06/06/2026
ఓ భార్య, భర్తను చంపేసి అతడు శవం పక్కనే ఎనిమిది గంటలు గడిపి ఆ తర్వాత నేరుగా ఆంజనేయస్వామి గుడికి l వెళ్ళి , పది నిమిషాలు అక్కడ స్వామివారి సేవలో గడిపి అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. తన భర్తను చంపేశానని చెప్పి పోలీసుల్ని తీసుకొచ్చి చూపించింది. ఆమె పేరు నీలం . దీనదయాల్ అనే వ్యక్తితో పదేళ్ల క్రితం వివాహం అయింది. కొంతకాలం నుంచి ఇద్దరు దూరంగా ఉంటున్నారు. ఏడేళ్ల ఏళ్ల బిడ్డ ఉంది. తన భర్త తాగుబోతు అని అందుకే దూరంగా ఉంటున్నానని చెప్పింది. తాగి వచ్చి తనను దారుణంగా కొడతాడని తెలిపింది. నిన్న కూడా అలాగే వచ్చి భరించలేనంతగా కొట్టాడని ఆ తర్వాత కోపం వచ్చి ఇంట్లో ఉన్న కర్ర తీసుకొని కొడితే, చనిపోయాడని చెప్పింది. పోలీసులు ఈ కేసులో మరో కోణం ఏదైనా ఉందా అని విచారణ చేస్తున్నారు.