07/08/2026
కొన్ని కేసులు విచిత్రంగా ఉంటాయి. ఓ కోడలు అత్త మీద కేసు వేసింది . తన అత్త షాంపూ బ్రాండ్ మార్చిందని, అలాగే భోజనంలో కూడా పౌష్టికాహారాన్ని తగ్గించడం వల్ల తన వెంట్రుకలు రాలిపోతున్నాయని అత్తపై కేసు పెట్టింది . గృహ హింస చట్టం కింద కేసు నమోదు అయింది. ఈ విషయమై అత్త కర్ణాటక హైకోర్టులో ఎఫ్ఐఆర్ కొట్టేయాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసింది. అత్తపై ఏదో ఒక ఆరోపణ చేయాలని ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేయడం మంచిది కాదని కూడా మందలించింది. జస్టిస్ ఎం నాగప్రసన్న కోడలు ఆరోపణల్లో పసలేదని వ్యాఖ్యానిస్తూ కేసు కొట్టివేసింది. 2024 మే నెలలో వారికి పెళ్లయిందని , ఏడాదికాకముందే భార్య భర్త , అత్త భర్త దూరపు బంధువులు పైన ఫిర్యాదులు చేస్తూ వచ్చిందని అన్నారు . అత్త తన భర్త కోసమే రాగి సంగటి చేసుకుంటుందని తనకు రాజసంటి పెట్టదని , రాగి సంగటి తింటే బలవర్ధకమైన ఆహారం అని చెప్పింది . అదికాక తనను బాడి షేమ్ చేస్తున్నారని ఆరోపించింది. కోర్టు ఈ ఆరోపణలను కొట్టివేసింది.