Ndnnews Online

Ndnnews Online news news, news videos, articles, news reviews, and journalistic related..

కొన్ని కేసులు విచిత్రంగా ఉంటాయి. ఓ కోడలు అత్త మీద కేసు వేసింది . తన అత్త షాంపూ బ్రాండ్ మార్చిందని, అలాగే భోజనంలో కూడా పౌ...
07/08/2026

కొన్ని కేసులు విచిత్రంగా ఉంటాయి. ఓ కోడలు అత్త మీద కేసు వేసింది . తన అత్త షాంపూ బ్రాండ్ మార్చిందని, అలాగే భోజనంలో కూడా పౌష్టికాహారాన్ని తగ్గించడం వల్ల తన వెంట్రుకలు రాలిపోతున్నాయని అత్తపై కేసు పెట్టింది . గృహ హింస చట్టం కింద కేసు నమోదు అయింది. ఈ విషయమై అత్త కర్ణాటక హైకోర్టులో ఎఫ్ఐఆర్ కొట్టేయాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసింది. అత్తపై ఏదో ఒక ఆరోపణ చేయాలని ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేయడం మంచిది కాదని కూడా మందలించింది. జస్టిస్ ఎం నాగప్రసన్న కోడలు ఆరోపణల్లో పసలేదని వ్యాఖ్యానిస్తూ కేసు కొట్టివేసింది. 2024 మే నెలలో వారికి పెళ్లయిందని , ఏడాదికాకముందే భార్య భర్త , అత్త భర్త దూరపు బంధువులు పైన ఫిర్యాదులు చేస్తూ వచ్చిందని అన్నారు . అత్త తన భర్త కోసమే రాగి సంగటి చేసుకుంటుందని తనకు రాజసంటి పెట్టదని , రాగి సంగటి తింటే బలవర్ధకమైన ఆహారం అని చెప్పింది . అదికాక తనను బాడి షేమ్ చేస్తున్నారని ఆరోపించింది. కోర్టు ఈ ఆరోపణలను కొట్టివేసింది.

జీరో లేనిదే ఆధునిక శాస్త్రం లేదు అని అనుకోవద్దు. జీరో అన్నది ఆధునిక శాస్త్రంలో కనుగొన్నది కాదు. ఇది వేదకాలం నాటి జ్ఞానం....
07/08/2026

జీరో లేనిదే ఆధునిక శాస్త్రం లేదు అని అనుకోవద్దు. జీరో అన్నది ఆధునిక శాస్త్రంలో కనుగొన్నది కాదు. ఇది వేదకాలం నాటి జ్ఞానం. ప్రస్తుతం జీరో మీదనే ఖగోళ, భౌతిక, రసాయనక గణిత శాస్త్రాలు ఆధారపడి ఉన్నాయి. చివరకు కంప్యూటర్ విజ్ఞానం ఇవన్నీ కూడా జీరో ప్రాతిపదిక మీదనే జరుగుతాయి. జీరో అంటే సున్నా కున్న ప్రాధాన్యత అంత ప్రసిద్ధమైనది. అయితే ఇది ఆధునిక శాస్త్రవేత్తలు కనుగొన్న సంఖ్య కాదు. ప్రాచీన కాలం నాటి మేధావులు కనుగొన్న గణిత ప్రమాణం. గ్వాలియర్ కోటలో ఓ మూలన ఉన్న చతుర్భుజ ఆలయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రజ్ఞులకు, భౌతిక శాస్త్రవేత్తలకు , గణిత శాస్త్రవేత్తలకు పరిశోధన అంశమైంది ఈ ఆలయం వద్ద ఉన్న శాసనాలలో 9 వ శతాబ్దం నాటి శాసనాల్లో కూడా జీరో ప్రాధాన్యత ఉంది. అప్పట్లోనే ఈ 0 సంఖ్యకు ప్రాధాన్యం ఉందని ఇది ఆధునిక యుగంలో కనుగొన్నది కాదని అర్థమవుతుంది. అదే విధంగా అక్కడ ఉన్న శాసనాల్లో కూడా ఈ 0 సంఖ్య ఉంది. దేవాలయం మీద శాసనాల్లో ఉంది. దీన్నిబట్టి జీరో అనేది ప్రాచీన జ్ఞానమని ఆనాటి గణిత శాస్త్ర ,గణిత విజ్ఞానంతోనే ఇది ఆధునిక యుగానికి అందిందని స్పష్టమవుతుంది.

కొన్ని సందర్భాల్లో మగాళ్ళకంటే మహిళలకే గుండె దైర్యం ఎక్కువ. బెంగుళూరులో ఓ మహిళ పెట్టుబడికి మూడింతలు ఇస్తానని స్టాక్ మార్క...
07/08/2026

కొన్ని సందర్భాల్లో మగాళ్ళకంటే మహిళలకే గుండె దైర్యం ఎక్కువ. బెంగుళూరులో ఓ మహిళ పెట్టుబడికి మూడింతలు ఇస్తానని స్టాక్ మార్కెట్ బ్రోకరింగ్ ఆఫీస్ పెట్టింది. మంచి మాటకారి. కోట్ల రూపాయలు వసూలు చేసింది. పెట్టిన డబ్బులకు రిటర్న్ రాకపోవడంతో ఇన్వెస్టర్స్ ఆమెను వత్తిడి చేయడం మొదలెట్టారు. వచ్చినప్పుడు, వచ్చినంత ఇస్తానంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతోంది. పెట్టుబడులు తీసుకునేప్పుడు కన్నడలో మాట్లాడేది, ఇప్పుడు డబ్బులు అడగబోతే బెంగాలీలో మాట్లాడుతోంది. అర్థం కాలేదు అంటే ఇది ఇండియా అంటూ వాదనకు దిగింది. దీంతో పెట్టుబడి దారులు పోలీస్ కేసు పెట్టారు..

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రకటించారు. మొదటి విడతగా ...
07/08/2026

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రకటించారు. మొదటి విడతగా 10 రూపాయలు 20 రూపాయలు ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను మార్కెట్లోకి విడుదల చేస్తారు. ప్రస్తుతానికి దానికి సంబంధించిన కార్యక్రమాలు అన్ని పూర్తయ్యాయని కేంద్రం ఆమోదించిందని కూడా తెలిపారు. వంద కోట్ల రూపాయల విలువైన 10, 20 రూపాయలు కరెన్సీ మార్కెట్లోకి విడుదల చేసి కొంతకాలం పాటు దాని చలామణి, నాణ్యత చూసి ఆ తర్వాత మిగిలిన నోట్ల విషయంలో కూడా అదే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగితపు కరెన్సీ కంటే ప్లాస్టిక్ కరెన్సీనే నిర్వహణ మరియు ఖర్చుల రీత్యా మంచిదన్నది తమ అధ్యయనంలో తేలిందని అన్నారు. లైట్ పాలిమర్ మెటీరియల్ తో దాన్ని తయారు చేయబోతున్నట్టు చెప్పారు.

వరదలు వచ్చి ఊరు కొట్టుకుపోతుందంటే గొడుగు ఎక్కడుందో వెతకమన్నాడు వెనకటీకి ఓ వెర్రి బాగులోడు.. అలా ఉంది  లక్నో, కాన్పూర్ ఎక...
07/08/2026

వరదలు వచ్చి ఊరు కొట్టుకుపోతుందంటే గొడుగు ఎక్కడుందో వెతకమన్నాడు వెనకటీకి ఓ వెర్రి బాగులోడు.. అలా ఉంది లక్నో, కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవే మీద కాంట్రాక్టర్లు చేస్తున్న పని. 64 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవేని 4500 కోట్ల రూపాయలు తో ఇటీవలే పూర్తి చేశారు. 14 రోజుల క్రితమే టోల్ ప్లాజా కూడా ఓపెన్ చేశారు. ఈలోగా వర్షాలు వచ్చాయి. మూడు రోజులు భారీ వర్షానికి 64 కిలోమీటర్ల నేషనల్ హైవే పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అంటే 4500 కోట్ల రూపాయల పని మొత్తం వరుణ దేవుడికి అర్పించేశారు. ఆ నిధులు ఎవరు మింగారో కానీ రోడ్డు మాత్రం లేదు. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చిర్రెత్తుకొచ్చింది. కేంద్రానికి ఫిర్యాదు చేసింది. వెంటనే కేంద్రం టోల్గేట్ ను మూసేయించింది. మొత్తం రోడ్డు మరమ్మతులు చేసి కొత్త రోడ్డు వేసి ఇచ్చేంతవరకు టోల్గేట్ వసూలు ఆపేయమని ఆదేశాలు ఇచ్చింది. ఇంజనీర్లను సస్పెండ్ చేసింది . కాంట్రాక్ట్ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టింది. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసింది. ఇంత చేసిన తర్వాత ఇప్పుడు కాంట్రాక్ట్ కంపెనీ కదిలింది. ఎలా కదిలిందో తెలుసా ..? 64 కిలోమీటర్ల నేషనల్ హైవే వెంబడి గుంటలు వద్ద నిలబడ్డ నీళ్లను, రోడ్డులో తేమను ఆర్పేందుకు హై కెపాసిటీ ఇండస్ట్రియల్ ఫ్యాన్లు పెట్టింది. కొన్ని దగ్గరల డ్రైయర్లు పెట్టింది. కొన్ని చోట్ల ఎయిర్ బ్లోయర్లు పెట్టింది . ఇదేంటని అందరు ఆశ్చర్యపోతున్నారు. రోడ్డు పక్కన ఫ్యాన్లు ఎయిర్ బ్లోయర్లు డ్రైయర్లు ఇలాంటివి పెట్టడం ఇదెక్కడ టెక్నాలజీ అని ఇంజనీరింగ్ నిపుణులు ముక్కున వేలు వేసుకుంటున్నారు . ప్రభుత్వం మాత్రం తమకేమీ సంబంధం లేదు . కొత్త రోడ్డు వేసి ఇస్తేనే టోల్గేట్ ప్రారంభించుకోమని ఆదేశాలు ఇచ్చి అలా వీలుకాని పక్షంలో అందర్నీ అరెస్ట్ చేసి జైలుకు పంపించేందుకు కూడా సిద్ధం అయిపోయింది . మొత్తానికి కేంద్రం కదిలింది . మిగతా కాంట్రాక్ట్ పనులు విషయాలు కూడా ఇలాగే కఠినంగా ఉంటే మంచిది.

లాకప్ లో ఉన్న రేప్ కేసులో నిందితుడు 20 ఏళ్ల ఆకాష్ మాధవ్ పక్సరే అనే యువకుడు నాగపూర్ లో పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు ....
07/08/2026

లాకప్ లో ఉన్న రేప్ కేసులో నిందితుడు 20 ఏళ్ల ఆకాష్ మాధవ్ పక్సరే అనే యువకుడు నాగపూర్ లో పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు .16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయి విచారణ సందర్బంగా పోలీస్ స్టేషన్ లాకప్ లో ఉన్నాడు. వీడు లాకప్ లో గోడలు మురికిగా ఉన్నాయని వాసన వస్తున్నాయని, బాత్రూంలో దుర్గంధం వస్తోందని పోలీసులను వేధించడం మొదలుపెట్టాడు . ఆ తర్వాత తనకు బ్రేక్ఫాస్ట్ కి పిజ్జా కావాలని, స్టార్ హోటల్ నుంచి మంచి ఫుడ్ తెప్పించమని అది కూడా నాన్ వెజ్ ఉండేట్టు చూడమని నైట్ బిర్యానీ తెప్పించమని గొడవ చేస్తున్నాడు . మా నాన్న చాలా గొప్పవాడు, డబ్బు హోదా ఉంది, అయినా పోలీసులు పట్టించుకోవడం లేదని లాకప్ లో ఉన్న 24 గంటలు ఇదే రచ్చ. తనకు విఐపి ట్రీట్మెంట్ ఇవ్వడం లేదని దోమల బాధ తట్టుకోలేక ఉన్నానని అందువల్ల ఆల్ ఔట్ లాంటివి ఇచ్చి దోమ తెర ఇవ్వమని కోరాడు. అయితే పోలీసులు అవేం పట్టించుకోకపోవడంతో ఆ యువకుడు గొడవ చేస్తున్నాడు. ఈ రేపిస్ట్ ను నిన్న మెజిస్ట్రేట్ ముందు హాజరపరిచినప్పుడు పోలీసులు పై ఇలాంటి ఆరోపణలు చేసి తన దగ్గర డబ్బులు తీసేసుకున్నారని చెప్పాడు. పోలీసులు మాత్రం అతడి విచారణకు సహకరించడం లేదని ఎదురు తిరిగి అబద్ధాలు చెబుతున్నాడని తనకు తన తాను హాని చేసుకునే ప్రయత్నం చేస్తూ పోలీసులు కొట్టారని చెప్తున్నారు కూడా పిటిషన్ దాఖలు చేశారు. మెజిస్ట్రేట్ వాడిని రిమాండ్ కు పంపారు.

అణ్వాయుధాలను మోసుకుపోగల ఖండాంతర క్షిపణి అగ్ని 4 ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. 5 వేల కిలోమీటర్ల లోని ఉపరితల లక్ష్యాల...
06/08/2026

అణ్వాయుధాలను మోసుకుపోగల ఖండాంతర క్షిపణి అగ్ని 4 ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. 5 వేల కిలోమీటర్ల లోని ఉపరితల లక్ష్యాలను చేధించగల శక్తిని కలిగి ఉంటుంది. 900అడుగుల ఎత్తులో గంటకు గరిష్టంగా 11వేల కిలోమీటర్ల వేగంతో ఈ ఖండాంతర సూపర్ సోనిక్ క్షిపణి ప్రయాణించగలదు. ఒరిస్సాలోని చందీపూర్ వీల్ ఐలాండ్స్ నుంచి దీనిని నిన్న ప్రయోగించారు.

కఠిన శిలలో సుకుమార శిరోజాల జడను అల్లిన ఆ శిల్పి నైపుణ్యం ఎట్టిదో..? వెయ్యేళ్ళ నాడే దువ్వెనతో జడ. వేసినట్టు, ఉలితో జడ అల్...
06/08/2026

కఠిన శిలలో సుకుమార శిరోజాల జడను అల్లిన ఆ శిల్పి నైపుణ్యం ఎట్టిదో..? వెయ్యేళ్ళ నాడే దువ్వెనతో జడ. వేసినట్టు, ఉలితో జడ అల్లిన ఆ మహనీయ శిల్పి మానవుడే.. అలనాటి శిల్పకళకు ఇదే నిదర్శనం.. తమిళనాడు కడలూరు జిల్లా శ్రీముష్ణం లోని భూవరాహ స్వామి ఆలయంలో ఈ శిల్పం ఒక అద్భుతం... నమ్మలేని నిజం.

మన దేశంలో ప్రభుత్వ హాస్పిటల్స్ దుస్థితికి, సర్కార్ నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఇదే.. కాలు విరిగిన పేషెంట్ కు కట్టు కట్టే...
06/08/2026

మన దేశంలో ప్రభుత్వ హాస్పిటల్స్ దుస్థితికి, సర్కార్ నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఇదే.. కాలు విరిగిన పేషెంట్ కు కట్టు కట్టేందుకు అవసరమైన వైద్య సామాగ్రి అక్కడ లేదు. దీంతో రెండు కొయ్య రీపర్లు తెప్పించి కాలుకు అటు, ఇటు వేసి కట్టు కట్టారు. దాన్ని కప్పేందుకు అవసరమైన గుడ్డ కానీ, జిప్సం లాంటి పదార్థం కానీ లేదు. దాంతో అట్టపెట్టేలాంటి కార్డ్ బోర్డు బాక్స్ బయట పడేసి ఉంటే తెచ్చి కాలుకు పెట్టారు.. ఇంత దౌర్భాగ్యం ఎక్కడో తెలుసా? బీహార్ బేగుసరాయి లోని రెఫరల్ హాస్పిటల్లో.. గత ఏడాదే సీఎం నితీష్ కుమార్ దానిని ప్రారంభించారు...

06/08/2026

అన్న ఫుల్ ఛార్జింగ్ లో ఉన్నాడు.. ఎలాగుంటే ఏమి, నడి రోడ్లో డ్యాన్స్ చేస్తుంటే అందరూ ఆగిపోయారు. హీరోల స్టెప్స్, హీరోయిన్ ల లయలు, హొయలు అన్నీ కలిపి అదరగొట్టేశాడు. నర్రవాడ వెంగమాంబ నెల పొంగళ్లలో లోపల కోలాటం ఆడుతూఉంటే మనోడు రోడ్లో సినిమా చూపించాడు.

Address

Near Kims Hospital
Nellore
524002

Website

Alerts

Be the first to know and let us send you an email when Ndnnews Online posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category