్కి అవతారం అని సెలవిచ్చేసాడు.

06/06/2026

కలియుగంలో కాలమానాలకు అతీతమైనది తిరుమల క్షేత్రం.. ఋతువులు ఏవైనా తిరుమలలో వాతావరణం నిత్య కళ్యాణం, పచ్చ తోరణంగా ఉంటుంది.. ఎన్ని గంటలైనా, రోజులైనా స్వామి దర్శనం లేనిదే భక్తులు వెనుతిరగరు. తిరుమలలో మహత్యం అదే..

ఈ. సాధ్విని పేరు మా దుర్గమా.. ఇటీవల ప్రచారంలోకి వస్తోంది. ఆమె ఎక్కడున్నా, భక్తులు ఆమె చేతులు, కాళ్ళు, వీపు, నడుము వత్తుత...
06/06/2026

ఈ. సాధ్విని పేరు మా దుర్గమా.. ఇటీవల ప్రచారంలోకి వస్తోంది. ఆమె ఎక్కడున్నా, భక్తులు ఆమె చేతులు, కాళ్ళు, వీపు, నడుము వత్తుతుంటారు. అయితే ఈ పని మహిళా భక్తులు మాత్రమే చేయాలి. ఆమె కూర్చున్న చోటులోనే కాకుండా నడుస్తున్నా.ఈ పని చేస్తుంటారు.. పిచ్చి పలు విధాలు అన్నట్టు భక్తిలో పలు చిత్ర విచిత్రాలు..

06/06/2026

సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు ప్రకృతిలో జీవ కోటిని ప్రభావితం చేస్తాయి. మనుషుల్లో కంటే పక్షుల్లో ఈ రెండు సమయాలు ఆహ్లాదం కలిగిస్తాయి..ఈ. రెండూ వేళల్లో పక్షుల కిలకిలరావాలు, కూతలు భిన్నంగా ఉంటాయి, శ్రావ్యంగా ఉంటాయి.. ఇది సుదీర్ఘ పరిశోధనల అనంతరం శాస్త్రవేత్తలు కనుగొన్నది.

మారుతున్న జీవన పరిస్థితులు, సమాజం ,. నాగరికత, సాంకేతికత, ప్రకృతి విధ్వంసం, పక్షుల్లోనూ మార్పు తెస్తున్నాయి . మారుతున్న క...
06/06/2026

మారుతున్న జీవన పరిస్థితులు, సమాజం ,. నాగరికత, సాంకేతికత, ప్రకృతి విధ్వంసం, పక్షుల్లోనూ మార్పు తెస్తున్నాయి . మారుతున్న కాలానికి అనుగుణంగా తమ జీవన శైలిని పక్షులు మార్చుకుంటున్నాయి. డేగలు సాధారణంగా తమ గు గూళ్లు ఎత్తైన. పర్వత శిఖరాలు, నిటారు చెట్లపై గాని పెడుతుంటాయి .వాటిలో గుడ్లు పెట్టి పొదుగుతుంటాయి. అయితే నగరాల విస్తరణలో చెట్లు మాయమైపోవడంతో ఇప్పుడు చాలా వరకు డేగలు పట్టణ ప్రాంతాల సమీపంలో ఎత్తైన ఎలక్ట్రిక్ టవర్లు పైన గూడు పెట్టి గుడ్లు పెట్టి పిల్లలు పొదుగుతున్నాయి. ఇదిగో ఇలా చూడండి. గుడ్డులో నుంచి బయటకొచ్చిన రోజుల వ్యవధిలోనే డేగ పిల్ల ఎలా చూస్తుందో.. డేగ పిల్లలు 42 రోజులకు ఎగరడం మొదలు పెడతాయి. 70రోజుల వరకు తల్లి డేగ తోనే వేట నేర్చుకుంటూ ఉంటాయి. ఆ తరువాతే స్వంతంగా వేటకు పోతాయి..

ప్రకాశం జిల్లాలో గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ పై జరిగిన దాడి కేసులో ఆకతాయిల కోసం పోలీసులు రంగంలోకి దిగారు  సింగ...
06/06/2026

ప్రకాశం జిల్లాలో గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ పై జరిగిన దాడి కేసులో ఆకతాయిల కోసం పోలీసులు రంగంలోకి దిగారు సింగరాయకొండ ప్రాంతంలో ఎర్నాకులం వైపు పోతున్న జీటి ఎక్స్ప్రెస్ ఇంజన్ పై, బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ లో పోతున్న తాగుబోతులు బీరు బాటిల్స్, రాళ్ళు, విసిరేశారు.. అద్దాలు పగిలి, లోకో పైలట్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ లోకో పైలెట్ కు ఉలవపాడులో ప్రాథమిక చికిత్స చేసి, విజయవాడకు తరలించారు. నిందితుల అరెస్ట్ కు రైల్వే పోలీస్ రంగంలోకి దిగింది.

పుస్తకాలు చెప్పే చరిత్ర తప్పు కావచ్చు, చరిత్రకారులు నిజానికి ముసుగేసి, అబద్ధాలకు రంగులు వేయొచ్చు.. కానీ ఈ చెట్టు, ఈ శిథి...
05/06/2026

పుస్తకాలు చెప్పే చరిత్ర తప్పు కావచ్చు, చరిత్రకారులు నిజానికి ముసుగేసి, అబద్ధాలకు రంగులు వేయొచ్చు.. కానీ ఈ చెట్టు, ఈ శిథిల భవనం నిజమే చెబుతుంది. జర్మనీలో 1525. నాటి భవనం ఇది. 1650 నాటికి కాలిపోయింది. అయినా ఓ చెట్టు గేట్ కీపర్ గదిపై పెరిగింది. అక్కడనుంచి అటు, ఇటు పెరిగి గోడలకు బలం చేకూర్చిందో, గోడలు దానికి బలం అయ్యాయో గానీ ఇప్పటికీ శిధిలమైన భవనంలో ఇదొక్కటే ఆ నాటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. అందుకే ప్రభుత్వం దీనిని అరుదైన కట్టడాల జాబితాలో పెట్టింది. చరిత్రకు నిజమైన సాక్ష్యం, ప్రకృతి చూపే ఆధారం..

దీన్ని హేమర్ హెడ్  పురుగు అంటారు. అంటే దీని తల సుత్తి లాగా ఉంటుంది. ఈ క్రిమి మానవాళికి మహా ప్రమాదకరమైంది.  పురాణాల్లో రా...
05/06/2026

దీన్ని హేమర్ హెడ్ పురుగు అంటారు. అంటే దీని తల సుత్తి లాగా ఉంటుంది. ఈ క్రిమి మానవాళికి మహా ప్రమాదకరమైంది. పురాణాల్లో రాక్షసుల గురించి వర్ణించినట్టు ఒక రాక్షసుడిని వధిస్తే 100 మంది రాక్షసులు పుడతారని చాలా కథలు ప్రచారంలో నుండి ఉన్నాయి .అలాంటి పురుగు ఇది. దీన్ని చంపితే మూడు భాగాలు చేస్తే మూడు భాగాలు బతుకుతాయి. నాలుగు భాగాలు చేస్తే నాలుగు భాగాలు బ్రతుకుతాయి. ఎన్ని భాగాలు చేస్తే అన్ని భాగాలు మళ్ళీ కొత్తగా పెరుగుతాయి. అందువల్ల దీన్ని చంపడం అంటే దానికి టెక్నిక్ ఉంది ..ఈ క్రిమిని తీసుకెళ్లి ఒక సీసాలో నీళ్లు పోసి దాంట్లో ఉప్పు వేస్తే చనిపోతుంది . సీసా దొరకలేదనుకుంటే ఉప్పు నీళ్లు దీనిమీద పోస్తే చనిపోతుంది. ఆ విధంగా తప్ప ఈ క్రిమి వేరే విధంగా చనిపోదు. ఇది రైతులకి, పర్యావరణానికి మహా ప్రమాదకరమైనది. ఎందుకంటే భూసారాన్ని పెంచే క్రిములను .భూసారాన్ని గణనీయంగా అభివృద్ధి చేసే వానపాములను తినేస్తుంది. ఇది ఒకటే 200.వానపాములను కూడా తినగలరు. అందువల్ల హామర్ హెడ్ పురుగు అంటే సుత్తిలాంటి ఆకారం ఉన్న ఈ క్రిమి ఎక్కడ కనిపించినా ఉప్పు నీళ్లు కలిపి చంపేస్తారు ..ఇది మన దేశంతో సహా ఆసియా దేశాలన్నిటిలోనూ విస్తృతంగా ఉంటుంది. ఇది ఉన్న పొలాలు సాధారణంగా దిగుబడి కూడా తక్కువ వస్తుంది. అలాంటి ప్రమాదకరమైనది.ఈ క్రిమి..

జైసల్మార్ లో ఓ పురాతన ఇంటిలో పాతకాలం నాటి దీపంలో మనుషులకు ఓ నీతి ఉంది. మనం వదిలేసిన, మర్చిపోయిన జీవితం ఉంది. ఆడ, మగ పావు...
05/06/2026

జైసల్మార్ లో ఓ పురాతన ఇంటిలో పాతకాలం నాటి దీపంలో మనుషులకు ఓ నీతి ఉంది. మనం వదిలేసిన, మర్చిపోయిన జీవితం ఉంది. ఆడ, మగ పావురాలు గుడ్లు పెట్టాయి. పిల్లలు పొదుగుతున్నాయి.. అవి పెద్దవి అవుతున్నాయి. అవి కూడా గుడ్లు పెడుతున్నాయి. పిల్లలు పొదుగుతున్నాయి. అయినా గూడు వీడటం లేదు, అందుకే ఆ భవనం జమీందార్లు, భవనాన్ని ఆదునికీరించినా ఈ దీపం ఉన్న భాగం మాత్రం తాకడంలేదు.. దాన్ని అలాగే ఉంచేసి, గూడుగా మారిన దీపాన్ని కాపాడుతున్నారు. పక్షుల్లో సమిష్టి జీవనానికి ఇదో నిదర్శనం..

Address

Near Kims Hospital
Nellore
524002

Website

Alerts

Be the first to know and let us send you an email when Ndnnews Online posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category